5, సెప్టెంబర్ 2022, సోమవారం

భిక్షాం దేహీ చ పార్వతి

 ఓం శ్రీ మాత్రే నమః


అన్నపూర్ణే... సదాపూర్ణే


అన్నపూర్ణే, సదాపూర్ణే

శంకర ప్రాణ వల్లభే

జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం

భిక్షాం దేహీ చ పార్వతి


"అన్నం సమృద్ధిగా గల తల్లీ, ఎల్లవేళలా నిండైన జగదంబ (ఎన్నడూ ఆ తల్లి కోశాగారం ఖాళీగా ఉండదు). శంకరునికి ప్రాణప్రియమైన దేవీ.. ఓ పార్వతీ దేవీ జ్ఞాన వైరాగ్యాలు సిద్ధించడానికి మాకు భిక్షనీయవమ్మా" అని అర్ధంతో కూడినది ఈ శ్లోకం.


జగదంబ ప్రకృతి.

ఈ ప్రకృతి అన్నాల భాండారం (అన్నపూర్ణ).

ఎన్ని జీవులు ఎన్ని రకాలుగా తిన్నా తరగని భాండారం (సదాపూర్ణే).

ఈ ప్రకృతి అంతా పరమేశ్వరుని శక్తి (శంకర ప్రాణ వల్లభ).

పవిత్రమైన ఈ చింతనతో అన్నాన్ని స్వీకరించేవారు,

అన్నం పరబ్రహ్మం స్వరూపమని గ్రహించినవారు "జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం" అన్నాన్ని గ్రహిస్తారు.


జ్ఞానంతో ఏది సత్యమో, ఏది అసత్యమో గ్రహించి మోహ శోకాలను, రాగ ద్వేషాలను వదిలే దివ్యానుభవం పొందాలి.

అందుకోసమే అన్నం స్వీకరించాలని లోతైన అర్ధాన్ని

పై శ్లోకం తెలియచేస్తుంది.


కాశీ క్షేత్రంలో అన్నపూర్ణ, విశ్వనాధుల చిత్రాన్ని పరికిస్తే, అందు అన్నపూర్ణ వడ్డిస్తుంటే ఈశ్వరుడు ఆహారాన్ని గ్రహిస్తుంటాడు.

ప్రకృతి నుంచి తయారైన ఆహారం ముందుగా ఈశ్వరునికి నివేదించి, అటుపై మనం స్వీకరించాలనే జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞాన భూమికయే కాశీక్షేత్రం.


ఈ ప్రపంచంలో మనం పొందే పదార్ధాలన్నీ అన్నపూర్ణ ప్రసాదాలే.


విశ్వనాధుడు గంగ అన్నపూర్ణ లకు పతి.

శక్తి స్థానమైన "భార్య" రూపం లోని అన్నపానాదులే అన్నపూర్ణ, గంగమ్మ తల్లులు.


ఒకే జగన్మాత గంగ, అన్నపూర్ణలుగా భిన్నరూపాల్లో మనకు సాక్షాత్కరించడమే ఇందు విశిష్టత.


"పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే,

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే" 


కనుపించనివన్నీ శక్తిచే నిండి ఉన్నాయి.

కనిపించేవి అన్నీ కూడా ఆ శక్తి చేత వ్యాప్తములై ఉన్నాయి.

అఖిల ప్రపంచమూ ఆ పూర్ణ శక్తినుండే వచ్చింది.

అయినా ప్రపంచమంతా నీ నుండే వచ్చినా,

ఇంకా ఆ శక్తి "పూర్ణమే"

ఆ పూర్ణశక్తియే "అన్నపూర్ణ"


ఆ పూర్ణ శక్తిని ధ్యానిస్తే, మేధాశక్తి వృధ్ధి చెందుతుంది.

మథుర భాషణ, సమయ స్పూర్థి, వాక్శుధ్ధి, భక్తిశ్రధ్ధలు, ఐశ్వర్యము కలుగుతాయి.




🌷🌷🌷🌷🌷


అన్నపూర్ణాస్తుతిః 


నిత్యానందకరీ వరాభయకరీ సౌన్దర్యరత్నాకరీ

నిర్ధూతాఖిలఘొరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ|

ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ1


తాత్పర్యము:

నిత్యమైన ఆనందము నిచ్చుదానవు, వరములను- అభయమును ప్రసాదించు దానవు, సౌందర్య సముద్రమైన దానవు, ఘొరమైన పాపముల నన్నిటినీ కడిగి వేయుదానవు, హిమవంతుని వంశమును పవిత్రము చేయుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్ష పెట్టుము.


