31, జులై 2020, శుక్రవారం

గోదావరి - గేయం

మనసున్న తల్లి మా తూర్పు గోదావరి - గేయం
----------------------------------------
రచన: నూజిళ్ళ శ్రీనివాస్ గానం: శ్రీ సాకేత్ నాయుడు, సంగీతం: శ్రీ కిరణ్ కుమార్ ; ఎడిటింగ్: శ్రీ కృష్ణ, దేవి మణికంఠ కలర్ ల్యాబ్, రాజమహేంద్రవరం;
------------------------
అందరికీ నమస్కారం🙏🙏

ఇది గోదావరి పై నేను రాసిన తొలిపాట - సుమారు పది సంవత్సరాల క్రితం అప్పటి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గారి పిలుపు మేరకు, జిల్లా గీతం ఎంట్రీ గా రచించి, మద్రాస్ లో మిత్రులు, ప్రముఖ ఫ్లూట్ ప్లేయర్, సంగీత దర్శకులు శ్రీ కిరణ్ కుమార్ గారి సంగీత సారధ్యం లో సిని నేపథ్య గాయకులూ శ్రీ సాకేత్ నాయుడు (పరుగు సినిమా ఫేం) గారి గానంతో రూపొందిన ఈ గీతం ఇన్నాళ్ళకు విడుదలకు నోచుకొంటున్నది.

జన్మనిచ్చిన ప్రాంతాన్ని (ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం... ఏదైనా) తలచుకొంటే పులకించని మనసు ఉండదు. అటువంటి పులకింతతో, ఆరాధనా భావంతో నేను పుట్టి, పెరిగి, తిరిగి చేరిన తూర్పు గోదావరి జిల్లా పట్ల నా భావాల సంకలనం ఈ పాట.

ఆయ్ మేం గోదారోళ్ళమండి... అన్న పాటను ఎటువంటి ఎల్లలు లేక, తెలుగు వారు అందరూ ఆదరించి, ఆశీర్వదించారు. అదే రీతిలో ఈ గీతాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

ఈ అవనిలో అన్ని ప్రాంతాలు ప్రత్యేకమైనవే.. సుందరమైనవే... మమతలను పంచేవే..   అందువల్ల, ఈ గీతాన్ని నా జిల్లా పట్ల నా కృతజ్ఞతాపూర్వక సమర్పణ గానే చూసి, తెలుగు వారు అందరూ ఆదరిస్తారని భావిస్తూ, వినమ్రంగా  ఈ పాటను సమర్పించుకొంటున్నాను.

Please Listen, Like, Comment, Share and Subscribe.😊

స్వస్తి

నూజిళ్ళ శ్రీనివాస్
ఫోన్: 7981862200
https://youtu.be/DBg101Opep8

కామెంట్‌లు లేవు: