31, జులై 2020, శుక్రవారం

ఖమ్మం లో వేద స్మార్త విద్యాలయం

జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధ  మహాసన్నిధానం   వారు మరియు  శ్రీ శ్రీ శ్రీ విధు శేఖర సన్నిధానం వారులదివ్య  ఆశీస్సులతో
 ఖమ్మం నగరం  లో  మామిళ్ళ గూడెం బస్ డిపో  వెనుక గల శ్రీ సీతరామచంద్రస్వామి స్వామి వారి కళ్యాణ మండపం ప్రాంగణంలో  శ్రీ విజ్ఞాన నంద భారతీ తీర్థ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణ లో దివ్య  ఆశీస్సుల తో వారి కరకములచే బుధవారం 29/07/2020 రోజున  శంకర వేద స్మార్త విద్యాలయం ప్రారంభము జరిగినది.
ఈ విద్యాలయం యందు శ్రీకృష్ణయజుర్వేదం స్మార్తం విద్యలను బోధించబడును.  ఈ  విద్యాలయం స్థాపన తో ఉమ్మడి ఖమ్మం జిల్లా లో  వేదాభ్యాసానికి  అవకాశం కలిగి పిల్లలను చాలా దూరాలు  వేరే రాష్ట్రాలకు పంపే ఇబ్బందులు తొలిగినవి. ఈ అవకాశాన్ని పెద్దల ఆశీస్సులతో   భారతిశంకరపీఠం  హైందవ ధర్మ సంస్క్రుతి పరిరక్షణ ట్రష్ట్ రి నెం 157  వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు  ముందుకు వొచ్చి ఉచితంగా  వేద స్మార్త  విద్యలను బోధనకు అంగీరించడంతో లభించింది. ఈ అవకాశం కల్పన జిల్లా బ్రాహ్మణ ప్రముఖులు
 శ్రీ జమలాపురం రామకృష్ణ గారు
శ్రీ నామవరపు శ్రీనివాస శర్మ గారు
ఖమ్మం జిల్లా విద్యా శాఖాధికారి శ్రీ
పొన్నూరు మదన్మోహన్ గారు
తుంగతుర్తి యుగంధర శర్మ గార్ల సహకారంతో ఎర్పాటు కావించబడ్డది. ప్రారంభ కార్య్రమానికి
 గౌరవ అధ్రక్షులు
శ్రీ అవధానుల పరమేశ్వర ప్రసాదు అవధాని
గారు,శ్రీ ఐతపు వేంకటేశ్వర శర్మ గారు
శ్రీ యడవల్లి సత్యం బాబు గారు
శ్రీ వడ్లమాని లక్ష్మీనారాయణ అవధానిగారు
శ్రీ సర్వదేవరభట్ల సోమశేఖశఖర శర్మ గారు
శ్రీ బుద్దరాజు వెంకట ఫణికృష్ణ మోహన్ గారు
శ్రీ తాటికొడాల సీతారామశాస్త్రి గారు
శ్రీ సొలసా దుర్గాప్రసాదు గారు
శ్రీ సరస్వతిభట్ల శ్రీధర్ గారు
శ్రీ అన్నావజ్జుల ప్రసాదు గారు
మరియు పట్టణ పురోహితులు
శ్రీ అవధానుల కృష్ణ శర్మ గారు
శ్రీ గడ్డం వెంకటేశ్వర శర్మ గారు
శ్రీ అయితపు శ్రీనివాస శర్మ గారు
శ్రీ కేదార శర్మగారు
శ్రీ యడవల్లి భాస్కరు గారు
పాల్గొనటం జరిగినది.
ఈ బృహత్తర కార్యానికి, సనాతన వైదిక ధర్మం పెద్దలు, దాతలు పూర్తి సహాయ సహకారములు అందించి ఇంకా ముందుకి తీసుకెళ్ళాలని కోరుతున్నారు.

ఒక ప్రభుత్వ టీచర్ చేసిన విశ్లేషణ ..*



       తప్పకుండా ఆలోచించాల్సిన

       అంశాలు ...

       ప్రభుత్వ విద్యా వ్యవస్థ, ప్రైవేటు విద్యా వ్యవస్థ మధ్య పోటీలో..  ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎలా బలిపశువులు చేసి చూపుతున్నారో, వాళ్ళు అలా ఎందుకు బలికావాల్సి వస్తుందో వివరించే ప్రయత్నం నాది...

       కొంత హిస్టరీలో కి వెళ్దాం...

       30 సంవత్సరాలకు పూర్వం అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్య అభ్యసించేవారు.

       డాక్టర్ కొడుకైనా, లాయర్ కొడుకైనా, ఇంజనీర్ కొడుకైన, టీచర్ కొడుకైనా, రాజకీయ నాయకుడి కొడుకైనా, రైతు కొడుకైనా, కూలి కొడుకైన ఎవరైనా ఒకే పాఠశాలలోనే చదవాల్సిందే..

       అప్పుడు పాఠశాలలన్నీ తెలుగు మీడియంలోనే ఉండేవి..

       దాదాపు ప్రతి గ్రామంలోనూ పాఠశాలలు విద్యార్థులతో కిటకిటలాడేవి.

       అప్పుడు కూడా విద్యార్థులకు సరిపడే టీచర్లు కూడా ఉండేవారు కాదు.

       ఏ కొంత మంది విద్యార్థులకో ప్రత్యేక తర్ఫీదు లు ఉండేవి కాదు. 

       కానీ విద్యార్థులు వారి యొక్క సామర్ధ్యాన్ని బట్టి ముందు తరగతులకు వెళ్తూ ఉండేవారు.

       తెలివైన విద్యార్థులు 5 నుండి 10 శాతం మంది  ఉన్నత తరగతులు చదువుతూ కాలేజీల్లోనూ.. యూనివర్సిటీల్లోని సీట్లు సంపాదిస్తూ  ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేవారు.

       మిగతా 90 శాతం మంది విద్యార్థుల్లో ప్రాథమిక విద్యలో విద్యను ఆపేసిన వారు కొందరు, హైస్కూల్ స్థాయిలో  విద్యను ఆపేసిన వారు కొందరు, కాలేజీ స్థాయిలో కొందరు, రకరకాల వృత్తులో స్థిరపడిన వారు కొందరు ఉండేవారు.

       అలా ఉన్న 90 శాతం మందిలో ఏ ఒక్కరు కూడా ఆ పాఠశాల వలనే మాకు చదువు రాలేదు అని ఎవరూ అనుకోలేదు.

       మేము చదువు మీద సరైన శ్రద్ధ చూపలేదు అని మాత్రమే అనుకునేవారు.

       వారికి చదువు చెప్తున్న ఏ ఉపాధ్యాయుని కూడా నిందించే వారు కూడా కాదు.

       తర్వాత వాస్తవం లోకి  వెళ్దాం ...

       కాలంతో పాటు జనాభా కూడా పెరుగుతోంది. గ్రామాల్లోని విద్యార్థులకు కూడా చదువుకోవాలనే ఆసక్తి పెరిగింది.

       కానీ ప్రాథమిక విద్య తర్వాత హైస్కూల్ లో  జాయిన్ చేయడానికి  అందుబాటులో లేక చదువు మానేసిన వాళ్లు  కొందరు.

       దీనికి కారణం ఉపాధ్యాయులా? ప్రభుత్వమా?

       ఏదోలా దూరాన ఉన్న హై స్కూల్లో చేరి హైస్కూలు చదువు పూర్తి చేసిన తర్వాత జూనియర్ కాలేజీలో చేరుదామనుకుంటే రెండు, మూడు మండలాలకు కలిపి ఒక జూనియర్ కళాశాల దానిలో 100 నుంచి 200 సీట్లు ఉండేవి.

       మరి మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి ?   ప్రభుత్వాలు వాళ్లకి ఎందుకు చదువుకునే అవకాశాలు కల్పించలేకపోయింది?

       అప్పుడే విద్యార్థులు అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ కళాశాలలు పుట్టుకొచ్చాయి.

       ప్రభుత్వం కూడా తన భారం తగ్గుతుంది కదా అని పర్మిషన్ లు కూడా ఇచ్చేసేది.

       కానీ  ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వాడు మాత్రమే ప్రైవేటు కళాశాలలో జాయిన్ అయ్యే వారు.

       కానీ ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వారి సంఖ్య పెరుగుతూ పోయింది.

       కానీ ప్రభుత్వ కళాశాలలు పెరగలేదు. వాటిల్లో సీట్ల సంఖ్య పెరగలేదు.

       ప్రైవేటు కళాశాలల సంఖ్య మాత్రం  వారికి అనుగుణంగా పెరుగుతూ పోయింది.