నానారత్నవిచిత్రభూషణకరీ హేమామ్బరాడమ్బరీ

ముక్తాహారవిడమ్బమానవిలసద్వక్షొజకుమ్భాన్తరీ|

కాశ్మీరాగరువాసితాఙ్గరుచిరా కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ2


తాత్పర్యము:

వివిధ రత్నముల విచిత్రాభరణములను ధరించినదానవు, బంగారు వస్త్రములను కట్టుకున్న దానవు, వక్షస్థలముపై ప్రకాశించు ముత్యాల హారములు ధరించిన దానవు, కుంకుమ- అగురులు పూసుకొనుటచే సువాసనలు వేదజల్లు శరీరము కలదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్ష పెట్టుము.


యొగానన్దకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ

చన్ద్రార్కానలభాసమానలహరీ త్రైలొక్యరక్షాకరీ|

సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ3


తాత్పర్యము:

యొగముచే పొందు ఆనందమును కలిగించుదానవు, శత్రువులను నాశనం చేయు దానవు, ధర్మనిష్టను ఏర్పరచుదానవు, చంద్రుడు- సూర్యుడు- అగ్నులతొ సమానమైన కాంతి ప్రవాహమైనదానవు, మూడులొకములను రక్షించుదానవు, సమస్త్యైశ్వర్యములను ప్రసాదించుదానవు, తపస్సులకు ఫలమునిచ్చుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్ష పెట్టుము.


కైలాసాచలకన్దరాలయకరీ గౌరీ హ్యుమా శాఙ్కరీ

కౌ మారీ నిగమార్థగొచకరీ హ్యొంకారబీజాక్షరీ|

మొక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ4


తాత్పర్యము:

కైలాస పర్వత గుహయందుడు దానవు, తేల్లని దానవు, ఉమాదేవివి, శంకరుని భార్యవు, కుమారివి, వేదార్థమును భొధించు దానవు, ఒంకార బీజాక్షరస్వరూపము కలదానవు, మొక్షద్వారపు తలుపులను తేరచేడి దానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్ష పెట్టుము.


దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాణ్డభాణ్డొదరీ

లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాఙ్కురీ|

శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ5తాత్పర్యము:

కనబడీ కనబడని మహిమలు కలదానవు, గర్బమునందు బ్రహ్మాండములను మొయుచున్న దానవు, లీలానాటకమునకు సూత్రధారివి, విజ్ఞానదీపమును వేలిగించుదానవు, పరమేశ్వరుని ఆనందింపచేయుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్ష పెట్టుము.


ఆదిక్షాన్తసమస్తవర్ణనికరీ శంభుప్రియా శాంకరీ

కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ|

స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాదీశ్వరీ

భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ6


తాత్పర్యము:

’అ’ కారము మొదలు ’క్ష’ కారము వరకు ఉన్న అక్షరముల సముదాయమైన దానవు, పరమేశ్వరునకు ప్రియురాలవు, శంకరుని భార్యవు, కాశ్మీర త్రిపురేశ్వరివి, మూడుకన్నులు కలదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్ష పెట్టుము.


ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ

నారీనీలసమానకున్తలధరీ నిత్యాన్నదానేశ్వరీ|

సాక్షాన్మొక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ7


తాత్పర్యము:

భూమియందలి సమస్తజనులకు నాయకురాలవు, విజయమునిచ్చుదానవు, తల్లివి, దయాసముద్రమైనదానవు, స్త్రీమూర్తివి, నల్లని కురులు కలదానవు, నిత్యము అన్నదానము చేయుదానవు, సాక్షాత్తుగా మొక్షమునిచ్చుదానవు, ఏల్లప్పుడు శుభము కలిగించు దానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్ష పెట్టుము.


దేవీ సర్వవిచిత్రరత్నరుచిరా దాక్షాయణీ సుందరీ

వామా స్వాదుపయొధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |

భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ8


తాత్పర్యము:

దేవివి, విచిత్రములైన సర్వరత్నములతొ అలంకరింపబడినదానవు, దక్షుని కుమార్తేవు, సుందరివి, యువతివి, మధురమైన పాలిండ్లు కల దానవు, ప్రియమునిచ్చుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్ష పెట్టుము.


చన్ద్రార్కానలకొటికొటిసదృశీ చన్ద్రాంశుబిమ్బాధరీ

చన్ద్రార్కాగ్నిసమానకుణ్డలధరీ చన్ద్రార్కవర్ణేశ్వరీ|

మాలాపుస్తకపాశసాఙ్కుశకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ9


తాత్పర్యము:

కోట్లాది చంద్రులు, సూర్యులు, అగ్నిలతొ సమానముగా ప్రకాశించుదానవు, సూర్యబింబము వలే ఎర్రనైన క్రింది పెదవి కలదానవు, చంద్రుడు, సూర్యుడు, అగ్నిల వలే ప్రకాశించు కుండలములు ధరించిన దానవు, చంద్రుడు, సూర్యుడు వంటి వర్ణము కలదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్ష పెట్టుము.


క్షత్రత్రాణకరీ మహాభయహరీ మాతా కృపాసాగరీ

సర్వానన్దకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ|

దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ10


తాత్పర్యము:

వీరులను రక్షించుదానవు, మహాభయంకరివి, తల్లివి, దయా సముద్రమైన దానవు, అందరికీ ఆనందము కల్గించు దానవు, ఎల్లప్పుడు శుభము కల్గించుదానవు, విశ్వమునకు రాణివి, శొభిల్లు దానవు, దక్షప్రజాపతికి(యాగనాశనము ద్వారా) దుఃఖమును కల్గించుదానవు, సుఖము నిచ్చుదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపేట్టుము.


అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే|

జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి11


తాత్పర్యము:

ఓ అన్నపూర్ణా.. ఎల్లప్పుడు పూర్ణముగా ఉండు తల్లి. శంకరుని ప్రాణవల్లభురాలా.. పార్వతీ.. జ్ఞానము వైరాగ్యము సిద్ధించుటకు భిక్ష పెట్టుము.


మాతా చ పార్వతీ దేవి పితా దేవొ మహేశ్వరః|

బాన్ధవాః శివభక్తాశ్చ స్వదేశొ భువనత్రయమ్||


తాత్పర్యము:

తల్లి పార్వతీ దేవి, సి, మూడు లోకములు స్వదేశము.


ఓం నమః శివాయ

పరమేష్టి

 ధర్మాకృతి : పరమేష్టి గురువులు - 2


శ్రీవారి సన్నిధిలో నిరంతరం భాష్య పాఠం జరిగేదట. ఆ రోజుల్లో మహామహాపాధ్యాయులైన మన్నారు గుడి పెరియవాగా ప్రసిద్ధి చెందినా రాజుశాస్త్రి గారు, హరిహర శాస్త్రిగారు, తిరువయ్యార్ బాలకృష్ణ శాస్త్రి గారు వంటి మహా పండితులు తరచుగా శ్రీవారి సమక్షంలో వాక్యార్థం చేస్తూ ఉండేవారట. స్వామివారికి స్వయంగా సంగీతంలో అభినివేశం ఉంది. అనేకమంది సంగీత విద్వాంసులు శ్రీవారి వద్ద తమ సంగీతాన్ని వినిపించి వారి మన్ననలనందుకోవడం మహా గౌరవంగా భావించేవారు. పాపనాశం శివం వంటి వాగ్గేయకారులు వీరిపై కృతులు కూడా చేశారు.


కొంతకాలం తరువాత ధర్మ ప్రచారానికి బయలుదేరిన స్వామివారు తంజావూరు, ఒడయార్ పాళెం, దక్షిణార్కాటు, తిరుచ్చి, కోయంబత్తూరు, మళయాళ దేశాలలో విస్తృత పర్యటన చేశారు. వీరు పండితులలోనూ, పామరులలోనూ ప్రతి ఒక్కరిని పలుకరించి మాట్లాడి, వారి సుగుణాలను ఉత్సాహపరుస్తూ, కష్టాలకు తరుణోపాయం ప్రసాదిస్తూ అందరికీ అత్యంత ప్రేమాస్పదులై ఉండేవారట. వీరు కోపమన్నదే ఎరుగరని చెబుతారు.      


1876లో పంచాంగ గణన రీతులపై వెంకటేశ్వర దీక్షితులు, సుందర శ్రౌతి ఒక పక్షం గానూ. తిరునల్వేలి కృష్ణ జోశ్యులు వేరొక పక్షం గాను వివాదపడగా, స్వామివారు ఆ కాలంలో ప్రముఖ గణిత శాస్త్ర పండితులయిన శ్రీనివాసయ్య అప్పశాస్త్రి, అప్పా దీక్షితులు మధ్యస్థులుగా ఇద్దరి వాదనలనూ ఆసాంతముగా విని, మధ్యస్థులు సుందర రామ శ్రౌతి పక్షమైన దృక్సిద్ధాంతమే సమంజసమైనదని అభిప్రాయ పడగా, స్వామివారు కూడా నిర్ణయాన్ని పరిశీలించి, శ్రీముఖం ద్వారా దృక్సిద్ధాంతమే సమంజసమైనదని కట్టడి చేశారు. దక్షిణ దేశంలో, ఆంద్ర దేశంలోనూ ఈ సిద్ధాంతమే ప్రస్తుతము ఎక్కువ ప్రచారంలో ఉంది.


కంచి పీఠాధిపతుల పూర్వీకులు ఎంతోమంది యావద్భారత విజయ యాత్ర చేసినట్లు వారి గురు సంప్రదాయం చెబుతోంది. స్వామివారు కూడా వారి పూర్వాచార్యుల బాటలోనే 1877లో ఉత్తర దేశ యాత్ర సంకల్పించారు. మాయవరం, చిదంబరం, వైదీశ్వరం, విల్లుపురం మీదుగా కాంచీపురం చేరి తమ మఠంలో కొంతకాలం ఉండి మదరాసు మీదుగా తిరువట్రియూరు చేరారు. తిరువట్రియూరుకు కంచి పీఠానికి అనేక తరాలుగా సంబంధం ఉంది. శంకరుల విగ్రహం ఉన్న అతి కొద్ది శివాలయాలలో ఈ ఊరి దేవాలయము ఒకటి. ఇక్కడి అమ్మవారికి శంకరులే స్వయంగా శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రసిద్ధి. కంచి కామకోటి పీఠానికి ఇక్కడ స్వంత మఠమున్నది. పూర్వాచార్యుల సిద్ధి క్షేత్రములో కట్టిన బృందావనాలున్నాయి. స్వామివారు ఆలయ ప్రధాన దేవత అయిన త్యాగేశ్వరుని అతి పురాతనమైన దక్షిణామూర్తిణి, ఆదిశంకరుని, అమ్మవారిని దర్శించి ఆంద్రదేశములో అడుగు పెట్టారు. మూడు ఏనుగులు, రెండు లొట్టిపిట్టలు, పది గుర్రపు బళ్ళు, నలభై ఎడ్ల బళ్ళు ఆవులు, మూడు వందలమంది పరివారంతో యాత్ర సాగింది.


ఆంధ్రదేశ ప్రజల శ్రద్ధాభక్తులకు సంతుష్టులయిన స్వామివారు యాత్ర ఎంతో నిదానంగానే కొనసాగించారు. దారిలోని సంస్థానాధీశ్వరులైన కార్వేటి నగరపు రాజా వంటి వారి ఆహ్వానములను అందుకొని వారి దేశములలోని ముఖ్య గ్రామములను పావనము చేస్తూ ధర్మ ప్రచారము ముఖ్య కార్యంగా యాత్ర సాగించారు. 


పూర్వాచార్యుల కాలంలో ఆరంభించబడిన పీఠ వ్యతిరేక ప్రచారము వీరు చేరక ముందే ఆయా సంస్థానములకు వెళ్ళింది. అక్కడి సంస్థానాధీశ్వరులందరూ సభ చేసి ఆధారాలను పరిశీలించి, కంచి కామకోటి పీఠాన్ని ఆదిశంకరులు అధిష్ఠించిన సర్వజ్ఞ పీఠంగా గుర్తించి స్వామివారిని ఎంతో ఆదర భావంతో ఆహ్వానించారు. శ్రీమఠపు ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి అందరికీ ఈ పరిశ్రమ ఎంతో ఉపయోగకారి అయింది. విజయనగర రాజ సంస్థానపు పండితులు తాము ఈ దుష్ప్రచారాన్ని ఖండించడమే కాక, తగిన సమాధానమియ్యవలసినదని మదరాసు మహాజన సభను కోరడం జరిగింది. తత్ఫలితమే ‘శంకరతత్త్వ సుబోధిని’ అనే పేరుతో ఏలూరు వాస్తవ్యులు గాధి జగన్నాథపాకయాజి గారిచే వ్రాయబడిన గ్రంథము.


