6, ఆగస్టు 2021, శుక్రవారం

🙏*శ్రీ సరస్వతీ దేవి ద్వాదశనామ స్తోత్రం*..

 🎻🌹🙏*శ్రీ సరస్వతీ దేవి ద్వాదశనామ స్తోత్రం*..


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


     సరస్వతీ త్వయం దృష్టా వీణా   

     పుస్తకధారిణీ


      హంసవాహ సమాయుక్తా 

 విద్యాదాన కరీమమ


   ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతీ


     తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా


   పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా


     కౌమారీ సప్తమం ప్రోక్త మష్టమం బ్రహ్మచారిణీ


   నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ


     ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ


    బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః


      సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ


    సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ


           ఇతి సరస్వతీ ద్వాదశ నామస్తోత్రం సమాప్తమ్....🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

కర్మత్రయం, ఫలత్రయం, దోషత్రయం i

  

కర్మకాండ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాము. కర్మకాండలో కర్మత్రయం, ఫలత్రయం, దోషత్రయం i


కర్మత్రయం- మనం వాడే కరణాల దృష్ట్యా మనం చేసే కర్మలు మూడు రకాలుగా ఉంటాయి. వాటిని త్రివిధం కర్మ అంటారు. 



ఎ) కాయిక కర్మ - శరీరంతో చేసేది పూజ, ప్రదక్షిణం, నమస్కారం, తీర్థయాత్ర, యజ్ఞం 

బి) వాచిక కర్మ పైకి చేసే జపం, పారాయణం వాక్కుతో చేసేది 

సి) మానస కర్మ - మనసుతో చేసేది ధ్యానం


ఫలత్రయం - ఏ కర్మ చేసినా, దానికి ఫలం ఉంటుంది. అది దృష్టఫలం కావచ్చు. అదృష్ట ఫలం కావచ్చు. అంటే కనపడే ఫలం, కనపడని ఫలం. ఆ ఫలం పుణ్యం కావచ్చు. పాపం కావచ్చు. ఉదాహరణకు ఆకలితో ఉన్న పేదవానికి అన్నం దానం చేస్తే పుణ్యం వస్తుంది. అది దృష్టఫలంగానూ, అదృష్టఫలంగానూ కూడా వస్తుంది. ఆకలి తీరిన ఆ పేదవాని ముఖంలో కలిగిన ఆనందం, అతను నోరారా మనను దీవించటం - దృష్టఫలం. ఈ మంచి కార్యం చేసినందుకు మన ఖాతాలో కొంత పుణ్యం వచ్చి చేరుతుంది. కాని అతను తినీ తినగానే, 'దుక్కలా ఉన్నావు, పనిచేసుకు బతకలేక, ఇలా ఊరిమీద పడి తింటావెందుకు?” లాంటి దుర్భాషలాడామనుకోండి. అప్పుడు అదృష్టఫలంగా పాపం కొంత వచ్చి చేరుతుంది. అలా ప్రతి కర్మకూ పుణ్యమో, పాపమో ఏదో ఒక ఫలం తెలిసో, తెలియకో చేరుతూ ఉంటుంది. ఆ ఫలాన్ని ఫలత్రయం అన్నారు. మనకు అది అర్ధ లేదా కామ లేదా ధర్మ రూపంలో కలుగుతుంది. అంటే మనం చేసే కర్మలు ధర్మార్థకామమోక్షాలనే నాలుగు పురుషార్థాలలో మొదటి మూడింటినీ చేకూరుస్తాయి.


వివాహ శబ్దార్ధం

 వివాహ శబ్దార్ధం: హిందూ వివాహం:


శ్లో|| ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తన|


వ్రతీచ్చ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా||


శ్రీమద్రామాయణంలో జనక మహారాజు అంటారు. ఓ 


రామచంద్రా! ఈ సీత నా కుమార్తె. నీకు సహధర్మ 


చారిణిగా ఈమెను అర్పించుచున్నాను. ఈమె చేతిని 


పట్టుకొని ఈమెను స్వీకరింపుము. నీకు శుభమగు గాక!


పరస్పర తపస్సంప త్ఫలాయిత పరస్పరౌ |


ప్రపంచ మాతాపితరౌ ప్రాంచౌ జాయావతీ స్తుమః ||


పార్వతీ పరమేశ్వరులు సనాతన దంపతులు. వారి 


దాంపత్యము తపస్సంపద యొక్క ఫలితము. 


ప్రపంచానికి తల్లితండ్రులైన ఆ దంపతులకు 


నమస్కారములు.


వివాహ శబ్దార్ధం:


సంస్కృతంలో 'వహ్' అనే ధాతువుకు 'వి' అనే 


ఉపసర్గను 


'ఘఞ్' అనే ప్రత్యయాన్ని చేరిస్తే వి+వహ్+ఘఞ్ = 


వివాహః అనే పదం ఏర్పడింది. దీనికి అర్ధం విశేష 


ప్రావణం అనగా విశేషమైన (ప్రత్యేకమైన) సమర్పణం. ఈ 


పదానికి అనేక పర్యాయ పదాలున్నాయి. పరిణయం, 


ఉద్వాహం, కల్యాణం, పాణిగ్రహణం, పాణిపీడనం, 


పాణిబంభం, దారోప సంగ్రహణం, దార పరిగ్రాహం, 


దారకర్మ, దారక్రియ మొదలైనవి.


వివాహ భేదములు:


మనువు వివాహ పద్ధతులను 8గా విభజించాడు.


బ్రాహ్మోదైవ స్తధైవార్షః ప్రాజాపత్యస్తధాసురః |


గాంధర్వో రాక్షసశ్చైవ పైశాచ శ్చాష్టమోథమః ||


1. బ్రాహ్మం, 2. దైవం, 3. ఆర్షం, 4. ప్రాజాపత్యం, 5. 


అసురం, 6. గాంధర్వం, 7. రాక్షసం, 8. పైశాచం అని వివాహాలు ఎనిమిది రకాలు.


1. బ్రాహ్మం: అలంకరించిన కన్యను పండితుడు, శీలవంతుడు అయిన వరుని ఆహ్వానించి దానం చేస్తే 


బ్రాహ్మ వివాహమౌతుంది. (ఉదా: శాంతా ఋష్యశృంగుల వివాహం)


2. దైవం: యజ్ఞంలో ఋత్విక్కుగా వున్న వారికి - దక్షిణగా కన్యను ఇచ్చి వివాహం చేస్తే అది దైవ 


వివాహమౌతుంది.


3. ఆర్షం: వరుని నుండి గోవుల జంటను తీసుకొని 


కన్యను ఇవ్వటం ఆర్ష వివాహం. ఇది ఋషులలో ఎక్కువగా వుండేది గనుక ఆర్షం అయింది.


4. ప్రాజాపత్యం: వధూవరులిద్దరు కలిసి ధర్మాన్ని ఆచరించండి అని చెప్పి కన్యాదానం చేయటం 


ప్రాజాపత్యం అవుతుంది. (సీతారాములు)


5. అసురం: వరుని వద్ద డబ్బు తీసుకుని కన్యను యిస్తే అది అసుర వివాహం. (ఉదా: కైకేయీ 


దశరథులు)


6. గాంధర్వం: పరస్పరం అనురాగంతో (మంత్ర విధానం లేకుండా) చేసుకునేది గాంధర్వ వివాహం. (ఉదా: 


శకుంతలా దుష్యంతులు)


7. రాక్షసం: యుద్ధం చేసి, కన్యను అపహరించి, ఎక్కడికో తీసుకువెళ్ళి చేసుకొనే వివాహం రాక్షసం 


అంటారు. (ఉదా: మండోదరి రావణులు)


8. పైశాచం: కన్యను నిద్రావస్థలో అపహరించి చేసుకున్నది పైశాచం. వీటిలో బ్రాహ్మం శ్రేష్ఠం, ప్రాజాపత్యం 


ధర్మబద్ధం, రాక్షసం, పైశాచం నిషిద్దం.


వివాహమెందుకు?


ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. దీనికి సమాధానం ప్రతివారూ తెలుసుకోవాలి. ప్రతీ మనిషీ మూడు 


ఋణాలతో పుడతాడు.


1. ఋషిఋణం, 2. దేవఋణం, 3. పితౄణం.


ఈ ఋణాలను తీర్చడం ప్రతి వ్యక్తి యొక్క విధి. ఈ ఋణాలు తీర్చకపోతే మరల జన్మ ఎత్తవలసి వస్తంది. 


మానవజన్మకు సార్థకత జన్మరాహిత్యం. కావున ప్రతివాడు ఋణ విముక్తుడు కావాలి. దానికి ఏంటి 


మార్గం? మన పెద్దలు చెప్పారు - "బ్రహ్మచర్యేణ ఋషిభ్యః" " యజ్ఞేన దేవేభ్యః" "ప్రజయా పితృభ్యః" అని.


1. ఋషి ఋణం: బ్రహ్మచర్యం ద్వారా ఋషి ఋణం తీర్చాలి. అంటే బ్రహ్మచర్యంలో చేయవలసిన 


వేదాధ్యయనం చేయాలి. అలాగే పురాణాలు మొదలైన వాగ్మయాన్ని అధ్యయనం చేసి తరువాత తరం 


వారికి వాటిని అందించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి.


2. దేవఋణం: యజ్ఞ యాగాది క్రతువులు చేయడం, చేయించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. 


యజ్ఞం అంటే త్యాగం. యజ్ఞాలవల్ల దేవతలు తృప్తి చెందుతారు. సకాలంలో వర్షాలు కురుస్తాయి. 


పాడిపంటలు వృద్ధి చెందుతాయి. కరువు కాటకాలు తొలగిపోతాయి. నీరు, గాలి, వెలుతురు, ఆహారాన్ని 


ప్రసాదిస్తున్న వారందరికి మనమెంతో ఋణపడివున్నాం. కనుక ఆ ఋణాన్ని తీర్చకపోతే మనం 


కృతఘ్నలం అవుతాం.


3. పితౄణం: సత్సంతానాన్ని కనడం ద్వారా ఈ 


ఋణాన్ని తీర్చుకోవాలి. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, 


మనకు జన్మనిచ్చి పెంచి పోషించినవారు. వంశాన్ని 


అవిచ్చిన్నంగా కొనసాగించడం ద్వారా, పితృ దేవతలకు 


తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని 


కనడం ద్వారా పితౄణం తీర్చుకోవాలి. సంతానం 


కనాలంటే వివాహం చేసుకోవాలి గదా! "ప్రజాతంతుం 


మావ్యవత్సేత్సీః" అంటుంది వేదం. అంటే వంశపరంపరను 


త్రెంచవద్దు. వేదాధ్యయనం, యజ్ఞం చేయడం, 


సంతానము కనడం ఇవి మానవుడు తప్పని సరిగా చేయవలసిన విధులుగా వేదం చెపుతున్నది. 


యజ్ఞాలలో పంచ యజ్ఞాలు నీ విధిగా ప్రతి మనిషీ చేయాలి. అవి దేవ, మనుష్య, భూత, పితృ, బ్రహ్మ 


యజ్ఞాలు.

వెంకన్న సేవలో

 *శ్రీనివాస మంగాపురం - వెంకన్న సేవలో వెర్రి బాగులమ్మ*

శ్రీనివాసమంగాపురంలో పుట్టనుండి బయటపడిన శ్రీనివాసునికి సేవలందించడానికి మరో వకుళమాత ప్రత్యక్షమయ్యింది. ఈమె చరిత్రకెక్కని వకుళమాత ! ఆమె పేరు 'తాయారమ్మ!

ఆమె విచిత్ర గాథ ఏమిటో! వింతగాథ ఏమిటో! అవ్పటి “వకుళమాత”లాగా వివరంగా తెలియకపోయినా ఇప్పటి ఈ “తాయారమ్మ”ను గూర్చి తెలిసినంతవరకు చెప్పుకుందాం!


*వెంకన్న సేవలో వెర్రి బాగులమ్మ*

శ్రీనివాసమంగాపురంలో ఒక రోజున ఉన్నపళంగా ఒక వెర్రి బాగుల స్త్రీ ప్రత్యక్షమయింది. ఆమె ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. ఏ ఊరినుంచి వచ్చిందో తెలియదు. పిచ్చిదానిలాగా చూపులుచూస్తూ వెర్రి నవ్వు నవ్వుతూ వుందేది. చూపులు బయటికి చూస్తున్నా అంతర్లీనంగా ఎక్కడో చూస్తున్నట్లు, ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా తనలో తానే గొణిగేది. అలా గొణుక్కుంటునే వెర్రినవ్వులు నవ్వేది. గట్టిగా మాత్రం కాదు. చిరునవ్వు, నవ్వేది. పక్కన ఎవరున్నా గమనించేది కాదు. ఎవరేమన్నా పట్టించుకొనేది కాదు. 


ఆ నవ్వు మొగంతో ఆతల్లి ఆకర్షణీయంగా కనపడుతుండేది. చెరగని నవ్వుతోవున్న ఆమె శరీరం ముడతలు పడ్డా, పసుపుపచ్చని నిమ్మపండులాగా నిగనిగలాడుతూ నుదుటున గుండ్రని కుంకుమబొట్టుతో చేతులనిండా మట్టిగాజులతో పెద్దముత్తెదువులాగా, యోగినిలాగా కనబడేది. మితంగా మాట్లాడేది. మితంగా ఏదో అడిగేది. వెంటనే నవ్వేది. ఇంతే..


ఒక ఉన్మ్నాదస్థితిలో, అవధూతలాగా, యోగినిలాగా వున్న ఆమెను మాత్రం ఆ ఊరివాళ్లు ఏవేవో ప్రశ్నలు అడిగే వాళ్లు. కొందరు ఎక్కడి నుండి వచ్చావు! అని అడిగేవాళ్లు. మరి కొందరు ఏవం పేరు? మీరు బ్రాహ్మణులా? ఇలా ఎన్ని ప్రశ్నలు గుచ్చి గుచ్చి అడిగినా నవ్వడమే ఆమె జవాబు.

పాపం! బ్రాహ్మణ స్రీ అయివుండవచ్చు. ఎక్కడి నుంచి వచ్చిందో? ఎవరికెరుక అనుకునేవాళ్లు. ఆ తర్వాత ఆ తర్వాత ఆమెను పట్టించుకోవడం పూర్తిగా మానివేశారు. కాని ఆమెను ఆ ఊళ్లో అందరూ “తాయారమ్మ” అని పిలిచేవాళ్లు.


పుట్టలతో చెట్లతో నిండిన శ్రీనివాస ఆలయమే తాయారమ్మ నివాసం! ఆమె ఊళ్లోని ఇంటింటికి వెళుతుంది. రవ్వంత చమురు ఇయ్యరూ స్వామికి దీపం పెట్టాల అని అడుగుతుంది. కొందరు డబ్బులియ్యబోతే నాకెందుకూ కాసులు?కొంచం బియ్యం పప్పు పెట్టండి! అని అడిగి ఇప్పించుకుంటుంది.


కొందరు ఏమిచ్చినా తీసుకొనేది కాదు. కొంతమందిదగ్గర పదేపదే అడిగి తీసుకుంటుంది. ఇలా ఇంటింటికి వెళ్ళి పప్పు, ఉప్పు, బియ్యం, నూనె .... ఇలా వస్తువుల్ని సేకరించి గుడికి వచ్చి మూడురాళ్ల పొయ్యి పెట్టి, మట్టి కుండలో అన్నీ కలియకలిపి ఉడికేసెది. ఆ తర్వాత మట్టిమూకుట్లో నూనె పోసి వత్తి వెలిగించి గుళ్లో దీపం వెలిగిస్తుంది.

కటికచీకట్లో గాఢాంధకారంలో తాటిమట్టల్ని వెలిగించి దాని మంటల వెలుగుల్లో గుడిలోకి వెళ్ళేది. దారిలో పుట్టల్లోని పాములు చిన్నవీ పెద్దవీ 'బుస్‌' అంటూ బుసకోట్టేవి. పడగ విప్పేవి. ఇవేవీ పట్టించుకోకుండా తాయారమ్మ “ఒరే నాగా! ఒరే శేషూ! స్వామికి ఆకలేన్తుందంట! పక్కకు తప్పుకొండర్రా! జరగండర్రా” అంటూ ముద్దుగా మురిపెంగా ప్రేమగా పిలుస్తూ ఏమాత్రం జంకుగొంకు లేకుండా లోనికి వెళ్లి స్వామివారిని అందినంతవరకు తుడిచి, తెచ్చిన పూలను పాదాలపై సమర్పించేది.


తదుపరి మట్టి మూకుట్లో దీపారాధన చేసి, తానువండిన మట్టికుండ అన్నాన్ని నిండుగా అట్లాగే స్వామికి నివేదించి సమర్పించేది. అంతే ఆమె భక్తి! లోపల ఏదేదో గొణిగేది. అవి ఏం మాటలో ఏం మంత్రాలో ఎవరికీ తెలియదు. ఆమెకే తెలియాల. ఆ స్వామికే తెలియాల. అంతే!

నైవేద్యం అయినవెంటనే ఆ ప్రసాదాన్ని అక్కడ ఆ గుడి ఆవరణలోవున్న పసులకాపరులకు పంచి పెడుతుంది. మిగతా తాను ఆరగిస్తుంది. ఒక్కొక్కసారి పసులకాపరులను అడిగి ఆవుపాలను స్వామికి నివేదించి అక్కడ గుళ్లో వుండే సర్పాలకు కూడా మూకుళ్లలో పెడుతూ ఒరే నాగులూ! పాలు తాగండర్రా! మీకోసమే! అంటూ పాలుపెట్టేది ఆ తల్లి! ఆ పాములు కూడా ఒదిగి ఒదిగి ఆమె చెప్పినట్లుగానే ఆమె పెట్టిన పాలను తాగేవి.


ప్రతిరోజు 'లేవడం, ఊళ్లో బిచ్చమెత్తడం. వాటీని వండి స్వామికి సమర్పించడం!... ఇదే ఆమె నిత్యకృత్యం, రామనామం! శ్రీనివాసుని గుడే ఆమె నివాసం! పగలంతా అక్కడ గుళ్లో మేసే ఆవులు, మేకలు, బర్రెలు, గొర్రెలు .... వాటిని మేపే పసులకాపరులు... వాళ్లే ఆమెకు నేస్తాలు!

ఇక రాత్రివేళల్లో! అయితే అక్కడి పుట్టల్లోని పాములే ఆమె దోస్తులు!


ఆమెకు నిరంతరం స్వామిమీదే ధ్యాస! స్వామి ఊసే ఆమెకు ఊపిరి. మరోమాట లేదు మంతీ లేదు. ఇలా సుమారు 40 ఏండ్లు జరిగింది. ఒక రోజున తాయారమ్మ తాను నిత్యం భిక్షకు వెళ్లే ప్రతి ఇంటింటికీ వెళ్లింది. ఆ ఇంటి వాళ్లందర్నీ ఆప్యాయంగా పిలిచి చెప్పింది.

ఈ రోజుతో నాపూజలు సరి! ఇక రేపట్నించీ నేను భిక్షకు రాను. “రేపు ఒక స్వాములోరు వస్తారంట! ఆయన బాగా మంత్రాలతో పూజ చేస్తారంట!ఇప్పట్నుంచి ఈ గుడి వృద్ధిలోకి వస్తుందంట!” ఈ విషయాలన్నీ గుళ్లోని శ్రీనివాసుదే నాకు చెప్పినాడు! “ఈ రోజే నేను తిరుమల వెంకన్న దగ్గరికి వెళ్తాను. అక్కడినుండి తుంబురు కోనకు (తిరుమలకొండ మీది తీర్థం) పోయి జపం చేసుకుంటాను- అంటూ ఇంటింటి దగ్గరే కాదు. కనపడిన ప్రతి వాళ్లందరికీ చెప్పింది. పిల్లా పెద్దా, ఆడా, మగా ఇలా ఆ ఊళ్లోని అందరికీ చెప్పింది. ఆవుపాలు ఇచ్చిన పసువులకాపర్లందరికీ ఇదే మాటల్ని చెప్పింది. పోయివస్తానంటూ.


ఆమె చెప్పేమాటల్ని విన్న వాళ్లందరూ ఎదో తెలియని వెలితికి లోనయ్యారు. ఇది రోజూవున్న సణుగుడేలే! అనుకున్నారు కొందరు. గుళ్లోని స్వామికీ నమస్కరించింది! పుట్టల్లోని పాములకు నమస్కరించి వీడ్మోలు చెప్పింది. అక్కడవున్న చెట్లను, తీగలను ప్రేమగా స్పృశించి, వీడ్కోలు చెప్పి రాత్రికి రాత్రే ఎటో వెళ్లిపోయింది వెర్రిబాగులతల్లి తాయారమ్మ! కాదు కాదు పరమయోగిని, భక్తురాలు తాయారమ్మ! ఇంకెక్కడికి పోయుంటుంది? తిరుమల వెంకన్న దగ్గరికి తప్ప!


విచిత్రాతి విచిత్రం! భక్తురాలు, కర్మయోగిని తాయారమ్మ చెప్పినట్లుగానే ఆ మరునాడే కంచినుంచి " సుందరరాజ స్వామి " అనే భక్తుడు అతి ప్రయాసతో మారుమూలగా వున్న శ్రీనివాసమంగాపురాన్ని వెతుక్కుంటూ వచ్చాడు.

తిరుమల వెంకన్న చేసే విచిత్రాలు ఎన్నెన్నో! ఎవరికెరుక!


\!/ ఓం నమో వేంకటేశాయ \!/

రచన : జూలకంటి బాలసుబ్రహ్మణ్యం గారు, తిరుపతి.

ప్రచురణ : టీటీడీ

పరుల భార్యను

 6. పరుల భార్యను, తనకు దగ్గరి సంబంధంలేని స్త్రీని గౌరవనీయురాలని, సోదరి అని పిలవాలి (2-29).


7. కన్యాదానం చేసి తండ్రి వరుని నుండి ధనం తీసుకుంటే, అతనికి కన్యాదాన ఫలం దక్కదు. పైగా తన సంతానాన్ని అమ్ముకున్నవాడౌతాడు. 3-51)


8. ఇంటికి వచ్చిన అతిథుల కుల గోత్రాలను అడగటం, వాంతిచేసుకొన్న అన్నమును పెట్టటంతో సమానము ( 3-109).


9. దేవకార్యంకంటే పితృకార్యం ముఖ్యము ( 3- 203).


10. సంధ్యావందనాన్ని సరియైన సమయాలలో ఎక్కువ సేపు చెయ్యటంవల్లనే ఋషులు దీర్ఘాయుస్సు, యశస్సు, బ్రహ్మవర్చస్సు, ప్రజ్ఞలను పొందగలిగినారు. ( 4-94)


11. పరస్త్రీ వ్యామోహం ఆయుక్షీణాన్ని కల్గిస్తుంది. ( 4-134)


12. తపస్సు వల్లనే పూర్వ జన్మ స్మరణ కలుగుతుంది ( 4-148)


13. సదాచారము వల్లనే దీర్ఘాయువు, ధనము, సత్సంతానము కలుగుతాయి. (4-156)


14. శ్రద్ధగా ఇయ్యకపోతే శ్రోత్రియుని అన్నమైన తినరాదు . ( 4-225)


చేసిన దానాన్ని ఇతరులకు చెప్పకూడదు. ( 4-236)


16. ప్రణవంతో చేసే ప్రాణాయామం చాలా గొప్పది. అది ఇంద్రియ దోషాలను పోగొడుతుంది. ( 6-70)


17. జలగలు, దూడలు, తేనెటీగలు ఏవిధంగా కొద్ది కొద్దిగా ఆహారం తీసుకుంటాయో, రాజుకూడ ప్రజలను కష్టపెట్టక కొద్ది కొద్దిగా పన్ను తీసుకోవాలి ( 7-129)


18. దోపిడి, ఇళ్ళు తగుల బెట్టటం వంటి నేరాలను కఠినంగా శిక్షించాలి ( 8-345)


మేనరికం చేసుకుంటే చెల్లిలిని వివాహమాడిన పాపం వస్తుంది ( 11-171)


శ్రాద్ధ విధి

 శ్రాద్ధ విధి ( 3-122....), అశౌచవిధానము ( 5-58 .....), రాజసేవకులను పరీక్షించటం, రాజువాడే వస్తువులను పరీక్షించటం (7-219,220), రాజుకొఱకు వంటవాళ్ళు చేసిన అహారాన్ని పరీక్షించటం ( 7-217), తూనికలు - కొలతలు వంటి వాటిని తరచు పరీక్షించటం (8403), తండ్రి తాను సంపాదించిన ద్రవ్యాన్ని ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకోవటం ( 9-209), అన్నదమ్ములు తండ్రి ఆస్తి పంచుకున్నప్పుడు ముందుగా తండ్రి చేసిన అప్పులను తీర్చటం ( 9-218) - ఇవన్నీ ఈనాటికీ ఆచరిస్తున్నవే !


ఇక మనస్మృతిలో చెప్పిన ఈ క్రింది విషయాలు అందరూ తెలుసుకోవాలసినవి:


ఆచమన జలపరిమాణ ఎంత ఉండాలి.( 2-62)


నమస్కార విధానము - తన కుడిచేతితో గురువు ఎడమ పాదాన్ని తన ఎడమ చేతిలో కుడిపాదాన్ని ముట్టుకొని నమస్కరించాలి.


ఋగ్యజుస్సామ వేదములనుండి అకార ఉకార మకార రూపమైన ప్రణ మును, భూః భువః సువః అనే వ్యాహ్యతి త్రయమును బ్రహ్మ ఏర్పరచినాడు. అట్లాగే ఆమూడు వేదాలనుండీ గాయత్రీ మంత్రానికి సంబంధించిన “తత్సవితుర్వరేణియం, భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః ప చోదయాత్" అన్నపాదత్రయాన్ని ఆకర్షించాడట, కనుక ఓంకారంతో, వ్యావృతిత్రయ సహితంగా, త్రిపాది అయిన గాయత్రీ మంత్రాన్ని జపించాలని, అట్లాచేస్తే పరబ్రహ్మను పొందగలుగుతాడని మనుస్మృతి . (2-76 నుండి 82) కాని, నేడు గాయత్రీ మంత్రం 24 అక్షరాలతోనే ఉన్నది కనుక వ్యాహృతులను వదిలి వేస్తూ ఉంటారు. అది పద్ధతి కాదని మనువు !


ఓంకారమే పరబ్రహ్మము. ఆ ఓంకార జపం యజ్ఞాదులకంటె పదిరెట్లు శ్రేష్ఠం దానిని ప్రక్కవాడికి వినపడకుండాచేస్తే 100 రెట్లు శ్రేష్ఠం. మానసికంగా చేస్తే వెయ్యిరెట్లు శ్రేష్ఠం. ( 2-8385) అది తెలియక చాలా మంది ఓంకారం ఎంత గట్టిగా చెబితే అంత గొప్ప అని భావిస్తూ, సాధనచేస్తున్నారు.


కామము ఉపభోగమువలన ఉపశమిస్తుందని నేటివారి అభిప్రాయము. జాతున కామః కామనాం ఉపభోగేన శామ్యతి' అని మనువు. పైగా అది నెయ్యి పోస్తే ప్రజ్వరిల్లే అగ్నిలాగా పెరుగుతూ పోతుందే కాని తగ్గదు అని మనువు'. (2-94)

కలౌ పారాశర స్మృతిః

 కృతేతు మానవాః ప్రోక్తాః 

త్రేతాయాం గౌతమ స్మృతి:

 ద్వాపరే శంఖలిఖితా 

కలౌ పారాశర స్మృతిః


అన్నశ్లోకం అదే విషయాన్ని చెబుతోంది. కృతయుగంలో మనుస్మృతి పరమ ప్రామాణికంగా పరిగణింపబడింది. అట్లాగే త్రేతాయుగంలో గౌతమ ధర్మశాస్త్రం, ద్వాపరయుగంలో శంఖ లిఖిత స్మృతి ప్రామాణికములు. ఈ కలియుగంలో పరాశరస్మృతి ప్రామాణికంగా ఉన్నదని అర్ధము. ఈ శ్లోకము మనుస్మృతి ప్రామాణికతనే కాక, ప్రాచీనత్వాన్ని కూడా తెలుపుతున్నది. పితృశ్రద్ధాలలో మాంసభక్షణము, దేవరన్యాయమున పిల్లలను కనటం వంటివాటిని మనుస్మృతి సమర్థిస్తూండగా పరాశరస్మృతి కలియుగంలో అవి నిషిద్ధములని చెప్పింది. అట్లాగే - నామకరణము శిశువునకు 10 లేక 12వ రోజున చెయ్యవలెనని మనుస్మృతి (230) చెబుతూ ఉంటే, 11వదినంలో చెయ్యవలెనని శంఖవచనము. ఇవన్నీ, ఆచారాలు, ధర్మాలు ఎట్లా మారుతూ వచ్చాయో తెలుపుతాయి. మొత్తం మీద - ఈనాడు మనం ఆచరిస్తున్న ఆచార వ్యవహారాలన్నిటికీ మూలం ధర్మశాస్త్రాలే !


ఈనాడు మనం ఆచరిస్తున్న జాతకర్మ, ఉపనయనము, వివాహము వంటి పోడశ సంస్కారములు, శ్రాద్ధవిధి, జాతాశౌచ మృతాశౌచములు స్త్రీ ధర్మాలు వంటి సదాచారములు; అప్పు తీసుకొనటం, క్రయవిక్రయాలలో తలెత్తే వివాదాలు, స్వామి-సేవకుల మధ్య వివాదాలు, భూమి ఎల్లలు, స్త్రీ పురుష వివాదాలు, ఆస్తిపంపకం, జూదం, వ్యభిచారం వంటి అష్టాదశ వ్యవహారాలు; సకాలంలో కర్మలు చేయకపోవటం వలన కలిగే అనర్ధాలకు చేసుకోవలసిన ప్రాయశ్చిత్తాలు; అన్యాయం చేసినవారికి రాజు విధించవలసిన వివిధ శిక్షలు - వంటి ఎన్నో విషయాలు ఈ ధర్మశాస్త్ర గ్రంధాలలో వివరించబడినాయి. అంటే వేల సంవత్సరాలుగా నిలిచి ఉన్నది, తరతరాలుగా వస్తున్నది అయిన మన సంస్కృతిని నిలబెట్టినవి మన ధర్మశాస్త్ర గ్రంథాలే. అందుకే వాటిని మనం అధ్యయనం చేసి, మన సంస్కృతిని అర్థం చేసుకొని, మన జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చి దిద్దుకోవాలి. అలాంటి వాటిలో అగ్రగణ్యమైనది మనుస్మృతి. కొన్ని వేల సంవత్సరాల క్రితం అందులో చెప్పిన ఆచార వ్యవహారాలే ఈనాటికీ అమలు చేస్తున్నామంటే, అవి మనకు ఎంత ఆదరణీయమో గ్రహించవచ్చు


షోడశకర్మలు, గురు ప్రాశస్త్యము (2-192......), అతిథి పూజనం ( 3-102...),

రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగేందుకు

 30 రోజుల్లో రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగేందుకు నేను ప్రయోగించిన సిద్ద యోగం -


    గోధుమగడ్డి చూర్ణం ఒకస్పూన్ ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ లో కలిపి ఉదయం సాయంత్రం ఆహారానికి గంటన్నర ముందు తీసికొనవలెను . అదేవిధంగా ఆహారం తీసుకున్న గంటన్నర తరువాత ఉదయం మరియు సాయంత్రం ఒక ఆపిల్ పండు తినవలెను . కేవలం నెలరోజుల్లో మీ రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తం అద్బుతంగా వృద్ధి అగును. 


       కొన్ని వందలమందికి ఈ యోగం ప్రయోగించాను . చాలా అద్బుతంగా పనిచేసింది. 


 గమనిక - 


    గోదుమగడ్డి చూర్ణం మీకు పతంజలి స్టోర్స్ లో దొరుకుతుంది.


           నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది. 


      గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*రక్షణ..సంరక్షణ..*


"అయ్యా!..గర్భగుడి మంటపం చుట్టూరా గ్రిల్లు పెట్టిస్తే బాగుంటుంది..ఒక్కొక్కసారి అందరూ నేరుగా ఇక్కడకు వచ్చేస్తున్నారు.. ఇబ్బందిగా ఉంటోంది..శని ఆదివారాల్లో తాళ్ళు కడుతున్నాము..మిగిలిన రోజుల్లో నియంత్రణ లేకుండా ఉంది..ఏదో ఒక శాశ్వత ఏర్పాటు చేసుకోవాలి..మీరొక్కసారి ఆలోచన చేయండి.." అని మా సిబ్బంది నాతో చెప్పారు..నిజమే..గర్భగుడి చుట్టూరా ఎటువంటి రక్షణా లేదు..కానీ సుమారు లక్ష రూపాయల వ్యయం తో కూడుకున్న పని..సమకూర్చుకోవాలి.. సమయం పడుతుంది..ఆ మాటే వాళ్ళతో చెప్పి..తాత్కాలిక ఏర్పాటు గురించి ఆలోచన చేద్దామని అనుకున్నాము..ఇది జరిగింది 2009 వ సంవత్సరం జూన్ నెలలో ఒకరోజు..ఆరోజు గురువారం..


ఆ ప్రక్క ఆదివారం నాడు..ఎప్పటిలాగానే గర్భగుడి చుట్టూరా తాళ్లతో కట్టి..అందరూ లోపలికి రాకుండా ఏర్పాటు చేసాము..ఉదయం తొమ్మిది గంటలప్పుడు ఒక పెద్దాయన, ఆయన భార్యా..కుమారుడు..వచ్చారు..శ్రీ స్వామివారికి అర్చన చేయించుకొని..తిరిగి వెళ్లి..ముందువైపున్న మంటపం లో కూర్చుని.. వాళ్లలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ వున్నారు..నేను కానీ మా సిబ్బంది కానీ పెద్దగా పట్టించుకోలేదు..కొద్దిసేపటి తరువాత..ఆ దంపతులిద్దరూ మెల్లిగా ఒకరి ఆసరతో ఒకరు లేచి..నా దగ్గరకు వచ్చారు..


"శ్రీధరరావు గారి అబ్బాయి ఇక్కడ వున్నాడని విన్నాము..కొంచెం నాకు చూపుతారా?.."అని నన్నే అడిగాడా పెద్దాయన..నేను నవ్వి.."నేనే పెద్దాయనా..నాతో ఏదైనా పని ఉందా?.." అన్నాను..


"నువ్వేనా?..కనుక్కోలేకపోయాను..నా పేరు మాలకొండయ్య..ఈమె పేరు ఈశ్వరమ్మ..మాది ఒంగోలు దగ్గర ఓలేటి వారి పాలెం..మేము వేమూరి వాళ్ళం..(అది వాళ్ళ ఇంటిపేరు..). మీ నాయన గారు ఇక్కడ నిర్వహణ చేస్తున్నప్పుడు తరచూ వచ్చేవాళ్ళం..మీ నాన్న గారికి నేను బాగా పరిచయం..ఇప్పుడు వయసు మీద పడ్డ తరువాత, ఇక్కడకు రావడం తగ్గిపోయింది..మొదటినుంచీ ఈ స్వామిని నమ్ముకొని వున్నాము..అన్నీ సక్రమంగానే చూసాడు ఆ తండ్రి..ఉన్నంతలో నలుగురికి పెట్టే స్థితిలోనే వున్నాము.." అన్నాడు.


"నీ పేరేంది?.." అన్నాడు.."ప్రసాద్.." అన్నాను..


"మూడేళ్ల క్రిందట ఇక్కడికి వచ్చినప్పుడు..అప్పుడు నువ్వింకా ఇక్కడ బాధ్యత తీసుకోలేదులే..మీ నాయనే చూస్తూ వున్నాడు..అప్పుడు..శ్రీ స్వామివారిని ఒక కోరిక కోరుకున్నాము..ఆ కోరిక నెరవేరితే ఈ గర్భగుడి చుట్టూ వున్న మంటపానికి గ్రిల్ తయారు చేయించి పెట్టిస్తా అని అనుకున్నాను..ఆ స్వామి మమ్మల్ని చల్లగా చూసాడు..మేము అనుకున్నది నెరవేరింది..కాకుంటే..మేమే ఆలస్యం చేసాము..నువ్వు పనివాళ్లను పిలిపించి..ఎంత అవుతుందో లెక్క గట్టించి చెప్పు..ఆ డబ్బు నేనిస్తాను..గ్రిల్ తయారు చేయించి బిగిద్దాము.." అన్నాడు..


అవాక్కవడం మినహా నేనేమీ చేయలేదు..గ్రిల్ గురించి అప్పటికి పూర్తిగా నేనే నిర్ణయం తీసుకోలేదు..కానీ శ్రీ స్వామివారు మాత్రం..లోపల సమాధిలో కూర్చునే నిర్ణయం తీసేసుకున్నారు..ఇక ఆలోచించడానికి నేనెవరిని?..కేవలం వీళ్ళతో మాట్లాడటానికి ఒక సాధనాన్ని మాత్రమే..


"మీతో పాటు ఇంకెవరన్నా మీ వాళ్ళు వచ్చారా?.." అన్నాను నేను.."మా పెద్దబ్బాయి వచ్చాడు.." అని ఆ అబ్బాయిని పిలుచుకుని వచ్చాడు..వాళ్ళను కూర్చోబెట్టి.."నేను పనివాళ్లను పిలచి..లెక్క గట్టి..మీకు చెప్పడం కన్నా..ఈ మంటపం కొలతలు తీసుకొని ఒంగోలు వెళ్లి..అక్కడ ఎస్టిమేషన్ వేయించండి..మీకొక అభిప్రాయం వస్తుంది..దానిని బట్టి ఇక్కడ పనివాళ్ళతో మాట్లాడదాము.."అన్నాను..


ఈ సూచన వాళ్లకు నచ్చింది..అప్పటికప్పుడే కొలతలు తీసుకొని వెళ్లారు..మరో రెండు మూడు రోజుల్లోనే..ఒంగోలు నుండి పనివాళ్లను వెంటబెట్టుకొని వచ్చారు..వెల్డింగ్ మిషన్లు తెచ్చుకొని..మందిరం వద్దే వారం పాటు వుండి.. గ్రిల్ తయారు చేసి..బిగించి వెళ్లిపోయారు..ఇప్పటికీ ఆ మాలకొండయ్య గారు గుడికి వస్తూ వుంటారు..ఏమాత్రం భేషజం చూపించరు.. తనకు శక్తి ఉన్నంతవరకూ శ్రీ స్వామివారి సేవలో ఉంటానని వినయపూర్వకంగా చెపుతూ వుంటారు..


శ్రీ స్వామివారి వద్ద ప్రతిదీ విన్నవించుకోవలసిన అవసరం లేదని ఆరోజు నాకు తెలిసివచ్చింది.. మా అందరి ఆలోచనలు పసిగట్టి అందుకు తగ్గ ప్రణాళికలు ఆయన వద్ద సిద్ధంగా ఉంటాయి..ప్రతిసారీ ఋజువు అవుతూనే ఉంది..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

ముకుందమాల స్తోత్రమ్

 ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                    శ్లోకం : 9    

                           SLOKAM : 9

                                                

करचरणसरोजे कान्तिमन्नेत्रमीने

श्रममुषि भुजवीचिव्याकुलेऽगाधमार्गे ।

हरिसरसि विगाह्यापीय तेजोजलौघं

भवमरुपरिखिन्नः क्लेशमद्य त्यजामि ॥ ९॥


కరచరణ సరోజే కాంతి మన్నేత్రమీనే 

శ్రమ ముషి భుజవీచి వ్యాకులేగాధమార్గే I  

హరిసరసి విగాహ్యాపీయ తేజోజలౌఘం 

భవమరు పరిఖిన్న: ఖేదమద్యత్యజామి ॥ 9


    నేను ఈ సంసారము అనెడి ఎడారిలో ప్రయాణము చేసిచేసి బడలిక చెంది, నేడు ఈ హరి సరస్సును చేరితిని. 

ఆహా! ఎంత సుందరమూ ఈ సరస్సు! 

    ఆ హరి కరచరణము లే మిలమిలలాడు చేపలు.    

    భుజములే అందు కదలాడు కెరటములు. 

    అది శ్రమలనన్ని టిని హరించును. 

     ఆ రేవులు అవగాహనము (స్నానము) చేయుటకు అనుకూలముగా లోతు కలవై ఉండును. 

     అందులోకి పోయి, ఆ తేజస్సు అనెడి జలమును కడుపు నిండుగా త్రాగి, నా బడలికను తీర్చుకొనుచున్నాను.


    The desert of material existence has exhausted me. 

     But today I will cast aside all troubles by diving into the lake of Lord Hari and drinking freely of the abundant waters of His splendor. 

    The lotuses in that lake are His hands and feet, and    

    the fish are His brilliant shining eyes. 

    That lake’s water relieves all fatigue and is agitated by the waves His arms create.    

    Its current flows deep beyond fathoming.    


https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    

ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                    శ్లోకం : 10    

                           SLOKAM : 10    

                                                

सरसिजनयने सशङ्खचक्रे

मुरभिदि मा विरमस्व चित्त रन्तुम् ।  

सुखतरमपरं न जातु जाने 

हरिचरणस्मरणामृतेन तुल्यम् ॥ १०॥    


సరసిజనయనే సశంఖచక్రే 

మురభిది మా విరమస్వ చిత్త రంతుమ్ I    

సుఖతరమపరం న జాతు జానే     

హరిచరణ స్మరణామృతేన తుల్యమ్ ॥ 10    


ఓ మనస్సా! 

    శ్వేత తామరలలాంటి నయనాలు కలిగి, 

    శంఖ చక్రాలను ధరించి,     

    దివ్య మంగళ స్వరూపుడైన శ్రీ కృష్ణ భగవానుని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండు. 

    ఎప్పటికీ ఆయన స్మరణ మానవద్దు. 

    శ్రీహరి పాదపద్మాలను స్మరించడం అనే అమృతానికి సమానమైన సుఖం మరొకటి లేదు కదా!    


O mind!  

    please never stop taking pleasure in thinking of the Mura demon’s destroyer,    

   who has lotus eyes and bears the conch and disc weapon. 

    Indeed, I know of nothing else that gives such extreme pleasure as meditating on Lord Hari’s divine feet.    


https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం

    —