21, డిసెంబర్ 2025, ఆదివారం

సూర్య నమస్కారాలలో

 🌈సూర్య నమస్కారాలలో 

12 భంగిమలు ఉంటాయి. 


వాటి పేర్లు: 

ప్రణమాసనం, హస్త ఉత్తానాసనం, హస్త పాదాసనం, అశ్వ సంచాలనాసనం, చతురంగ దండాసనం, అష్టాంగ నమస్కార, భుజంగాసనం*, 


*పర్వతాసనం, అశ్వ సంచాలనాసనం, హస్త పాదాసనం, హస్త ఉత్తానాసనం, మరియు ప్రణమాసనం*. 


*🌈సూర్య నమస్కారంలోని 12 భంగిమలు:*


*1.🌞 ప్రణమాసనం (Pranamasana):*

*నమస్కార భంగిమలో నిలబడటం*


*2.🌞 హస్త ఉత్తానాసనం (Hasta Uttanasana):*

*చేతులు పైకెత్తి, శరీరాన్ని కొద్దిగా వెనుకకు వంచడం*.


*3.🌞 హస్త పాదాసనం (Hasta Padasana):*

*ముందుకు వంగి, చేతులతో పాదాలను తాకడం.*


*4. 🌞అశ్వ సంచాలనాసనం (Ashwa Sanchalanasana):*

*కుడి కాలును వీలైనంత వెనుకకు చాచి, మోకాలు నేలకు తాకకుండా ఉంచడం*.


*5. 🌞చతురంగ దండాసనం (Chaturanga Dandasana):*

*శరీరాన్ని నేలమీదకు దించి, చేతులతో బ్యాలెన్స్ చేయడం.*


*6.🌞 అష్టాంగ నమస్కార (Ashtanga Namaskara):*

*శరీరాన్ని నేలమీదకు దించి, 8 భాగాలు (రెండు పాదాలు, రెండు చేతులు, రెండు మోకాళ్లు, ఛాతీ మరియు గడ్డం) నేలను తాకడం.*


*7. 🌞భుజంగాసనం (Bhujangasana):*

*పాముల వలె శరీరాన్ని పైకి లేపడం.*


*8.🌞 పర్వతాసనం (Parvatasana):*

*పర్వతం ఆకారంలో శరీరాన్ని పైకి లేపడం*.


*9. 🌞అశ్వ సంచాలనాసనం (Ashwa Sanchalanasana):*

*ఎడమ కాలును వీలైనంత వెనుకకు చాచి, మోకాలు నేలకు తాకకుండా ఉంచడం*.


*10. 🌞హస్త పాదాసనం (Hasta Padasana):*

*ముందుకు వంగి, చేతులతో పాదాలను తాకడం.*


*11. 🌞హస్త ఉత్తానాసనం (Hasta Uttanasana):*

*చేతులు పైకెత్తి, శరీరాన్ని కొద్దిగా వెనుకకు వంచడం*.


*12. 🌞ప్రణమాసనం (Pranamasana):*

*నమస్కార భంగిమలో నిలబడటం*. 

*ప్రతి భంగిమలోనూ మంత్రాలు జపిస్తారు. ఒక్కో మంత్రం ఒక్కో దేవుడికి లేదా సూర్యుడికి సంబంధించినది. ఈ భంగిమలను క్రమ పద్ధతిలో చేయడం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు కలుగుతాయి.*

మహాభారతం అందులోని పర్వాలు*

  *మహాభారతం అందులోని పర్వాలు*     


*ఆది పర్వము*

వ్యాసుడు రచించిన, మహాభారతములో మొత్తం 18 ఉపపర్వాలు, 8 అశ్వాసాలు ఉన్నాయి. సంస్కృత భారతంలోని ఆది పర్వంలో మొత్తం 9,984 శ్లోకాలు ఉంటే, శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వంలో మొత్తం పద్యాలు, గద్యాలు కలిపి 2,084 ఉన్నాయి.


మహాభారతంలోని పద్ధెనిమిది పర్వాలలో విషయ క్రమణిక ఇలా ఉంది.


*1.ఆది పర్వము:* పీఠిక, కురువంశం కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం.


*2.సభా పర్వము:* కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత.


*3.వన పర్వము (లేక) అరణ్య పర్వము:* అరణ్యంలో పాండవుల 12 సంవత్సరాల జీవనం.


*4.విరాట పర్వము:* విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం పాండవుల అజ్ఞాతవాసం.


*5.ఉద్యోగ పర్వము:* కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు.


*6.భీష్మ పర్వము:* భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం.


*7.ద్రోణ పర్వము:* ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.


*8.కర్ణ పర్వము*: కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.


*9.శల్య పర్వము:* శల్యుడు సారథిగాను, అనంతరం నాయకునిగాను సాగిన యుద్ధం. దుర్యోధనుని మరణం.


*10.సౌప్తిక పర్వము*: నిదురిస్తున్న ఉపపాండవులను అశ్వత్థామ వధించడం.


*11.స్త్రీ పర్వము:* గాంధారి మొదలగు స్త్రీలు, మరణించినవారికై రోదించడం.


*12.శాంతి పర్వము*: యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం. భీష్ముని ఉపదేశాలు.


*13.అనుశాసనిక పర్వము:* భీష్ముని చివరి ఉపదేశాలు (అనుశాసనాలు)


*14.అశ్వమేధ పర్వము*: యుధిష్ఠిరుని అశ్వమేధ యాగం.


*15.ఆశ్రమవాస పర్వము:* ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రభృతులు చివరి రోజులు ఆశ్రమవాసులుగా గడపడం.


*16.మౌసల పర్వము:* యదువంశంలో ముసలం, అంతఃకలహాలు.


*17.మహాప్రస్ధానిక పర్వము:* పాండవుల స్వర్గ ప్రయాణం ఆరంభం.


*18.స్వర్గారోహణ పర్వము:* పాండవులు స్వర్గాన్ని చేరడం.


వీటిలో మొదటి అయిదు పర్వాలను ఆదిపంచకము అనీ, తరువాతి ఆరు పర్వాలను యుద్ధషట్కము అనీ, ఆ తరువాతి ఏడు పర్వాలను శాంతిసప్తకము అనీ అంటారు. ఇవి కాక తరువాతి కథ అయిన శ్రీకృష్ణుని జీవితగాథను తెలుగు మహాభారతంలో భాగంగా కాక హరివంశ పర్వము అనే ప్రత్యేక గ్రంథంగా పరిగణించారు. నన్నయ మొదలుపెట్టిన కథావిభాగాన్నే తిక్కన, ఎఱ్ఱన అనుసరించారు.



ఆది పర్వం ఈ క్రింది సంస్కృత మంగళ శ్లోకంతో ప్రారంభం అవుతుంది. ఈ సంస్కృత శ్లోకం తెలుగు సాహిత్యానికే మంగళ శ్లోకం అనవచ్చును.


శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాజ్గేషు యే

లోకానాం స్థితి మావహ న్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం

తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వస్సురై

ర్భూయాసుః పురుషోత్తమామ్బుజభవశ్రీకన్ధరా శ్శ్రేయసే.


ఆ తరువాత ఒక వచనం, తరువాత ఈ క్రింది ఉత్పలమాలతో ప్రారంభం అవుతుంది.


రాజకులైకభూషణుడు, రాజమనోహరు, డన్యరాజతే

జోజయశాలిశౌర్యుడు, విశుద్దయశశ్శరదిందు చంద్రికా

రాజితసర్వలోకు, డపరాజితభూరిభుజాకృపాణధా

రాజలశాంతశాత్రవపరాగుడు రాజమహేంద్రుడున్నతిన్



ఈ ఆదిపర్వంలో నన్నయ తాను ఎందుకు ఈ మహా భారతాన్ని తెలుగు సేయుచున్నాడో, అందుకు ఎవరు తోడ్పడుతున్నారో వివరించాడు. అంతే కాకుండా మహాభారత ప్రశస్తిని, అందులో ఏయే విభాగాలలో ఏ కథాంశం ఉన్నదో కూడా వివరించాడు. ఇది తరువాతి కవులకు, పరిశోధకులకు ఎంతో మార్గదర్శకంగా ఉంది.


*ఉపపర్వాలు*


మహా భారతంలోని మొత్తం 100 ఉపపర్వాలలో 19 ఉప పర్వాలు ఆది పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు.


*సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు*


1.అనుక్రమణికా పర్వం (పర్వాల సంగ్రహం)


2.పౌష్యం


3.పౌలోమం


4.ఆస్తిక పర్వం


5.ఆదివంశావతరణం


6.సంభవ పర్వము


7.లాక్షాగృహ దహనం


8.హిడింబాసురని వధ


9.బకాసురుని వధ


10.చైత్రరథం


11.ద్రౌపదీ స్వయంవరం


12.వైవాహిక పర్వము


13.విదురాగమనం


14.రాజ్యలాభ పర్వం


15.అర్జునుని వనవాసం


16.సుభద్రా కల్యాణం


17.హరణ హారిక


18.ఖాండవ వన దహనం


19.మయసభా దర్శనం


*ఆంధ్ర మహాభారతం*


అవతారిక, మొదలగున్నవి, శమంత పంచకాక్షౌహిణీ సంఖ్యా కథనము, ఉదంకుడు కుండలాలు తెచ్చి గురుపత్నికిచ్చు కథ, సర్పయాగముకై ఉద్ధవుడు జనమేజయుడిని ప్రోత్సహించుట మొదలగునవి కలవు

సుభాషితమ్

  🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝 *యుక్తియుక్తముపాదేయం* 

           *వచనం బాలకాదపి* l

           *అన్యత్తృణమివ త్యాజ్యం*

           *అప్యుక్తం పద్మజన్మనా* ll


         *_----యోగవాశిష్టమ్----_*


తా𝕝𝕝 *యుక్తియుక్తమైన మాట చిన్నపిల్లలు చెప్పిననూ స్వీకరించవలెను...*.

*యుక్తియుక్తము కాని మాట సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్పిననూ గడ్డిపరకగా భావించి వదిలివేయాలి...*


✍️🌹🌸💐🙏

శ్రీమద్భగవద్గీత

  శ్రీమద్భగవద్గీత:పదునెనిమిదవ అధ్యాయము

మోక్షసన్న్యాసయోగం:అర్జున ఉవాచ


అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా 

సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ(32)


ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేంద్రియక్రియాః 

యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్వికీ (33)



పార్థా.. అజ్ఞానాంధకారంవల్ల అధర్మాన్ని ధర్మంగా, ప్రతి విషయాన్నీ విరుద్ధంగా, విపరీతంగా భావించే బుద్ధి తామసబుద్ధి. మనసు, ప్రాణం, ఇంద్రియాలు—వీటి వ్యాపారాలను యోగసాధనతో నిలబెట్టగలిగే నిశ్చలధైర్యం సాత్వికధైర్యం.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

తిరుప్పావై 7వ పాశురము

 🌹 *తిరుప్పావై 7వ పాశురము*🌹


*(తిరుప్పావై 7వ పాశురము~ దానికి అనువాద పద్యము)*



    *కీశు కీశెన్ఱెజ్గు మానైచ్చాత్త జ్గలన్దు*

    *పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయా పేయ్ ప్పెణ్ణే!*

    *కాశుమ్ పిఱప్పుమ్ కలగలప్పక్కై*

    *వాశ నరుజ్గళ లాయ్ చ్చియర్; మత్తినాల్*

    *ఓశైప్పడుత్త త్తయిరరవమ్ కేట్టిలైయో*

    *నాయకప్పెణ్పిళ్లాయ్! నారాయణన్ మూర్తి*

    *కేశవనైప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో*

    *తేశముడై యాయ్! తిఱ వేలోరెమ్బవాయ్!!*


*భావం:-*


భరద్వాజ పక్షులు పగలు విడిపోదుము కదాయని తెల్లవారుఝామున కలిసికొని అన్నివైపులా ఏవేవో మాటలాడుకొనుచున్నవి. 

ఆ మాటలలోని ధ్వనినైననూ నీవు వినలేదా !ఓ పిచ్చిదానా ! కుసుమాలంకృతములగు కేశబంధములు వీడుటచే సుగంధములను వెదజల్లుచున్న జుట్టుముడులుగల గోపికలు, కవ్వములతో పెరుగు చిలుకునప్పుడు, వారిచేతుల కంకణ ధ్వనులు, మెడలోని ఆభరణ ధ్వనులతో కలిసి, విజృంభించి, ఆకాశామంటుచున్నవి. ఆ ధ్వనిని వినలేదా ? ఓ నాయకులారా ! సర్వపదార్థములలో వాత్సల్యముతో వ్యాపించియుండి, మనకు కనపడవలెనని మూర్తిమంతుడై కృష్ణుడుగా అవతరించి, విరోధులను నశింపచేసిన ప్రభువును కీర్తించుచుండగా వినియును, నీవు పరుండియుంటివా ? నీ తేజస్సు మాకు కనపడుచున్నది. దానినడ్డగింపక మేము దర్శించి అనుభవించునట్లు తలుపు తెరువ వలయును. 


*అవతారిక:-*


భగవదనుభవము నిత్యనూతనమై మోహపరచుచుండును. పక్షులు తెల్లవారుఝామున మేల్కొంటున్నాయి. ఈనాటి పాశురంలో గోదాదేవి భరద్వాజ పక్షులద్వార, అవిచేసే మధురధ్వనులు ద్వారా పొద్దు పొడుస్తున్నదని సూచిస్తూ భారద్వాజాదులు చేసే ఉపదేశాలను గుర్తెరిగి అజ్ఞానాన్ని రూపుమాపుకోమంటున్నది. భగవంతుని యందు ఆసక్తి కలగాలంటే శాస్త్రవిషయాలు తెలుసుకోవలసిందేకదా ! వీటిని తెలుసుకొని భగవంతుని యందు ప్రీతి కలగటానికి నిత్యకృత్యాలేవీ ఆటంకాలు కావు అని, మేలుకొని తలుపుతీసి మాతో వ్రతము చేయుటకు రండి అని పిలుస్తోంది.  


*తాత్పర్యం*



       ఓయీ! పిచ్చిపిల్లా! భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కలకలములు వినపడలేదా? అదిగో! సువాసనలు వెదజల్లుతున్న కురులుగల ఆ గోప కాంతులు తాము ధరించిన ఆ భరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతుల త్రిప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేవీ వినబడలేదా? నీవు మాకు నాయకురాలివికద! భగవద్విషయానుభవము నెరిగినదానవు.


   సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే ఇపుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యంకొద్దీ అవతరించాడు. మనకొరకే 'కేశి' మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానం చేస్తున్నాము. ఐనా వానిని వింటూనే యింకనూ పడుకొనే వుంటివే? మేము పాడే యీ పాటల ఆనందముతో నీవు మెరిసిపోతున్నావులే! ఇకనైననూ లేచి రామ్మాతల్లీ! వ్రతం ఆచరించటానికి ఇంకనూ అలస్యందేనికి? అని 'ఒక గోపకన్యను లేపుతోంది ఆండాళ్ తల్లి.

   


*అవతారిక :-*

  


    వ్రతాలూ, నియమాలూ అనే జ్ఞానం లేని పక్షులే తెల్లవారుఝామున మేల్కొని మాటాడుకొంటూ ఆకాశంలోనికి ఎగిరిపోతున్నాయి. అంటే మనకు అజ్ఞానులవలె గోచరిస్తున్న పక్షులు బ్రహ్మజ్ఞానులకు సంకేతాలు. వీరే బ్రహ్మీ ముహూర్తంలో మేల్కొని బ్రహ్మ పదార్ధాన్ని గురించి మాత్రమే ఆలోచించేవారు. అంటే భగవంతుని ఆరాధించే సమయమాసన్నమైనదని, భగవన్నామ చింతనే మనకు పరమాహారమని ధ్వని రూపంగా చెప్పబడింది. అంటే పక్షులే తెల్లవారుఝామున మేల్కొంటున్నాయంటే మరి మానవమాత్రులం ఎప్పుడు మనం మేల్కాంచాలో తెలుసనుకోవలెననే సంకేతం ఇందులోని ధ్వని.


   ఈనాటి పాశురంలో గోదాతల్లి భరద్వాజ పక్షుల ద్వారా అవి చేసే మధుర ధ్వనులద్వారా ప్రొద్దు పొడుస్తున్నదని సూచిస్తూ భరద్వాజాదులు చేసే ఉపదేశాలను గుర్తెరిగి అజ్ఞానాన్ని రూపుమాపుకోమంటున్నది. భగవంతుని యందాసక్తి కలగాలంటే శాస్త్ర విషయాలు తెలుసుకోవలసిందేగదా! వీటినెరిగి భగవంతుని యందు ప్రీతి కలగటానికి నిత్యకృత్యాలేవి ఆటంకాలు కావనీ, మేలుకొని తలుపుతీసి మాతో వ్రతాన్ని చేయటానికి రమ్మని పిలుస్తోంది యీ పాశురంలో...

  

     *(చక్రవాక రాగము - ఆదితాళము)*


ప. తేజోముఖీ! తలుపు తీయుమా!

    ఈ జాము నిడురేల! ఇక మేలుకొనవేల?


అ..ప.. ఆ జంటలౌ పక్షి కలకలము వినలేద?

    ఏ జంకు లేని నీవెటు నిదురవోతువో?


1 చ. పరిమళించు కుంతలాల పడుచులు - ఆ

    భరణములు రవళింప చేతులని సాచి

    పెరుగు కవ్వమున చిలికెడు ధ్వనులను వెర్రిదాన! నీవేమి వినలేద?

    వినలేద?


2 చ. నాయిక! శ్రీమన్నారాయణుడే

    ఈయిల కేశవుడై ప్రభవించగ   

    మాయిలవేల్పుగ స్తుతియించు చున్నాము

    లే! యిక! వినుచు మొద్దునిద్దురపోదువె?


*భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము*


*(ఆండాళ్ తిరువడిగలే శరణం)*


*కీశు కీశ్ ఎన్ఱ్* పక్షులు మాట్లాడుతున్నాయి. *కలందు పేశిన పేచ్చరవం కేట్టిలైయో* పక్షులు వాటి ఆహారంకోసం వెల్లడానికి ఒకదానితో ఒకటి కలిసి ఎడబాస్తున్నామే అని బాధతో మట్లాడుతున్నాయి. నీకు వినబడట్లేదా. కేవలం మేం నిలుచున్న చెట్టుమీది పక్షులే కాదు.


*ఎంగుం* అన్ని చెట్లమీది పక్షులూ అరుస్తున్నాయి, అంటూ అండాళ్ తల్లి *ఆనైచ్చాత్తన్* భరద్వాజ పక్షి గురించి చెబుతుంది.


ఈ పక్షులు కేరళ తమిళనాటి తీర ప్రాంతాల్లో ఉంటాయి, చిలుకలవలె మాట్లాడగల పక్షులు. ఇక్కడ భరద్వాజ ఋషిని గుర్తు చేస్తుంది అండాళ్ తల్లి. రాముడు వనవాసానికి వెల్లి నప్పుడు ఒక రోజు భరద్వాజ ఆశ్రయంలో ఉండి వెళ్తాడు. తరువాత భరతుడు రాముణ్ణి వెతుకుతూ

 ఆ ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు భరద్వాజుడు భరతునికి ఉన్న రామ భక్తి ని పరిక్షిస్తాడు. ఏపాపం చేయని రాముణ్ణి ఏంచేయాలని బయలుదేరావని ప్రశ్నించాడు. దానికి భరతుడు నీవు త్రికాలజ్ఞుడివి నీకు కూడా తెలియదా నా అంతర్యం అని విలవిలా ఏడిచాడు.


 భరద్వాజుడు తన తపో సంపద అంతా పెట్టి అన్ని విలాసాలు కల్గి ఉన్న ఒక నగరాన్ని సృష్టించాడు. అందులో ఒక సభ ఏర్పాటు చేసాడు. భరతుణ్ణి రాజు సింహాసనంపై కూర్చోమన్నాడు. రాముడు కూర్చోవాల్సిన రాజ సింహాసనం వైపు వింజామరం ఊపుతూ, భరతుడు వెళ్ళి మంత్రి కూర్చునే ఆసనం పై కూర్చున్నాడు. అప్పుడు భరద్వాజునికి భరతునిపై నమ్మకం కల్గింది. అప్పుడు భరద్వాజుడు భరతునితో నాకున్న తపస్సంపద అంతా వినియోగించానయ్యా సార్థకమైంది అని చెప్పాడు. భరద్వాజుడు ఒక్క పురుష ఆయుష్షు వేద అద్యయళ కాగానే తనకు ఇంకొక పురుష ఆయిస్సు కావాలంటూ తస్లపస్సు చేయటం ప్రారంభించాడు. ప్రజాపతి ప్రత్యక్షమై మరొక పురుష ఆయస్సు భరద్వాజునికి పెంచాడు.


 మళ్ళీ వేద అద్యయనం చేసి అదీ సరిపోనట్లనిపించింది, మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. అలా మూడు పురుష ఆయుష్షు గంగలు పూర్తయ్యాక మళ్ళీ ఆయనకు ఏం సరిపోనట్లు అనిపించి చింతించసాగాడు, ఈ సారి ప్రజాపతి తానంతట వచ్చి, ఎం కావాలి అని అడిగాడు. మరొక్క పురుష ఆయిస్సు అని అడిగాడు, అయితే ప్రజాపతి ఆయననకు ఒక్క సారి కళ్ళల్లో మూడు పర్వతాలు ఆ పై మూడు పిడికెడులు కనిపించజేసాడు. భరద్వాజుడితో నీవు చదివింది ఆ వేదంలోని కేవలం మూడు పిడికెడులు మాత్రమే, ఇక చదివింది చాలు దాన్ని ఆచరించు అని చెప్పాడు. కాబట్టి ఆయనకు తెలిసింది రామభక్తుని సేవ!


 భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము అని భరద్వాజ సంహితలో ఈ సూక్తిని ఆయన రాసి పెట్టాడు. అందుకే భరద్వాజుడు మూడు పురుషాయిష్యులలో సంపాదించిన తపస్సంపద అంతా భగవత్ భక్తి కల్గిన మహనీయునికై వినియోగించాడు. ఆండాళ్ తల్లి అలాంటి పేరు కల్గి ఉన్న పక్షిని చెబుతుంది అంటే అంతర్యం నీవు భగవతుణ్ణి మాత్రమే తలుస్తున్నావు, భగవత్ భక్తులతో కలవడంలేదు "పేయ్ ప్పెణ్ణే" పిచ్చిదానా అని లోపల ఉన్న గోప బాలికను అంటుంది.


గోకులంలో గోపికలకు నిత్యకర్మ పెరుగులు చిలకడం, అది వారు భగవత్ ఆరాధనగా భావించి చేసేవారు. దానికి వారు స్నానం ఆచరించి, పువ్వులు దరించి ఇవన్నీ భగవత్ సేవ అని భావిస్తూ చేసేవారు. అక్కడి గోవులు కృష్ణ కర స్పర్శచే పెరిగినవి కావటంచే అవిచ్చే పాలు అంత చిక్కనివి, ఇక పెరుగు ఇంకా చిక్కగా ఉండేది, వీళ్ళకు పెరుగు చిలకడం కష్టంగా ఉండేది, ఇక కృష్ణ నామ స్మరణ చేస్తూ చేసేవాళ్ళు. వాళ్ళు పాలు కాచినా, పెరుగు చిలికినా, వెన్న దాచినా అన్నీ కృష్ణుడి కోసమే. కృష్ణుడు వెన్న దోంగిలించడం కూడా వారికి ఇష్టమే, ఒక్క రోజు కన్నయ్య వెన్న దోంగిలించకుంటే వారికి భాదగా ఉండేది, వెన్న దాచటం, కృష్ణుడు వెన్న దొంగిలించటం ఇవన్నీ వారికి ఒక సరదా. ఇవి తప్ప వారికి వేరే స్వార్థం కూడా ఏమి ఉండేది కాదు, కృష్ణుడి క్షేమం తప్ప వాళ్ళకంటూ ఏమి కోరేవారు కాదు.


*కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు* గోపికలు వెన్న చిలుకుతుంటే దేహంపై ఉండే ఆభరణాలు గలగలా శబ్దం చేస్తున్నాయి, *వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్* గోపికల జడల్లోని పుష్పాలు రేపల్లె అంతటా పరిమళాన్ని విరజిమ్ముతున్నాయి. *మత్తినాల్ ఓ శై పడుత్త తయిర్ అరవం* కవ్వముతో పెరుగు చిలికే శబ్దం *కేట్టిలైయో* వినబడలేడా. *నాయగ ప్పెణ్ పిళ్ళాయ్!*

 *ఓ పెద్ద నాయకురాలా! నీవు ముందర నడిచి మమ్మల్ని వెంట తీసుకెల్లాల్సినదానివి, హాయిగా నిద్ర పోతున్నావా ?* అంటూ ఆక్షేపించసాగారు.


*నారాయణన్ మూర్ త్తి కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో* పెరుగులు చిలికే గోపికలు స్మరించే శ్రీకృష్ణ నామాలను 

మేం పాడుతుంటే నీవు హాయిగా నిద్రపోతున్నావేమి అని అడుగుతున్నారు. ఏమిటా నామాలు అంటే *నారాయణ* సర్వ జగత్తును లోపల పెట్టుకున్న స్వామి, మరి అంతవాడు మనకేం అందుతాడు అనుకోకుండా, మూర్తీభవించిన అందమేనా అన్నట్టుగా ఉన్న చిన్ని రూపంలో వచ్చాడు మనకోసం, అందుకే ఆయన *మూర్తి* మన కోసం ఒకరూపు దాల్చి మన కోసం వచ్చినవాడు.


కేవలం అందమైనవాడేనా! కాదూ, మనం కృష్ణున్ని సేవించుకోవడానికి వచ్చే అడ్డుకూడా ఆయనే తొలగించుకొని తనను మనకు ఇచ్చుకొనేవాడు, *కేశవన్* కేశి అనే గుఱ్ఱం రూపం లో ఉన్న రాక్షసున్ని సంహరించినవాడు. కృష్ణుడు ఆడుకుంటుంటే ఒక అసురుడు గుఱ్ఱంలా వచ్చి నోరు తెరిచాడు, తెరిచిన ఆ నోరులో చేతుపెట్టాడు కృష్ణుడు, చిన్న పిల్లాడు కదా ఆనందంతో ఉబ్బిపోయాడు. ఆయన తగ్గి పోగలడు, ఉబ్బిపోగలడు. తగ్గితే వామనుడయ్యాడు, ఉబ్బిపోతే త్రివిక్రముడయ్యాడు.


అలా ఉబ్బిన చేయివల్ల ఆ అసురుడు సంహరింపబడ్డాడు.


అలా మనకు ఉపకారం చేసే వాడి నామాన్ని పాడుతుంటే నీవు వచ్చి మాతో కల్సి పాడొచ్చుకదా. లోపల గోప బాలిక, తను లేచి వస్తే వీళ్ళెక్కడ నామాన్ని పాడటం ఆపేస్తారేమోనని కాబోలు లేవటం లేదు. కానీ ఆమె లోపలనుండి భగవత్ నామ స్మరణ చేయడంచే ఆమెలో ఒక తేజస్సు మన వాళ్ళకి కనిపించింది. 


 *తేశం ఉడైయాయ్* భగవత్ నామ సంకీర్తనచే తేజస్సు కల్గిన దానా *తిఱవ్* రావమ్మా, నీ తేజస్సును మాకూ పంచి ఇవ్వు అని ఆండాళ్ తల్లి పిలుస్తుంది . మనలోని భగవత్ జ్ఞానమే మనకు తేజస్సును కలగ జేస్తుందని గమనించాలి.


*తిరుప్పావై 7వ పాశురము*

*తెలుగు పద్య అనువాద౦*

*రచన మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు* 

*మిట్టాపల్లి* 


*సీసమాలిక:*


*పవళింపు వీడుము పక్షుల కిలకిల*

           *మనుచు పలుకుచుండె తనివి తీర*

*ఘల్లుఘల్లు మనెడు కాసుల పేర్లను* 

       *కంఠమాలను దాల్చి కాంచు మనుచు*

*గొల్లల యిల్లాండ్రు కోలలు చేదాల్చి* 

      *పెల్లు మనెడు పూ జల్లుచేత* 

*నారాయణ యని కైవారముతో మేము* 

           *ఆలపించిన స్వామి పలుకలేడు*

*గోపబాలల మమ్మ గోవిందు సేవింప* 

        *తరలి నారము వచ్చి తలుపు తెరువు*


 *ఆ.వె. అనుచు పిలిచి వారు మనవిని వినుమని* 


*ఏక చిత్తులగుచు వేడుకొనిరి*

*స్వామి సేవయందు సర్వంబు నర్పించి*

*నోము నోతు మమ్మ సేమముగను*

*శ్రద్ద భక్తి నిచ్చి బుద్ధిని యొసగుచు*  

*శ్రీధరుని మనమున స్థిరము కమ్ము!*


   *(ఆణ్డాళ్ దివ్య తిరువడి గళే శరణమ్)*


                🌹🌹🌹

సుభాషితమ్

  🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝 *యుక్తియుక్తముపాదేయం* 

           *వచనం బాలకాదపి* l

           *అన్యత్తృణమివ త్యాజ్యం*

           *అప్యుక్తం పద్మజన్మనా* ll


         *_----యోగవాశిష్టమ్----_*


తా𝕝𝕝 *యుక్తియుక్తమైన మాట చిన్నపిల్లలు చెప్పిననూ స్వీకరించవలెను...*.

*యుక్తియుక్తము కాని మాట సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్పిననూ గడ్డిపరకగా భావించి వదిలివేయాలి...*


✍️🌹🌸💐🙏

శ్రీ పోతన భాగవత మధురిమలు*

  *శ్రీ పోతన భాగవత మధురిమలు*

 

(3-193-క)

ఏ నరుఁడే నొక నిమిషం

బైన వృథావాదగతిని హరిపదకమల

ధ్యానానందుఁడు గాడే

నా నరునకు నాయు వల్ప మగు మునినాథా!


*భావము:-* ఓ మునిశ్రేష్ఠా! పనికిమాలిన వాదాలలో పడి కనీసం ఒక్క నిముషమైన హరిపాదపద్మాలను స్మరించి ఆనందించకుండా ఉండేవాడు ఎవడైనా సరే వాడి ఆయుస్సు అల్పమైపోతుంది.


ధనుర్మాసం ఆరవ రోజు, 'శ్రీ జయదేవుని, ఆరవ అష్టపదితో' శుభాకాంక్షలు...


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం* 

ధర్మో రక్షతి రక్షితః

శ్రీ ద్వారకాధీశో విజయతే

  శ్రీ ద్వారకాధీశో విజయతే


జగద్గురు శ్రీమచ్ఛంకరాచార్య శ్రీశారదామఠ ద్వారకా సంస్థానాధీశ్వర మహ


శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య పదవాక్య ప్రమాణ పారావార పారణి యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠతవశ్చర్యాచరణ చక్రవర్త్యనాద్యవిచ్ఛిన్న గురుపరంపరాప్రాప్త షణ్మతస్థాపనాచార్య సాంఖ్యత్రయప్రతిపాదక వైదికమార్గప్రవర్తక నిఖిల నిగమాగమసార హృదయ శ్రీమత్సుధన్వనః సామ్రాజ్యప్రతిష్ఠాపనాచార్య శ్రీమద్రాజాధి రాజగురు భూమండలాచార్య చాతుర్వర్ణ్య శిక్షక గోమతీతీరవాస శ్రీమద్వారకాపురవరాధీశ్వర పశ్చిమామ్నాయ శ్రీమచ్ఛారదాపీఠాధీశ్వర శ్రీమత్కేశవాశ్రమస్వామి దేశికవరకరకమలసంజాత శ్రీ శారదా పీఠాధీశ్వర శ్రీమద్రాజరాజేశ్వరశంకరాశ్రమస్వామిభిః


శిష్యకోటిప్రవిష్టాన్ నిరవద్యవైదికరాద్ధాంతశ్రద్ధధానచేతః సామ్రాజ్యసమలంకృతానశేషభరతఖండ సదాయతనవిద్వద్వరాన్ ప్రతి ప్రత్యగ్రహ్మైక్యానుసంధాననియతనారాయణస్మరణ సంసూచితా శిషస్సముఛసంతుతరామ్ జగద్గురూణాం మహేశ్వరాపరావతార శ్రీమచ్ఛంకరభగవత్పూజ్యపాదాచార్యాణామాదిమైకాంతికాస్థానద్వార కానశ్రీమచ్చారదాపీఠగోచరా భక్తిరనవధిక శ్రేయోనిదానమితి సార్వజనీనమేతత్॥ సాంప్రతమ. భగవత్యాః శారదాయా లష్కరనగరీ గ్వాలియరసంనిహితాంత్రీజనపద సమావేశ వాసర విశేషముపక్రమ్యాప్రస్థితే ర్లష్కరప్రస్థాత్ప్రజ్ఞాపితసాయన నిరయన భేదభిన్నప్రక్రియాతిశయ సమాస్పదీభూత ప్రక్రమభరబు భుత్సాపరాయత్తస్వాంతేన లేలేఇత్యుపాభిధానవిసాజీరఘునాథశర్మణా తన్నగరీ నికేతనేనానుపదమభ్యహింతామభ్యర్ధనామురరీకుర్వాణైర్విగాన విశేషపరామృష్టప్రత్యయసంధానైరిదమత్రాస్మాభిరవధార్యతే తథాహి


దర్శనసామాన్యస్యావాంతర మహాతాత్పర్యవిశేషానుగృహీత విగ్రహవత్తయోపక్రమ పరామర్శోపసంహారాననుగమ్యాపిచరమామేవ తయోస్తాత్పర్యమహాభూమిమభ్యుదితవ లాభిధేయప్రసవిత్రీ మాచక్షాణాస్సమ్మీయంతేతీర్థకారాః


అవాంతరతాత్పర్యతికర్తవ్యతా ప్రయుక్త ప్రసక్తినిర్వహణా యాభ్యంతరపదార్థపరిశీలనౌపయికప్రయత్నాతిశయస్యార్ధవత్వే పి తథాత్వమేవ తస్యావక్లప్తమవసితం భవత్యుపసర్జన ముద్రయా కిలాశేషశ్చ.


మహాతాత్పర్యకథాసుధాత్వవికృతవస్తుభేదప్రగ్రహమేవ ప్రత్యస్తమితసాతిశయవిధావిధానమపూర్వతర మనుభావయంతీ ప్రతర్పయాతీ చ నిరూఢార్థప్రధట్టికామసాధారణీం తాం చకాస్త్యేవ సర్వశః సరణిరేషా సర్వాస్వపి దర్శనస్థితిషు సత్యేవ సాధారణీ ప్రతిష్ఠాపయత్యర్థతత్వమితి వస్తుస్థితిఃప్రకృతే హి సాయననిరయనతంత్రయోరితరేతరప్రత్యనీక భావభావితయోరష్యన్యోన్య స్వరూప విశేషసమర్పణకృతే కృతాకాంక్షయోస్తి హి వైషమ్యం భూయః తచ్చ పరిగణితానేకపదా ర్థవిభాగభాగపి జ్యోతిఃశాస్త్రమహాతాత్పర్యేదం పర్యవిషయీభూతకాలా వయాథాత్మ్యమనుభావయమానం విహితనమస్తశ్రాతస్మార్య క్రియాకలాపనియతకాలీవిభ్రమాపనోదనిర్మరమనుకూలీకృతాశేష భూతవస్తువ్యవస్థాకమ పరామృష్ణ విపర్యయ ప్రతీతిజననమ విపర్యస్తాబాధితాసందిగ్ధదృక్రతీతిపర్యాప్తమేవ వరిసమాప్యతే స్వాభావభావితమర్ధత ఇత్యాదరగోచరం భవత్యేవ సాయనతంత్రగతం తదేతత్.


నిరయనతంత్రాయత్తం తదిదం యథాభూతక్రియాకలాపకాల నిర్దేశనిర్వర్తనాసమర్ధ సత్తదుపజీవకతామేవావివాదమశ్రుత ఇతి స ఏష సాయనపక్షః సర్వైరపి శ్రీమతా విసాజీ రఘునాథ శర్మణా సమర్థితస్సదస ద్విచారణాపురఃసరమాద్రియతాం మహాశయైరశేషవర్ణాశ్రమిభిరితి స్థితమ్| అనాదిసిద్ధ శ్రీమజ్జగద్గురుసంస్థానాజ్ఞాపరిపాలనైకపరంపరాకేషు కిమధికం బ్రహ్మక్షత్రాదిశిష్యవరేష్వితి శివమ్.


శ్రీమచ్ఛంకరభగవత్పూజ్యపాదాచార్యాణామవతారశకాబ్దాః 2362 ఫాల్గుణకృష్ణాష్టమ్యాం 8స్థిరే సంవత్ 1949శకే 1814 (స్వారీ ముం. ధవలపురమ్)

శ్రీల ప్రభుపాద ఉవాచ!

 శ్రీల ప్రభుపాద ఉవాచ! 

🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿 

సర్వ శుభకరుడైన భగవంతుడు, విశ్వం యొక్క సృష్టికర్త అయినందున, సమస్త సత్ జీవుల యొక్క మంచి కోసం కూడా ప్రణాళికలు వేస్తాడు. 

మంచి జీవులకు భగవంతుడు తన మంచి సలహాను పాటించమని సలహా ఇచ్చాడు మరియు అలా చేయడం ద్వారా వారు జీవితంలోని అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. 


భగవంతుడిని తప్ప మరే దేవతను పూజించాల్సిన అవసరం లేదు. 

భగవంతుడు సర్వశక్తిమంతుడు, మరియు ఆయన తన పాద పద్మములపట్ల మన విధేయతతో సంతృప్తి చెందితే, మన భౌతిక మరియు ఆధ్యాత్మిక జీవితాలను విజయవంతంగా అమలు చేయడానికి అన్ని రకాల ఆశీర్వాదాలను మనకు అందించగల సమర్థుడు. 


ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని పొందేందుకు, భగవంతునితో మనకున్న శాశ్వత సంబంధాన్ని అందరూ అర్థం చేసుకునేందుకు మానవ రూపం ఒక చక్కటి అవకాశం. 

ఆయనతో మన సంబంధం శాశ్వతమైనది; 

అది విచ్ఛిన్నం లేదా నాశనం చేయబడదు. 

ఇది ప్రస్తుతానికి మరచిపోవచ్చు, కానీ అన్ని కాలాల మరియు అన్ని ప్రదేశాలలోని గ్రంథాలలో వెల్లడి చేయబడిన ఆయన ఆదేశాలను మనం పాటిస్తే, భగవంతుని దయతో ఇది పునరుద్ధరించబడుతుంది.


(శ్రీమద్-భాగవతం, స్కందము.1

అధ్యాయం.11, వచనం.7)


హరే కృష్ణ

ఎల్లప్పుడూ మీ శ్రేయోభిలాషి

ఆంజనేయస్వామి_అవతారాలు

 🚩#ఆంజనేయస్వామి_అవతారాలు🚩  


🚩ఆంజనేయస్వామి కూడా విష్ణుమూర్తిలా అవతారాలెత్తారు.శ్రీమహావిష్ణువు దశావతారంధరిస్తే..ఆంజనేయస్వామివారు తొమ్మిది అవతారాలు ధరించారు🚩


🚩అవేంటంటే🚩

🚩1.ప్రసన్నాంజనేయస్వామి

🚩2.వీరాంజనేయస్వామి

🚩3.వింశతి_భుజ_ఆంజనేయస్వామి

🚩4.పంచముఖ_ఆంజనేయస్వామి

🚩5.అష్టదశ_భుజ_ఆంజనేయస్వామి

🚩6.సువర్చలాంజనేయస్వామి

🚩7.చతుర్బుజ_ఆంజనేయస్వామి

🚩8.ద్వాత్రింశద్భుజ_ఆంజనేయస్వామి

🚩9.వానరాకార_ఆంజనేయస్వామి.


🚩ఆంజనేయస్వామి రుద్రాంశ సంభూతుడు. 

నవ అవతార ఆంజనేయస్వామి ఆలయం 

ఒంగోలులో ఉంది.ఇక్కడ పంచముఖ ఆంజనేయస్వామి ప్రధాన దైవం. ఆలయాన్ని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం 

అని పిలుస్తారు.


🚩ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన 

ప్రత్యేక రోజులు - శనివారం, మంగళవారం మరియు గురువారం. 


🚩పురాణకథ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. 

శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, 

స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు


🚩అందుకే ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు 

శనివారం ఆంజనేయ ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. 

ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు.


🚩తమలపాకుల దండ:🚩


🚩ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.


🚩మల్లెలు:🚩

గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం 

చాల శ్రేష్టం.


🚩పారిజాతాలు:🚩

స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.


🚩తులసి:🚩

తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, 

అందుకే హనుమంతునికి కూడా ఇష్టమైనది


🚩కలువలు:🚩

కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి ఎంతో 

ఇష్టమైన పూలు. 


🚩కేరళలోని ఇరింజలకుడలో భరతునుకి ఒక దేవాలయం వుంది.అందులో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. 

శ్రీరాములవారికి హనుమంతుడుపై భరతుని మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.


🚩పంచముఖ హనుమాన్:🚩

శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. 


🚩ఈ పంచముఖముల వివరాలు ఇలా చెప్పబడ్డాయి.🚩

🚩1 తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త శుద్దిని కలుగ చేస్తాడు.


🚩2 దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.


🚩3 పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, 

దుష్ట ప్రభావలను పోగొట్టీ, 

శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.


🚩4 ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.


🚩5 ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు.హనుమంతుడంటే ఒక అంకితభావం. 

బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం – వీటన్నింటి సమ్మేళనం. 

అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం. 


🚩సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని 

ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం,విశ్వవిజేతలైన రాక్షస వీరులనేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం – ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే...

🚩మిత్రులందరికీ *మంగళవారం*

 *శుభ శుభోదయ శుభాకాంక్షలు*

                 *సేకరణ*

    *న్యాయపతి నరసింహారావు*

ఆదివారం*🌞 *🌹21డిసెంబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🌞 *ఆదివారం*🌞

 *🌹21డిసెంబర్2025🌹*  

    *దృగ్గణిత పంచాంగం* 

                 

         *స్వస్తి శ్రీ విశ్వావసు* 

         *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*పుష్యమాసం - శుక్లపక్షం*


*తిథి  : పాడ్యమి* ‌ఉ 09.10 వరకు ఉపరి *విదియ*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : పూర్వాషాఢ* రా 03.36 వరకు ఉపరి *ఉత్తరాషాఢ*

*యోగం : వృద్ధి* సా 04.36 వరకు ఉపరి *ధ్రువ*

*కరణం  : బవ* ఉ 09.10 *బాలువ* రా 10.03 ఉపరి *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 08.00 - 10.00 మ 02.00 - 04.00*

అమృత కాలం  : *రా 10.21 - 12.06*

అభిజిత్ కాలం  : *ప 11.43 - 12.28*

*వర్జ్యం    : ప 11.51 - 01.36*

*దుర్ముహూర్తం  : సా 04.11 - 04.55*

*రాహు కాలం   : సా 04.16 - 05.40*

గుళికకాళం      : *మ 02.53 - 04.16*

యమగండం    : *మ 12.06 - 01.29*

సూర్యరాశి :*ధనుస్సు*                   

చంద్రరాశి : *ధనుస్సు*

సూర్యోదయం :*ఉ 06.42* 

సూర్యాస్తమయం :*సా 05.47*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.31 - 08.45*

సంగవ కాలం         :     *08.45 - 10.59*

మధ్యాహ్న కాలం    :    *10.59 - 01.12*

అపరాహ్న కాలం    : *మ 01.12 - 03.26*


*ఆబ్ధికం తిధి         : పుష్య శుద్ధ విదియ*

సాయంకాలం        :  *సా 03.26 - 05.40*

ప్రదోష కాలం         :  *సా 05.40 - 08.14*

రాత్రి కాలం           :*రా 08.14 - 11.40*

నిశీధి కాలం          :*రా 11.40 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.49 - 05.40*

<><><><><><><><><><><><><><>

        🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞శ్రీ సూర్య పంజర స్తోత్రం🌞* 


*ఉన్మత్తభైరవాయ నమః* 

*భీషణభైరవాయ నమః*

*కాలభైరవాయ నమః* 

*సంహారభైరవాయ నమః*

 *ముఖస్థానే మాం రక్షతు*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*🍁శనివారం 20 డిసెంబర్ 2025🍁*

``

             *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                             8️⃣0️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


    *సంపూర్ణ మహాభారతము*            

                *80 వ రోజు*

                

*వన పర్వము ద్వితీయాశ్వాసము*


*నలదమయంతుల వియోగం*```


ఒకరోజు అడవిలో నలుని తొడమీద తల పెట్టుకుని, దమయంతి నిద్రపోతూ ఉంది. అమెను చూసి నలుడు “ఈ సుకుమారి నాతో అడవులలో కష్టాలు పడుతోంది. నా వెంట ఉండటమే ఈమె కష్టాలకు కారణం. నేను లేకపోతే ఈమె పుట్టింటికి వెళ్ళి సుఖపడుతుంది” అని మనసులో అనుకుని, తాను ధరించిన చీరభాగాన్ని చింపి, పైన వేసుకుని ఆమెను వదలలేక వదలలేక విడిచి వెళ్ళాడు. నిద్రలేచిన దమయంతి భర్త లేకపోవడం చూసి దుఃఖించింది. భర్తను తలచుకుంటూ అడవిలో తిరుగుతున్న దమయంతిని ఒక కొండచిలువ పట్టుకుంది. భయంతో దమయంతి కేకలు వేసింది. ఆ కేకలు విని ఒక కిరాతుడు తన కత్తితో ఆ కొండచిలువను చంపి, దమయంతిని రక్షించాడు. ఆ కిరాతుడు దమయంతి గురించి తెలుసుకున్నాడు. ఆమె నిస్సహాయతను తెలుసుకుని, ఆమెను తాకబోవగా, దమయంతి అతనిని భస్మం చేసింది.

 

భర్తను తలుచుకుంటూ అడవిలో దారీతెన్నూ లేకుండా ప్రయాణిస్తూ ఉండగా, ఆమెకు ఒక మునిపల్లె కనపడింది. అక్కడ ఆమె మునిశ్రేష్టులను చూసింది. మునులు దమయంతిని చూసి “అమ్మా! నీవు ఎవరు? ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు?” అని అడిగారు. 


సమాధానంగా దమయంతి “మునిపుంగవులారా! నేను నలచక్రవర్తి భార్యను. నా పేరు దమయంతి. విధివశంతో నా భర్త నన్ను విడిచి వెళ్ళాడు. నాకు వారి జాడ చెప్పగలరా? నేను భర్త లేనిదే జీవించ లేను” అని అడిగింది. 


మునులు “అమ్మా! నీకు త్వరలోనే భర్త సమాగమం జరుగుతుంది. చింత పడకుము” అని చెప్పి, వెళ్ళారు. 


దమయంతి పిచ్చిదానిలా భర్తను వెతుక్కుంటూ ఆ అడవిలో తిరుగుతూ ఉంది. 


ఇంతలో అటుగా పోతున్న బాటసారులు ఆమెను చూసి చూసారు. కొందరు ఆమెను పిచ్చిది అని ఎగతాళి చేసారు. కొందరు ఆమెకు మొక్కారు. వారిలో ఉన్న వ్యాపారి ఆమెను గురించి తెలుసుకుని “అమ్మా! నేను నలుని చూడలేదు, కానీ మేము ఛేది దేశానికి వెళుతున్నాము” అన్నాడు. 


దమయంతి వారితో “నేను కూడా మీ వెంట వస్తాను” అన్నది. 


ఆ వ్యాపారి ఆమెను తమ వెంట తీసుకు వెళ్ళాడు. వారు అడవి మార్గంలో రాత్రి వేళ నిద్రిస్తున్న సమయంలో ఒక ఏనుగుల గుంపు వారిలో చాలా మందిని తొక్కివేసింది. వారిలో చాలామంది మరణించడం చూసి, దమయంతి తన దురదృష్టానికి దుఃఖించింది. తనను చంపలేదని రోదిస్తున్న ఆమెను కొందరు బ్రాహ్మణులు ఓదార్చి ఆమెను తమ వెంట సుబాహు నగరానికి తీసుకు వెళ్ళారు. ఛేదిదేశ రాజధాని సుబాహుపురం చేరింది. ఒళ్ళంతా దుమ్ముతో వీధిలో వెళుతున్న దమయంతిని రాజమాత చూసి దాసీలను పంపి దమయంతిని అంతఃపురానికి పిలిపించింది. రాజమాత దమయంతితో “అమ్మా! నిన్ను చూస్తుంటే రాచకళ ఉట్టి పడుతోంది. నీవు ఎవరు?” అని అడిగింది. 


దమయంతి “అమ్మా! నా భర్త జూదంలో రాజ్యం పోగొట్టుకున్నాడు. నన్ను అడవిలో ఒంటరిగా విడిచి వెళ్ళాడు. అతనిని వెతుకుతూ తిరుగుతున్నాను” అని చెప్పింది. 


రాజమాత “అమ్మా! ఇకనుండి నువ్వు నా దగ్గర సైరంధ్రిగా ఉండు. నీకు ఏ లోటూ రాకుండా నేను చూస్తాను. నీ భర్తను వెతికిస్తాను” అని చెప్పింది. 


దమయంతి అందుకు అంగీకరించి “అలాగే ఉంటాను, కానీ నేను సైరంధ్రిగా ఎవరి ఎంగిలీ తినను, పరులకు కాళ్ళుపట్టను, పరపురుషులతో మాట్లాడను. కేవలం నా భర్తను వెతుకుతూ వెళ్ళే బ్రాహ్మణులతో మాత్రం మాట్లాడు తాను” అని చెప్పింది. 


రాజమాత అంగీకరించి తన కుమార్తె సునంద వద్దకు పంపింది. దమయంతి అక్కడే ఉండిపోయింది.```


             *(సశేషం)*

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనఈ రోజు పంచాంగం 21.12.2025 

Sunday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాస శుక్ల పక్ష ప్రతిపత్తి తిథి భాను వాసర పూర్వాషాఢ నకత్రం వృద్ధి యోగః బవ తదుపరి బాలవ కరణం.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు. 

  

 

శ్రాద్ధ తిథి: ద్వితీయ 

 


నమస్కారః , శుభోదయంది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏 నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

పంచ మహా యజ్ఞాలంటే ఏమిటి?`

  *`పంచ మహా యజ్ఞాలంటే ఏమిటి?`*


ఇవి ఋత్విక్కులు చేసేయజ్ఞాలు కాదండీ. శాస్త్ర ప్రకారం ప్రతి వ్యక్తీ అను నిత్యం పాటించ వలసిన విధులు. అవి ఏమిటి?


*`1. దేవ యజ్ఞం`*


పూర్వం నిత్యాగ్నిహోత్రులు వుండేవారు. వారు తాము భోజనం చేసే ముందు కొంచెం అన్నాన్ని అగ్నికి ఆహుతి చేసేవారు. దీనికి *ఆహుతం* అని పేరు. అలాకాక ఇంట్లో వారందరూ అగ్నికి సమిధలు సమర్పించినా ఆహుతం చేసినట్లే. *సృష్టికి మూలకారకుడైన దేవదేవుని నిత్యం తలుచుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలపటమే దీని ముఖ్యోద్దేశ్యం.*


*`2. పితృ యజ్ఞం`*


మనల్ని కని పెంచి ఇంత వారిని చేసిన తల్లితండ్రలను ప్రేమగా చూడాలి. చిన్నప్పుడు వారు మనల్ని ఎంత ప్రేమగా చూశారో, మన అవసరాలెలా తీర్చారో, *అలాగే వారి పెద్ద వయసులో వారిని కనిపెట్టుకుని వుండాలి. ఇలా వారి ఋణాన్ని కొంతయినా తీర్చుకోగలం. ఇది పితృ యజ్ఞం.*


*`3. భూత యజ్ఞం`*


గృహస్తు సర్వప్రాణికోటిమీద దయ కలిగి పుండాలి. పశు పక్షులు, క్రిమి, కీటకాదులు మానవుడి మీద ఆధార పడి వున్నాయి. అందుకే మనిషికి భూతదయ వుండాలి. అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నం పక్షుల కోసం బయట (పక్షులు వచ్చే ప్రదేశంలోపెట్టాలి. ఇంటి ముందు కుక్కకి, ఇంట్లో పిల్లికి అన్నం పెట్టాలి. ఇంట్లో పశువులు వుంటే వాటికి పెట్టాలి. క్రిమి కీటకాల కోసం కొంచెం అన్నం (తినక ముందు) పక్కన పెట్టాలి. (మన పెద్దలు వీటిని పాటించటం మీలో కొందరయినా చూసే వుంటారు). జలాశయాలలో జలచరాలకు కూడా ఆహారం వెయ్యాలి. *సర్వ ప్రాణులయందూ దయ కలిగి వుండి ప్రతి నిత్యం కనీసం ఏదో ఒక దానికన్నా ఆహారం ఇవ్వాలి.*


*`4. మనుష్య యజ్ఞం`*


మన పెద్దలు అతిధి దేవో భవ అన్నారు. అప్పటివారు ఆతిధ్యం కోరి వచ్చినవారు తమకు తెలియనివారయినా వారిని ఆదరించి సత్కరించేవారు. రోజులు మారినాయి. అయినా ఇంటికొచ్చినవారిని మన కులం వారా, మన మతం వారా మన కేవిషయంలో నైనా పనికి వస్తారా లేదా వగైరాలాలోచించకుండా వారు వచ్చిన సమయాన్నిబట్టి తగు విధంగా గౌరవించాలి. *తోటి వారి పట్ల దయ కలిగి వుండాలి. అందరితో సఖ్యంగా వుండాలి. ఎవరైనా సహాయం కోరితే, మనం చెయ్యగలిగితే నిస్వార్ధంగా చెయ్యాలి.*


*`5. బ్రహ్మ యజ్ఞం`*


ప్రతి వారూ, ప్రతి రోజూ వేద మంత్రాలు కానీ శాస్త్రిలని కానీ చదవాలి. ఇప్పుడు వేద మంత్రాలు చదివే వారి సంఖ్య తక్కువగానీ *ప్రతి వారూ ఎవరికి వీలయిన, ఎవరికి ఆసక్తి వున్న, ఎవరికి అనుకూలంగా వున్న శాస్త్రాలను చదవాలి. ప్రతి రోజూ కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తి చూపించాలి. అంతేకాదు. తను తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలి.* 


*ప్రతి మనిషికీ భగవంతుని పట్ల విశ్వాసం, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, భూత దయ, తోటి మనిషులతో కలిసి వుండే మనస్తత్వం, శాస్త్రం తెలుసుకుని నలుగురితో పంచుకునే జిజ్ఞాస వున్నాయనుకోండి. ఈ ప్రపంచం ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మనిషిని సక్రమ మార్గంలో నడపటానికే ఈ పంచ యజ్ఞాలను నిర్దేసించారు మన పెద్దలు.*


     *🪷సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🪷*

జీవిత రహస్యం

  ✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️


              *జీవిత రహస్యం*


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


          మానవుడు తాను ఖర్చు చేసే ధనములో తృణమో పణమో ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి. ఈ శరీర నిర్మాణంలో దానంచేసే సుగుణముంది. భగవంతుడు ఒకరికిచే దాన పద్ధతిలోనే చేతిని నిర్మించాడు.


             చేతులు కిందికి వాలి ఉన్నప్పుడు వాటి తీరు గమనిస్తే ఈ సత్యం బోధపడుతుంది . ఇమ్ము శ్రద్ధతో ఇమ్ము నిశ్చయముగా ఇమ్ము -ఇదే జీవిత రహస్యం అని నీతిశాస్త్ర కోవిదులను అంటున్నారు.


              మనిషి దాన గుణంతోనే ధర్మాత్ముడు అవుతాడు ఇతరులకు ఆదర్శంగా జీవించగలుగుతాడు మంచి వారసత్వానికి వారసుడు అవుతాడు సమాజ క్షేమాన్ని కాంక్షించి గలుగుతాడు.


              మన చేతికి అలంకారం దానం చేయడం అది ఒక గొప్ప సౌశీల్యం దానధర్మాల విశేషంగా చేయాలి తన కోసం తన ధనాన్ని ఎంత తక్కువ ఖర్చు చేసుకుంటే అంత గొప్పవాడు అవుతాడు మానవుడు. మనిషి జీవితం దానధర్మాల తోనే ముడిపడి ఉంది అదే అతడు దాచుకున్న సంపద అదే సద్గతిని కలిగిస్తుంది అనుకున్నప్పుడే వెంటనే దానం చేయాలని మహర్షులు చెబుతారు జీవితం ఏ క్షణములో ఏమి జరుగుతుందో తెలియదు ,అది గుర్తించిన వారు ఈ జీవన రహస్యాన్ని మర్చిపోరు .


               పిసినిగొట్టుతనము మహా ప్రమాదకరమైన అవలక్షణం కొందర్ని మనం అంటూ ఉంటాం పిల్లికి కూడా బిచ్చం వేయడు.... కామక్రోధ,లోభాలు నరకానికి ద్వారాలని అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు.


               అవి ఆత్మ వినాశనానికి దారులన్నీ వాటిని త్యాగం చేయలని మహాత్ములు అన్నారు. మనిషి త్యాగశీలి జీవించాలి దానం అనేది మన కర్తవ్యంగా భావించాలి లోకంలో ఎందరో దరిద్రులను చూస్తున్నాము కూటికి గుడ్డకు విద్యకు నోచుకోని నానా బాధలు పడుతూ వీధుల్లో తిరుగుతున్నారు . ఈ దీన స్థితి నుంచి వీరిని ఉద్ధరించాలి.


            మన సంపాదనలో, కనీసం 5 శాతం నుండి 10 శాతం వరకు, ధనాన్ని ఇతరులకు దానం చేద్దాము . అది తిరిగి రెట్టింపు అయ్యి10 రెట్లు మనకు తిరిగి వస్తుంది. ఒక కేజీ ధాన్యం మనము పొలములో చల్లితే, దాదాపు రెండు మూడు బస్తాల ధాన్యం వస్తుంది, అసలు ఏమి చల్లకపోతే ఏమీ రాదు.


            అదే విధముగా మనము ఇతరులకు సహాయం చేయడం అలవాటు చేసుకుంటే, మనకు అది తిరిగి ఏదో విధముగా చేరుతుంది . ఇది అక్షర సత్యం...... మన చుట్టూ ఉన్న వారు ఆనందంగా ఉంటే, మనం ఆనందంగా ఉండగలుగుతాము ఇది పకృతి రహస్యం. ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా మన వారే ఎవరు పరాయి వారు కాదు ఎవరితోనూ విరోధం వద్దు


  🙏జై గురు దేవ దత్త 🙏

తస్మాత్ శాస్త్రం ప్రమాణం

  "తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యావ్యవస్థితౌ"


మన శాస్త్రములు చెప్పిన విషయాలు పరమ సత్యము అని, మనము అనన్యమైన విశ్వాసము కలిగి ఉండాలి. శాస్త్రవిహితముగా జీవనం గడపలేము అనుకుని, శాస్త్ర వాక్యములను వదిలిపెట్టరాదు. ఆధునిక, పాశ్చాత్య జీవన విధానమునకు మనం బానిసలుగా మారకూడదు. మన కోరికలను కొంచెం తగ్గించుకుంటే, ధనార్జన అనే తృష్ణకి లోనుకాకుండా ఉండగలగుతాము, తద్వారా శాస్త్ర విహిత జీవనాన్ని,

అనుష్టానమును వదిలిపెట్టవలసిన అవసరం రాదు. ప్రతీ మనిషికీ జీవితంలో కొంత ధనము అవసరమే, కానీ కేవలం ధనం సంపాదించడం ఒక్కటే జీవిత లక్ష్యంగా పెట్టుకోకుండా ఉన్నవాడికి, భగవత్ చింతన చేయడానికి, శాస్త్ర విహిత జీవనం గడపడానికి చాలా సమయం దొరుకుతుంది.

శాస్త్రము చెప్పినట్లు బ్రతికే వాడికి, శాంతి, సంతృప్తి మరియు తరగని సంతోషం వాటంతట అవే వస్తాయి".

మంచిమాట

🌹🙏 శుభోదయం 🌞🌹. 🌷🌹 మంచిమాట 🌹🌷. *మంచి స్వభావం ఎప్పుడూ సౌందర్యం తాలూకు లోటును భర్తీ చేస్తుంది.. కానీ సౌందర్యం మంచి స్వభావం లేని లోటును భర్తీ చేయలేదు.*👏🙏💐

వేద ఆశీర్వచనం


  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - హేమంత ఋతువు - పుష్య మాసం - శుక్ల పక్షం - ప్రతిపత్ - పూర్వాషాఢ -‌‌ భాను వాసరే* (21.12.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

21-12-2025 రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

21-12-2025 రాశి ఫలితాలు

మేషం

ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

---------------------------------------

వృషభం

సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో విశేషమైన ఆధరణ పెరుగతుంది.

---------------------------------------

మిధునం

కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల కష్టం ఫలించింది నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. సన్నిహితుల నుండి కొత్త విషయాలు సేకరిస్తారు. స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.

---------------------------------------

కర్కాటకం

కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కలసిరావు. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి. బంధు వర్గంతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

---------------------------------------

సింహం

ఉద్యోగాలు ఆశించిన రీతిలో రాణించవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. 

---------------------------------------

కన్య

వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలిగి పదోన్నతులు పెరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.  

---------------------------------------

తుల

చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

వృశ్చికం

బంధు మిత్రులతో ఒక వ్యవహారంలో వివాదాలు తప్పవు. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. దూరప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది.

---------------------------------------

ధనస్సు

ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.

--------------------------------------

మకరం

ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. ఆత్మీయుల నుంచి అందిన శుభవార్త ఆనందం కలిగిస్తుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------కుంభం

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు ఉంటాయి. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు ఆకస్మికంగా నిర్ణయాలు మార్పు. చేయడం వలన నష్టాలు తప్పవు.

---------------------------------------

మీనం

వ్యాపారాల్లో ఆశించిన విధంగా రాణిస్తాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఊరట కలిగిస్తుంది. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. గృహమున శుభకార్యాల నిర్వహణ పై చర్చలు చేస్తారు.

---------------------------------------

తిరుప్పావై ప్రవచనం‎-6 వ రోజు*

 🍀```21వ తేదీ ఆదివారం…

వేకువఝామున పాడుకొనుటకు…

```

*తిరుప్పావై ప్రవచనం‎-6 వ రోజు*

                 ➖➖➖✍️

              6 వ పాశురము:


*పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్*

*వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో*

*పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు*

*కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి*

*వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై*

*ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం*

*మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం*

*ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్*



*🌺భావము:*```

భగవదనుభవము క్రొత్తదవుట వల్ల ఈ వ్రతము గురించి తెలియక తానొక్కత్తె తన ఇంటిలో పడుకొని బయటకు రాకుండా వున్న ఒక అమ్మాయిని లేపుచున్నారు.


ఆహారము సంపాదించుటకు పక్షులు లేచి కిలకిలలాడుచున్నవి. ఆ పక్షులుకు నాయకుడైన గరుత్మంతునకు స్వామి యగు 

శ్రీ మహా విష్ణువు ఆలయములో తెల్లని శంఖము ‘సమయము అయినది’ అని పెద్ద శబ్దము చేయుచున్నది. ఆ ధ్వని వినబడుటలేదా ! ఓ పిల్లా ! లే!. మేము ఎవరు లేపగా లేచామని అనుమానం కలుగవచ్చు .

పుతనస్తనములందుండు విషమునారగించినవాడును అసిరావేశము గలిగి చంప నుద్యమించిన కృత్రిమ శకటమును కేలుడునట్లు, పాలకై ఏడ్చి కాలు చాచి పొడి పొడి యగునట్లు చేసినవాడును, క్షీర సాగరమును చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్యపై లోకరక్షచింతనతో యోగనిద్ర సమరియున్న జగత్కారణభూతుడగు ఆ సర్వేశ్వరుని తమ హృదయముల పదిలపరచుకుని మెల్లగా లేచుచున్న మునులును యోగులను ‘హరి -హరి -హరి’ అనుచున్నప్పుడు వెలువడిన పెద్ద శబ్దము మా హృదయములలో చొచ్చి, చల్లబరచి , మమ్ములను మేల్కొల్పినది. నీవునూ లేచి రా!

```


*🌸అవతారిక :*```

ధనుర్మాస వ్రతంలో చేయవలసినది, పొందవలసినది, దానికి తగు యోగ్యత మొదలైనవాటిని గురించి మొదటి ఐదు పాశురాలలోను వివరించింది గోదా తల్లి. అందరినీ ఉత్సాహంగా వ్రతంలో పాల్గొనజేసింది. ఈ మొదటి ఐదు పాశురాలను వ్రతానికి మొదటి దశగా (అభిముఖ్య దశ) చెపుతారు.


ఇక 6 నుంచి 15 వరకు రెండవ దశ, అనగా ఆశ్రయణదశగా వర్ణిస్తారు. భగవంతుని సంశ్లేషము, సాక్షాత్కరము కావాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని పొందటానికి ఆచార్య కృప కావాలి. ఆచార్య కృపకావలెనంటే వారిని సమాశ్రయించాలి. భాగవదనుభవజ్ఞులైన సదాచార్య సమాశ్రయణమే భవగద్ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.


కావున యీ పది పాశురాలలో గోదా తల్లి భగవదనుభవాన్ని పొందిన పదిమంది గోపికలను మాతో కలిసిరండని, మీఅనుభావాన్ని మాకూ పంచండనీ, ఆ భగవదానందాన్ని మీరొక్కరే అనుభవించరాదనీ, అందరికీ పంచవలెనని గోపికారూపులు, సదాచార్యులైన ఆళ్వారు రూపాలను మేలుకొలుపుతోంది గోదాతల్లి. వ్రతంలో అనుభవం లేని ఒక గోపికను లేపుతోందీ పాశురంలో.```



*🌷6.వ మాలిక:*

*(అఠాణారాగము - ఆదితాళము)*


ప. చూడవె! సఖియరో! ఓ చిన్నదాన!

పడక వీడవె! పక్షులెగిరే కనవే!

చూడవే! సఖియరొ!


అ.ప. గడి వెడలిన గుడి శంఖ నాదములు

వడి బిలువగ వినలేదే! లేవవె! చూడవె! సఖియరొ!


1 చ. స్తన విషమును, పూతన, శకటాదుల

ప్రాణమ్ముల నవలీల హరించిన

పన్నగ శయనుని జగన్నాధుని

మనసున నిలిపి ధ్యానింపరాగదే!

చూడవె! సఖియరో


2. చ. మునులు యోగులును మెల్లన లేచి

ధ్యానమగ్నులై 'హరి హరి' యన - నది

ఘనరవమై మా మనసులను జేరి

తనువు పులకింప నిదుర లేపినది

చూడవె! సఖియరో!



🌼*ఆరవ ప్రవచనం‎:*


*6 వ రోజు - స్థిత ప్రజ్ఞుల దశ*

ఆండాళ్ తిరువడిగలే శరణం


*పాశురము:*


*పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్*

*వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో*

*పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు*

*కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి*

*వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై*

*ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం*

*మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం*

*ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్*```


ఈ రోజు నుండి మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపబాలికలను లేపడం ప్రారంభిస్తుంది. మనకో సందేహం రావచ్చు. శ్రీకృష్ణ ప్రేమ అందరికీ సమానమైనప్పుడు కొందరికేమో నిద్ర పట్టడంలేదు, వెంటనే శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంటే మరి కొందరెలా నిద్ర పోతున్నారని మనకు అనిపించవచ్చు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. భగవంతుని గుణాలు, ప్రేమ అనేవి ఒక మత్తు మందులాంటివి. అలాగే భగవంతుని గుణాలు ఒక్కొక్కరిపై ఒక్కోలా పనిచేసి కొందరికి నిద్రమత్తులో ఉంచేట్టు చేసాయే తప్ప వారికి శ్రీకృష్ణ ప్రేమ తక్కువని కాదు అని గమనించాలి. పైగా వారు సాత్విక నిద్రలో ఉన్నారు, మన నిద్ర లాంటి తామసిక నిద్ర కాదు అని గుర్తించాలి.


శ్రీకృష్ణ పరమాత్మ …

రెండో అధ్యాయమంలో స్థితప్రజ్ఞుల గురించి చెప్పాడు. వారు ఎలా ఉంటారంటే అందరూ మేల్కొనేపుడు వాళ్ళు పడుకొని ఉంటారు, అందరు పడుకొనేపుడు వాళ్ళు మెలుకువగా ఉంటారు. సామన్యులు శారీరక సుఖాలలో మెలుకువై ఉంటారు. మరి ఏ జ్ఞానం లేకుండా ఉన్నది దేనిలో అంటే లోపల ఉండే మన విషయంలో, వెనకాల ఉండి నడిపే వాడి విషయంలో జ్ఞానం శూన్యం. ప్రాపంచిక విషయాల్లో చాలా జ్ఞానం కల్గి ఉంటారు. మరి జ్ఞానులేమో ప్రాపంచిక విషయాలు అంతగా పట్టించుకోకుండా, భగవంతుని విషయంలో జాగరూకులై ఉంటారు. ఆలోపల ఉండే గోపికలూ అట్లాంటివారే. అందుకే మనం వాళ్ళను మన తోడుపెట్టుకొని భగవంతుని దగ్గరకు వెళితే తప్ప భగవంతుడు మనకేసి చూడడు. అలా భగవంతుని విషయంలో నిమగ్ఞమై ఉన్న ఒక పది మంది గోపికలను లేపుతూ భగవత్ జ్ఞాన దశల్లోని ఒక్కొక్క స్థితిని మనకు చూపిస్తూ మన ఆండాళ్ తల్లి మనకున్న పొరల్ని తొలగిస్తుంది. అప్పుడు మనకు భగవంతుని అనుగ్రహాన్ని పొందే యోగ్యత సంప్రాప్తిస్తుంది.


ఈ రోజు లేపే గోపబాలిక ఒక చిన్ని పిల్ల. చిన్నపిల్లలు మనసులో చేతల్లో ఒకేరకమైన భావం కల్గి ఉంటారు. అలాంటి ఒక గోపబాలికను లేపుతూ *"పుళ్ళుం శిలమ్బిన కాణ్ "* పక్షులు అరుస్తున్నాయ్ లేవవోయ్. భౌతిక జీవితంలోనైనా అంతరమైన జ్ఞాన జీవితంలోనైన పక్షుల అరుపులే మనల్ని రక్షించేవి. అంటే రెండు రెక్కల పక్షులు మనకు తెల్లవారడాన్ని సూచించినట్లే, జ్ఞానము దానికి ఉచితమైన ఆచరణ అనే రెండు రెక్కలతో ఆకాశము అంటే అంతటా వ్యాపించి ఉన్న భగవతత్వములో విహరించే మహానుభావుల పలుకులు, మనల్ని అజ్ఞానములోంచి బయటకు తెచ్చే పక్షుల అరుపులు అవే. అందుకే మనవాళ్లు ఒక గుర్తుగా చెప్పారు. 


లోపల గోపబాలిక వీళ్ళు చేసే అల్లరికి పక్షులు లేచి ఉంటాయి అని భావించినట్లుంది, మనవాళ్ళు రెండో గుర్తు చెప్పడం ప్రారంభించారు ``` *"పుళ్ళరైయన్ కోయిల్ వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో పిళ్ళాయ్! "ఆ ఊరిలో ఉండే పక్షిరాజు అయిన గరుత్మంతుని స్వామి - విష్ణు ఆలయంలో తెల్లని పిలుపు శంఖం ధ్వని కుడా వినిపించడం లేదా ఓ చిన్నపిల్లా అని అంటుంది. అక్కడి దీప కాంతి శంఖం ఊదే వాడి బుగ్గలపై పడి శంఖం మెరుస్తుందని ఆండాళ్ తల్లి ఆలయ సన్నివేశాన్ని భావిస్తూ - తెల్లని పిలుపు శంఖం అని వర్ణిస్తుంది. శంఖం ఓంకారానికి సంకేతంగా పోలుస్తారు. లోపలుండే గోపబాలిక అది ఝాము ఝాముకు వినిపించే ధ్వని ఇంకా తెల్లవారలేదన్నట్లుగా భావించి ఇంకా నిద్ర లేవలేదు. *"ఎళుందిరాయ్"-* మేలుకో. మరి ఆండాళ్ తల్లి తాను ఎలా మేలుకొందో కొన్ని గుర్తులు చెబుతుంది. *"మునివర్గ ళుం యోగిగళుం మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం ఉళ్ళం పుగుందు కుళిరుంద్"* మునులూ,యోగులూ మెల్లగా లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ హరి-హరి-హరి అంటూ అనుకునే శబ్దం ఒక్కసారిగా పెద్దగావినిపించి మా చెవులను చేరి ఒక్కసారిగా లేచాం, నీకు వినబడలేడా! మరి వాళ్ళు మూడు సార్లు హరినామం ఎందుకు అన్నారో ఆండాళ్ తల్లి వివరిస్తుంది. 


*"పేయ్ములై నంజుండు"* పూతన స్తనాలకు అంటి ఉన్న విషాన్ని ఆరగించాడు- దూదిపింజ నిప్పుపై పడి కాలిపోయినట్లు ఆమెను సంహరించాడు - వదలని వాడు కాబట్టే ఆయనను అచ్యుత అని అంటారు. ప్రకృతి మనకు ఇచ్చే "అహం-మన" అనే విషాలను హరించేవాడా - హరి అని జ్ఞానులు తలుస్తున్నారు. 


*"కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి"* శ్రీ కృష్ణుని తల్లి యశోదమ్మ ఒక బండి క్రింద పడుకోబెట్టింది, ఒక అసురుడు బండిపై ఆవహించి శ్రీ కృష్ణుని సంహరించాటానికి చూసాడు. కపట శకటాసురుణ్ణి కాలుజాచి సంహరించాడు. ఆయన పాదం అలాంటిది. ఈ శరీరం మనకు ఒక శకటం లాంటిది, పుణ్య-పాపాలు దాని చక్రాలవంటివి, మనల్ని నడిపించే పరమాత్మను దానిక్రింద పెట్టి ఆయన పాదాలను- చరణౌ శరణం ప్రపద్యే అంటే చాలు- మనకు అంటి ఉన్న పుణ్య-పాప సంపర్కాన్ని హరించువాడా - హరి. 


*"వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై ఉళ్ళత్తు క్కొండు"* - ```

ఆదిశేషువుపై సుకుమారంగా పవళించి ఉన్న జగత్తుకు బీజమైన స్వామి. అయిదు తలల ఆదిశేషువు - అయిదు రకాల జ్ఞానములను తెలియ జేస్తుంది. నేను వాడికి చెందిన వాన్ని, వాడు నన్ను తరింపచేయువాడు, వాణ్ణి చేరే సాధనం వాడి శరణాగతే, వాణ్ణి చేరితే కలిగే ఫలితం వాని సేవ, వాణ్ణి చేరకుండా ఉంచే ఆటకం వానియందు రుచిలేకుండుట అనే అయిదు జ్ఞానాలు కల్గి ఉండే వారి హృదయాల్లో ఉంటాడు స్వామి. ఇతరమైన వాటిపై రుచి హరింపచేసినవాడా- హరి. అంటూ మూడు సార్లు హరి అని పిలుస్తుంటే లేచామని తెలుపుతూ అండాళ్ తల్లి గోప బాలికను లేపింది.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

మాంసం తినే పాశ్చాత్య ఆవులు*

 

*మన ఆరోగ్యం…!


*మాంసం తినే పాశ్చాత్య ఆవులు*

               ➖➖➖✍️


```

అమెరికాలో ఎక్కడ చూసినా కనిపిస్తున్న ఆటిజం (పిల్లలలో బుద్ధిమాంద్యం), జైగాంటిజం (చిన్నపిల్లలు కూడా రాక్షసులలాగా పెరిగిపోవడం), ఒబెసిటీ (ఊబకాయం), ప్రికోసియస్ ప్యూబర్టీ (తొమ్మిదేళ్లకే ఆడపిల్లలు రజస్వలలు కావడం, ఎనిమిదేళ్లకే అబ్బాయిలకు గడ్డాలు మీసాలు రావడం), 25 ఏళ్లకే వస్తున్న రకరకాల కేన్సర్లు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇవన్నీ ఎందుకొస్తున్నాయా అని తెగ పరిశీలించాను చాలాసార్లు. 


వీటన్నిటికీ కొన్ని కారణాలు కనిపించాయి. 

అవి…```


*1. జీవనవిధానాలు లేదా లైఫ్ స్టైల్స్:*```

అంటే, ఒక వేళకు నిద్ర లేవడం, నిద్రపోవడం లాంటి ఒక నియమిత జీవనవిధానం లేకపోవడం. ```


*2. ఆహారదోషాలు…*```

అంటే, ప్రాసెస్ చేసినవి, ఫ్రోజెన్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, రెడ్ మీట్ లాంటివి తెగ తినడం.```



*3. సిగరెట్లు, త్రాగుడు, వీడ్ మొదలైనవి విపరీతంగా తీసుకోవడం.*



*4. ఉద్యోగ టెన్షన్లు. విపరీతమైన పని ఒత్తిడితో, టెన్షన్ తో, బాగా చేయకపోతే ఉద్యోగం పోతుందేమో అన్న భయంతో ఏళ్లకేళ్లు పనిచేయడం.*



*5. మోడ్రన్ మెడిసిన్ లో వాడబడుతున్న సింథటిక్ డ్రగ్స్, ఇంకా స్టెరాయిడ్స్ మొదలైన వాటి వాడకం. ప్రతి చిన్నదానికీ భయపడి హై పవర్ మందులు వాడెయ్యడం.*



*6. వందలాది టీకాలను పుట్టినప్పటినుండీ పిల్లలకు విచక్షణారహితంగా వేయించడం.*

```

ఇలా చాలా కారణాలు నాకు కనిపించాయి. 



కానీ వీటిని చెప్పినా కూడా ఎవరూ నమ్మనంతగా జనం తయారయ్యారు. 

పైగా, 'ఇవి కారణాలు కాదులే' అని తేలికగా కొట్టిపారేస్తున్నారు. సరే ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు? అని నేనూ వదిలేస్తూ ఉంటాను.



మూడేళ్ళ క్రితం మావాడు నాతో ఫోన్లో మాట్లాడుతూ, 'నాన్నా నేను పాలు పెరుగు మానేశాను. వీగన్ నయ్యాను' అన్నాడు.


నేను షాకయ్యాను.


'అదేంటి నాన్నా? పాలూ పెరుగూ మానేస్తే ఎలా? మనం తినే ఆహారంలో కాస్త ప్రోటీన్ అదే కదా? పైగా పెరుగేమో ప్రో బయాటిక్. గట్ హెల్త్ కి అది చాలా అవసరం. అది మానేస్తే ఎలారా?' అని కొంచం గదిమినట్లే అన్నాను.


మావాడు తేలికగా, 'నువ్వు ఇక్కడికొచ్చినపుడు నీకర్థమౌతుందిలే నాన్నా' అన్నాడు.


'సరే. అక్కడి పరిస్థితులేంటో మనకు తెలీవు కదా. వెళ్ళినపుడు చూద్దాం' అనుకొని నేనూ ఊరుకున్నాను.  


ఇక్కడికొచ్చి నలభై రోజులయ్యాయి. ఈ నలభై రోజులలో అరుగుదలలో చాలా తేడా వచ్చింది. ముందు నీళ్ల తేడా అనుకున్నాను. కానీ రోజురోజుకూ కొన్ని సమస్యలు ఎక్కువౌతున్నట్లు అనిపిస్తున్నది. మొదటిరోజునుంచీ ఇక్కడ పాలు, పెరుగుల మీద నాకేదో అనుమానంగానే ఉంది. అవి సహజంగా ఉన్నట్లు అనిపించవు. రుచి తేడాగానే ఉంటుంది, అదీగాక వాటిని తీసుకున్న తర్వాతే అరుగుదల సమస్యలు ఎక్కువౌతున్నట్లు అనిపించింది. అందుకని ఈ మధ్యనే అవి రెండూ మానేశాను. 

వెంటనే అప్పటిదాకా కనిపిస్తున్న డైజెషన్ సమస్యలన్నీ మంత్రం వేసినట్లుగా మాయమయ్యాయి. ఈ రెండే అసలైన దొంగలని అర్ధమైంది. వీటిమీద ఇంకాస్త రీసెర్చి చేద్దామని నిర్ణయించుకున్నాను. 


ఈ లోపల డెట్రాయిట్ రిట్రీట్ వచ్చింది. నాలుగైదు రాష్ట్రాల నుండి సభ్యులు వచ్చారు. ఒకరోజున మాటల మధ్యలో ఇదే టాపిక్ వచ్చింది.


'డైరీ ప్రొడక్స్ ఇక్కడివాళ్లకు అసలైన చేటు చేస్తున్నాయని నా ఉద్దేశ్యం' అన్నాను.


సభ్యులలో ఒక డాక్టర్ ఉన్నారు. ఆమె గత ముప్పై ఏళ్ళనుంచీ ఇక్కడ డాక్టర్ గా ఉన్నారు. ఆమె నా మాటలతో ఏకీభవించడమే గాక, ఇలా అన్నారు…


'ఇక్కడ ఆవులకు మాంసం తినిపిస్తున్నారు. వాటి పాలను కల్చర్ చేసి, చాలా మార్చేసి మార్కెట్లో పెడుతున్నారు. వాటిని త్రాగిన పిల్లల్లో మీరు చెప్పిన రోగాలన్నీ వస్తున్నాయి. చిన్నచిన్న పిల్లల్లో కూడా కేన్సర్లు వస్తున్నాయి. ఇక్కడి తిండే ఇక్కడి రోగాలకు కారణం, పాలు బాగా త్రాగాలని ఇక్కడి పిల్లలకు మనవాళ్లు తెగ తాగిస్తారు. అవే వాళ్ళ కొంప ముంచుతాయి. కానీ ఆ విషయం అర్ధమయ్యేసరికి చేయి దాటిపోతుంది.'


నేను నిర్ఘాంతపోయాను.


'ఆవులకు మాంసమా?' అన్నాను నోరెళ్ళబెట్టి. 

కానీ అమెరికాలో ఆమె చాలా సీనియర్ డాక్టర్ అవడం చేత ఆమె చెప్పినది నమ్మక తప్పలేదు.


తరువాత రీసెర్చి చేస్తే దిమ్మెరపోయే నిజాలు బయటపడ్డాయి…


ఇక్కడ స్టోర్స్ లో... 

'గ్రాస్ ఫెడ్ కౌ మిల్క్' అని విడిగా పాలపేకెట్లు దొరుకుతాయి. 

అంటే, 'గడ్డి తినే ఆవుల పాలు' అన్నమాట. 

మొదటిసారి స్టోర్స్ లో ఈ పాల పాకెట్స్ చూసినపుడు నాకు మళ్ళీ మతిపోయింది. 


'ఆవులు గడ్డి తినక ఇంకేం తింటాయి?' అనడిగాను.


'అలా కాదు, బలం కోసం, మరిన్ని పాలివ్వడం కోసం వాటికి బీన్స్ పెడతారు. అంతేగాక హార్మోన్ ఇంజక్షన్లు ఇస్తారు' అని నాకు చెప్పారు.


ఇప్పుడు, ఆ బీన్స్ తో బాటు, మాంసాన్ని బాగా ఎండబెట్టి, పొడిచేసి, అందులో కలిపి ఆవులకు తినిపిస్తున్నారన్న దిగ్భ్రాంతికరమైన వాస్తవం బయటపడింది. అందులో పందిమాంసం కూడా ఉంటుందట. అందుకే ఇక్కడి పాలు ఏదోగా ఉంటాయి. పెరుగేమో బంక బంకగా సాగుతూ ఉంటుంది. సహజమైన రుచి వాటిలో ఉండదు.


అంటే, అలాంటి మాంసం తిని, హార్మోన్ ఇంజక్షన్లు చేయించుకున్న ఆవుల పాలు, డబల్ పాశ్చరైజేషన్, కల్చర్ చెయ్యబడిన తర్వాత, మనం త్రాగుతున్నాం. అదే పెరుగును తింటున్నామన్న మాట !


మరి పైన చెప్పిన నానా రోగాలు రాక ఇంకేమొస్తాయి?


అమెరికాలో అడుగుపెట్టిన మొదటిరోజునుంచీ నాకీ పాలంటే, పెరుగంటే ఎందుకు అసహ్యంగా ఉందో ఇప్పుడర్థమైంది. వాటిని మానేశాక, ఎందుకు హాయిగా ఉందో ఇంకా బాగా అర్ధమైంది.



ఇవీ ఫుడ్ మాఫియా లీలలు !



అందుకేనేమో, అమెరికాలో ఎక్కడ చూసినా వీగన్ కల్చర్ బాగా ఎక్కువైంది. ఇప్పుడు ఇండియాలో కంటే అమెరికాలోనే శాకాహారులు ఎక్కువగా ఉన్నారు. ఇండియాలో మనం పాలు పెరుగులు కూడా తీసుకుంటాం. ఇక్కడ వీగన్స్ అవి కూడా తినరు. పూర్తిగా మొక్కల నుండి తయారైన ఆహారాన్నే వీళ్ళు వాడతారు. వీగనిజం అనేది ప్రస్తుతం ఇక్కడొక ఉద్యమంలా వ్యాపిస్తోంది. ఎక్కడచూచినా వీగన్ రెస్టారెంట్లు కనిపిస్తున్నాయి. ఇండియాలో తినే శాకాహారమే అన్నిటికంటే బెస్ట్ బేలన్సుడ్ ఫుడ్ అని అమెరికన్లు చాలామంది అంటున్నారు.



చావుకొస్తుంటే చస్తారా మరి?


ఒకే ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను…


బాక్సింగ్ రంగంలో ఎప్పటికీ గుర్తుండే పేరు - మైక్ టైసన్. రెడ్ మీట్ లేనిదే అతనికి ముద్ద దిగదు, అతనితో రింగ్ లోకి దిగాలంటే భయపడి చచ్చేవాళ్ళు ప్రత్యర్ధులు. కానీ ప్రస్తుతం అతను వీగన్.


'ఎందుకిలా అయ్యావు? అని ఎవరో అడిగితే అతనిలా చెప్పాడు.


'రెడ్ మీట్ నాకు చేసిన హానిని నా బాడీ నుంచి క్లీన్ చేసుకోవడానికి ఇంతకంటే నాకు మార్గం కనిపించలేదు, అందుకే వీగన్ నయ్యాను. ఇప్పుడు నాకు హాయిగా ఉంది' అన్నాడు. 


మైక్ టైసన్ నుండి ఈ మాటను ఊహించగలమా? కానీ ఇది నిజం. యూట్యూబ్ లో ఉంది చూడండి.


అమెరికా నాశనమౌతున్నది ఫుడ్డు, మందులు, జీవన అలవాట్ల నుంచి మాత్రమే. ఇప్పుడు ఈ జాడ్యం మన ఇండియాకి కూడా దిగుమతి అవుతున్నది. ఇప్పటిదాకా లేని రోగాలను మనం ఇండియాలో కూడా చూస్తున్నాం. ముఖ్యంగా యువతలో. ముప్ఫైకే అన్నీ ఉడిగిపోయి జీవచ్ఛవాలైపోతున్నారు.


ప్రపంచ వినాశనం అణ్వస్త్రాలతో కాదుగాని, ఆహారపు అలవాట్లతోనే వచ్చేటట్టు ఉంది.


విపరీతంగా డబ్బు చేతిలో ఉన్నా, ఆకులూ అలములూ తినాల్సి రావడం ఎంత విచిత్రమో కదా? 

ఆ డబ్బు ఎందుకు సంపాదిస్తున్నట్లో మరి?? ఎటు పోతోంది మానవజాతి?


వేపచెట్టుకు తియ్యటి పండ్లు కాస్తాయి, చింతచెట్టు నుంచి పాలు కారతాయి. అని బ్రహ్మంగారు వ్రాశారు.


'ఆవులు మాంసం తింటాయి, మానవజాతి వినాశనానికి అదొక గుర్తు'. అని కూడా వ్రాశారో లేదో మరి. కాలజ్ఞాన పండితులు చెప్పాలి.


ఏదేమైనా పాలూ పెరుగూ తినడం మానేశాక నాకు చాలా హాయిగా ఉంది. నేనూ వీగన్నయ్యానా? చూడబోతే అలాగే ఉంది మరి !✍️

-సేకరణ -బాబ్ లాల్*```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

పుష్య మాసమును..* *శూన్య మాసమని…*

  


*పుష్య మాసమును..*

              *శూన్య మాసమని…*

                         *ఎందుకంటారు?*

                   ➖➖➖✍️

```

సూర్యమానం ప్రకారం, చాంద్రమానం ప్రకారం కలిసి ఉండే కొన్ని మాసాలను శూన్య మాసాలంటారు. ఉదాహరణకు సూర్యమానం ప్రకారం ధనుర్మాసం చాంద్రమానం ప్రకారం పుష్యమాసం కలిసి ఉన్న కొన్ని రోజులను శూన్య మాసమంటారు. 


ధనుర్మాసము మొత్తము కూడా శూన్య మాసం కాదు అదేవిధంగా పుష్య మాసం మొత్తము కూడా శూన్య మాసం కాదు. 


ధనుర్మాసం ప్రారంభమైన కొద్దిరోజులకు పుష్య మాసం ప్రారంభం అవుతుంది. అంటే ధనుర్మాసం ప్రారంభమైన మొదటి రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమయిన ముందు రోజు వరకు శూన్య మాసం కాదు. 


అదేవిధంగా ధనుర్మాసము అయిపోయిన తర్వాత పుష్యమాసంలో మిగిలిన రోజులు శూన్య మాసం కాదు.


మీన మాసంతో కూడిన చైత్రమాసం, మిధున మాసంతో కూడిన ఆషాడ మాసం, కన్యా మాసంతో కూడిన భాద్రపద మాసం, ధనుర్మాసంతో కూడిన పుష్య మాసాలను శూన్య మాసాలంటారు.


ఈకాలంలో గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహాది ముఖ్య శుభ కార్యాలకు ముహుర్తాలు శూన్యం. 


అధిక మాసంలో కూడా శుభ కార్యాలకు ఎటువంటి ముహుర్తాలుండవు. 

కనుక ముహుర్తాలు లేని ఈ నెలలను శూన్య మాసాలంటారు. 


ఎటువంటి దైవకార్యాలయినా, పితృ కార్యాలయినా శూన్య మాసంలో చేయవచ్చు. ఎటువంటి నిషేధం లేదు.


మనకు చాంద్రమానము, సూర్యమానమని రెండు రకాల కాలమానాలు(క్యాలెండర్) ఉన్నాయి. చంద్రుడి గమనాన్ని ఆధారం చేసుకుని చాంద్రమాన మాసాలు ఏర్పడతాయి. 


చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం అని పన్నెండు మాసాలు ఉన్నాయి. 


శుక్ల పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఒక మాసముగా పరిగణిస్తారు. 


ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలలో పూర్ణిమ తరువాత వచ్చే కృష్ణ పాడ్యమి మొదలు మళ్లీ వచ్చే పూర్ణిమ వరకు ఒక మాసముగా పరిగణిస్తారు.


రోజుకు ఒక నక్షత్రం చొప్పున 27 రోజులు 27 నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు ప్రయాణం చేయడానికి 27.32 రోజులు పడుతుంది. దీనికి sidereal month అని పేరు. 


చంద్రుడు కొంతకాలం వృద్ధి చెందుతూ పూర్ణ స్థితికి చేరుకుంటాడు. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అని పదిహేను రోజులకు (తిధులకు) నామకరణం చేశారు. 

ఈ పదిహేను రోజులను వృద్ధి పక్షము లేదా శుక్లపక్షము అని పిలుస్తారు. 


తిరిగి చంద్రుడు, పాడ్యమి నుంచి అమావాస్య వరకు క్షీణించి పూర్తిగా కనిపించడు. 

ఈ పదిహేను రోజులను బహుళ పక్షం లేదా కృష్ణ పక్షం అని పిలుస్తారు. 


చంద్రుడు వృద్ధి చెంది తిరిగి పూర్తిగా క్షీణించడానికి సగటున 29.530587981 రోజులు పడుతుంది. దీనిని Synodic month అంటారు. సంవత్సరం పూర్తి కావడానికి 354.37 రోజులు పడుతుంది. 


భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం అంటే 365.25 రోజులు పడుతుంది. 


ప్రతి సంవత్సరం 11.12 రోజులు ముందుగానే పూర్తవుతుంది. ఈ కారణంగా తెలుగు పండుగలు పది పదకొండు రోజులు ముందుగానే వస్తాయి. దీనిని సరి దిద్దటం కోసం ప్రతి మూడు సంవత్సరాలకు ఒక నెలను అధిక మాసంగా చేరుస్తారు. చైత్రమాసం నుంచి ఆశ్వీయుజ మాసం వరకు వచ్చే మాసాలను మాత్రమే అధిక మాసంగా కలుపుతారు. 


మొదటి అధిక మాసం 28 నెలల తరువాత వస్తుంది. వరుసగా 28, 34, 34, 35 నెలల తరువాత అధిక మాసం పునరావృతం అవుతుంటుంది. 


అధిక మాసమెప్పుడూ ముందు వచ్చి తరువాత నిజ మాసం వస్తుంది. 


అధిక మాసం కూడా శూన్య మాసంగా పరిగణించ బడుతుంది. 


ఇటువంటి సవరణ లేదు కాబట్టి అరబిక్ కాలమానం ప్రకారం జరుపుకొనే రంజాన్ శీతాకాలంలో, ఎండాకాలంలో, వానాకాలంలో కూడా వస్తుంది.


పూర్ణిమ రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో ఆ మాసాన్ని పిలుస్తారు. 

ఉదాహరణకు చంద్రుడు పూర్ణిమనాడు చిత్త నక్షత్రం దగ్గర ఉంటాడు కాబట్టి చైత్ర మాసం అంటారు. 

చంద్రుడు విశాఖ నక్షత్రమునకు దగ్గరగా ఉన్నప్పుడు వైశాఖ మాసమని పిలుస్తారు.


సూర్యుడు ప్రతినెలా ఒక రాశిలో ఉంటాడు. ధనుర్మాసంలో ధనుస్సురాశి దగ్గర ఉంటాడు. మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అను పన్నెండు రాశుల పేర్లతో పన్నెండు సూర్య మాన నెలలు ఉంటాయి.


సూర్యుని చుట్టూ భూమి ఒక స్థిరమైన కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. అందువల్ల సూర్యమానం ఆధారంగా చేసుకొని తయారుచేసిన కాలమానం ఋతువులకు సామీప్యంగా ఉంటుంది.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము*

*సరళ వ్యావహారిక భాషలో...!*


* 597వ రోజు*


అనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము


ధర్మరాజు

అగ్నిదేవుడు సుదర్శన

అగ్నిదేవుడికి సుదర్శనకు ఒక కుమారుడు కలిగాడు. అతడికి సుదర్శనుడు అను నామకరణం చేసాడు. అతడు సుగుణసంపన్నుడు ధర్మపరుడు. సుదర్శనుడు పెద్దవాడై తాతగారి రాజ్యభారమును వహించి రాజ్యపాలన చేయసాగాడు. సుదర్శునుడికి వివాహమై ఒక కుమారుడిని పొందాడు. అతడి పేరు ఓఘవంతుడు. ఓఘవంతుడికి ఒక కుమార్తె ఓఘవతి ఒక కుమారుడు ఓఘరధుడుకలిగారు. ఓఘవతికి వివాహ వయసురాగానే ఆమెకు తగిన వరుడి కొరకు వెతికి చివరకు తాతగారైన సుదర్శనుడితో వివాహము జరిపించారు. ఓఘవతిని చేపట్టిన సుదర్శనుడు " నేను గృహస్థధర్మమును పాటిస్తూ మృత్యువును జయిస్తాను " అని ప్రతిజ్ఞ చేసాడు. తరువాత అతడు కురుక్షేత్రముకు వెళ్ళి అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకుని భార్య ఓఘవతితో గృహస్థ జీవితం కొనసాగించాడు. ఒక రోజు సుదర్శనుడు భార్యతో " ఓఘవతీ ! నాకు అతిథి పూజలంటే మక్కువ ఎక్కువ. అందు వలన నేను గృహంలో ఉన్నా లేకున్నా ! నీవు మాత్రము అతిథి మర్యాదలు చేయాలి. ఎందుకంటే ఎవరి ఇంట్లో అతిథి తన కోర్కెలు తీర్చుకుంటారో ఆ గృహస్థు కృతార్ధుడు ఔతాడు. మన ఇంటికి వచ్చిన అతిథి ఏకోరిక కోరినా నీవు ఆ కోరిక సంకోచించచక తీర్చాలి. పతి ఆజ్ఞ నెరవేర్చడమే సతికి ధర్మము కదా ! " అని అన్నాడు. భర్త మాటలకు ఓఘవతి అంగీకరించింది. సుదర్శనుడు సమిధల కొరకు అడవికి పోయిన సమయంలో వారి ఇంటికి ఒక అతిథి వచ్చాడు. ఓఘవతి అతడికి అతిథి మర్యాదలు చేసింది. అతడు ఓఘవతి వంక మోహంతో చూసి " లలనా ! నా మనసు నీ అందు లగ్నమైనది కనుక నీవు నా కోరిక తీర్చు. అతిథి మర్యాద చేయడమూ అతడి కోరిక తీర్చడము ధర్మము కదా ! నీకు తెలియనిది ఏమున్నది. అది నీధర్మమని నీభర్త నీకు చెప్ప లేదా ! " అన్నాడు. ఓఘవతి " మహానుభావా ! మీరు మరే కోరిక అడిగినా తీరుస్తాను " అన్నది. కాని అతడు " లలనా ! నాకు మరే కోరికా అవసరం లేదు " అన్నాడు. ఓఘవతి " తన భర్తమాట గుర్తుకు వచ్చి భర్తమాట నెరవేర్చిన తన శీలం పోతుంది. తీర్చక పోతే తన భర్తమాటలను ఉల్లంఘించినట్లౌతుంది అనుకుని చివరకు అతడి కోరికకు అంగీకరించింది " ఇంతలో సుదర్శనుడు తిరిగి వచ్చి ఓఘవతిని పిలిచాడు. అతిథి ఓఘవతిని మాట్లాడకుండా కట్టడి చేసాడు. ఆ బ్రాహ్మణ అతిథి శాపానికి భయపడి ఓఘవతి మాటాడక ఊరకున్నది. భార్య ఎంతకీ పలకనందున సుదర్శనుడు పర్ణశాలలోకి తొంగిచూసి ప్రేమగా ఓఘవతిని పిలిచాడు. బ్రాహ్మణుడు లోపల నుండి " ఓ యజమానీ ! నీ భార్య నాకు అతిథి సత్కారము ఇస్తుంది. నీకు గృహస్థధర్మాలు అతిథి సత్కారాలు తెలుసు కనుక కోపించకుము " అన్నాడు. అప్పుడు సుదర్శనుడు లోపల ఉన్న " అతిథితో మహాభాగా ! నీకు ఆతిథ్యము ఇచ్చినందు వలన నా జన్మధన్యము అయింది. అతిథి పూజలు నిర్వహించే గృహము ధన్యము పవిత్రము అంటారు కదా ! అతిథిపూజ అయ్యేంత వరకు నేను వెలుపల ఉంటాను " అని " అతిథీ ! నా మనసు నా వాక్కు ఒక్కటే దీనికి ఈ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు సాక్షి " అన్నాడు. అప్పుడు ఆకాశవాణి " ఇతడు ధన్యుడు అందరూ గౌరవించ తగిన వాడు " అని పలికింది. అప్పుడు లోపల ఉన్న వ్యక్తి తేజోమంతుడై సాక్షాత్కరించి " సుదర్శనా ! నేను ధర్మదేవతను. నీ చిత్తము ఎటువంటిదో తెలుసుకోవడానికి వచ్చాను. నీవు నిశ్చలవ్రతుడవు. నీవు ధర్మము ఎప్పుడు తప్పుతావో అప్పుడు నిన్ను చంపాలని మృత్యుదేవత నీ వెంటనే పొంచి ఉన్నది. కాని నీవు మృత్యువును జయించావు. నీ భార్య కూడా మహాపతివ్రత. మీరు సశరీరంగా ఊర్ధ్వలోక ప్రవేశానికి అర్హులు. కనుక మీకు ఎప్పుడు ఊర్ధ్వలోకాలకు రావాలని అనిపిస్తుందో అప్పుడే ఊర్ధ్వలోకాలకు భార్యాసమేతంగా రావచ్చు. నీవు చేసిన సగభాగం తపః ఫలము చేత నీ భార్య ఓఘవతి పుణ్యనది అయి ఈ లోకములో ప్రవహిస్తూ జనులను పావనం చేస్తుంది. మిగిలిన సగం తపః ఫలము వలన నీకు సేవచేస్తుంది. నేను నీ ఇంటికి రావడము నీ భార్యను కోరడమూ అన్నీ నీ కీర్తి లోకాలకు తెలియజేయడానికే నేను కల్పించాను. అంతే కాని నీ భార్యశీలానికి ఎంటువంటి హానీ జరగలేదు . ఇది నిజము " అని పలికి అంతర్ధానం అయింది. ధర్మనందనా ! ఇదీ ఓఘవతీనది చరిత్ర. ఈ కథసారాంశం ఏమంటే గృహస్థుకు అతిథి పూజకు మించిన పరమధర్మము వేరొకటి లేదు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.



*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ ముఘ్దేశ్వర్ ఆలయం

 🕉 మన గుడి : నెం 1332


⚜  తమిళనాడు : కోడుముడి - ఈరోడ్ 


⚜  శ్రీ ముఘ్దేశ్వర్ ఆలయం



💠 బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు వేరు వేరుగా ఆలయాలు మనం చూస్తూనే ఉంటాం కాని ఒకే ఆలయంలో త్రిమూర్తులు ముగ్గురూ కొలువు తీరి ఉండటం చాలా అరుదుగా చూస్తాం. అలాంటి ఒక ఆలయమే తమిళనాడులోని ఈరోడ్ దగ్గరలో ఉన్న కొడుముడి దేవాలయం.

ఈ ఆలయం కావేరి నది ఒడ్డున కలదు..


💠 ఈ విశాలమైన ఆలయంలో తూర్పు వైపున 3 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. 

మధ్య ద్వారానికి ఉత్తరాన కొడుముడి నాథర్ మరియు మకుటేశ్వరర్ అని పిలువబడే ప్రధాన దైవం శివుని మందిరానికి ప్రవేశ ద్వారం ఉంది. మధ్య ద్వారానికి దక్షిణాన పన్మోళి నాయకి మరియు సౌందరంబిక అని పిలువబడే తల్లి పార్వతిదేవి ఆలయానికి ప్రవేశ ద్వారం ఉంది. విష్ణువును వీరనారాయణ పెరుమాళ్ అని పిలుస్తారు. 

కుంచితపాద నటరాజర్ తన రెండు పాదాలను నేలపై ఉంచాడు, ఎడమ పాదం పైకి లేచింది. 


💠 ఇక్కడి శివుడిని ముఘ్దేశ్వర్ అని, అమ్మవారిని సౌందర్యవల్లి అని అంటారు. 


💠 ఈ ఆలయ పురాణం అగస్త్య మహర్షికి సంబంధించినది . 

ఒకసారి ఆ మహర్షి విగ్రహం అదృశ్యమవుతుందని గమనించి, తన చేతిలో ఆ విగ్రహాన్ని పట్టుకున్నాడు మరియు ఆయన వేలిముద్రలు ఆ దేవతపై కనిపిస్తున్నాయి.


💠 పాండ్యరాజులు ఈ ఆలయాన్ని క్రమం తప్పకుండా పోషించారు మరియు పాండ్య రాజుల సంబంధం కారణంగా, ఈ శివస్థలాన్ని తిరుప్పండికొడుముడి అని పిలుస్తారు.


💠 ఒక పురాణగాథ ప్రకారం ఆదిశేషుడికి, వాయుదేవుడికి మధ్య ఎవరి బలం గొప్పదో అనే దాని మీద వాదోపవాదాలు జరిగి ఇద్దరు మేరు పర్వతం దగ్గరకి వచ్చి యుద్ధానికి తలపడ్డారు. 

ఆదిశేషుడు మేరు పర్వతాన్ని గట్టిగా పట్టుకుని ఉండగా వాయుదేవుడు తన శక్తి మేర గట్టిగా ఊదితే అతని ప్రతాపానికి ఈ పోరాటంలో మేరు పర్వతం పైభాగం ఐదు ముక్కలుగా (కొన్ని ఏడు అని చెబుతారు) విరిగి వివిధ ప్రదేశాలలో రత్నాలుగా పడిపోయింది, వాటిలో తిరువన్నమలై, రత్నగిరి (తిరువత్పోకి), ఈంగోయిమలై మరియు పోతిగైమలై ఉన్నాయి. 


💠 ఇక్కడ ఒక వజ్రం పడి స్వయంభు లింగంగా మారింది. ఆదిశేషుని సంబంధం దృష్ట్యా, ఈ ఆలయం నాగదోషాన్ని తొలగించడానికి కూడా ప్రసిద్ధి చెందింది మరియు పాములను మగుడితో మచ్చిక చేసుకోవడం వల్ల, ఇక్కడ శివుడిని మగుడేశ్వరర్ అని పిలుస్తారు. 


💠 అలా వజ్రంతో సమానమైన మేరు పర్వత శిఖర భాగం వచ్చి ఈ కొడుమూడిలో పడి శివలింగ రూపం దాల్చింది. అదే ముఘ్దేశ్వర శివలింగం.


💠 శివుడి పెళ్లి జరిగిన తరువాత పార్వతి దేవితో కలిసి అగస్త్య మహర్షికి ఈ ప్రదేశంలోనే ప్రధమ దర్శనమిచ్చారు. అలాగే భరద్వాజ మహర్షికి శివుడి తాండవం చూసే అదృష్టం కూడా ఈ ప్రదేశంలోనే కలిగింది. 


💠 ఈ ఆలయ ప్రాంగణంలోనే భరద్వాజ తీర్థం, దేవ తీర్థం, బ్రహ్మ తీర్థం అనే మూడు తీర్థాలని మనం చూడవచ్చు.


💠 ఇక విష్ణుమూర్తి రూపాన్ని వీర నారాయణ పెరుమాళ్ అని అంటారు. అమ్మవారిని తిరుమంగ నాచియార్ అని పిలుస్తారు. 

పెళ్లికాని వారు ఇక్కడ పరిహార పూజలు చేయించుకుంటే వెంటనే పెళ్లి కుదురుతుందనే ఒక నమ్మకం కూడా ఉంది. 

అంతేకాదు రాహు కేతువులకు కూడా పహిహార పూజలు చేసుకోవచ్చు. కుజదోషం ఉన్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. 

మొత్తానికి ఎలాంటి జాతక దోషాలకైనా ఇక్కడ పరిహార పూజలు చేయటం పరిపాటి.


💠 బ్రహ్మ దేవుడు ఒక చెట్టు రూపంలో ఉండటం ఇక్కడి మరొక విశేషం. 

వణ్ణి చెట్టుగా పేరుపొందిన ఈ మహావృక్షం దాదాపు 3000 సంవత్సరాల నాటిదని చెప్తున్నారు ఆలయ నిర్వాహకులు. 

ఈ చెట్టుకున్న మరొక విశేషం దీనికి ఒక వైపు ముళ్ళు ఉంటే మరో వైపు ఉండవు, అంతేకాదు దీనికి పళ్ళు పువ్వులు కూడా కాయవు. 

ఈ చెట్టు ఆకు ఒక్కటైనా ఒక బిందెడు నీళ్ళల్లో వేసి ఉంచితే ఆ నీళ్ళు ఎన్నాళ్లయినా పాడవ్వవు అని ఇక్కడి భక్తుల నమ్మకం. 


💠 ఈ ఆలయంలో అనేక గణేశులు ఉన్నప్పటికీ, వాటిలో ముఖ్యమైన వ్యక్తిని కావేరీ కంద గణేశన్ (కావేరీని చూసినవాడు) అని పిలుస్తారు.   వయస్సుకు సమానమైన కుండలతో వినాయకుడికి అభిషేకం చేయడం ఈ ఆలయంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. 


💠 ఈ ఆలయంలోని మరొక ప్రత్యేక వినాయకుడిని వ్యాక్రపాద వినాయకుడు అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన పులి పాదాలను కలిగి ఉంటాడు మరియు ఈ మూర్తి ఒక స్తంభంలో కనిపిస్తాడు!   

ఈ రకమైన మూర్తి మరే ఇతర ఆలయంలోనూ కనిపించడు. 

ఏనుగు మొహంతో ఉండే వినాయకుడికి కాళ్ళు మాత్రం పులి పంజాలా ఉంటాయి.


💠 బ్రహ్మోత్సవం తమిళ మాసం చిత్తిరైలో జరుపుకుంటారు.

పంగుని మరియు ఆవణి అనే తమిళ నెలలలో 4 రోజుల పాటు సూర్యకిరణాలు శివుడు మరియు అంబాల్ గర్భగుడిలో ప్రకాశిస్తాయి.



💠 ఈ ఆలయం ఈరోడ్ జిల్లాలోని కరూర్ నుండి 25 కి.మీ మరియు ఈరోడ్ నుండి 40 కి.మీ దూరంలో ఉంది . ఈరోడు - కరూర్ రైల్వే లైన్ లో కొడుముడి రైల్వే స్టేషన్ వస్తుంది..


Rachana


©️ Santosh Kumar

పంచాంగం