       అపార్ట్ మెంట్ లో నడుస్తున్నా.. విద్యా ప్రమాణాలు పాటించకున్నా.. ప్రభుత్వం తన మీద భారం లేదు కదా అనుకుంటూ పర్మిషన్ ఇచ్చుకుంటూ పోయింది.

       మరి ప్రాథమిక విద్య లో విద్యార్థులను ఆకర్షించడం ఎలా..?

       వాళ్ల దగ్గర లేనిది మన దగ్గర ఏముంది?

       దానికి సమాధానమే ఇంగ్లీష్ మీడియం...

       ఇబ్బడిముబ్బడిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రారంభమయ్యాయి... 

       ఉన్నత తరగతి వ్యక్తులందరూ అటు వైపు ఆకర్షింపబడ్డారు.

       ప్రభుత్వం ప్రాథమిక విద్యని మాతృభాషలోనే బోధించాలని  రూల్ ఏమి పెట్టలేదు.

       అడిగిన వాళ్లందరికీ ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ ఇచ్చేసింది.

       కానీ ఏ ఒక్క గవర్నమెంట్ స్కూల్లోనే ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం పెట్టలేదు.

       ప్రభుత్వం మీద భారం లేకుండా ఎవరికి వారే కదా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ గా చదివేస్తున్నారు. 

       ప్రభుత్వానికి చాలా సంతోషించదగ్గ విషయమే కదా..! ప్రభుత్వ ఖర్చు లేకుండా ప్రజలు విద్యావంతులై పోతుంటే..!!

       అలా ఉన్నత, మధ్య తరగతి విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్ళిపో సాగారు.  అది సమాజంలో లో స్టేటస్ సింబల్ గా మారిపోయింది. 

       ‌ప్రభుత్వ పాఠశాల క్రమేపీ పేదల పాఠశాల గా మారిపోయింది.

       కష్టం చేసుకునే ప్రజల పిల్లలు.. 

       ఇంటి దగ్గర కష్టపడుతూ స్కూల్ కి వచ్చి చదువుకునే పిల్లలు..

       ఏ మాత్రము చదువుకు సహకరించని తల్లిదండ్రులున్న పిల్లలు... ప్రభుత్వ పాఠశాలలకు దిక్కయ్యారు.

       వాళ్లలో కూడా తెలివైనవారిని రెసిడెన్షియల్ పాఠశాలలు, నవోదయ పాఠశాలలు లాంటివి పరీక్షలు పెట్టి  తీసుకెళ్లిపోయారు.

       ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల మీద భారం వేసి నీవల్లే ప్రభుత్వ పాఠశాల నాశనమయ్యిందంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ప్రజల మీద దురభిప్రాయం రుద్దింది. 

       ఆకులు చిదిమేసి, కొమ్మలు నరికేసి, చెట్టు మొదలు కి నీరు పోసినట్టు..

       ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం అని.. తూతూమంత్రంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాయి.

       పెట్టినా.. అందుకు తగ్గట్టు వనరులు సమకూర్చ లేకపోయింది.



       ‌ప్రైవేటు పాఠశాల పక్కన, ప్రభుత్వ పాఠశాల చిన్న పోయేలా ప్రభుత్వం తయారుచేసింది. 

       1. సరిపడినంత మంది ఉపాధ్యాయులు ఇవ్వలేకపోవడం

       2. విద్యార్థులకు ఫర్నిచర్ తరగతి గదులు సరిపడా  లేకపోవడం.

       3. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్లు, ట్రాన్స్ఫర్లు సరైన సమయంలో చేసి,  సరైన పద్ధతిలో పాఠశాలలను నడిపించలేక పోవటం

       4. ప్రైవేటు విద్యార్థులు సొంతంగా సిలబస్లో రూపొందించుకున్న వారిని అదుపు చేయలేక పోవడం.

       5. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, క్లాస్ రూమ్ సిలబస్ కి సంబంధం లేకపోవడం..



       ఉదాహరణకు 5వ తరగతి పూర్తి చేసి నవోదయ రాస్తున్న విద్యార్థికి ఐదవ తరగతి సిలబస్ లో ఉన్న ప్రశ్నలు కాకుండా ఇతరత్రా జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ ఉండటం వల్ల వాటిని పాఠశాలలో బోధించే ఏవిధంగా సిలబస్ లేకపోవడం.



       ఇంటర్మీడియట్ రెండు సంవత్సరములు MPC గ్రూప్ గవర్నమెంట్ కాలేజీలో చదివి  లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్క లైను కూడా మిస్ అవ్వకుండా మొత్తం అవపోసణ చేసిన వాడికి ఐఐటీలో సీటు వస్తుందా?  ‌రాదు... 

       ఎందుకంటే ఆ సిలబస్లో లేని అంశాలు, అంతకు మించిన అంశాలను ఆ ఎక్జామ్ లో ప్రశ్నించడం వలన...

       అంటే ప్రభుత్వం ఆ అంశాలను ఎందుకు సిలబస్ లో పొందుపరచ లేకపోయింది. లేదా ఇంటర్మీడియట్ సిలబస్ కు మించకుండా ఐఐటీ ఎగ్జామ్ ని ఎందుకు నిర్వహించలేక పోతుంది?



       అంటే గవర్నమెంట్ పాఠశాల పుస్తకాలు, గవర్నమెంట్ కాలేజీ చదువులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు సరిపోవు.. అనే భావాన్ని ప్రజల్లో బాగా నాటింది...

       ఈ విధంగా ప్రభుత్వం తన విధానాలతో ప్రభుత్వ స్కూళ్ల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ..  ఆ తప్పిదాన్ని ఉపాధ్యాయులు మీదికి నెట్టేస్తూ ప్రజల్లో ఆ భావాన్ని గట్టిగా నాటింది.

       నిజంగా ఇప్పుడు ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న రాష్ట్రంలో విద్యార్థులందరూ ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అయితే వారి సంఖ్యకు తగ్గట్టు స్కూళ్లను ఏర్పాటు చేసి, ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించగలదా...?

       ఆ సామర్ధ్యం ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రభుత్వ స్కూళ్లు ఎందుకు బలోపేతం కావు ..?!

       ఇక్కడ నేను చెప్ప వచ్చే ముఖ్యమైన విషయం ఏంటంటే ...

       ఫలితాలు చూపిస్తూ మేము మీ కంటే మెరుగ్గా ఉన్నాం అని విర్రవీగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, వాటిని సమర్థించే గొర్రె మంద లాంటి జనాలు ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి.

       నీళ్లు ఉన్నచోట ఎవరైనా పంట పండిస్తారు..

       ఎడారిలో పండించండి ...

       మీ ప్రవేట్ స్కూల్ కి వచ్చిన ప్రతి పిల్లాడు ప్రతి రోజు స్కూల్ కి వస్తాడు.

       వారిని స్కూల్ దాకా దింపే తల్లిదండ్రులు ఉంటారు.

       నువ్వు అడిగిన ప్రతి పుస్తకం కొంటాడు.

       నువ్వు ఎన్ని గంటలు రుద్దుతున్నా వింటాడు.

       వాళ్ల తల్లిదండ్రులు విద్యావంతులై ఉంటారు.

       ఇంటి దగ్గర మాత్రం వారి కోసం సమయం  కేటాయించగల గలవారై ఉంటారు.

       ఆ పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు.

       మరి నా ప్రభుత్వ స్కూల్ కి వచ్చిన పిల్లాడు ..

       నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, రోజువారి కూలీల పిల్లలు...

       అడిగిన పుస్తకం కూడా లేని పరిస్థితి..

       ఇంటి పని అంతా చేసుకొని సమయానికి స్కూలు రాని పరిస్థితి...

       పేదరికంలో ఉన్న వాళ్లు ఆరోగ్యం చెడిపోతే మధ్యలోనే నెలలపాటు పాఠశాల మాని వేసే పరిస్థితి..

       ఉదయాన్నే పనికిపోయే తల్లిదండ్రులు వాడు పాఠశాలకు వెళ్తున్నాడు లేదో కూడా పట్టించుకోని పరిస్థితి.. 

       పౌష్టికాహారం లేక బక్కచిక్కిన పిల్లలు..

       ★ నువ్వు మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలను చేర్చుకోవు.

       మేము చేర్చుకుంటాం...

       ★ మీరు పుస్తకం లేకపోతే బడీకి రానివ్వరు..

       మేము రానిస్తాం...

       ★ మీరు పాఠశాలకు ఆలస్యమైతే ఒప్పుకోరు..

       మాకు వాడు పాఠశాలకు ఎప్పుడు వచ్చినా అదే పదివేలు..

       ★ మీరు మీ విద్యార్థులకు హోం వర్క్ చేయకపోతే వాళ్ల తల్లిదండ్రులను కూడా మందలిస్తారు.

       మా పిల్లల తల్లిదండ్రులు 90 శాతం నిరక్షరాస్యులు..

       ★ మీ పాఠశాలను శుభ్రం చేసే మనుషులు ఉంటారు.

       మాకు మా విద్యార్థులు మరియు మేమే ఆ పని చేస్తాం.

       ★ మీరు చదువులో వెనుకబడిన విద్యార్థులకు పాఠశాల నుండి తీసివేసి పంపించేస్తారు.

       ఎందుకంటే వాడు ఉంటే మీ పాఠశాల పరువు తక్కువ కాబట్టి.

       మేము వెనుకబడిన విద్యార్థులకు పిలిచి మరీ పాఠశాలలో చేర్చుకుంటాం.

       ★ మీ పాఠశాలలో క్రీడలు లాంటివి లేవు. అంతెందుకు గ్రౌండ్ లే లేవు.

       మా పాఠశాలలో తప్పనిసరిగా క్రీడలు ఆడించవలసిందే...

       ★ మీ పాఠశాలలో తెలివైన విద్యార్థులను మీరే దాచుకుంటారు.  ఫీజు రాయితీలు అంటూ బయటికి పోనివ్వరు.

       ఎందుకంటే వాడి పేరు చెప్పి ఇంకో వందమందిని ఆకర్షించాలిగా..

       మా పాఠశాలలో తెలివైనవారిని నవోదయ రెసిడెన్షియల్ స్కూల్స్ కి పంపించేస్తుంటాం...

       ★ మీరు కొన్ని వందల పాఠశాలల  బ్రాంచ్ లు కలిపి అది మీ యొక్క పాఠశాల రిజల్ట్ గా చెప్పుకుంటారు...

       మాకు మా పాఠశాలలో వస్తేనే మా గొప్ప...

       ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి...

       అవన్నీ మీకు కూడా తెలుసు...

       వ్యవస్థలో లోపాలు సరిచేయకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుడిదే లోపం అని  మాట్లాడుతున్న గా.. అందరూ ఈ అన్ని విషయాలు గమనించండి.

       అయినా మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ తోపులు కాలేదు..

       లక్షల మంది దగ్గర్నుంచి ఐఐటీ సీట్లంటూ లక్షలు.. గుంజేస్తుంటే ఏ వందమందికో సీట్లు వస్తున్నాయి...

       మరి మిగతా వాళ్ల సంగతేంటి..?

       మా ప్రభుత్వ పాఠశాలలో పదికి పది పాయింట్లు వచ్చిన వారిని నీలాగ రాష్ట్రం అంతా కలిపి లెక్కేస్తే, టీవీల్లో ప్రకటనలు ఇస్తే నువ్వు ఒక పక్కకు కూడా రావు.. అది నీ లాంటి సౌకర్యాలు లేకుండా..

       ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టు ఉంది.

       ప్రైవేట్ పాఠశాలలు గోదారి బ్రిడ్జి మీద కారులో పోతున్నట్టు ఉంది..

       అన్ని తెలుసుకోకుండా ఎవడికి వాడు ఈ రంగంలో లేకుండా ఒడ్డున కూర్చుని మామీద రాళ్లువేయడం సరికాదు.

       దయచేసి ప్రభుత్వ పెద్దలు ఈ లోపాలను సరి చేయండి.

       నిజమే.. అనిపిస్తే ఈ నిజాలను ఎంత ఎక్కువ మందికి చేరవేస్తే(share) అంత మంచి చేసినవారు అవుతారు......

గోదావరి - గేయం

మనసున్న తల్లి మా తూర్పు గోదావరి - గేయం
----------------------------------------
రచన: నూజిళ్ళ శ్రీనివాస్ గానం: శ్రీ సాకేత్ నాయుడు, సంగీతం: శ్రీ కిరణ్ కుమార్ ; ఎడిటింగ్: శ్రీ కృష్ణ, దేవి మణికంఠ కలర్ ల్యాబ్, రాజమహేంద్రవరం;
------------------------
అందరికీ నమస్కారం🙏🙏

ఇది గోదావరి పై నేను రాసిన తొలిపాట - సుమారు పది సంవత్సరాల క్రితం అప్పటి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గారి పిలుపు మేరకు, జిల్లా గీతం ఎంట్రీ గా రచించి, మద్రాస్ లో మిత్రులు, ప్రముఖ ఫ్లూట్ ప్లేయర్, సంగీత దర్శకులు శ్రీ కిరణ్ కుమార్ గారి సంగీత సారధ్యం లో సిని నేపథ్య గాయకులూ శ్రీ సాకేత్ నాయుడు (పరుగు సినిమా ఫేం) గారి గానంతో రూపొందిన ఈ గీతం ఇన్నాళ్ళకు విడుదలకు నోచుకొంటున్నది.

జన్మనిచ్చిన ప్రాంతాన్ని (ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం... ఏదైనా) తలచుకొంటే పులకించని మనసు ఉండదు. అటువంటి పులకింతతో, ఆరాధనా భావంతో నేను పుట్టి, పెరిగి, తిరిగి చేరిన తూర్పు గోదావరి జిల్లా పట్ల నా భావాల సంకలనం ఈ పాట.

ఆయ్ మేం గోదారోళ్ళమండి... అన్న పాటను ఎటువంటి ఎల్లలు లేక, తెలుగు వారు అందరూ ఆదరించి, ఆశీర్వదించారు. అదే రీతిలో ఈ గీతాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

ఈ అవనిలో అన్ని ప్రాంతాలు ప్రత్యేకమైనవే.. సుందరమైనవే... మమతలను పంచేవే..   అందువల్ల, ఈ గీతాన్ని నా జిల్లా పట్ల నా కృతజ్ఞతాపూర్వక సమర్పణ గానే చూసి, తెలుగు వారు అందరూ ఆదరిస్తారని భావిస్తూ, వినమ్రంగా  ఈ పాటను సమర్పించుకొంటున్నాను.

Please Listen, Like, Comment, Share and Subscribe.😊

స్వస్తి

నూజిళ్ళ శ్రీనివాస్
ఫోన్: 7981862200
https://youtu.be/DBg101Opep8

సదు వొద్దు....

నాడు నేను స దువొద్దు
బాబా... బాబా...అంటే...
స దు కోరా   బిడ్డా... బిడ్డా...అనే పెద్దోళ్ళు
సదు వు వొద్దే...
సదిగి నోడు ఏం చెయ్యాలా అంటే ...
సదూ. కుంటే జరా
మంచిగా కొలువ్
దొరుకుద్దిరా బిడ్డా అనే..
నే నం టీ... యెట్టి చాకిరీ
తప్ప ఏరే కొలువెందే అనే...
అయిననూ.. చదూ కుంటే  జరా మంచిగా
ఏదో ఒక కొలువు
దోరుకుద్దిరా అనే...
మరి నేడో...
సతికీ సతకని సదువు తో అంటీ అంటని అక్ష రాల్ని బట్టుకుని ఏలాడి
చివరికి యెట్టి చాకిరీ చేసే
కార్మిక న్న పట్టం గట్టి
సర్కరోల్లు నను సంపు
తుండ్రు
అది జూసి నా తల్లీ దండ్రీ
ఆలీ బిడ్డా కూడా నడి మద్దెన అటు చెప్పాలేక
ఇటు వేరే దారి కానరాక
మగ్గుతుండ్రు
ఎందుకంటే......
వారికీ తెలిసింది నేటి
వెట్టి చాకిరీ కి అర్ధం
అందుకే సదువు వొద్దు
సదివితే నువ్వు మొద్దు.

మిడి మిడి చదువు. ల తో. కార్మికులు గా బ్రతికే
వారి మనివ్యధావి ష్కరణ ఈ సదువొ ద్దు.
దోస పాటి.సత్యనారాయణ
మూర్తి.9866631877.

****************

ప్రైవేటు బడిపంతులు

బ్రతుకు పోరాటంలో
       ప్రైవేటు బడిపంతులు
               *   *     *
కరోనా !
వేశావు
ప్రైవేటుపై విషపు కాటు
చేశావు
అక్షరాన్నినడ్డివిరిచి
నడిరోడ్డు చేటు !
దశాబ్దాల అనుభవముంటేనేమి
ఆత్మాభిమానంతోనే
బ్రతుకుతున్నారు
అరిగిన చెప్పుల్లోనైనా !
బాలల విద్యా తోటమాలియై
విజ్ఞాన భాండాగారమై
శక్తి కణాలను
ఒక్కొక్కటిగా దానం చేసి
నిస్సహాయకులై
రోజు కూలీలయ్యారు !
ఓనమాలు
దిద్దించే బ్రతుకు
చితికి పోతుండె
ఆహారన్వేషణలో !
ముద్దకోసం
తడిసి ముద్దయిపోతుండే
అక్షరాలు
చెమట చుక్కల్లో !
పరుషాలు నేర్పడమే కానీ
పరుషంగా
మాట్లాడనేరడు
నీతి శతకాలు
బోధనయే కానీ
అవినీతి
చేయనెరుగడు !
అక్షర కిరణాలతో
అజ్ఞానంధకారాన్ని
పారద్రోలు -గురువు !
అందలేని దానికై
ఆరాటపడక
పొందలేని వాటికై
ప్రాకులాడక
అందిన దానితో ఆనందిస్తూ...
పొందిన వాటితో పరవసిస్తూ...
ఆకాశమంత విశాల చీకటిలో
మిణుగురంత ఆశతో
బ్రతుకీడుస్తున్న
ఓ దివ్వె-గురువు !
ఎడారి జీవితంలో
అవకాశాలు
ఎండమావులైనా....
కన్నీళ్ళు ఒడిసిపట్టి
కుటుంబ దాహార్తిని తీర్చే
ఒయాసిస్సు -గురువు !
పూలమ్మిన చోటే
కట్టెలమ్మే పరిస్థితి
సర్కారైనా ఏకాక్షితో
ఓరచూపు చూడని దుస్థితి !
''విద్వాన్ సర్వత్రా పూజ్యతే''
నేటి కరోనావస్థలో
బరువులు మోస్తున్న
గురువు శోకాన్ని చూసి
శ్లోకాన్ని సవరించుకుంటున్నాయి
పురాణాలు !
నల్లబల్లపై
తెల్లని వర్ణాలు వ్రాసేటి
శిధిల సౌధం తెల్లని జీవితంలో
అలుముకున్నాయి
నల్లనిచ్ఛాయలు !
నిత్య కృత్య భూభ్రమణంలో
పాఠశాల చుట్టూ సాగిన
పరిభ్రమణం
అక్షరాలు అక్షం మారి
ప్లూటో గ్రహాలయ్యాయి !
తప్పించేదెవరు ఈ ఘోరం
భగవంతునికి తప్పదు భారం !!

రామాయణమ్ 15


..
అస్త్రప్రయోగము తెలియటం ఎంత ముఖ్యమో ,ఉపసంహారము తెలియటం అంతే ముఖ్యము! ప్రయోగ,ఉపసంహారాలు రెంటినీ ముని వద్ద నుండి ఉపదేశము పొందాడు రామచంద్రుడు!
ఆయనతో పాటు లక్ష్మణుడు కూడా ఉపదేశం పొందాడు.
.
అలా మునితో నడుస్తూ నడుస్తూ ప్రయాణం సాగించారు!
వారికి అత్యంత మనోహరంగా ,ప్రశాంతంగా ,దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్న ఒక ఆశ్రమము కనపడ్డది .అది చూడగనే రాముడు మునితో ఇన్ని కాంతులు వెదచల్లుతూ ప్రకాశమానంగా ఉన్న ఈ ప్రాంతము ఇలా ఉండటానికి కారణమేమిటి? అని ప్రశ్నించాడు!.
.
మహర్షి అందుకు ప్రతిగా ,రామా ! ఇది పూర్వము విష్ణువు వామానావతారంలో నివసించిన పుణ్యభూమి ,ప్రస్తుతం నేను ఉంటున్నాను ,దీని పేరు సిద్ధాశ్రమము.
.
ఆశ్రమంలో ప్రవేశించగనే అచట నివాసముండే మునులందరూ మహర్షికి ఎదురేగి స్వాగతం పలుకారు.
 ,రాముడు మహర్షితో స్వామీ మీరు యాగ దీక్షాస్వీకారం గావించండి మేము రక్షణబాధ్యతలు ఈ క్షణం నుండే స్వీకరిస్తున్నాము అని పలికి మహర్షి యాగ శాల చుట్టూ తిరుగుతూ వేయికళ్ళతో కాపలా కాస్తున్నారు!
.
యాగము ఆరురోజులు కొనసాగుతుంది! అయిదురోజులు ఏవిధమైన విఘ్నము లేకుండా గడచిపోయింది !
.
ఆరవ రోజు అన్నదమ్ములిద్దరూ ఏమాత్రము అజాగ్రత్త లేకుండా కళ్ళలో వత్తులేసుకొని కాపలా కాస్తున్నారు. తమ్ముడిని రాముడు హెచ్చరించాడు ఇంకా జాగ్రత్తగా ఉండమని!
.
ఇంతలో అందరూ చూస్తూ ఉండగనే ఒక్కసారిగా యజ్ఞకుండంలోనుండి భగ్గుమని ఒక్కసారిగా అగ్నిజ్వాలలు పైకి లేచినవి! ఆ విధంగా జ్వలించటం రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నది!.
.
యజ్ఞం సాగుతున్నది మంత్రపూర్వకంగా ,శాస్త్రానుసారంగా యజ్ఞనిర్వహణగావిస్తున్నారు విశ్వామిత్రునితో కూడిన ఋత్విక్కులు. ఇంతలో ! ఆకాశం బ్రద్దలయినంత చప్పుడు !
ఒక్కసారిగా ఆకాశమంతా నల్లని మేఘాలావరించినట్లుగా మిడతలదండులాగా రాక్షస సైన్యం యాగశాల పయిన ఆకాశాన్ని కప్పివేసింది! చిమ్మచీకట్లు కమ్మినట్లున్నది! .
.
పెద్దపెద్ద కడవలు పట్టుకొని మారీచ,సుబాహులు యజ్ఞకుండంలోకి రక్తధారలు కురిపిస్తున్నారు రక్తంతో ఆ వేదిక నిండిపోయింది!.
.
((మారీచసుబాహులు నానారాత్రించరులతోడ నభమున మాయా
నీరదములుపన్ని యసృగ్ధారలు వేదిపయి గురిసి గర్జనలెసగన్
( భాస్కర రామాయణం నుండి)
.
లక్ష్మణ చూడు నా "లా" వంచు విజయ లక్ష్మీ ధనుర్ఘోష లక్షణం బెసగ నెలకొని వినువీధి నిజదృష్టి నిలిపినాడట..
(ఇది గోనబుద్ధారెడ్డిగారు వ్రాసిన రంగనాధరామాయణంలోని వాక్యము).)
.
వీరు చేస్తున్న దుష్కార్యాన్ని గమనిస్తూనే ఒక్కసారిగా విల్లు ఎక్కుపెట్టి నారిసారించి మానవాస్త్రం మంత్రించి విడిచిపెట్టాడు !
అది రయ్యిన దూసుకుంటూ వెళ్ళి మారీచుడికి తగిలి వాడిని తోసుకుంటూ తీసుకెళ్ళి నూరుయోజనాల దూరంలోని సముద్రంలో పడవేసింది! ఆ దెబ్బకు వాడిదిమ్మతిరిగి కళ్ళు బైర్లుగమ్మి మూర్ఛపోయాడు.
.
మరల క్షణం కూడా వ్యవధి లేకుండా ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించి సుబాహుడిమీదకు వదిలాడు అది వాడి గుండెల మీద పిడుగులా కూలి శరీరాన్ని చీల్చి ఛిద్రం చేసి వాడిని నేల కూల్చింది !
మిగిలిన రాక్షసులందరూ రాముడు ప్రయోగించిన వాయవ్యాస్త్రం దెబ్బకు ఎక్కడివారక్కడ చెల్లాచెదురయై చెట్టుకొకరు పుట్టకొకరుగా నేల కూలారు!
.
యజ్ఞం నిర్విఘ్నంగా పరిసమాప్తమయ్యింది.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

.

