31, జులై 2020, శుక్రవారం

*మేరా భారత్ మహాన్*

మన దేశ పరిస్థితిని చక్కగా వివరించిన కధనం

_*ఆలోచించ వలసిన విషయమే.*_                                                                                           
                                                                                                                 _*మేరా భారత్ మహాన్*_

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వింటున్నా...

_*"పేదరికాన్ని నిర్మూలిస్తాం"*_

70 సంవత్సరాలలో 70% పథకాలన్నీ దీనికే...

ఎన్ని లక్షల కోట్లు ఖర్చుపెట్టారో లెక్కే లేదు...

నాకు అర్థమవని విషయమేంటంటే...

అసలు పేదరికాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత సమాజానికి ఏమిటి?

ప్రతి మనిషి ఎవరి కష్టం మీద వాళ్ళు బ్రతుకేటప్పుడు,
మద్య తరగతి వాడి కష్టం - పేదవాడి కష్టం కన్నా ఏ విషయం లో తక్కువ?

ఈ పేదవాడు అన్నవాడు  ప్రభుత్వ దత్తపుత్రుడు ఎందుకవుతున్నాడు?

ప్రభుత్వం అందరిదీ అయినప్పుడు, మద్య తరగతి వాడి  పొట్ట కొట్టి పేదవాడికి ఎందుకు పెడుతున్నారు?

సమాజం సంవృద్దికి, అభివృద్ధికి పేదవాడి సహకారం ఏమిటి?

🚩వీడు టాక్స్ కట్టడు.
🚩పొదుపు చెయ్యడు.
🚩కుటుంబ నియంత్రణ పాటించడు.
🚩చట్టాన్ని గౌరవించడు.
🚩ఆరోగ్య సూత్రాలు పాటించడు.
🚩వీడికసలు కుటుంబ భాధ్యతే ఉండదు.
🚩వీడింట్లో పిల్లలకు అరటి పండుకి డబ్బు లుండవు కానీ మత్తిచ్చే మందుసీసాలకి లోటుండదు.
🚩అసలు వీడు అన్నింటిలోనూ భాధ్యతారహితమే.
🚩తూలుతూ హక్కుల గురించి మాత్రమే మాట్లాడతాడు.
🚩సమాజం పట్ల ఎటువంటి బాధ్యత ఉండదు.
🚩సమాజ శ్రేయస్సు తో సంబంధం లేదు.
🚩సామాజిక భాధ్యత ఉండదు. 
🚩వీడికన్నీ ఉచితంగా కావాలి. 
🚩వీడికి అవినీతి తప్పు కాదు పైగా సమర్ధిస్తాడు.
🚩ఎవడు ఉచితాలు, డబ్బులెక్కువిస్తే వాడికే ఓటేస్తాడు.

అసలు మతలబు ఇక్కడే ఉంది...

రాజకీయ నాయకులకు కావలసింది ఆలోచించి ఓటేసేవాడు కాదు. వాళ్ళిచ్చిన డబ్బు తీసుకుని స్వార్ధం తో ఓటేసేవాడే కావాలి. ఈరోజు ప్రభుత్వాలను పేదవాళ్ళే నిర్ణయిస్తున్నారు.

వీళ్ళు ఎంత ఎక్కువ మంది ఉంటే, అవినీతిపరులు అంత సులభంగా అధికారం లోకి రావచ్చు.

అందుకే ఓటుకి నోటు ఇవ్వని వాడికి డిపాజిట్ కూడా దక్కదు.

ప్రజాస్వామ్యం లో దేశానికి అసలు నష్టం పేదవాడి వల్లే జరుగుతోంది.

అందుకే...

_*దేశంలో అన్యాయమౌతోంది పేదవాడు కాదు, మద్య తరగతి వాడు*_

_*పేదవాళ్ళకి పేదరిక నిర్మూలన అవసరం లేదు. ఎందుకంటే ఉచితాలు పోతాయి*_

_*రాజకీయ నాయకులకూ పేదరిక నిర్మూలన వల్ల ఉపయోగం లేదు*_

_*కాబట్టి పేదరికం ఎప్పటికీ నిర్మూలించబడదు*_

టాక్స్ లు కడుతున్న వెంగళప్పలు మాత్రం  రూ. ఇరవై పెట్రోల్ ని డెబ్బైకి కొనుక్కొని తింగరోళ్లలా తలదించుకుని ఉరుకుల పరుగులతో బ్రతుకీడుస్తుంటారు.

మౌలిక సదుపాయాలుండని  గతుకుల రోడ్ల పై తిరుగుతూనే ఉంటారు.

పైన చెప్పినట్లు.  పేదవాడు డబ్బు తీసుకుని ఓట్లు వేస్తూ, సంక్షేమ పధకాలన్నీ పొందుతూ, మోటార్ సైకిల్, టివి, ఫ్రిజ్, మిక్సీ, కూలర్/ఎసి, స్మార్ట్ ఫోన్ (వీటన్నిటికీ కరెంటు ఫ్రీ)  లాంటివి అన్నీ ఉన్నా మరుగుదొడ్డి మాత్రం ఉండదు, ఉన్నా వాడరు...

వీరు ప్రభుత్వం దృష్టిలో మాత్రమే పేదవాడి గా ఉంటారు. అలానే తూలుతుంటారు.

అసలు కారణం ఏమిటంటే ఆ ఇంట్లో నాలుగు ఓట్లుంటాయి మరి.

దేశం చుట్టూ సైనికలు రేయింబగళ్లు, ఎండా, వాన, మంచుల్లో మాత్రం పహరా కాస్తూనే ఉంటారు.

స్థూలంగా ఈ దేశంలో వెంగళప్పలు ఎవరయా అంటే -  బ్యాంక్ ఋణాలు ఎగ్గొట్టకుండా, నిఖార్సుగా వాయిదాలు కడుతూ, ట్యాక్స్ లు కట్టే మధ్యతరగతి మనిషి, నా దేశం అంటూ వీరస్వర్గం పొందే సైనికుడు, దేశానికి అన్నం పెట్టే  విలువ లేని రైతునూ...

కానీ... నాయకులు, ఉన్నతాధికారులు మాత్రం పొట్ట మీద చేయి వేసుకుని రాజరికం వెలగబెడుతూ కార్పోరేట్లతో సావాసం చేస్తూ చల్లగా కులాసాగా కాలం గడిపేస్తూనే ఉంటారు.

🇮🇳 _*మేరా భారత్ మహాన్*_ 🇮🇳

కామెంట్‌లు లేవు: