18, మే 2026, సోమవారం

అమ్మ "కొంగు"

 జీన్స్‌లో అమ్మ "కొంగు" ఎక్కడ దొరుకుతుంది? 🤔


పాఠశాలలో, ఉపాధ్యాయురాలు విద్యార్థులను "అమ్మ కొంగు" పై ఒక వ్యాసం రాయమని అడిగారు.

ఒక విద్యార్థి రాసిన విషయం ఎంత హృదయానికి హత్తుకునేలా ఉందంటే, అది మీ మనసును భావోద్వేగాలతో నింపేస్తుంది... 😭


గౌరవనీయ ఉపాధ్యాయురాలీ,


అమ్మ కొంగు కేవలం ఒక వస్త్రపు ముక్క మాత్రమే కాదు; అది అమ్మ యొక్క గౌరవం మరియు ఔన్నత్యం.


పొయ్యి మీద ఉన్న వేడి పాత్రలను దించడానికి అమ్మ కొంగునే ఉపయోగించేవారు.


అది పిల్లల చెమటను, కన్నీళ్లను తుడిచేది; మురికి పట్టిన ముఖాలను, చెవులను, చిట్టి చేతులను శుభ్రం చేసేది.


భోజనం చేసిన తర్వాత, అమ్మ కొంగుతో మా ముఖాలను తుడిపించుకోవడంలో ఒక ప్రత్యేకమైన హాయి ఉండేది.


మా కళ్ళలో ఏదైనా పడినప్పుడు, అమ్మ కొంగును మెలివేసి, తన ఊపిరితో దాన్ని మెల్లగా వెచ్చబరిచి, కంటిపై ఉంచేది — ఎందుకో తెలియదు గానీ, ఆ నొప్పి వెంటనే మాయమైపోయేది.


అమ్మ ఒడిలో నిద్రించే పిల్లలకు, ఆమె ఒడి మృదువైన పడకగా, ఆమె కొంగు హాయినిచ్చే దుప్పటిగా మారేది.


ఇంట్లోకి ఎవరైనా కొత్తవారు వచ్చినప్పుడు, పిల్లలు భద్రత కోసం అమ్మ కొంగు వెనుక దాక్కునేవారు.


పిల్లలకు సిగ్గు అనిపించినప్పుడు, వారు అమ్మ కొంగుతో తమ ముఖాన్ని కప్పుకునేవారు.


పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు, వారు అమ్మ కొంగును పట్టుకునేవారు; అది వారికి మార్గదర్శిగా, రక్షణ కవచంగా నిలిచేది.


పిల్లలు అమ్మ కొంగును పట్టుకుని ఉన్నంత సేపు, ఈ ప్రపంచమంతా తమ చేతిలోనే సురక్షితంగా ఉన్నట్లు వారికి అనిపించేది.


చలికాలంలో, చలి నుండి రక్షించడానికి అమ్మ తన కొంగుతో పిల్లలను నలువైపులా చుట్టేసేది.


మరియు భారీ వర్షం కురిసినప్పుడు, అదే కొంగు గొడుగులా మారి పిల్లల ముఖాన్ని కప్పేది.


చేతులు తుడుచుకోవడానికి అమ్మ కొంగును తువ్వాలులా కూడా ఉపయోగించేవారు.


చెట్ల కింద రాలిన పూలను, పండ్లను సేకరించి అందులోనే మోసుకొచ్చేది.


కొన్నిసార్లు, ధాన్యాన్ని, నైవేద్యాన్ని లేదా ప్రసాదాన్ని అందులోనే సేకరించేవారు.


ఇంటి సామాన్లను దుమ్ము దులపడానికి, శుభ్రం చేయడానికి కూడా దాన్ని ఉపయోగించేవారు.


ఏదైనా వస్తువు పోయినప్పుడు, అది త్వరలోనే దొరుకుతుందని నమ్మి అమ్మ తన కొంగుకు ఒక ముడి వేసేది — వింతగా అనిపించినా, అది సాధారణంగా దొరికిపోయేదే.


అమ్మ కొంగులోని ఆ ముడి ఒక కదిలే బ్యాంకు లేదా లాకర్ లాంటిది; పిల్లల అదృష్టం బాగుంటే, అందులో దాగి ఉన్న కొన్ని నాణేలు మాయాజాలంలా బయటపడేవి కూడా. అమ్మ చీర కొంగు కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు — అది ఒక అద్భుతమైన అనుభూతి, ఒక భావోద్వేగం, ఒక ఆశ్రయం, మరియు ప్రేమతో నిండిన ఒక ప్రపంచం.


నేటి తరం ఆ కొంగులోని వెచ్చదనాన్ని, దాని లోతైన అర్థాన్ని బహుశా ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు.

ఇప్పుడు పిల్లలకు ఆ అవకాశం లేదు అంతా నైటి ప్రపంచం.మరియు

ఇప్పుడు, అమ్మలు జీన్స్ ధరిస్తున్న ఈ రోజుల్లో...

మరి ఆ "కొంగు" ఎక్కడి నుండి వస్తుంది?


🙏 ప్రేమను, వెచ్చదనాన్ని, త్యాగాన్ని మరియు బాల్యపు లెక్కలేనన్ని మధుర స్మృతులను తనలో మోసుకున్న ప్రతి అమ్మ చీర కొంగుకు ఈ నివాళి. 🙏

18-05-2026 సోమవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

18-05-2026 సోమవారం రాశి ఫలితాలు


మేషం


పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు. గృహమున సొంత ఆలోచనలు అమలు చేస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.  

--------------------------------------- 


వృషభం


బంధువులతో అకారణ మాట పట్టింపులు ఉంటాయి. విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

---------------------------------------


మిధునం


బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.

---------------------------------------


కర్కాటకం


సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగుతారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. 

---------------------------------------


సింహం


ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో అవరోధాలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

---------------------------------------


కన్య


ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన శిరో బాధలు తప్పవు. వ్యాపారాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సంతానం విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది.

---------------------------------------


తుల


సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారస్థులు నూతన పెట్టుబడులు అందుకుంటారు. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.  

---------------------------------------


వృశ్చికం


భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించినట్టు అవకాశాలు లభిస్తాయి. 

---------------------------------------


ధనస్సు


స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సన్నిహితుల మీ మాటతో విబేదిస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని రంగాల వారికి సమస్యలు తప్పవు.

---------------------------------------


మకరం


చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగుల యత్నాలు నిరాశ కలిగిస్తాయి.

---------------------------------------


కుంభం


భూవివాదాల పరిష్కారమౌతాయి. వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహంకాలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------


మీనం

 

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విద్యార్థుల విదేశీ యత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. వ్యాపారమున భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

---------------------------------------

పంచాంగం

  🕉️


*పురుషోత్తమ/మల/అధికమాస మహాత్మ్యము*


భారతీయ కాలగణన (పంచాంగం) ప్రకారం చంద్రమానానికి, సౌరమానానికి మధ్య గల వ్యత్యాసాన్ని సరిచేయడానికి ప్రతి 32 నెలల 16 రోజులకు ఒకసారి అధిక మాసం వస్తుంది. జ్యేష్ఠ మాసంలో ఈ అధిక మాసం సంభవించినప్పుడు దానిని అధిక జ్యేష్ఠ మాసం అంటారు. పురాణాలు, స్మృతులు, ధర్మశాస్త్ర సూత్రాల ప్రకారం దీనికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. దీనినే "పురుషోత్తమ మాసం" అని కూడా పిలుస్తారు.

చంద్రమాన సంవత్సరానికి (354 రోజులు), సౌరమాన సంవత్సరానికి (365 రోజులు) మధ్య దాదాపు 11 రోజుల వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసం సరిగ్గా 33 మాసాలకు (దాదాపు 2 సంవత్సరాల 8 నెలల 16 రోజులకు) ఒక పూర్తి మాసంగా (30 రోజులుగా) మారుతుంది.


కాలచక్రంలో ఈ 'అధిక మాసం' ఏర్పడటానికి పట్టే కాలం 33 నెలలు. ఈ కాలగణన సూత్రానికి ప్రతీకగా కూడా వ్రత విధానంలో 33 సంఖ్యను నిర్దేశించారు.


అధిక మాసానికి అధిపతి లేకపోవడం వల్ల దీనిని అందరూ శుభకార్యాలకు వర్జ్యమని భావించి 'మల మాసం' అని పిలిచేవారు. అప్పుడు ఆ మాసం బాధపడి మహావిష్ణువును ఆశ్రయించగా, స్వామి అనుగ్రహించి, తన పేరైన "పురుషోత్తమ" నామధేయాన్ని దానికి ఇచ్చి, అన్ని మాసాల కంటే శ్రేష్ఠమైనదిగా మార్చాడని పద్మ పురాణ వచనం.


అహం చైవ యథా లోకే

పురుషోత్తమ ఇత్యుతే |

తథాయమపి లోకేషు

పురుషోత్తమ నామకః ||

మత్స సాదృశ్యమగమత్

మాసానామధిపో భవత్ |

జగత్పూజ్యో జగద్వంద్యో

మాసోఽయం చ భవిష్యతి ||

"లోకంలో నేను ఏ విధంగా 'పురుషోత్తముడు' అని పిలవబడుతున్నానో, అదే విధంగా ఈ మాసం కూడా లోకంలో 'పురుషోత్తమ మాసం' అని పిలవబడుతుంది. ఇది నా సారూప్యతను పొంది, అన్ని మాసములకు అధిపతియై, జగత్తు చేత పూజింపబడుతుంది.


మాసానాం ప్రవరో మాసః

పురుషోత్తమ సంజ్ఞకః |

అస్మిన్ మాసే కృతం పుణ్యం

కోటికోటి గుణం భవేత్ ||

( స్కాంద పురాణం)

మాసాలన్నింటిలోనూ పురుషోత్తమ మాసం అత్యంత శ్రేష్ఠమైనది. ఈ మాసంలో ఆచరించే ఏ పుణ్యకార్యమైనా (దానం, జపం, తపస్సు) కోట్లాది రెట్ల ఫలితాన్ని ఇస్తుంది.


యాదృశీ జాహ్నవీ గంగా 

సరితాం ప్రవరా స్మృతా |

తాదృశః సర్వమాసానాం 

ప్రవరో జ్యేష్ఠాఽధికో నృప ||

(నారద పురాణము)

నదులన్నింటిలోనూ గంగానది ఎంత శ్రేష్ఠమైనదో, చాంద్రమాన మాసాలన్నింటిలోనూ ఈ 'అధిక జ్యేష్ఠ మాసం' అంత శ్రేష్ఠమైనది." గంగలో స్నానం చేస్తే ఎలాంటి పాపాలు తొలగిపోతాయో, ఈ మాసంలో విష్ణు నామ స్మరణ చేయడం వల్ల అంతటి అంతఃశుద్ధి కలుగుతుంది.


మాసోఽయమధికో రాజన్

పురుషోత్తమ ఉచ్యతే |

అస్మిన్ కాలాచ్యుతం నత్వా

పునర్భవం న విందతి ||

ఈ అధిక మాసము సాక్షాత్తూ పురుషోత్తమ స్వరూపము. ఈ కాలంలో అచ్యుతుడైన ఆ శ్రీమహావిష్ణువును భక్తితో అర్చించి, నమస్కరించిన మానవుడు మరల జన్మ మృత్యు సంసార చక్రంలో పడకుండా మోక్షాన్ని పొందుతాడు.


గంగా సరస్వతీ రేవా 

యమునా చ ప్రయాగకా |

తాసాం స్నానాచ్చ యత్పుణ్యం

తదస్మిన్ మాస సేవయా ||

(బృహన్నారదీయ పురాణం)

గంగ, సరస్వతి, నర్మద (రేవ), యమున మరియు ప్రయాగ వంటి పవిత్ర తీర్థాలలో స్నానం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం లభిస్తుందో, ఈ పురుషోత్తమ మాసంలో నియమ పూర్వకంగా భగవత్ సేవ చేయడం వల్ల అంతటి పుణ్యఫలం లభిస్తుంది.


దేవదేవ జగన్నాథ

ప్రణతార్తివినాశన |

జ్యేష్ఠాఽధికే మయా దత్తం

గృహాణార్ఘ్యం నమోఽస్తుతే ||💧

అని భగవంతుడికి నిత్య‌ అర్ఘ్యం సమర్పించడం.


వాపీకూపతటాగాది 

ప్రతిష్ఠా యజ్ఞకర్మ చ |

మాంగల్యాని చ కర్మాణి 

మలమాసే వివర్జయేత్ ||

(నారద స్మృతి)

బావులు, చెరువులు తవ్వించడం, దేవాలయ ప్రతిష్ఠలు, యజ్ఞ యాగాలు, వివాహము, ఉపనయనము, గృహప్రవేశము, చౌలము (పుట్టువెంట్రుకలు తీయుట) వంటి మాంగల్య (శుభ) కార్యాలను మలమాసంలో/అధిక మాసంలో విడిచిపెట్టాలి.


నిత్యాని నైమిత్తికాని

ప్రకుర్యాదధికేఽపి చ |

కామ్యాని తు న కుర్వీత

 ప్రతిష్ఠాదీని కాన్యచిత్ ||

(స్మృతి కౌస్తుభం)

అధిక మాసము వచ్చినప్పటికీ నిత్య కర్మలను (సంధ్యావందనాది అనుష్ఠానాలు), నైమిత్తిక కర్మలను (గ్రహణ స్నానాలు, శ్రాద్ధాలు, తప్పనిసరి విధులు) యథావిధిగా ఆచరించాలి. కానీ, కామ్య కర్మలను (కోర్కెలు కోరుతూ చేసే యజ్ఞాలు, వ్రతాలు) మరియు దేవతా ప్రతిష్ఠలు, నూతన గృహారంభాలు వంటి వాటిని మాత్రం అస్సలు చేయకూడదు.


లౌకిక శుభకార్యాలు లేకపోవడం వల్ల మానవునికి సంసార పరమైన బాధ్యతల నుండి కొంత మానసిక విరామం దొరుకుతుంది. ఈ సమయాన్ని దైవచింతనలో, గ్రంథ పఠనంలో గడపడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

అధిక మాసంలో చేసే పూజలు కేవలం "శ్రీ పురుషోత్తమ ప్రీత్యర్థం" (భగవంతుని సంతోషం కోసం మరియు ఆత్మశుద్ధి కోసం) మాత్రమే చేస్తారు. ఇది మానవుడిని స్వార్థం నుండి నిష్కామ స్థితికి తీసుకెళ్తుంది.


జీవతో వా మృతస్యాపి 

యా గతిః పురుషోత్తమే |

న సా క్రతుసహస్రేణ 

లభ్యతే నృపసత్తమ ||

( నారద పురాణం)

పురుషోత్తమ మాసంలో జీవించి ఉన్నవారికి మాత్రమే కాదు, మరణించిన పితృదేవతల పేరిట చేసే పుణ్యకార్యాల వల్ల వారికి లభించే సద్గతి, వేయి యజ్ఞాలు చేసినా లభించదు. ఈ మాసంలో పితృదేవతలను తలుచుకుని దానాలు చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది.


యైర్న పూజిత ఈశానో 

మాసి పురుషోత్తమే |

దరిద్రా భవంతి తే నూనం

జన్మజన్మని మానవాః ||

(పద్మ పురాణము)

ఎవరైతే ఈ పరమ పవిత్రమైన పురుషోత్తమ మాసంలో జగదీశ్వరుడైన శ్రీహరిని పూజించకుండా, దానధర్మాలు చేయకుండా కాలం గడుపుతారో, వారు జన్మజన్మలందు దరిద్రాన్ని అనుభవిస్తారు. అంటే ఈ మాసంలో చేసే కొద్దిపాటి పూజ అయినా దరిద్ర నాశనం అవుతుంది.


ఏకభక్తేన నక్తేన తథైవాయాచితేన చ |

ఉపవాసేన కర్తవ్యో మలమాసః ప్రయత్నతః ||

అధిక మాస వ్రతాన్ని ఆచరించే శక్తులు గలవారు నెల రోజులు ఉపవాసం ఉండాలి. అది సాధ్యం కాని పక్షంలో రోజుకు ఒక పూట మాత్రమే భుజించడం (ఏకభుక్తం), లేదా రాత్రి వేళ మాత్రమే భుజించడం (నక్తం), లేదా అడగకుండా లభించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం (అయాచితం) అనే నియమాల ద్వారా ఈ మాసాన్ని భక్తి శ్రద్ధలతో గడపాలి.


అధిక మాసములో

ఉపవాసము, 

ఏకభుక్తము,

నక్త వ్రతము,

అయాచితము‌,

ధారణ పారణ వ్రతం, 

విష్ణుపంచక వ్రతము,

అలవణ వ్రతము,

లక్ష ప్రదక్షిణము, 

అయాచిత వ్రతము,

లక్ష వత్తుల వ్రతము,

దీప నమస్కారము,

లక్ష పుష్పార్చన,

అథఃశయనము,

మౌనవ్రతము,

ఇవన్నీ భగవత్ ప్రీతికరమైనందున

చేయవలెను. 


మలమాసే గతే ప్రాప్తే 

హరిముద్దిశ్య భక్తితః |

త్రయస్త్రింశదపూపానాం 

దానం కుర్యాద్విధానతః ||

కాంస్యపాత్రే నిధాయైతాన్

ఫలతాంబూల సంయుతాన్ |

దద్యాద్విప్రాయ శాంతాయ

పురుషోత్తమ తుష్టయే ||


33 అపూపాలను

(అరిసెలు) పళ్ళు, వెండి,

బంగారము మొదలగు దానాలు

బ్రాహ్మణ సువాసినీలకు భోజనము

వాయనాల దానాలు

నిష్కామముగా చేసినచో విశేష

ఫలము లభించును


అధిక మాసములో 33 దేవతలను

వారి అంతర్యామి 33

భగవద్రూపాలను ఆరాధించాలి.

12 ఆదిత్యులు, 

11 రుద్రులు, 

8 వసువులు, 

2 అశ్విని దేవతలు.

వీరిని అపూపాలలో ఆవాహన చేసి పూజించి దానము చేయాలి.


బ్రహ్మాండాన్ని దానం చేసే శక్తి

మానవునికి సాధ్యము కాదు.

పురుషోత్తమ మాసములో ఇది

సాధ్యము. 33, అరిసలను ఒక

కంచు పాత్రలో పెట్టి ఇంకొక కంచు

పాత్రను మూసిపెట్టి దానము

చేసినవారికి బ్రహ్మాండ దాన 

ఫలము నిశ్చయముగా లభిస్తుంది.


కాంస్యపాత్రం సమాదాయ 

తస్మిన్ పూపాన్ నిధాయ చ |

బ్రాహ్మణాయ ప్రదాతవ్యం

సర్వపాప విముక్తయే ||

​సువర్ణ లేదా కంచు పాత్రను (తామ్ర/కాంస్య పాత్ర) తీసుకుని, అందులో నెయ్యితో వండిన అప్పాలను (అరిసెలను) ఉంచి, సర్వ పాపాల నుండి విముక్తి కలగడం కోసం ఉత్తముడైన బ్రాహ్మణునికి దానంగా సమర్పించాలి.


(అపూప దాన శ్లోకం)

విష్ణురూపీ సహస్రాంశుః

సర్వపాపప్రణాశనః |

అపూపాన్న ప్రదానేన 

మమ పాపం వ్యపోహతు ||

సహస్ర కిరణాలు కలిగిన, సర్వ పాపాలను నాశనం చేసే విష్ణు స్వరూపుడైన ఓ పురుషోత్తమా! నేను సమర్పిస్తున్న ఈ అపూప (అరిసెల) దానం వల్ల నా పాపాలన్నీ తొలగిపోవు గాక.


అరిసెలు గుండ్రంగా ఉంటాయి. ఇది సూర్య మరియు చంద్ర బింబాలకు ప్రతీక. అధిక మాసం అనేది సూర్య, చంద్రుల గమనాల వ్యత్యాసం వల్ల (సౌర, చాంద్ర మానాల సమన్వయం) ఏర్పడేది కాబట్టి, ఈ గ్రహాల అనుగ్రహం కోసం వాటి రూపంలో ఉన్న అపూపాన్ని దానం చేస్తారు. నెయ్యిలో వేయించినప్పుడు అరిసెపై వచ్చే చిన్న చిన్న రంధ్రాలు లేదా దాని రూపం సూర్యుని సహస్ర కిరణాలకు (రశ్మి) సంకేతంగా భావిస్తారు.


*అధిక మాసం లో విశేష దానాలు*


అధిక మాసం సంపూర్ణముగా

ముగిసేంత వరకూ తాంబూల

దానం, బ్రాహ్మణ దంపతులకు

చేసినచో దౌర్భాగ్యము నశించి

సౌభాగ్య ప్రాప్తి కలుగును. ఒక నెల

ఆఖండ దీపము శాంతము

కాకుండా దీపారాధన చేయుట

వలన అంధకారము నశించి

జీవితము ప్రకాశవంతమై జ్ఞాన ప్రాప్తి

కలుగును. సువాసినీ స్త్రీలు 33

వాయన దానాలు చేయుట వలన

వంశాభివృద్ధి మరియు దీర్ఘ

సౌమంగల్యము సిద్ధించును.

ఇదేవిధముగా అనేక దానాలు

చేయవచ్చు. 33 సంఖ్య అని

చెప్పినది 33 కన్న తక్కువ

కారాదన్న అభిప్రాయముతో

చెప్పినదని తెలుసుకొనవలెను.

అధికమాసములో శ్రీమద్భాగవత

శ్రవణము చేయుటవలన

పురుషోత్తముని అనుగ్రహము

విశేషముగా లభించును.


*అధికమాసములో నిషిద్ధ కార్యములు*


అనిత్యమనిమిత్తంచ దానం మహాదానం|

ఆగ్య్నధానాధ్యరాపూర్వతీర్థయాత్రామరేక్షణం||

దేవారామతటాకాదిప్రతిష్టాం మౌంజి బంధనం |

ఆశ్రమ స్వీకృతం కామ్యపృషోత్వర్గంచ నిప్క్రమం||

రాజ్యాభిషేకం ప్రథమం చూడాకర్మ ప్రతానిచ| 

అన్నప్రాశన మారంభం గృహాణాం చ ప్రవేశనం||

స్నానం వివాహం నామాతిపన్నం దేవమహోత్సవం | వ్రతారంభం సమాప్తిం చ కామ్యకర్మచ పాప్మనాం I|

 ప్రాయశ్చిత్తం చ సర్వ స్యమల మాసే వర్జయేత్|| - 

(బృహస్పతిః- స్ర్మతి ముక్తావళి)


మహా దానములు, 

అగ్నాధానము, 

యజ్ఞము, 

ఉద్యానవనముల నిర్మాణము,

చెరువుల నిర్మాణము,

ఉపనయనము, 

సన్యాస స్వీకారము, 

జ్యోతిష్టోమాది కామ్యకర్మలు,

పసిపిల్లలను మొదటి సారి ఇంటి

నుండి బయటకు తీసుకువెళ్ళుట,

పట్టాభిషేక కార్యము, 

చౌలము, 

విశేష వ్రతాలు, 

అన్నప్రాశనము, 

గృహారంభము, 

గృహప్రవేశము, 

విశేష తీర్థస్నానము,

వివాహము, 

నామకరణము,

ప్రాయశ్చిత్త హోమాలు,

ఈ కార్యములను అధికమాసములో

చేయకూడదు.


పురుషోత్తమస్య మాసే తు

దీపదానం కరోతి యః |

ఘృతేన వాపి తైలేన తస్య

పుణ్యమనంతకమ్ |

పురుషోత్తమ మాసంలో ఎవరైతే ఆవు నెయ్యితో గానీ, లేదా నువ్వుల నూనెతో గానీ భగవంతుని సన్నిధిలో దీప దానం (దీపారాధన చేసి సమర్పించడం) చేస్తారో, వారికి అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. వారి వంశంలోని పితృదేవతలకు కూడా సద్గతులు కలుగుతాయి.


నెల రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం విష్ణు సన్నిధిలో లేదా తులసి కోట వద్ద అఖండ దీపం లేదా నిత్య దీపారాధన చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.


ఈమాసంలో సూర్యుడి తాపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో విష్ణువుకు జలాభిషేకం చేయడం, పురుష సూక్తం, విష్ణు సహస్రనామ స్తోత్రాలు పఠించడం వలన మనశ్శాంతిని ఇస్తుంది.


సాధ్యమైనంత వరకు నదీ స్నానం చేయడం, నెలలో కనీసం ఒక రోజైనా (ముఖ్యంగా ఏకాదశి నాడు) ఉపవాసం ఉండి పురుషోత్తముడిని పూజించడం శాస్త్ర సమ్మతం.


అధిక మాసం అనేది లౌకిక శుభకార్యాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక ఎదుగుదలకు, పూర్వ జన్మ పాప పరిహారానికి, అక్షయ పుణ్య సంపాదనకు లభించిన ఒక అద్భుతమైన ‌"అదనపు" సమయం లాంటిది. ధర్మశాస్త్రాల ప్రకారం దీనిని భక్తి శ్రద్ధలతో వినియోగించుకోవడం ఉత్తమం.

🕉️


*పురుషోత్తమ/మల/అధికమాస మహాత్మ్యము*


భారతీయ కాలగణన (పంచాంగం) ప్రకారం చంద్రమానానికి, సౌరమానానికి మధ్య గల వ్యత్యాసాన్ని సరిచేయడానికి ప్రతి 32 నెలల 16 రోజులకు ఒకసారి అధిక మాసం వస్తుంది. జ్యేష్ఠ మాసంలో ఈ అధిక మాసం సంభవించినప్పుడు దానిని అధిక జ్యేష్ఠ మాసం అంటారు. పురాణాలు, స్మృతులు, ధర్మశాస్త్ర సూత్రాల ప్రకారం దీనికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. దీనినే "పురుషోత్తమ మాసం" అని కూడా పిలుస్తారు.

చంద్రమాన సంవత్సరానికి (354 రోజులు), సౌరమాన సంవత్సరానికి (365 రోజులు) మధ్య దాదాపు 11 రోజుల వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసం సరిగ్గా 33 మాసాలకు (దాదాపు 2 సంవత్సరాల 8 నెలల 16 రోజులకు) ఒక పూర్తి మాసంగా (30 రోజులుగా) మారుతుంది.


కాలచక్రంలో ఈ 'అధిక మాసం' ఏర్పడటానికి పట్టే కాలం 33 నెలలు. ఈ కాలగణన సూత్రానికి ప్రతీకగా కూడా వ్రత విధానంలో 33 సంఖ్యను నిర్దేశించారు.


అధిక మాసానికి అధిపతి లేకపోవడం వల్ల దీనిని అందరూ శుభకార్యాలకు వర్జ్యమని భావించి 'మల మాసం' అని పిలిచేవారు. అప్పుడు ఆ మాసం బాధపడి మహావిష్ణువును ఆశ్రయించగా, స్వామి అనుగ్రహించి, తన పేరైన "పురుషోత్తమ" నామధేయాన్ని దానికి ఇచ్చి, అన్ని మాసాల కంటే శ్రేష్ఠమైనదిగా మార్చాడని పద్మ పురాణ వచనం.


అహం చైవ యథా లోకే

పురుషోత్తమ ఇత్యుతే |

తథాయమపి లోకేషు

పురుషోత్తమ నామకః ||

మత్స సాదృశ్యమగమత్

మాసానామధిపో భవత్ |

జగత్పూజ్యో జగద్వంద్యో

మాసోఽయం చ భవిష్యతి ||

"లోకంలో నేను ఏ విధంగా 'పురుషోత్తముడు' అని పిలవబడుతున్నానో, అదే విధంగా ఈ మాసం కూడా లోకంలో 'పురుషోత్తమ మాసం' అని పిలవబడుతుంది. ఇది నా సారూప్యతను పొంది, అన్ని మాసములకు అధిపతియై, జగత్తు చేత పూజింపబడుతుంది.


మాసానాం ప్రవరో మాసః

పురుషోత్తమ సంజ్ఞకః |

అస్మిన్ మాసే కృతం పుణ్యం

కోటికోటి గుణం భవేత్ ||

( స్కాంద పురాణం)

మాసాలన్నింటిలోనూ పురుషోత్తమ మాసం అత్యంత శ్రేష్ఠమైనది. ఈ మాసంలో ఆచరించే ఏ పుణ్యకార్యమైనా (దానం, జపం, తపస్సు) కోట్లాది రెట్ల ఫలితాన్ని ఇస్తుంది.


యాదృశీ జాహ్నవీ గంగా 

సరితాం ప్రవరా స్మృతా |

తాదృశః సర్వమాసానాం 

ప్రవరో జ్యేష్ఠాఽధికో నృప ||

(నారద పురాణము)

నదులన్నింటిలోనూ గంగానది ఎంత శ్రేష్ఠమైనదో, చాంద్రమాన మాసాలన్నింటిలోనూ ఈ 'అధిక జ్యేష్ఠ మాసం' అంత శ్రేష్ఠమైనది." గంగలో స్నానం చేస్తే ఎలాంటి పాపాలు తొలగిపోతాయో, ఈ మాసంలో విష్ణు నామ స్మరణ చేయడం వల్ల అంతటి అంతఃశుద్ధి కలుగుతుంది.


మాసోఽయమధికో రాజన్

పురుషోత్తమ ఉచ్యతే |

అస్మిన్ కాలాచ్యుతం నత్వా

పునర్భవం న విందతి ||

ఈ అధిక మాసము సాక్షాత్తూ పురుషోత్తమ స్వరూపము. ఈ కాలంలో అచ్యుతుడైన ఆ శ్రీమహావిష్ణువును భక్తితో అర్చించి, నమస్కరించిన మానవుడు మరల జన్మ మృత్యు సంసార చక్రంలో పడకుండా మోక్షాన్ని పొందుతాడు.


గంగా సరస్వతీ రేవా 

యమునా చ ప్రయాగకా |

తాసాం స్నానాచ్చ యత్పుణ్యం

తదస్మిన్ మాస సేవయా ||

(బృహన్నారదీయ పురాణం)

గంగ, సరస్వతి, నర్మద (రేవ), యమున మరియు ప్రయాగ వంటి పవిత్ర తీర్థాలలో స్నానం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం లభిస్తుందో, ఈ పురుషోత్తమ మాసంలో నియమ పూర్వకంగా భగవత్ సేవ చేయడం వల్ల అంతటి పుణ్యఫలం లభిస్తుంది.


దేవదేవ జగన్నాథ

ప్రణతార్తివినాశన |

జ్యేష్ఠాఽధికే మయా దత్తం

గృహాణార్ఘ్యం నమోఽస్తుతే ||💧

అని భగవంతుడికి నిత్య‌ అర్ఘ్యం సమర్పించడం.


వాపీకూపతటాగాది 

ప్రతిష్ఠా యజ్ఞకర్మ చ |

మాంగల్యాని చ కర్మాణి 

మలమాసే వివర్జయేత్ ||

(నారద స్మృతి)

బావులు, చెరువులు తవ్వించడం, దేవాలయ ప్రతిష్ఠలు, యజ్ఞ యాగాలు, వివాహము, ఉపనయనము, గృహప్రవేశము, చౌలము (పుట్టువెంట్రుకలు తీయుట) వంటి మాంగల్య (శుభ) కార్యాలను మలమాసంలో/అధిక మాసంలో విడిచిపెట్టాలి.


నిత్యాని నైమిత్తికాని

ప్రకుర్యాదధికేఽపి చ |

కామ్యాని తు న కుర్వీత

 ప్రతిష్ఠాదీని కాన్యచిత్ ||

(స్మృతి కౌస్తుభం)

అధిక మాసము వచ్చినప్పటికీ నిత్య కర్మలను (సంధ్యావందనాది అనుష్ఠానాలు), నైమిత్తిక కర్మలను (గ్రహణ స్నానాలు, శ్రాద్ధాలు, తప్పనిసరి విధులు) యథావిధిగా ఆచరించాలి. కానీ, కామ్య కర్మలను (కోర్కెలు కోరుతూ చేసే యజ్ఞాలు, వ్రతాలు) మరియు దేవతా ప్రతిష్ఠలు, నూతన గృహారంభాలు వంటి వాటిని మాత్రం అస్సలు చేయకూడదు.


లౌకిక శుభకార్యాలు లేకపోవడం వల్ల మానవునికి సంసార పరమైన బాధ్యతల నుండి కొంత మానసిక విరామం దొరుకుతుంది. ఈ సమయాన్ని దైవచింతనలో, గ్రంథ పఠనంలో గడపడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

అధిక మాసంలో చేసే పూజలు కేవలం "శ్రీ పురుషోత్తమ ప్రీత్యర్థం" (భగవంతుని సంతోషం కోసం మరియు ఆత్మశుద్ధి కోసం) మాత్రమే చేస్తారు. ఇది మానవుడిని స్వార్థం నుండి నిష్కామ స్థితికి తీసుకెళ్తుంది.


జీవతో వా మృతస్యాపి 

యా గతిః పురుషోత్తమే |

న సా క్రతుసహస్రేణ 

లభ్యతే నృపసత్తమ ||

( నారద పురాణం)

పురుషోత్తమ మాసంలో జీవించి ఉన్నవారికి మాత్రమే కాదు, మరణించిన పితృదేవతల పేరిట చేసే పుణ్యకార్యాల వల్ల వారికి లభించే సద్గతి, వేయి యజ్ఞాలు చేసినా లభించదు. ఈ మాసంలో పితృదేవతలను తలుచుకుని దానాలు చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది.


యైర్న పూజిత ఈశానో 

మాసి పురుషోత్తమే |

దరిద్రా భవంతి తే నూనం

జన్మజన్మని మానవాః ||

(పద్మ పురాణము)

ఎవరైతే ఈ పరమ పవిత్రమైన పురుషోత్తమ మాసంలో జగదీశ్వరుడైన శ్రీహరిని పూజించకుండా, దానధర్మాలు చేయకుండా కాలం గడుపుతారో, వారు జన్మజన్మలందు దరిద్రాన్ని అనుభవిస్తారు. అంటే ఈ మాసంలో చేసే కొద్దిపాటి పూజ అయినా దరిద్ర నాశనం అవుతుంది.


ఏకభక్తేన నక్తేన తథైవాయాచితేన చ |

ఉపవాసేన కర్తవ్యో మలమాసః ప్రయత్నతః ||

అధిక మాస వ్రతాన్ని ఆచరించే శక్తులు గలవారు నెల రోజులు ఉపవాసం ఉండాలి. అది సాధ్యం కాని పక్షంలో రోజుకు ఒక పూట మాత్రమే భుజించడం (ఏకభుక్తం), లేదా రాత్రి వేళ మాత్రమే భుజించడం (నక్తం), లేదా అడగకుండా లభించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం (అయాచితం) అనే నియమాల ద్వారా ఈ మాసాన్ని భక్తి శ్రద్ధలతో గడపాలి.


అధిక మాసములో

ఉపవాసము, 

ఏకభుక్తము,

నక్త వ్రతము,

అయాచితము‌,

ధారణ పారణ వ్రతం, 

విష్ణుపంచక వ్రతము,

అలవణ వ్రతము,

లక్ష ప్రదక్షిణము, 

అయాచిత వ్రతము,

లక్ష వత్తుల వ్రతము,

దీప నమస్కారము,

లక్ష పుష్పార్చన,

అథఃశయనము,

మౌనవ్రతము,

ఇవన్నీ భగవత్ ప్రీతికరమైనందున

చేయవలెను. 


మలమాసే గతే ప్రాప్తే 

హరిముద్దిశ్య భక్తితః |

త్రయస్త్రింశదపూపానాం 

దానం కుర్యాద్విధానతః ||

కాంస్యపాత్రే నిధాయైతాన్

ఫలతాంబూల సంయుతాన్ |

దద్యాద్విప్రాయ శాంతాయ

పురుషోత్తమ తుష్టయే ||


33 అపూపాలను

(అరిసెలు) పళ్ళు, వెండి,

బంగారము మొదలగు దానాలు

బ్రాహ్మణ సువాసినీలకు భోజనము

వాయనాల దానాలు

నిష్కామముగా చేసినచో విశేష

ఫలము లభించును


అధిక మాసములో 33 దేవతలను

వారి అంతర్యామి 33

భగవద్రూపాలను ఆరాధించాలి.

12 ఆదిత్యులు, 

11 రుద్రులు, 

8 వసువులు, 

2 అశ్విని దేవతలు.

వీరిని అపూపాలలో ఆవాహన చేసి పూజించి దానము చేయాలి.


బ్రహ్మాండాన్ని దానం చేసే శక్తి

మానవునికి సాధ్యము కాదు.

పురుషోత్తమ మాసములో ఇది

సాధ్యము. 33, అరిసలను ఒక

కంచు పాత్రలో పెట్టి ఇంకొక కంచు

పాత్రను మూసిపెట్టి దానము

చేసినవారికి బ్రహ్మాండ దాన 

ఫలము నిశ్చయముగా లభిస్తుంది.


కాంస్యపాత్రం సమాదాయ 

తస్మిన్ పూపాన్ నిధాయ చ |

బ్రాహ్మణాయ ప్రదాతవ్యం

సర్వపాప విముక్తయే ||

​సువర్ణ లేదా కంచు పాత్రను (తామ్ర/కాంస్య పాత్ర) తీసుకుని, అందులో నెయ్యితో వండిన అప్పాలను (అరిసెలను) ఉంచి, సర్వ పాపాల నుండి విముక్తి కలగడం కోసం ఉత్తముడైన బ్రాహ్మణునికి దానంగా సమర్పించాలి.


(అపూప దాన శ్లోకం)

విష్ణురూపీ సహస్రాంశుః

సర్వపాపప్రణాశనః |

అపూపాన్న ప్రదానేన 

మమ పాపం వ్యపోహతు ||

సహస్ర కిరణాలు కలిగిన, సర్వ పాపాలను నాశనం చేసే విష్ణు స్వరూపుడైన ఓ పురుషోత్తమా! నేను సమర్పిస్తున్న ఈ అపూప (అరిసెల) దానం వల్ల నా పాపాలన్నీ తొలగిపోవు గాక.


అరిసెలు గుండ్రంగా ఉంటాయి. ఇది సూర్య మరియు చంద్ర బింబాలకు ప్రతీక. అధిక మాసం అనేది సూర్య, చంద్రుల గమనాల వ్యత్యాసం వల్ల (సౌర, చాంద్ర మానాల సమన్వయం) ఏర్పడేది కాబట్టి, ఈ గ్రహాల అనుగ్రహం కోసం వాటి రూపంలో ఉన్న అపూపాన్ని దానం చేస్తారు. నెయ్యిలో వేయించినప్పుడు అరిసెపై వచ్చే చిన్న చిన్న రంధ్రాలు లేదా దాని రూపం సూర్యుని సహస్ర కిరణాలకు (రశ్మి) సంకేతంగా భావిస్తారు.


*అధిక మాసం లో విశేష దానాలు*


అధిక మాసం సంపూర్ణముగా

ముగిసేంత వరకూ తాంబూల

దానం, బ్రాహ్మణ దంపతులకు

చేసినచో దౌర్భాగ్యము నశించి

సౌభాగ్య ప్రాప్తి కలుగును. ఒక నెల

ఆఖండ దీపము శాంతము

కాకుండా దీపారాధన చేయుట

వలన అంధకారము నశించి

జీవితము ప్రకాశవంతమై జ్ఞాన ప్రాప్తి

కలుగును. సువాసినీ స్త్రీలు 33

వాయన దానాలు చేయుట వలన

వంశాభివృద్ధి మరియు దీర్ఘ

సౌమంగల్యము సిద్ధించును.

ఇదేవిధముగా అనేక దానాలు

చేయవచ్చు. 33 సంఖ్య అని

చెప్పినది 33 కన్న తక్కువ

కారాదన్న అభిప్రాయముతో

చెప్పినదని తెలుసుకొనవలెను.

అధికమాసములో శ్రీమద్భాగవత

శ్రవణము చేయుటవలన

పురుషోత్తముని అనుగ్రహము

విశేషముగా లభించును.


*అధికమాసములో నిషిద్ధ కార్యములు*


అనిత్యమనిమిత్తంచ దానం మహాదానం|

ఆగ్య్నధానాధ్యరాపూర్వతీర్థయాత్రామరేక్షణం||

దేవారామతటాకాదిప్రతిష్టాం మౌంజి బంధనం |

ఆశ్రమ స్వీకృతం కామ్యపృషోత్వర్గంచ నిప్క్రమం||

రాజ్యాభిషేకం ప్రథమం చూడాకర్మ ప్రతానిచ| 

అన్నప్రాశన మారంభం గృహాణాం చ ప్రవేశనం||

స్నానం వివాహం నామాతిపన్నం దేవమహోత్సవం | వ్రతారంభం సమాప్తిం చ కామ్యకర్మచ పాప్మనాం I|

 ప్రాయశ్చిత్తం చ సర్వ స్యమల మాసే వర్జయేత్|| - 

(బృహస్పతిః- స్ర్మతి ముక్తావళి)


మహా దానములు, 

అగ్నాధానము, 

యజ్ఞము, 

ఉద్యానవనముల నిర్మాణము,

చెరువుల నిర్మాణము,

ఉపనయనము, 

సన్యాస స్వీకారము, 

జ్యోతిష్టోమాది కామ్యకర్మలు,

పసిపిల్లలను మొదటి సారి ఇంటి

నుండి బయటకు తీసుకువెళ్ళుట,

పట్టాభిషేక కార్యము, 

చౌలము, 

విశేష వ్రతాలు, 

అన్నప్రాశనము, 

గృహారంభము, 

గృహప్రవేశము, 

విశేష తీర్థస్నానము,

వివాహము, 

నామకరణము,

ప్రాయశ్చిత్త హోమాలు,

ఈ కార్యములను అధికమాసములో

చేయకూడదు.


పురుషోత్తమస్య మాసే తు

దీపదానం కరోతి యః |

ఘృతేన వాపి తైలేన తస్య

పుణ్యమనంతకమ్ |

పురుషోత్తమ మాసంలో ఎవరైతే ఆవు నెయ్యితో గానీ, లేదా నువ్వుల నూనెతో గానీ భగవంతుని సన్నిధిలో దీప దానం (దీపారాధన చేసి సమర్పించడం) చేస్తారో, వారికి అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. వారి వంశంలోని పితృదేవతలకు కూడా సద్గతులు కలుగుతాయి.


నెల రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం విష్ణు సన్నిధిలో లేదా తులసి కోట వద్ద అఖండ దీపం లేదా నిత్య దీపారాధన చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.


ఈమాసంలో సూర్యుడి తాపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో విష్ణువుకు జలాభిషేకం చేయడం, పురుష సూక్తం, విష్ణు సహస్రనామ స్తోత్రాలు పఠించడం వలన మనశ్శాంతిని ఇస్తుంది.


సాధ్యమైనంత వరకు నదీ స్నానం చేయడం, నెలలో కనీసం ఒక రోజైనా (ముఖ్యంగా ఏకాదశి నాడు) ఉపవాసం ఉండి పురుషోత్తముడిని పూజించడం శాస్త్ర సమ్మతం.


అధిక మాసం అనేది లౌకిక శుభకార్యాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక ఎదుగుదలకు, పూర్వ జన్మ పాప పరిహారానికి, అక్షయ పుణ్య సంపాదనకు లభించిన ఒక అద్భుతమైన ‌"అదనపు" సమయం లాంటిది. ధర్మశాస్త్రాల ప్రకారం దీనిని భక్తి శ్రద్ధలతో వినియోగించుకోవడం ఉత్తమం.


*అధికస్య అధికం ఫలం* 


🔯

*అధికస్య అధికం ఫలం* 


🔯

పంచాంగం

 ఈ రోజు పంచాంగం 18.05.2026  Monday,


స్వస్తి  శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం  గ్రీష్మ ఋతువు అధిక  జ్యేష్ఠ  మాస శుక్ల పక్ష ద్వితీయ తిథి ఇందు వాసర రోహిణి నక్షత్రం సుకర్మ యోగః బాలవ తదువరి కౌలవ తదుపరి తైతుల కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

  


శ్రాద్ధ తిథి: ద్వితీయ 


 

నమస్కారః , శుభోదయం

తల్లిదండ్రులు చేసిన పాపం

 *నిజంగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందా? లేక అలా చెప్తే భయపడి తప్పులు చేయరని ఆలోచిస్తున్నారా?* 



తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు. నన్నడిగా కన్నావా? కన్నప్పుడు భరించాలి అంటూ పిల్లలు అరవడం చూస్తుంటాము. అడిగి కనడం కాదు, వారిని తల్లిదండ్రులుగా నీవే ఎంచుకున్నావు. జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీశాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. సర్పాలను చంపినప్పుడు సర్పశాపం, పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహించనందువలన పితృశాపం సంక్రమిస్తాయి. వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చినా అభివృద్ధి ఉండదు; సంతానం కలగదు, వ్యాపరంలో నష్టం మొదలైనవి వస్తాయి. ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తర్వాతి తరం అనుభవిస్తుంది.


అలాగే గురుగ్రహం యొక్క అనుగ్రహం లేనప్పుడు పిల్లల జీవితంలో వృద్ధి ఉండదు. పిల్లలను చూసి తల్లిదండ్రులు బాధ పడతారు. నిజానికి అనుభవించేవారికంటే వారిని చూసేవారి బాధే అధికంగా ఉంటుంది. గురుధ్యానం ప్రపద్యామి పుత్ర పీడోపశాంతయే అని శాస్త్ర వాక్కు. గురు/బృహస్పతి ధ్యానం వలన సంతానం వలన కలిగే భాద తొలగుతుంది. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పుట్టినప్పుడు, అతడు తన కర్మతో పాటు ఆ కుటుంబానికి చెందిన కర్మను కూడా స్వీకరిస్తాడు. అతడిపై దాని ప్రభావం ఉంటుంది.


కొన్ని ఉదాహరణలు - ఈ లోకంలో ఉండే అన్ని జీవుల్లో దత్తుడు ఉన్నాడు. తెలిసో తెలియకో ఇతరులను విమర్శించడం అంటే దత్తుడిని అవమానించడం, విమర్శించడమే. అది కూడా కొంత పాపాన్ని సమకూర్చిపెడుతుంది. అది కూడా గురుశాపానికి కారణమవుతుంది.


పచ్చని చెట్ల పై గురు ప్రభావం ఉంటుంది. పచ్చని మొక్కలు/చెట్లను నరికితే, అది జాతకంలో గురుదోషంగా కనిపిస్తుంది. కళ్ళముందే పిల్లలు మరణించడం, #స్త్రీ సంతానం ఉంటే వారు వైధవ్యం పొందడం వంటివి జరుగుతాయి. అంటే ఆ పిల్ల పుటింట్లో కూర్చుని ఏడుస్తుంది, ఆమెను చూసి తల్లిదండ్రులు ఏడుస్తారు. అదే పండ్లు, కాయలు, పుష్పాలతో ఉన్న చెట్లను నరికితే సంతానం కూడా కలగని సందర్భాలుంటాయి. దానికి కారణం ఆ బిడ్డ తల్లిదండ్రులు చేసిన పాపం. అందుకే పిల్లలు కలవారు పచ్చని చెట్లు కొడుతుంటే, 'పిల్లలున్న వాడివి, పచ్చని చెట్లు కొడుతున్నావ్, ఎంత తప్పు చేస్తున్నావో' అని పెద్దలంటారు.


భూములు లాక్కుంటారు. ముఖ్యంగా రాజకీయనాయకులు, బడా వ్యాపారవేత్తలు తమ అక్రమసంపాదనను సక్రమంగా చూపించడం కోసం పేద రైతులను మోసం చేసో, మరొక విధంగానో భూమలను ఆక్రమించుకుంటారు. వ్యవసాయం మీద పన్ను లేదు కనుక ఆ భూమిలో పండిన దానిపై వచ్చిన ఆదాయంగా తమ అక్రమసంపాదనను చూపి సక్రమం చేసుకుంటారు. ఒక కుటుంబంలోని వారికి ఒక భూమి వంశపారంపర్యంగా సంక్రమించినప్పుడు, దానికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. భూమిని బలవంతంగా లాక్కుంటే, ఆ పితృదేవతలు ఏడుస్తారు. అది శాపంగా మారి లాక్కున వారి కడుపు కొడుతుంది. వారి పిల్లలు అకాల మరణం చెందుతారు, లేదా జీవచ్ఛవాలుగా మిగిలిపోతారు. దీనికి కారణం ఆ తల్లిదండ్రులు చేసిన పాపం. అసలు మనం ఒక భూమిని కొనాలన్నా, దానికి ముందు వెనుక బాగా ఆలోచించాలి. యోగులైతే ఒక భూమిని కొనెముందు పితృదేవతలను సంప్రదిస్తారు. మీరు ఉచితంగా ఇస్తానన్నా, వారు తీసుకోరు. ఎందుకంటే తమ వారసులు అనుభవించకుండా భూములు అమ్ముకోవడం పితృదేవతలకు ఇష్టం ఉండదు. విచిత్రం ఏమిటంటే మనదేశంలో ప్రభుత్వాలే భూములు లాక్కుంటాయి.


ఏ వ్యక్తి అయినా సంపాదించేది తన కోసం, తన పిల్లల కోసం. వారు బాగుండడం చూసి ఆనందించాలని అనుకుంటాడు. ఆ క్రమంలో అతడు అవినీతికి పాల్పడితే, ఇతరులకు ద్రోహం చేస్తే, వారి ఏడుపు వీరికి శాపంగా మారుతుంది. ఆ అవినీతి పరులు బాధపడేది వారి పిల్లలకు హాని కలిగినప్పుడే. అందుకే వారి పిల్లలు అకాలమరణాల పాలవుతారు.


ఇలా ఎన్నో రకాలుగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుంది. కాబట్టి, తస్మాత్ జాగ్రత్త.