పీఠాపురం తుని సంస్థానాల మీదుగా 25.7.1865న శనివారం ఉదయం పదిగంటలకు విజయనగరము (తూర్పు ఆంద్ర) విజయం చేశారు. స్వామివారి ఈ విజయనగర విజయ యాత్ర ఆ సంస్థాన పక్షాన రికార్డు చేయబడి ముద్రించబడినది. వారి మాటలలో విజయనగరమునకు స్వామివారిని ఆహ్వానించిన తీరు ఈ దిగువ వివరించబడింది. “శ్రీ జగద్గురు భగవత్పాదులు శ్రీపీఠ పరివారంతో విజయనగరమునకు విజయము చేయునవసరమున శ్రీ విజయనగర సంస్థానము రెండేనుగులు, తూర్పు సవర్లు, కుడతాఘాట్లు, లౌక్యులు, పండితులు, పురోహితులును, నయోధ్య ప్రాంతమునకు ముందుపోయి, శ్రీవారి నెదుర్కొని భక్తిపూర్వకముగా స్వాగతమొనర్చి పల్లకీనధిరోహించి ఉన్న శ్రీవారిని తీసుకొని వచ్చి శ్రీ ఓరుగంటి లక్ష్మీకాంతం గారింట్లో నిలిపిరి. బ్రాహ్మణ భోజన నిమిత్తము 300 మందికి వలసిన సామాగ్రి శ్రీమఠమునకు సమర్పించబడినది. 26వ తేదీ వ్యాసపూజ అనంతరము మహారాజా వారు స్వామివారికి వ్యాసపూజ చేసి 116/-రూ.లు 5౦౦ల మందికి భోజన సామాగ్రి సమర్పించినదే కాక శ్రీవారికి నగరములో ఏర్పాటు కాని రోజులలో రోజుకు 25రూ.ల చొప్పున సంస్థాన పక్షాన భిక్ష చేయవలసినదని’ ఆదేశించారు. ఆ రోజుల్లో బంగారం తులం 13రూ.లు ఉండేది. 


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

చిన్నమెరుపు - 12 .

 కంచి పరమాచార్య ఉపన్యాసాలలో చిన్నమెరుపు - 12 .


పంచాంగ నమస్కారం  అంటే రెండుచేతులూ రెండుకాళ్ళూ , రెండుమోకాళ్ళూ, వక్షస్సు , తల, నేలకు తాటించటం.


పురుషుల మాదిరిగా స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయరు.  వారు చేసేది పంచాంగ నమస్కారం .  మొత్తం శరీరాన్ని నేలపై  ఆన్చడం మంచిదయినా  పూర్వులు మాతృత్వాన్ని గమనించారు .  స్త్రీలందరూ అంబికా స్వరూపులే కదా ! గర్భం లో పిల్లను మోస్తోంది . పాలనిస్తోంది . అట్టి పనులు చేసే భాగాలు నేలకు తగలగూడదని వద్దన్నారు 


వణక్కం అంటే వంగుట యని తమిళంలో అర్ధం .  నమస్కారం లో ' నమ ' కు కూడా వంగుట అనే అర్ధం . నమ్ అనగా వంగుట .  నమనం దాని నుండి వచ్చిందే . 


ఎవ్వరూ సంస్కృతాన్ని మాతృ భాషగా వాడటం లేదు .  కానీ , మత గ్రంధాలన్నీ సంస్కృతంలో వున్నాయి .  అర్చన అందులోనే అనాదిగా సాగుతున్నది .  ఆలయాలు ఒకే ప్రాంతానికి పరిమితం కావు .  అనేక ప్రాంతాల వారు వచ్చి దేవతలను పూజిస్తారు.  అందుకే సంస్కృతం.  


అందరూ ఒక కుటంబం అనే భావన దీని వలన కలుగుతుంది . జాతీయ సమైక్యం కోసమయినా  కొన్ని సంప్రదాయాలను కాదనకూడదు .


జమ్మూ కాశ్మీరు లో వున్న  వైష్ణవీదేవి ఆలయమయినా, దక్షిణ ప్రాంతం లోని రామేశ్వరమయినా  భారతీయులందరూ పాల్గొంటారు .


🌹🙏

మరికొంత ఇంకొకసారి..

ప్రేమతో,

గండవరపు ప్రభాకర్,