పోత‌న త‌ల‌పులో‌ ...(4)


ప్రణవ స్వరూపుడు , ప్రమద గణాధిపతి ,పార్వతీ పరమేశ్వరుల ప్రియ పుత్రుడు - సకల జగతికి ప్రేమపాత్రుడైన  గ‌జ‌ముఖుడి రూపాన్ని గుండెనిండా నింపుకున్న‌ పోత‌న త‌న ఘంటం నుంచి తెలుగు జాతికి అందించిన ఆణిముత్యం, ఈ గ‌ణేశుడి ప‌ద్యం.
                 ****
ఆదరమొప్ప మ్రొక్కిడుదు - నద్రిసుతా హృదయానురాగ సం
పాదికి - దోష బేధికి - బ్రపన్న వినోదికి - విఘ్నవల్లికా
చ్ఛేదికి - మంజువాదికి - నశేష జగజ్జన - నందవేదికిన్
మోదక ఖాదికిన్ - సమద మూషకసాదికి - సుప్రసాదికిన్

                   ****
హిమగిరినందిని  హృదయానురాగాన్ని పొందినవాడు, కలిపురుషుని  దోషాలను తొలగించువాడు ,ఆశ్రితుల విఘ్నాల‌ను ఛేదిస్తూ ,ప్రపన్నులను ఆనందింపజేస్తూ తన మధుర భాషణలతో అందరికీ ఆనందాన్ని ఇచ్చు వాడు,మోదక ప్రియుడు ,మూషకము (ఎలుక) ను అధిరోహించు వాడు, ముదమును కలుగ జేయువాడైన ఆ వినాయకుని నేను స‌భ‌క్తికంగా మ్రొక్కుతున్నాను. అంటూ తెలుగుజాతి చేత ఆనాటినుంచి గ‌ణ‌ప‌య్య‌కు ఈ ప‌ద్యంతో మ‌నచేత అక్ష‌రార్చ‌న చేయిస్తున్నాడు పోత‌న‌.

*Happy Friendship day*




స్నేహితులు లేని వారు అరుదుగా ఉంటారు. ఒకరోఇద్దరో స్నేహితులందరికీ ఉంటారు. కాస్త నడక, మాట వస్తే చాలు స్నేహం కోసం ఆ ప్రాణి ఎదురుచూస్తుంది. కేవలం మనుషులకే కాదు జంతువుల్లో కూడా స్నేహాన్ని చూస్తుంటాం. నోరు లేని ప్రాణులే  స్నేహం కావాలనుకొంటే ఇక మనసు, నోరున్న మనం స్నేహం కోసం అర్రులు చాస్తాం అంటే వింతేమ్తుంది? విచిత్రమేముంది?     స్నేహమేరా జీవితం! స్నేహమేరా శాశ్వతం !!         అని పాడుకున్నదే అందుకుకదా!?
స్నేహం అనేది ఒక మధురమైన అనుభూతి. 98 ఏళ్ల వృద్ధునికి తన చిన్ననాటి స్నేహితుడు ఎదురైతే చాలు అప్పటిదాకా కదలలేక పడి ఉన్నా సరే చిటుక్కున  లేచి కూర్చుంటాడు. చిరునవ్వుతో పలుకరిస్తాడు. అంతటి శక్తి స్వచ్ఛత   ఒక్క స్నేహానికే ఉన్నయ్.
స్నేహం గురించి కేవలం చిన్న పిల్లలు, పెద్దవాళ్లు అంటే లౌకికంగానే కాదు ఆధ్యాత్మిక ప్రపంచంలో వాళ్లు కూడా మాట్లాడుతారు.
చెడు మార్గంలో వెళ్లేవారిని మంచి మార్గంలో తెప్పెంచే శక్తి ఒక్క స్నేహానికి మాత్రమే ఉంది. కుటుంబంలో ఉన్న బంధుత్వాల దగ్గర మొదలయ్యే   బాధను స్నేహితులకు చెప్పి దూరం చేసుకొంటారు. అమ్మనాన్న, ఉపాధ్యాయులు , అన్నదమ్ములు, అక్కచెళ్లెళ్లు ఆఖరికి దాంపత్యబంధం కన్న గొప్పది స్నేహబంధం.
ఎటువంటి సమస్యనైనా స్నేహితునితో పొరపొచ్చాల్లేకుండా చర్చించుకోవచ్చు. అహానికి అక్కడ చోటే ఉండదు. స్నేహంలో ఎక్కువతక్కువలుండవు. పేదవాడు గొప్పధనవంతునితో స్నేహహస్తాన్ని కలుపవచ్చు. బాగా చదువుకున్నవారు అసలు చదువే లేని పామరునితో అత్యంత గాఢంగా స్నేహం చేయవచ్చు.
స్నేహానికి కాలంతో కూడా పట్టింపుండదు. వయస్సు తేడా రాదు. ఎవరి హృదయమైనా స్నేహం అనే మాటను పలికితే చాలు ఆ స్నేహమాధుర్యంతో ఆ హృదయశోకమంతా మాయమైపోతుంది. స్నేహం ఒక్క తరానితో ఆగిపోదు. తరతరాలకు తరగని గనిలా అందుతుంది.
మంచిస్నేహితుడు కష్టనష్టాల్లో అండగా ఉంటాడు. స్నేహానికి అవధులుండవు

🤝🤝🤝🤝🤝🤝🤝
*స్నేహితులు దినోత్సవ.. శుభాకాంక్షలు*💐💐💐
🌹🌹🌹🌹🌹🌹🌹

వ్యాస భాగవతం

వ్యాస భాగవతం ద్వితీయ స్కంధము 4 అధ్యాయము లోని ఈ కింది శ్లోకం విద్యార్థులు చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి

ప్రచోదితా యేన పురా సరస్వతీ వితన్వతాజస్య సతీం స్మృతిం హృది
స్వలక్షణా ప్రాదురభూత్కిలాస్యతః స మే ఋషీణామృషభః ప్రసీదతామ్

భాగవతం 2-4-22

బ్రహ్మకు కూడా ఎవరి అనుగ్రహంతో వాక్కు ( సరస్వతీ, వేదం) ప్రసన్నమై సృష్టి కలిగించే స్వచ్చమైన జ్ఞ్యానాన్ని ప్రసాదించిందో. (భాగవత ప్రారంభ శ్లోకంలో ఉన్న 'తేనే బ్రహ్మ బృదా యదా ఆది కవయే' బ్రహ్మకు ఎవరి సంకల్పంతో వేదములను ఎవరుపదేశించారో)
అలాంటి బ్రహ్మ ఈ జ్ఞ్యానమును పొంది పరమాత్మ యొక్క స్వస్వరూప (స్వలక్షణా )జ్ఞ్యానాన్ని పొందాడో.
స్వలక్షణ అంటే వేదం కూడా కేవలం వేదం కాకుండా - సృష్టి స్థితి సంహారములు, ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములు, హ్రస్వమూ ధీర్ఘము ప్లుతము ఉదాత్తము అనుదాత్తము స్వరితమూ, పశ్యంతి మద్యమా వైఖరీ (అందులో స్వరములు మూడు , అందులో భేధములు మూడు, ఇలా ఒక్క వర్ణం 32 రకములు ఉంటుంది, 'ఆ అన్నమంటే ఇది హ్రస్వమా ధీర్ఘమా ప్లుతమా? ఉదాత్తమా అనుదాత్తమా స్వరితమా, మంద్రమ మధ్యమమా ఉత్తమమా, తరమా వితారమా అనుతారమా, వివృతమా సంవృతమా, సంవృతములో మళ్ళీ ఉదాత్తమా అనుదాత్తమా, కంఠ్యమా లేక ఉపకంఠ్యమా - ఇవన్నీ వేద లక్షణాలు, స్వరములతోటి - మంద్ర మధ్య తారాది వర్ణ కంఠగత భేధములతోటి ఉర: కంఠ శిరోరాది స్థాన భేధములతోటి కంఠాల్వాది అవస్థా భేధములతోటి ఇన్ని రకములుగా ఉన్న వేదం) ఎవరి సంకల్పంవలన బ్రహ్మకు భాసించిందో అటువంటి ఋషులకు ఋషి అయిన స్వామి ప్రసన్నుడగు గాక

*అదిరిపోయే కామెడీ*



ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్ లో అతిపెద్ద మాల్ లో ఒక సేల్స్ మాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు.

అది ప్రపంచంలోనే అతి పె ద్ద మాల్. అక్కడ దొరకని వస్తువు అంటూ  ఉండదు.
 "ఇంతకు ముందు సేల్స్ మాన్ గా ఎక్కడైనా పనిచేసావా ?" అడిగాడు బాస్.

 "చెయ్యలేదు"

"సరే ! రేపు వచ్చి జాయిన్ అవ్వు. నీ పెర్ఫార్మన్స్ నేను స్వయంగా చూస్తా! ".

తర్వాతి రోజు చాలా భారంగా నడిచింది తనకి. చివరకి సాయంత్రం ఆరు గంటలకి బాస్ వచ్చాడు.

"ఈ రోజు ఎంత మంది customers కి  సేల్స్ చేశావు?".

 "Sir ! కేవలం ఒకరు" అని బదులిచ్చాడు తను.

 "ఒకటేనా ! నువ్వు ఇక్కడ గమనించావా, అందరూ 40 నుండి 50 సేల్స్ చేస్తారు. సరే, ఎంత ఖరీదైన సేల్ నువ్వు చేశావో చెప్పు?"

 "8,009,770 పౌండ్స్" చెప్పాడు మన సేల్స్ మాన్.

"What !!" 😳🤔 అదిరిపడ్డాడు  బాస్.

"అంత పెద్ద సేల్ ఏమి చేశావు?"  అడిగాడు.

"వినండి. ఒక పెద్దాయనకి ఒక చేపలు పట్టే పెద్ద గేలం అమ్మాను."

"గాలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ ఖరీదు కాదే? "  అన్నాడు బాస్.       

"పూర్తిగా వినండి, తర్వాత ఆ గాలానికి సరిపడే రాడ్, ఒక గేర్ అమ్మాను.
ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నారో అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పారు. దాని కన్నా ఒక బోట్  లో వెళుతూ నది మధ్య చేపలు పడితే  బాగుంటుందని ఒప్పించి బోట్ స్టోర్లో ఒక బోట్  డబల్ ఇంజన్ ఉన్నది కొనిపించాను. ఆ పెద్దమనిషి తన జీప్ కెపాసిటీ తక్కువ ఈ బోట్ ని తీసుకు పోలేను అన్నారు. అప్పుడు ఆటొమోబైల్ డిపార్ట్మెంట్ లో ఒక కొత్త 4 * 4   డీలక్స్ బ్లాజర్ కొనిపించాను.తరువాత అక్కడే నది ఒడ్డున ఉండటానికి క్యాంపింగ్ డిపార్ట్మెంట్ లో కొత్తగా వచ్చిన ఆరు స్లీపర్ల ఇగ్లూ క్యాంప్ టెంట్ , దానిలో ఉండటానికి కావల్సిన భోజన సామగ్రి ప్యాక్ చేయించాను.”

బాస్ ఆశ్చర్యంతో రెండు అడుగులు వెనక్కి వేశాడు. "ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వాడితో కొనిపించావా

 "లేదు సార్ !" బదులు ఇచ్చాడు మన సేల్స్ మాన్.

"మరి ? "  అన్నాడు బాస్.

 " ఆయన నిజానికి ఒక తల నొప్పి టాబ్లెట్ కోసం వచ్చారు. తలనొప్పికి టాబ్లెట్ కన్నా చేపలు పట్టే  హాబీ ద్వారా తగ్గించుకోవచ్చు అని ఒప్పించాను."

బాస్: " అరే యార్ …!! ఇంతకీ  నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి?"

అప్పుడు మన సేల్స్ మాన్ చెప్పాడు ,
"ప్రీచైతన్య -పారాయణ, కార్పొరేట్ స్కూల్ లో టీచర్ ఉద్యోగం చేసేవాణ్ణి సార్."

"టీచర్ కి, సేల్స్ కు,ఏంటి రిలేషన్?? అడిగాడు బాస్

"ఏ,బీ,సీ,డీ లు నేర్పమని వస్తే ,
పదేళ్ల తర్వాత వచ్చే ఐఐటి -నీట్-సివిల్స్ ర్యాంక్  పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళం"... అని ఆన్సర్ ఇచ్చాడు ...

😜😁😁

మంత్రాలకు_అర్థం

మంత్రాలకు_అర్థం, మంత్రం_వెనుకున్న_మర్మం -:

అసలు మంత్రం అంటే ఏమిటి? మంత్రానికి ఉన్న అర్థమేమిటి? మననాత్ త్రాయతే ఇతి మంత్ర: అని అంటారు. అంటే మననం చేయడం వల్ల మనల్ని రక్షించేది అని అర్ధం. అలాంటి మహా శక్తివంతమైన మంత్రాలను మన రుషులు అమోఘ తపశ్శక్తితో, భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలుగా రూపాంతరం చెందాయ్‌. మనుషుల్ని మంచి మార్గం వైపు నడిపిస్తున్నాయ్.

ఓం, ఐం, శ్రీం, హ్రీం, క్లీం. ఇవే బీజాక్షరాలు, ఈ బీజాక్షరాలు చాలానే ఉన్నా... ఉపాసాన పద్ధతిలో చేయాల్సినవి మాత్రం వేళ్ల మీదే లెక్కపెట్టవచ్చు. ఆయా దేవతల పేర్లతో కలిపి బీజాక్షరాలను జపించడం వల్ల కలిగే ఫలితం అనంతం. మాన్యుల నుంచి సామాన్యుల దాకా ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక్కటంటే ఒక్కసారైనా అనుభూతిని ఇచ్చేది ఈ మంత్రసాధనే. అలా శక్తిమంతమైన పరమోద్భుత మంత్రాలుగా మారే క్రమం మహాద్భుతంగా కనిపిస్తుంది. మంత్రాల అసలు లక్ష్యం. మన ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడం. అలా మూడు విధాలుగా విభజించి... ఉచ్ఛరించిన మంత్రాలకు మహాశక్తి ఉంటుంది. క్షుద్రంతో ఉచ్చాటన చేసే తామస మంత్రాలు... యుద్ధంలో గెలుపు కోసం చేసే రాజ మంత్రాలు... ఆధ్యాత్మిక సాధన కోసం జపించే సాత్విక మంత్రాలుగా కాలక్రమంలో ఆవిర్భవించాయ్.

అన్ని మంత్రాలకు ముందు ఓం కారాన్ని చేర్చి జపిస్తాం. అదెవ్వరికైనా అనితర సాధ్యం కాని పనికాదు. ఇలా ఎందుకు పలికాలి? ఎందుకంటే ఓంకారం లేని మంత్రం ఫలవంతం కాదు. అలాంటి మంత్రం ప్రాణ వాయువు లేని జీవం లాంటిది. ఈ ఓంకారం సర్వేశ్వరుని నుంచి జ్యోతిగా ప్రారంభమై అందులో నుంచి ఒక నాదం ధ్వనించింది. ఆ ధ్వనే ఓంకారంగా రూపాంతరం చెందింది. ఓం నుంచి వేదరాశులే ఉద్భవించాయ్. రుగ్వేదం నుంచి ఆకారం, యజుర్వేదం నుంచి ఊకారం, సామవేదం నుంచి మాకారం.... ఈ మూడు కలసి ఓంకారంగా ఏర్పడిందన్నది రుషివాక్కు. అందుకే ఓంకారాన్ని బీజాక్షరంతో ముడిపెట్టారు మన పెద్దలు.

అసలు బీజాక్షరాలు అంటే... భాషలోని అక్షరాలే బీజాలా?..ప్రతీ బీజానికి ప్రత్యేక మహత్తు ఉంటుందా?..ఈ బీజాక్షరాల ఏకీకరణమే మంత్ర నిర్మాణమా?.. మంత్రాల స్పష్టమైన ఉచ్చారణతో అద్భుత ఫలితం సాధ్యమేనా?.. కళ్లకు కనిపించనివి.. కొలతకూ, తూకానికీ దొరకనివే బీజాక్షారాలా?

ఈ జగత్తు స్థూలమనీ, సూక్ష్మమనీ రెండు విధాలుగా విభజించారు. శరీరం స్థూలమైతే.... మనస్సు సూక్ష్మం. స్థూలమైన దానికంటే సూక్ష్మమైన దానికే శక్తి ఎక్కువ. మన శారీరక శక్తికంటే, మానసికశక్తి చాలా గొప్పది. బలవత్తరమైనది కూడా. సూక్ష్మశక్తుల జాగృతి వల్లే మానవుడు మహాత్ముడై అసాధారణ కార్యాలు చేయగలుగుతాడు. ఈ సూక్ష్మశక్తుల జాగృతికి మంత్ర శబ్ధతరంగాలు తోడ్పడితే అద్భుతం సాధించడం అదేమంత కష్టమేమీ కాదు. జీవులలోని అంతశక్తులనే కాదు, ప్రకృతిలో ఆవరించి ఉన్న అనేక అదృశ్య శక్తుల్ని కూడా బీజాక్షరాలు మంత్రాల రూపంలో ప్రేరేపిస్తాయంటారు. వర్షాలు కురిపించడం, దీపాలు వెలిగించడంలాంటి పనులు శబ్ధ తరంగాల ప్రక్రియతో మన పూర్వీకులు సాధించి చూపించారు.

అణువులను కదిలించే శబ్ధ తరంగాలకు ఉండడం వల్లే ఇవన్నీ సాధ్యమవుతాయ్. ఇది నిజం. కానీ ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మంత్రాలను పలికినప్పుడు చాలా స్పష్టంగా పలకాలి. పర్‌ఫెక్ట్‌ ప్రీక్వెన్సీతో నిర్ణీత స్వరాన్ని అనుసరించి పలకాలి. అలా అయితేనే దాని ఫలితం ఉంటుంది. మనకు కనిపిస్తుంది. జీవులలోని సూక్ష్మశక్తుల్నీ, ప్రకృతిలోని వివిధ శక్తుల్నీ ప్రేరేపించడానికీ, దైవశక్తిని మనకు అనుసంధాన పరచడానికీ మంత్రశబ్ధలు ఉపకరిస్తాయనడంలో అణుమాత్రం కూడా సందేహం లేదు.

ప్రకృతిలోనే కాకుండా, సృష్టిలో కూడా అనంతంగా వ్యాపించి ఉన్న శక్తిని మంత్రాలు...సరైన ఉచ్ఛరణతో మనకు అందిస్తాయ్. దైవాంశను మనకు అనుసంధానపరచే శబ్ధమే ఓంకారం. మంత్రానికి త్రికరణ శుద్ధి చాలా అవసరం. మనసా, వాచా, కర్మణా శుద్ధి కలిగిన జీవికే మంత్రోచ్చారణ సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. కంప్యూటర్‌ కాలంలో త్రికరణ శుద్ధి పూర్తిగా తగ్గిపోతుంది. క్రమంగా తరిగిపోతుంది. అందుకే మంత్రాల ప్రభావం కూడా సన్నగిల్లుతుంది. పురాణ కాల మేధావులు మంత్రాలకు చింతకాయలనే కాదు, అవసరమైతే నక్షత్రాలను కూడా రాలగొట్టగలిగే శక్తి కలిగి ఉండేవారని మనం విన్నాం. మనకు ఫలించనంత మాత్రాన మంత్రశక్తిని విమర్శించడం అవివేకం. చేతకాక పోయినా కూడా కనీసం శాస్త్రీయ సత్యాన్ని తెలుసుకోవడం వివేకం.

అందుకే ప్రతి అక్షరం బీజాక్షరం. ప్రతి బీజాక్షరం దేవతాశక్తి స్వరూపం. విశ్వచైతన్యం దేవతగా అవతరించినపుడు అతి సూక్ష్మంగా కనిపించే అతీంద్రియ శక్తే మంత్రం. అందుకే మంత్ర నిర్మాణం ఆశ్చర్యకరమే కాక ఆసక్తికరమైన శాస్త్రం కూడా. ఎంతో అపురూపమైన మంత్రాలను ఎవరైనా భక్తితో సాధన చేయవచ్చు. సిద్ధిని, లబ్ధిని, దివ్యానుభూతిని పొందవచ్చు. దీనికి శాస్త్రీయత ఉంది. అసశాస్త్రీయంగా రుజువు అయింది కూడా.!!డైలీ విష్

మరి మంత్రాలకు, వేదాలకు సంబంధం ఏమిట?. పురాణాల్లో, వేదాల్లోనూ మంత్ర ప్రస్తావన ఉందా? మంత్రశాస్త్రంలోనూ సైన్స్‌ కనిపిస్తుందా?.. శబ్ధ తరంగాలకు ఉన్న శక్తిని ఎలా అర్థం చేసుకోవాలి? పురాణకాలాన్ని మంత్రయుగమంటే... .ఆధునిక కాలాన్ని యంత్రయుగమని పిలవాలా?.. నిజంగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? కొందరు అనుకుంటున్నట్టు మంత్రం సైన్స్‌కి విరుద్ధమా?.. జీవ నాడీ వ్యవస్థపై బీజాక్షరాల ప్రభావం ఎంత?

ఇలా మంత్రాల గురించి, బీజాక్షరాల మర్మం గురించి చాలా మందిలో చాలా రకాలైన అపోహలు ఉన్నాయ్. అంతెందుకు తప్పుగా ఆలోచించే వాళ్లూ లేకపోలేదు. మంత్రాలను వాడాల్సిన విధంగా వాడితే... అవి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు పండితులు. పురాణాల్లోని సైన్సు విషయాల్ని తెలుసుకునేటప్పుడు మంత్రం అనే అంశంపై కచ్చితమైన అవగాహన ఉండి తీరాలి. ఎందుకంటే పురాణాల్లో అనేక మంత్ర తంత్రాలు కనిపిస్తాయి మనకు. అందుకే మంత్రాలకూ, సైన్సుకూ ఉన్న సంబంధాన్ని తెలుసుకొని తీరాలి. పురాణకాలంగా మంత్రయుగంగా... ఆధునికకాలం యంత్రయుగంగా మారుతుంది. ఇది నిజమే కావచ్చు కానీ మంత్రం సైన్సుకు ఏమాత్రం విరుద్ధం కాదు. ఇది నిజం కానే కాదు. మంత్రం అనేది నూటికి నూరుపాళ్లు ఒక సైన్సు ప్రక్రియే.

దేవతానామాన్ని లేదా బీజాక్షరాన్ని స్మరించడాన్ని మంత్ర జపం అంటారు. కొన్ని అక్షరాలను క్రమబద్ధంగా కలిపి వాడటమే. ఇలా వాడటం వల్ల ఉత్పన్నమయ్యే వైబ్రేషన్‌ను ఒక లక్ష్యం కోసం వాడటం వల్ల ఆ ఉద్భవించిన శక్తి మనకు అనుకూలంగా గాని వ్యతిరేకంగా గాని మారుతుంది. అది మంత్రానికి ఉన్న పవర్‌. తరుచూగా ఉచ్చరించే శబ్ధ తరంగాలే మంత్రాలు. ఆ మంత్ర శబ్ధ తరంగాలు చాలా శక్తివంతమైనవి కూడా. శబ్ధ తరంగాలు జీవుల మీదా, ప్రకృతి మీదా, సృష్టి మీదా ప్రభావాన్ని చూపిస్తాయ్. ఇది సైన్సు కూడా ఒప్పుకుంటున్న సత్యం.

జీవుల శారీరక, మానసిక స్థితులపై శబ్ధ తరంగాల ప్రభావం ఉంటుంది. కొన్ని రకాల శబ్ధ తరంగాల వల్ల ఆరోగ్యం క్షీణించడం, భయం కలగడం, నిరాశ ఆవరించడం చూస్తుంటాం. మరి కొన్ని శబ్ధ తరంగాల వల్ల ఆరోగ్యం బాగుపడటం, ఉత్సాహం రావడాన్ని కూడా గమనిస్తుంటాం. అందుకే మంత్రాలంటే శక్తిమంతమైనవి శబ్దతరంగాలే. అందుకే మంత్ర ప్రభావం మన సూక్ష్మగ్రంథులపైనా, షట్‌ చక్రాలపైనా శక్తి కేంద్రాలపైనా సూటిగా పడుతుంది. అప్పుడు మనలోని సూక్ష్మ జగత్ శక్తి కేంద్రం మేల్కొంటుంది. మంత్ర శబ్దాలు గ్రంథులకు చలనం కలిగించి జాగృతం చేస్తుంది. పోగొట్టుకున్న శక్తిని అవి మేల్కొలుపుతాయ్. మంత్రోచ్చారణ ద్వారా ఉద్భవించిన శబ్ధ తరంగాలు ముందుగా చెవిని చేరి, తర్వాత మెదడుకు వెళ్తాయి. మెదడు నుంచి మంత్ర శబ్ధ తరంగాల ప్రభావం ప్రతీ అవయవాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. ఎక్కడ కనిపించని అత్యంత శక్తిమంతమైన ముక్తిప్రదం మన పెద్దలు మనకిచ్చిన మంత్రసాధన. మంత్రాలు కేవలం పదాల నిర్మితాలే కాదు. శక్తికి ప్రతిరూపాలు. పరమేశ్వరా అనుగ్రహంతో, పంచభూతాత్మకమైన దేహంతో, అద్భుతమైన మేథా సంపత్తిని పొందిన మానవుడి ఆలోచనాశక్తి అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చేది మంత్రమే.

*మేరా భారత్ మహాన్*

మన దేశ పరిస్థితిని చక్కగా వివరించిన కధనం

_*ఆలోచించ వలసిన విషయమే.*_                                                                                           
                                                                                                                 _*మేరా భారత్ మహాన్*_

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వింటున్నా...

_*"పేదరికాన్ని నిర్మూలిస్తాం"*_

70 సంవత్సరాలలో 70% పథకాలన్నీ దీనికే...

ఎన్ని లక్షల కోట్లు ఖర్చుపెట్టారో లెక్కే లేదు...

నాకు అర్థమవని విషయమేంటంటే...

అసలు పేదరికాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత సమాజానికి ఏమిటి?

ప్రతి మనిషి ఎవరి కష్టం మీద వాళ్ళు బ్రతుకేటప్పుడు,
మద్య తరగతి వాడి కష్టం - పేదవాడి కష్టం కన్నా ఏ విషయం లో తక్కువ?

ఈ పేదవాడు అన్నవాడు  ప్రభుత్వ దత్తపుత్రుడు ఎందుకవుతున్నాడు?

ప్రభుత్వం అందరిదీ అయినప్పుడు, మద్య తరగతి వాడి  పొట్ట కొట్టి పేదవాడికి ఎందుకు పెడుతున్నారు?

సమాజం సంవృద్దికి, అభివృద్ధికి పేదవాడి సహకారం ఏమిటి?

🚩వీడు టాక్స్ కట్టడు.
🚩పొదుపు చెయ్యడు.
🚩కుటుంబ నియంత్రణ పాటించడు.
🚩చట్టాన్ని గౌరవించడు.
🚩ఆరోగ్య సూత్రాలు పాటించడు.
🚩వీడికసలు కుటుంబ భాధ్యతే ఉండదు.
🚩వీడింట్లో పిల్లలకు అరటి పండుకి డబ్బు లుండవు కానీ మత్తిచ్చే మందుసీసాలకి లోటుండదు.
🚩అసలు వీడు అన్నింటిలోనూ భాధ్యతారహితమే.
🚩తూలుతూ హక్కుల గురించి మాత్రమే మాట్లాడతాడు.
🚩సమాజం పట్ల ఎటువంటి బాధ్యత ఉండదు.
🚩సమాజ శ్రేయస్సు తో సంబంధం లేదు.
🚩సామాజిక భాధ్యత ఉండదు. 
🚩వీడికన్నీ ఉచితంగా కావాలి. 
🚩వీడికి అవినీతి తప్పు కాదు పైగా సమర్ధిస్తాడు.
🚩ఎవడు ఉచితాలు, డబ్బులెక్కువిస్తే వాడికే ఓటేస్తాడు.

అసలు మతలబు ఇక్కడే ఉంది...

రాజకీయ నాయకులకు కావలసింది ఆలోచించి ఓటేసేవాడు కాదు. వాళ్ళిచ్చిన డబ్బు తీసుకుని స్వార్ధం తో ఓటేసేవాడే కావాలి. ఈరోజు ప్రభుత్వాలను పేదవాళ్ళే నిర్ణయిస్తున్నారు.

వీళ్ళు ఎంత ఎక్కువ మంది ఉంటే, అవినీతిపరులు అంత సులభంగా అధికారం లోకి రావచ్చు.

అందుకే ఓటుకి నోటు ఇవ్వని వాడికి డిపాజిట్ కూడా దక్కదు.

ప్రజాస్వామ్యం లో దేశానికి అసలు నష్టం పేదవాడి వల్లే జరుగుతోంది.

అందుకే...

_*దేశంలో అన్యాయమౌతోంది పేదవాడు కాదు, మద్య తరగతి వాడు*_

_*పేదవాళ్ళకి పేదరిక నిర్మూలన అవసరం లేదు. ఎందుకంటే ఉచితాలు పోతాయి*_

_*రాజకీయ నాయకులకూ పేదరిక నిర్మూలన వల్ల ఉపయోగం లేదు*_

_*కాబట్టి పేదరికం ఎప్పటికీ నిర్మూలించబడదు*_

టాక్స్ లు కడుతున్న వెంగళప్పలు మాత్రం  రూ. ఇరవై పెట్రోల్ ని డెబ్బైకి కొనుక్కొని తింగరోళ్లలా తలదించుకుని ఉరుకుల పరుగులతో బ్రతుకీడుస్తుంటారు.

మౌలిక సదుపాయాలుండని  గతుకుల రోడ్ల పై తిరుగుతూనే ఉంటారు.

పైన చెప్పినట్లు.  పేదవాడు డబ్బు తీసుకుని ఓట్లు వేస్తూ, సంక్షేమ పధకాలన్నీ పొందుతూ, మోటార్ సైకిల్, టివి, ఫ్రిజ్, మిక్సీ, కూలర్/ఎసి, స్మార్ట్ ఫోన్ (వీటన్నిటికీ కరెంటు ఫ్రీ)  లాంటివి అన్నీ ఉన్నా మరుగుదొడ్డి మాత్రం ఉండదు, ఉన్నా వాడరు...

వీరు ప్రభుత్వం దృష్టిలో మాత్రమే పేదవాడి గా ఉంటారు. అలానే తూలుతుంటారు.

అసలు కారణం ఏమిటంటే ఆ ఇంట్లో నాలుగు ఓట్లుంటాయి మరి.

దేశం చుట్టూ సైనికలు రేయింబగళ్లు, ఎండా, వాన, మంచుల్లో మాత్రం పహరా కాస్తూనే ఉంటారు.

స్థూలంగా ఈ దేశంలో వెంగళప్పలు ఎవరయా అంటే -  బ్యాంక్ ఋణాలు ఎగ్గొట్టకుండా, నిఖార్సుగా వాయిదాలు కడుతూ, ట్యాక్స్ లు కట్టే మధ్యతరగతి మనిషి, నా దేశం అంటూ వీరస్వర్గం పొందే సైనికుడు, దేశానికి అన్నం పెట్టే  విలువ లేని రైతునూ...

కానీ... నాయకులు, ఉన్నతాధికారులు మాత్రం పొట్ట మీద చేయి వేసుకుని రాజరికం వెలగబెడుతూ కార్పోరేట్లతో సావాసం చేస్తూ చల్లగా కులాసాగా కాలం గడిపేస్తూనే ఉంటారు.

🇮🇳 _*మేరా భారత్ మహాన్*_ 🇮🇳

సర్వసంపదలిచ్చే శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం

క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|

శుద్ధ సత్త్వస్వరూపే చ కోపాది పరి వర్జితే||

ఉపమే సత్త్వసాధ్వీనాం దేవీనాం దేవ పూజితే|

త్వయా వినా జగత్సర్వం మృత తుల్యం చ నిష్ఫలమ్|

సర్వసంపత్స్వరూపా త్వం సర్వేషాం సర్వరూపిణీ|

రామేశ్వర్యధిదేవీ త్వం త్వత్కళాసర్వయోషితః||

కైలాసే పార్వతీ త్వం చ క్షీరోధే సింధుకన్యకా|

స్వర్గే చ స్వర్గ లక్ష్మీస్త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే||

వైకుంఠే చ మహాలక్ష్మీ ర్దేవదేవీ సరస్వతీ|

గంగా చ తులసీ త్వం చ సావిత్రీ బ్రహ్మలోకగా||

కృష్ణప్రాణాధిదేవీ త్వం గోలోకే రాధికాస్వయమ్|

రాసేరాసేశ్వరీ త్వం చ వృందా వృందావనే  వనే||

కృష్ణప్రియా త్వం భాండీరే చంద్రా చందనకాననే|

విరజా చంపకవనే శతశృంగే చ సుందరీ|

పద్మావతీ పద్మవనే మాలతీ మాలతీవనే|

కుందదంతా కుందవనే సుశీలా కేతకీవనే||

కదంబమాలా త్వం దేవీ కదంబ కాననేపి చ|

రాజ్యలక్ష్మీ రాజగేహే గృహలక్ష్మీః గృహే గృహే||

ఇత్యుక్త్వా దేవతాస్సర్వే మునయో మనవస్తథా|

రురుద్దుర్నమ్ర వదనా శుష్క కంఠో తాలుకాః||

ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్|

యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్||

అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్|

సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్||

పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్|

అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్||

పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్|

భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్||

హత బంధుర్లభేద్బంధుః ధన భ్రష్టో ధనం లభేత్||

కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్||

సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్|

హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్||



ఇది మహాలక్ష్మీ స్తోత్రం. మహాప్రభవ సంపన్న మైన స్తోత్రం. దేవత లంతా కలసి ఆ జగజ్జ ననిని స్తోత్రించిన మహా వాక్యాలివి. శ్రీ



మహాలక్ష్మి సంపద లకి శ్రే ష్ఠ త్వానికి, కాం తి కీ ,

 ఇది ముఖ్యంగా పురుషులకు ఉత్తమమైంది స్త్రీలకు ఎట్లాగో అన్ని స్తోత్రాలు ఉన్నాయి



ఇది వివాహం కాకపోయినా ఉద్యోగం రాకపోయినా ఈ అందరూ చదువుకునేది రోజు 41 రోజులు కలవాలి నైవేద్యం పెట్టాలి పాయసం దీని విశేషమైంది దీనికి నియమాలేవీ లేవు



***********