12, ఫిబ్రవరి 2021, శుక్రవారం

పిండోపనిషత్తు

 *-*"పిండోపనిషత్తు'**-

======+++×+++======

మనిషి ౼

మరణించిన తర్వాత కర్మ జరిగిన పిమ్మట నెలనెలా మాసికాలు పెడుతుంటారు. ఆమాసికాల రహస్యం ఇదే*!

 *మాసికాలు ఎందుకు పెట్టాలి?*

*అన్ని మాసికాలు పెట్టాలా?*

*కొన్ని మానేయవచ్చా?*


 వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు మన మహోన్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. 


*అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.*


*కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి.* 


చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.


వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు "పిండోపనిషత్తు".  ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్య, నైమిత్తిక, కామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.


బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు.


*మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు? అనే ప్రశ్నలు వేశారు.*


దానికి సమాధానంగా బ్రహ్మ దేహం,దేహి గురించి వివరాలు చెప్పాడు.


*మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి.* 


*ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది*.


*ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళ్లిపోతాడో.... పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళ్లిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞులు కూడా అంగీకరించినదే.*


*ముందుగా గాలి వెళ్లిపోతుంది. అనగా  ఊపిరి ఆగిపోతుంది. దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళ్లిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు, వెంట్రుకలు, గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహా ఆకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళ్లిపోయే విధానం.*


*నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి.* 


*కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం  మరో శరీరం వెతుక్కుంటూ వెళ్లిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది.*


*యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళ్లిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళ్లిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.*


*ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది.*


*దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళ్లిపోతుంది.*


*అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ   ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది.*


*సపిండీకరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి, ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటాడు. పితృదేవతా స్థానం పొందుతాడు అని అర్థం.*


*దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్ట శ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనాశరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు, మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.*


*వీటిలో మొదటి పిండం  ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అంటారు.*


*దీని తరువాత మాంసం, చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.*


**మూడో పిండం వలన బుద్ధి (మెదడు) కలుగుతుంది. **


*నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.*


*ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి.* 


*ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు  ఏర్పడతాయి.*


*ఆయుఃప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది.* 


*ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.*


*తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి.* 


*పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.*


*ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్ణ శరీరం పిండాల వలన కలుగుతుంది.* 


*ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.* ఇది పుత్రుడి ముఖ్య కర్తవ్యం.

 

*నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు.*


*వీటిలో 10 పిండాల గురించి  మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని "పిండోపనిషత్తు" చెప్పింది. మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.*


*అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి.*


*ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.*


*కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు.*


*ఏది వదిలితే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది.* 


*మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించిన వారమవుతాము. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.*


*మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు.* 


*తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి.*


*కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.*


ఇవి మన పురాణాలు,    ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు.....   


ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి.


*ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి.*


*ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజనం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మనకు మరింతగా సకల సంపదలు  ఇస్తారు.*


పిండాలు ప్రేతాలకు వెళ్తాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ "పిండోపనిషత్తు". 


*నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్య పదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహా సాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి.* 


అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే.... అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు. 


గయలో ఎందుకు చేయాలి? ప్రయాగలో ఎందుకు చేయాలి?  అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి. 


ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి.


 వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు.... పితృదేవతానందం వలన కలుగుతాయి.  


వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు. 


ఉదాహరణకు మాఘపౌర్ణమి చాలా మంచిది. దాన్ని మాఘపౌర్ణమి, మహామాఘి అని అంటారు. ఆ రోజున పితృదేవతలకు  ప్రయాగలో పిండప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు, సంపదలు కలుగుతాయి. ప్రయాగలో చివరిగా రాబోతున్న మహాశివరాత్రి స్నానానికి ముందు రానున్న పుణ్యదినం.  ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయినా తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.


ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు. 


మాఘమాసం పితృదేవతా అర్చనలకు మహాదివ్యమైన కాలం. *మాతృదేవోభవ*

            *పితృదేవోభవ*

_*మాఘ పురాణం*_ _*1 వ అధ్యాయము*_

 _*మాఘ పురాణం*_ _*1 వ అధ్యాయము*_


       *శుక్రవారం*

*ఫిబ్రవరి 12, 2021*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*మాఘమాస మహిమ*



☘☘☘☘☘☘☘☘



*శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |*

*ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||*

*వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |*

*పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||*

*వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |*

*నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||*


           ప్రపంచదేశములన్నిటిలోను భారతదేశము కర్మధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. అట్టి భారతదేశంలో హిమాలయాది  పర్వతములు , గంగాది నదులూ నైమిశం మొదలైన అరణ్యములూ మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైనవానికి అనేకరెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం , ఆషాడం , కార్తీకం , మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం , జపం , తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం బగణ్యమైనది అంటే యింత అని లెక్కకురానిది.


పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి *'స్వామీ ! స్నానానికీ , ధ్యానాధికమైన తపస్సుకీ ప్రశాంతమూ , పావనమూ , సిద్దిప్రదమూ అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షు లారా ! నేను నా చక్రాన్ని విసురుతాను అది యెక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపో యోగ్యమైన ప్రదేశంగా గుర్తించండీ , అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట , ఆ మహావిష్ణువు యోక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిశారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసమేర్పరచుకొన్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూవుంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులూ చూడడానికి వస్తూవుండేవారు. అలగే రోమహర్షుణుడో , ఆయన కుమారుడు సూతమహర్షియో  అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేసారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని , విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిశారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులూ లేనప్పుడు పుణ్యకథాప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పేంపొందించేవి.


ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూలలనుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో *సూతమహర్షి* వున్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసికొని వచ్చారు. తగిన ఆసనం పై కూర్చుండబెట్టి అతిధి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు. సూతమహర్షి ! మీ తండ్రిగారు రోమహర్షణులవారు పురాణప్రవచనంలో ధర్మవిషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల  సమర్థులు , రోమములకును హర్షము కలిగించువారు కనుగ రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడ ఆయన అంతటివారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయవుంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు.


సూతమహర్షి వారి ఆతిధ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద వున్న అభిమానానికి కృతజ్ఞణ్ణి , పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడ యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్నూ ఈ పుణ్యకార్యంలో యిలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి , వ్యాసమహర్షుల వారి దయా విశేషం చేత , నాకు తెలిసిన విషయాన్ని , మీ అనుగ్రహం చేత స్పురింపజేసుకొని యధాశక్తి  వినిపించి మీ ఆనందాశీస్సులనీ , భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను , మీ ఆజ్ఞయేమిటి అని సవినయంగా అడిగెను. అప్పుడు మునులు *'సూతమహర్షి లోగడ వైశాఖమాసం , కార్తీకమాసం వైశిష్ట్వాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన, వ్రతానుష్టాలని వివరించి మాకానందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని'* కోరారు.

అప్పుడు సూతమహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రిగారిని గురువులను తలచుకొని నమస్కరించి కనులు తెరచి మునులకు మరల నమస్కరించి యిలా ప్రారంభించాడు. మహర్షిసత్తములారా ! మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకొన్నవారు కొద్దిమంది అయినా , యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి యిదే  విషయాన్ని అడిగింది.  గృత్నమదమహర్షి మొదలైనవారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో బాటు చెప్పెదను వినండి.


పార్వతీదేవి పరమేశ్వరునితో *"విశ్వాత్మకా ! సర్వలోకేశ్వరా ! సర్వభూతదయానిధీ ! ప్రాణేశ్వరా ! మీ మాటలు అమృతముకంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత యింపుగానున్నవి. మాఘ మాస మహిమను వివరింప గోరుచున్నానని"* ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు *"కళ్యాణీ ! జగన్మంగళా ! నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది. గంభీరమైనది నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమియందును ? తప్పక చెప్పెదను ,  వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతఃకాలస్నానము చేసినవారు పాపవిముక్తులై ముక్తినొందుదురు. గోవుపాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వపాపములను పోగోట్టును.

రెండవస్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవస్నానం అతనికి శ్రీమహావిష్ణువే ఋణగ్రస్తుడయేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి యివ్వాలని శ్రీమహవిష్ణువే ఆలోచనలోపడును. ప్రయాగలో మాఘమాసంలో గంగాస్నానం చేసిన వానికి పునర్జన్మ వుండదు. మాఘ మాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలోగాని సరస్సులో గాని స్నానం చేసినవారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు , నూయి , కాలువ మొదలైనవానిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమా , తెలిసికాని , తెలియకకాని , బలవంతంగాకాని మాఘ మాసమున ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నియును పోవును. భక్తి భావముతో నెలాంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును.


మాఘస్నానమును మాని , విష్ణువునర్చింపక , దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లుపోవును ? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు , నీచజన్మలను పలుమార్లుపొందును. చలికి భయపడి స్నానము చేయనివారిని చూడరాదు. అట్టివారిని జూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతః కాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచజన్మలనొందుదురు సుమా , దరిద్రులైనను , బాలురైనను ప్రాతఃకాల స్నానముచేసిన శ్రీ మహావిష్ణువు దయనుపొందెదరు. చిన్నపిల్లలు , అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును.


ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను , మాఘమాస ప్రాతఃకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసినవానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకుగాని , భయముచే గాని , బలవంతముగా గాని , మాఘస్నానము చేసినవాడు పాపవిముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసినవానికి దక్షిణనిచ్చి వానినుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానముగాని కంబళదానముగాని చేసిన స్నానఫలమునొంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని , చేయించిన వారికిని పుణ్యముకల్గును. ఈ స్నానమును అన్ని వర్ణములవారును చేయవలెను. మాఘస్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను , నివారించినను మహాపాపములు కలుగును.


పార్వతీ ! మాఘస్నానము సద్యోముక్తిప్రదము దానికి సాటిలేదు. శక్తిలేనివారు కాలు చేతులను కడుగుకొని , ఆచమనముచేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము. శ్రీవారిదేవతలందరిలో ఉత్తముడు. అన్నిమాసములలో మాఘమాసము ఉత్తమము. వృక్షములలో అశ్వత్తవృక్షము ఉత్తమము. తేజోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని , నిందించినను , నివారించినను మహాపాపములు కలుగును. నాలుగువర్ణముల వారిలో బ్రాహ్మణుత్తముడు. పర్వతములలో మేరుపర్వతముత్తమము. కావున మాఘమాస స్నానమునంత పుణ్యప్రదము సుమా.


దిలీపుడను మహారాజు పెక్కుయాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడోకనాడు వేటకుపోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సునొకదానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడా మహారజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులనందెను. ఆ బ్రాహ్మణుడు *'మహారాజా ! పరమపవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండపోవుచున్నావేమి. మాఘమాసమున చేయు నదీస్నానముకాని , సరస్స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునని యెరుగువా ? యని ప్రశ్నించెను. రాజు మాఘస్నానమహిమను చెప్పుడని కోరగానతడు. రాజా నీ విప్పుడీ సరస్సున తప్పక స్నానము చేసిపొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠమహర్షివలన తెలిసికొనుమని చెప్పి తన దారిన పోయెను.*


దిలీపమహారాజు మాఘమాసస్నాన మహిమ తెలిసికొనవలయునని తమ కులగురువైన వశిష్టమహర్షి యాశ్రమమునకు వెళ్లెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాసస్నాన మహిమను తెలుపగోరెను. వశిష్టమహర్షి దిలీపుని యాశీర్వదించి యిట్లనెను. నాయనా దిలీపా ! నీకోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు యితర దినములలో చేసిన పుణ్యకార్యములకంటే ఎక్కువ పుణ్యము నిచ్చును. మాఘమాసమున ప్రాతఃకాలమునచేసిన స్నానమే సర్వపాపములను పోగోట్టి అక్షయములైన పుణ్యఫలములనిచ్చును. స్నానమే యింత అధికమైనపుణ్యము నిచ్చునో పూజ పురాణ శ్రవణాదులవలన నెంతటి ఫలముండునో యూహించుకొనుము. మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగట్టుకొని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలిసికొన యత్నింపుము. 


పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము(వానలు లేకపోవుట పంటలు పండకపోవుట మొదలైన లక్షణముగల కరువు) వింధ్య - హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీనివలన సామాన్యజనులు , ప్రభువులు , మునులు , మహర్షులు , పశువులు , పక్షులు , సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి , అట్టివారిలో భృగుమహర్షి యొకడు అతడును ఆ ప్రాంతమును విడుచుటకు యిష్టములేకున్నను కైలాస పర్వత ప్రాంతముకడకు చేరి తనకునచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించు కొనుచుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్యప్రదేశమునకు గంధర్వులు యక్షులు , కిన్నరులు మున్నగు దేవజాతులవారును వచ్చుచుండిరి అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి.


ఒకనాడు గంధర్వుడోకడు భార్యాసమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగుమహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై మనోహరమై విచిత్రమై యుండెను. వాని మొగము మాత్రము పులిమొగమై యుండును. ఇందువలన అతడుయెంత చక్కగానున్నను పులిమొగము వలన విచిత్రముగా భయంకరమై యుండును. అతడు భృగుమహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వరా ! నాకు భోగభాగ్యములన్నియునున్నవి. ఈ నా భార్యను చూసితిరికదా ! ఈమె సౌందర్యము గుణసంపద నిరుపమానములు , నేను గంధర్వుడను మానవులకంటే దివ్యశక్తులు కొన్నియున్నవి. కాని భయంకర వికారమైన ఈ పులిమొగము నాకు బాధాకరముగనున్నది. దీనిని పోగట్టు కొనుటయెట్లో తెలియరాకున్నది. ఈ వికారమువలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయయుంచి నాకీ వికారరూపము పోవునుపాయమును చెప్పుడని ప్రార్థించెను.


భృగుమహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలికలిగినది వానికి సాయపడవలయుననుకొన్నాడు. నాయనా పురాకృతకర్మము యెవనిని విడువడు. గతజన్మలో చేసిన పాపము వలన నీకీస్థితి కలిగినది. పాపము , దురదృష్టము , పేదరికమూ ఇవి మూడును జీవినిబాధించును. ఇట్టి వానిని పోగట్టుకొని శుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందు స్నానము , పవిత్రక్షేత్రములందు దేవపూజ చేసుకొనవలయును. ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము , పూజ , జపము , తపము జీవికి గల పాపమునుపోగట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాదికముచేసినచో వచ్చుఫలితము , మాఘమాసములో నదిలోగాని , సముద్రములోగాని , కాలువలోగాని , సెలయేరులోగాని యే స్వల్పజల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘస్నానమును యేప్రవాహమున చేసినను సర్వతీర్థములయందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది. ఏ జాతివారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున యిది మాఘమాస ప్రారంభముకావున నీ భార్యతో బాటు ప్రతిదినము ప్రాతఃకాలమున మాఘస్నానమును  యిష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగుమహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘస్నానమును , తీరమున యిష్టదేవతాపూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిమొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాసమహిమను కీర్తించును. కృతజ్ఞడై , మునికి భార్యతోబాటు నమస్కరించెను. అతని యాశీర్వాదమునొంది తన భార్యలో బాటు తనలోకమున కెగెను. దిలీప మహారాజా మాఘస్నాన మహిమను గమనించితివా ? మరియోక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలనిట్లు పలికెను. 


🌹🌷🌼🛕🔔🌼🌷🌹


  🙏🙏 *సేకరణ*🙏🙏

మాఘమాస

 _*మాఘమాస స్నాన సంకల్పము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


శ్లో.  శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |

      ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ||

      సర్వపాపహరం పుణ్యం స్నానం మాఘేతుయత్ కృతం |

      నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమోస్తుతే ||

       మకరస్ధేరవౌ మాఘే మాఘేవాయే శుభేక్షణే |

      ప్రయాగస్నాన మాత్రేణ ప్రయాంతి హరిమందిరం ||

      ప్రాతర్మాఘే బహిస్నానం క్రతుకోటి ఫలప్రదం |

      సర్వపాపహరం పుణ్యం సర్వపుణ్య ఫలప్రదం ||


ఓం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా శ్రీ శివశంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రథమపాదే , జంబూద్వీపే , భరత వర్షే , భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే  శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా / గంగా / గోదావర్యోః మధ్యదేశే అస్మిన్(ఆయా ప్రాంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్తి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే , ఉత్తరాయనే, శశిరఋతౌ , మాఘమాసే , ...పక్షే , ....తిధౌ  ......వాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం , శుభతిదౌ , శ్రీ మాన్ .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం , శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం క్షేమ , స్థైర్య , విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం , ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం , గంగావాలుకాభి సప్తర్షిమండల పర్యంతం కృతవారాశేః పౌండరీకాశ్వమేధాది సమస్త క్రతుఫలావాప్త్యర్థం , ఇహజన్మని జన్మాంతరేచ బాల్య యౌవ్వన కౌమారవార్ధకేషు , జాగ్రత్ స్వప్నసుషుప్త్యవస్ధాను జ్ఞానతో జ్ఞానతశ్చకామతో కామతః స్వతః ప్రేరణతయా సంభావితానాం , సర్వే షాంపాపానాం అపనోద నార్ధంచ గంగా గోదావర్యాది సమస్త పుణ్యనదీ స్నానఫల సిద్ధ్యర్ధం , కాశీప్రయాగాది సర్వపుణ్యక్షేత్ర స్నానఫలసిద్ధ్యర్థం , సర్వపాపక్షయార్ధం , ఉత్తరోత్తరాభివృద్ధ్యర్ధం మకరంగతేరవౌ మహాపవిత్ర మాఘమాస ప్రాతః స్నానం కరిష్యే.


*☘సంకల్పము చెప్పుకొనుటకు ముందు చదువవలసిన ప్రార్థనా శ్లోకము☘*


గంగాగంగేతియోబ్రూయాత్ యోజనానాంశ తైరపి

ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్ఛతి ||

పిప్పలాదాత్సముత్సన్నే కృతే లోకాభయంకరి

మృత్తికాంతే ప్రదాస్యామి ఆహారార్దం ప్రకల్పయ ||

అంబత్వద్దర్శనామ్మక్తిరజానే స్నానజంఫలం

స్వర్గారోహణ సోపాన మహాపుణ్య తరంగిణి ||

విశ్వేశం మాధవందుంఢిం దండపాణీం చ భైరవం

వందేకాశీం గుహం గంగాం భవానీం మణికర్ణికాం ||

అతితీక్షమహాకాయ కల్సాంత దహనోపమ

భైరవాయనమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి ||

త్వంరాజా సర్వతీర్థానాం త్వమేవ జగతః పితా

యాచి తోదేహిమే తీర్థం సర్వపాపాపనుత్తయే ||

యోసౌసర్వగతో విష్ణుః చిత్ స్వరూపీనిరంజనః

సేవద్రవ రూపేణ గంగాంభో నాత్రసంశయః ||

నందినీ నళినీ సీతా మాలినీ చమహాసగా

విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపధ గామినీ ||

భాగీరధీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ

ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే

స్నానకాలేపఠేత్ నిత్యం మహా పాతక నాశనం ||

సమస్త జగదాధార శంఖచక్ర గదాధర

దేవదేహిమమానుజ్ఞాం తవ తీర్థ నిషేవణే ||

నమస్తే విశ్వగుప్తాయ నమో విష్ణుమపాంసతే

నమోజలధిరూపాయ నదీనాంపతయే నమః ||


స్నానం తరువాత ప్రార్థనాశ్లోకాలను చదువుతూ , ప్రవాహానికి యెదురుగా , వాలుగా తీరానికి పరాజ్ముఖముగా కుడిచేతి బొటనవ్రేలుతో నీటిని కదిలించి 3 దోసిళ్ల నీళ్లు తీరానికి జల్లి , తీరానికి చేరి కట్టుబట్టలను పిండుకోవాలి , తరువాత మడి / పొడి బట్టలను కట్టుకొని తమ సాంప్రదాయానుసారం విభూతి వగైరాలని ధరించి సంధ్యావందనం చేసుకోవాలి. తరువాత నదీతీరాన / దేవాలయాన దైవమును అర్చించాలి.


*☘దానమంత్రం☘*


ఏవం గుణవిశేషణ విశిష్టాయాంశుభతిథౌ అహం .....గోత్ర, .....నామధేయ ఓం ఇదం వస్తుఫలం(దానంయిచ్చే వస్తువుని పట్టుకొని) అముకం సర్వ పాపక్సయార్థం , శుభఫలావాప్త్యర్థం అముక ......గోత్రస్య(దానం పుచ్చుకొనేవారి గోత్రం చెప్పాలి) ప్రాచ్యం / నవీనందదామి అనేన భగవాన్ సుప్రీతః సుప్రసన్నః భవతు దాత దానము నిచ్చి అతని చేతిలో నీటిని వదలవలెను.


*☘దాన పరిగ్రహణ మంత్రం☘*


ఓం ఇదం , ఏతద్ ఓమితిచిత్తనిరోధస్స్యాత్ ఏతదితి కర్మణి ఇదమితి కృత్యమిత్యర్ధాత్ అముకం ......గోత్ర , ....నామధేయః దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దుష్ఫలవినాశార్ధం ఇదం అముకం దానం ఇదమితి దృష్ట్యాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయః పరిహృహ్ణామి స్వీగృహ్ణామి దానమును తీసికొనవలయును.


*☘పురాణ ప్రారంభమున వైష్ణవులు చదువదగిన ప్రార్థనా శ్లోకములు☘*


శ్లో. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం

     విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే ||

     యత్ర యోగీశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః

     తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిః మతిర్మమ ||

     లాభస్తేషాం జయస్తేషాంకుత స్తేషాంపరాభవః

     యేషా విందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ||

     అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ

     ఆ కర్ణపూర్ణ ధన్వానౌ రక్షతాం రామలక్షణౌ ||

     సన్నద్ధః కవచీఖడ్గీ చాపబాణధరోయువా

     గచ్ఛన్ మమాగ్రతో నిత్యం రామః పాతుసలక్ష్మణః ||

శ్లో. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశమ్

     విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్ ||

     లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యాన గమ్యమ్

     వందే విష్ణుం భవ భయ హరం సర్వ లోకైక నాథమ్ ||

శ్లో. ఉల్లాస పల్లవితపాలిత స్పతలోకం నిర్వాహకోరకిత నేమకటాక్షలీలాం

     శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః ||


*☘పురాణము ముగించునప్పుడు చదువదగిన ప్రార్థనా శ్లోకములు☘*


శ్లో. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్

     అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్ ||

     వందేలక్ష్మీం పరశివమయీం శుద్దజాంబూనదాభాం

     తేజోరూపాం కనకవసనాం స్వర్ణ భూషోజ్జ్వలాంగీం ||

     బీజాపూరం కనక కలశం హేమపద్మం దధానాం

     ఆద్యాంశక్తీం సకలజననీం విష్ణువామాంకసంస్థాం ||

     కుంకుమాంకితవర్ణాయ కుందేందు ధవళాయచ

     విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయతే నమః ||

శ్లో. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయాంతాం న్యాయ్యేన మార్గేణ మహీంమహీశాః

     గోబ్రహ్మణేభ్యః శుభమస్తు నిత్యంలోకా స్సమస్తాస్సుఖినోభవంతు ||

శ్లో. కాలేవర్షతు పర్జన్యః పృధివీసస్యశాలినీ

     దేశోయంక్షోభరహితో బ్రహ్మణాస్సంతు రాజాభవతు ధార్మిక ||

శ్లో. సర్వేద సుఖినస్సంతు సర్వేసంతునిరామయాః

     సర్వేభద్రాణి పశ్యంతు నకశ్చిత్ పాపమాప్నుయాత్ ||

శ్లో. అపుత్రాః పుత్రిణస్సంతు పౌత్రిణః

     అధనస్సధనాస్సంతు జీవంతు శరదాంశతం ||


*☘పురాణ ప్రారంభమున శివ సాంప్రదాయము వారు చదవవలసిన ప్రార్థనా శ్లోకములు☘*


శ్లో. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

     అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే ||


శ్లో. వందే శంభు ముపాపతీం సురుగురం వందే జగత్కారణం

     వందే పన్నగ భూషణం శశిధరం వందే పశూనాంపతిం ||

     వందే సూర్యశశంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం

     వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం ||


శ్లో. తప్త స్వర్ణవిభా శశాంకమకుటా రత్నప్రభాభాసురా

     నానావస్త్ర విరాజితా త్రిణయనాభూమీరమాభ్యాం యుతా ||

     దర్వీహాటక భాజనం చదధతీరమ్యోచ్చపీనస్తనీ

     నృత్యంతం శివ మాకలయ్య ముదితాధ్యేయానాపూర్ణేశ్వరీ ||


శ్లో. భవానీ శంకరానందే శ్రద్దా విశ్వాసరూపిణి

     యాభ్యాంవినాన పశ్యంతి సిద్ధాః స్వాంతస్థమీశ్వరం ||

     ఉక్షం విష్ణుమయం విషాణకులిశంక రుద్ర స్వరూపంముఖం

     ఋగ్వేదాది చతుష్ట్యంపద యుతం సూర్యేందు నేత్ర ద్వయం ||

     నానాభూషణ భూషితం సురనుతం వేదాంత వేద్యంపురం

     అండం తీర్థమయం సుధర్మ హృదయం శ్రీనందికేశంభజే ||


*☘పురాణం ముగించునపుడు చదవదగిన ప్రార్థనా శ్లోకములు☘*


శ్లో. సాంబోనః కులదైవతం పశుపతే సాంబత్వదీయా వయం

     సాంబం స్తామిసురాసురోగగణాః సాంబేన సంతారితాః ||

     సాంబాయాస్తు నమో మయావిరచితం సాంబాత్ పరంనోభజే

     సాంబస్యామ చరోస్మ్యహం మమరతిహ్ సాంబే పరబ్రహ్మణి ||


శ్లో. ఓంకార పంజరశుకీం ఉపనిషదుద్యావకేళి కలకంఠీం

     ఆగమవిపిన మయారీం ఆర్యామంతర్వి భావయే గౌరీం ||

     సాంబాయాస్తు నమో మయావిరచితం సాంబాత్ పరంనోభజే

     సాంభస్యామ చరోస్మ్యహం మమరతిః సాంబే పరబ్రహ్మణి ||


శ్లో. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక

     మహాదేవస్య సేవార్థమనుజ్ఞాం దేహిమే ప్రభో ||

     వేదపాదం విశాలాక్షం తీక్ష్ణ శృంగంమహోన్నతం

     ఘంటాంగళే ధారయంతాం స్వర్ణరత్న విభూషితం

     సాక్షాద్ధర్మ తనుందేవం శివవాహం వృషంభజే ||


శ్లో. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీంమహీశాః

     గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నితంలోకా స్స్మస్తాస్సుఖినోభవంతు ||


🌹🌷🕉️🛕🔔🕉️🌷🌹

మాఘపురాణం

 _*మాఘపురాణం లోని 30 అధ్యాయములు*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


1. మాఘ మాస మహిమ


2. శివుడు పార్వతికి  మాఘమాస మహిమలు చెప్పుట


3. గురు పుత్రికా కథ


4. సుమిత్రుని కథ


5. కుక్కకు మిముక్తి

కలుగుట


6. కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వ కథ


7. లోభికి కలిగిన మాఘమాస స్నాన ఫలము


8. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట


9. గంగా జలం మహిమ


10. ఋక్ష కయను బ్రాహ్మణ కన్య వృతాంతము


11. భీముని ఏకాదశి వ్రతము


12. శుద్ర దంపతుల కథ


13. సుశీలుని కథ


14. విపుని పుత్రప్రాప్తి


15. జ్ఞాన శర్మ కథ - (మాఘ పూర్ణిమ)


16. విద్యాధర పుత్రిక కథ


17. ఇంద్రునికి కలిగిన శాపము


18. ఇంద్రునికి శాపవిముక్తి


19. మునుల వాగ్వాదము


20. శివ బ్రహ్మల వివాదము


21. శివ స్తుతి


22. క్షీరసాగర మధనము


23. నారదుని దౌత్యము - దేవతల దైన్యము


24. శ్రీమన్నారాయణుని అనుగ్రహము - తులసి మహాత్త్యము


25. కళింగ కిరాతుడు - మిత్రుల కథ


26. పుణ్యక్షేత్రాలలో నదిస్నానము


27. సులక్షణ మహారాజు కథ


28. క్రూర (రా) కథ


29. మృగశృంగుని కథ


30. మార్కండేయుని వృత్తాంతము


🌹🌷🙏🛕🙏🛕🌷🌹

నీతి కథ

 *నీతి కథ*  


🌺తన చివరి శ్వాసను విడుస్తున్న , జటాయువు నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అని అనుకుంటారు.


రావణుడు జటాయువు రెండు రెక్కలను తెంచినప్పుడు. అప్పుడు  మృత్యువు వచ్చింది. అపుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు. 


"జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరుకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం  "ప్రభు శ్రీరాముడి" కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు! మరణం జటాయువును తాకలేకపోతోంది, అది నిలబడి   వణుకుతూనే ఉంది. మరణం అప్పటివరకు కదలకుండా నిల్చునే వుంది, వణుకుతూనే ఉంది. తాను  కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది.


కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు  ఆరు నెలలు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళలో కన్నీళ్ళు. ఏడుస్తూవున్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను  చిరునవ్వు నవ్వుతున్నారు!


ఈ దృశ్యం చాలా అలౌకికమైనది.


రామాయణంలో జటాయువు శ్రీరాముడి  ఒడిలో పడుకున్నాడు. ప్రభు "శ్రీరామ్" ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు.


అక్కడ మహాభారతంలో, 


భీష్మ పితామహుడు  ఏడుస్తున్నాడు మరియు "శ్రీ కృష్ణుడు" చిరునవ్వు నవ్వుతున్నాడు. తేడా ఉందా లేదా?


అదే సమయంలో , జటాయువుకు ప్రభువు "శ్రీరాముడి" ఒడి పాన్పుగా  అయింది. కాని భీష్మపితామహుడు  చనిపోయేటప్పుడు బాణం పాన్పుగా అయింది!


జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు "శ్రీరాముడి" యొక్క ఒడిలో ప్రాణ త్యాగం చేసాడు.  జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు. మరియు బాణాలపై భీష్మపితామహుడు  ఏడుస్తున్నాడు. 


ఇంత తేడా ఎందుకు? 


ఇంతటి తేడా ఏమిటంటే, 


ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో  పరువు తీస్తున్నా భీష్మ పితామహుడు  చూశాడు. అడ్డుకోలేకపోయాడు!

దుశ్శాసనునికి  ధైర్యం ఇచ్చారు. దుర్యోధనుడికి అవకాశం ఇచ్చాడు. కాని ద్రౌపది ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ, అరుస్తూ,అరుస్తూ వున్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే వున్నాడు. ద్రౌపదిని రక్షించలేదు.


దీని ఫలితం ఏమిటంటే, మరణం కోరుకున్నప్పుడే  వరం వచ్చిన తరువాత కూడా, బాణాల అంపశయ్య దొరికింది.


జటాయువు స్త్రీని సన్మానించాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, కాబట్టి చనిపోతున్నప్పుడు, అతనికి ప్రభు “శ్రీరాముడి” ఒడి అనే పాన్పు లభించింది!


ఇతరులుకు తప్పు జరిగిందని చూసి  కూడా ఎవరు కళ్ళు తిప్పు కుంటారో,  వారి గతి భీష్ముడిలా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ, ఇతరుల కోసం పోరాడుతారో వారు, మహాత్మ జటాయువులా కీర్తి సంపాదిస్తారు.


 *"నిజం అనేది  కలత చెందుతుంది, కానీ ఓడిపోదు."* 


" *సత్యమేవ జయతే "*

మొగలిచెర్ల

 *మూడు నిద్రల మహిమ..*


"చాలా దూరం నుంచి వస్తున్నాము..మాలకొండలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని, అమ్మవారిని దర్శించుకున్నాము..తిరిగి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాము..కార్లో మాలకొండ ఘాట్ రోడ్డు లో క్రిందకు వస్తుంటే..ఈ క్షేత్రం దర్శించమని రోడ్డు ప్రక్కగా పెట్టివున్న బోర్డ్ చూసాము..అక్కడినుంచి పదకొండు కిలోమీటర్లే కదా..అని చూద్దామని ఇక్కడకు వచ్చాము..స్వామివారి సమాధిని చూడొచ్చు కానీ దగ్గరకు వెళ్ళనివ్వరు అని మీ పూజారి గారు చెప్పారు..ఇంకొక గంటకు పల్లకీసేవ కూడా ఉంటుందని అన్నారు..మేము ఈరోజు రాత్రికి ఇక్కడ ఉండేవిధంగా అనుకోని రాలేదు..మాలకొండ నుంచే వెనక్కి వెళ్లిపోవాలని మా ఆలోచన..మేము ఉండటానికి ఒక రూమ్ ఏమైనా ఇప్పించగలరా?..రేపుదయాన్నే ఖాళీ చేసి మా ఊరు వెళ్లిపోతాము..ప్లీస్ అండీ.." అంటూ ఆ అమ్మాయి ప్రాధేయపడింది..ఆ అమ్మాయి భర్త మాత్రం ప్రక్కనే మౌనంగా వున్నాడు..


"మీరెంత బ్రతిమిలాడినా రూములు మాత్రం ఖాళీ లేవు..ఆ విషయం లో నేనేమీ చేయలేను..దాదాపుగా అన్ని రూములూ బుక్ చేసుకున్న వాళ్ళు వచ్చేసారని అనుకుంటున్నాను..ఎవరైనా రాకుండా వుండి..తాము రావటం లేదని మాకు కాల్ చేస్తే..ఆ రూమ్ మీకు కేటాయిస్తాను.." అని నేను జవాబు చెప్పేలోపలే.."అయ్యా..విజయవాడ నుంచి మురళీధర్ గారు రావడం లేదని ఫోన్ చేశారు.." అని మా సిబ్బంది నాతో అన్నారు.."అమ్మా..కేవలం మీ అదృష్టం..ఆ రూమ్ మీరు తీసుకోండి.." అన్నాను..ఆ అమ్మాయి ముఖం సంతోషం తో వెలిగిపోయింది.."థాంక్స్ అంకుల్.." అని చెప్పింది..


ఆరోజు సాయంత్రం పల్లకీసేవ లో ఆ ఇద్దరు కూడా పాల్గొన్నారు..ఆ అమ్మాయికి మన హిందూ ఆచారాల మీద కొద్దిగా నైనా అవగాహన వున్నది కానీ..ఆ అమ్మాయి భర్తకు మాత్రం బొత్తిగా లేదు..ఆచమనానికి..తీర్ధానికీ..తేడా తెలియని వాడు..పల్లకీసేవ పూర్తి అయిన తరువాత..ఆ దంపతులు ఇద్దరూ నా వద్దకు వచ్చారు.."చాలా బాగా జరిగింది అంకుల్..మేము సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు గా పనిచేసేవాళ్ళము..రెండేళ్ల క్రితం మేమే ఒక కంపెనీ పెట్టుకున్నాము..పర్వాలేదు..బాగానే నడుస్తోంది..గత ఐదారు నెలలుగా సరైన కాంట్రాక్టులు రావడం లేదు..మా వద్ద ఓ ముప్పై మంది పనిచేస్తున్నారు..ఇంతవరకూ ఎవ్వరికీ జీతాలు ఇవ్వకుండా ఆపలేదు..కానీ ఇప్పుడున్న పరిస్థితే ఇంకా కొన్నాళ్ళు కొనసాగితే..కొంతమంది సిబ్బందిని తొలగించాల్సి వస్తుంది..ప్రధానంగా రెండు కాంట్రాక్టుల కోసం మేము ఆరాటపడుతున్నాము..అవి మాకు వస్తే..మరో మూడేళ్లు మేము తిరిగి చూసుకోకుండా కంపెనీ నడపొచ్చు..మరో పది రోజులే గడువు ఉన్నది..ఈరోజు మాలకొండ లో కూడా మొక్కుకున్నాము..ఏదో బలమైన శక్తి ఇక్కడకు లాగినట్టుగా..వెనక్కు వెళ్లాలని అనుకున్న మేము..ఈ క్షేత్రానికి వచ్చాము..ఇక్కడ పల్లకీసేవ లో పాల్గొన్నాము..మాకు మంచి జరుగుతుందని అనిపిస్తున్నది.." అని చెప్పింది.."నాకు కూడా చాలా బాగా అనిపించిందండీ.." అని ఆ అమ్మాయి భర్త చెప్పాడు..


ఆదివారం ఉదయం ప్రభాతసేవ పూర్తి కాగానే..ఆ దంపతులు ఒక ఫైల్ చేతిలో పట్టుకొని మందిరం లోకి వచ్చారు.."మెమనుకుంటున్న కాంట్రాక్టు తాలూకు ఫైల్ ఇది..స్వామివారి సమాధి వద్దకు వెళ్ళినప్పుడు..ఆ సమాధికి ఈ ఫైల్ తాకిస్తాము..మేలు జరుగుతుందేమో అని ఒక ఆశగా ఉంది అంకుల్.." అన్నది ఆ అమ్మాయి.."అలాగే నమ్మా.." అన్నాను..మరి కొద్దిసేపటి లోనే..ఆ దంపతులు స్వామివారి సమాధి దర్శనం చేసుకొని ఇవతలికి వచ్చారు..స్వామివారి ఉత్సవ మూర్తి వద్ద అర్చన చేయించుకొని..మంటపం లోకి వెళ్లి.. చాలాసేపు ఇద్దరూ తమలో తామే ఏదో చర్చించుకుని..నా వద్దకు వచ్చి.."అంకుల్..మేము ఈరోజు, రేపు కూడా ఇక్కడే ఉంటాము..ఎల్లుండి ఉదయం  స్వామివారి సమాధి దర్శించుకొని మా ఊరు వెళ్లిపోతాము.." అన్నారు.."హఠాత్తుగా ఎందుకు అలా అనిపించింది.."? అన్నాను.."ఏమో అంకుల్..ఇతనే ఆ విధంగా పట్టు పట్టాడు..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి రాగానే..తనకెందుకో ఇక్కడ మూడు నిద్రలు చేయాలని అనిపించిందట..నాతో చెప్పాడు..నిజానికి చాలా పనులున్నాయి..కానీ ఇతను మాత్రం ఇక్కడ వుండిపోదాము అంటున్నాడు..సరే అన్నాను.." అన్నది..అతని వైపు చూసాను.."అవునండీ..ఇంకో రెండు రోజులు ఉంటాము.." అని ముక్త సరిగా సమాధానం చెప్పాడు.."మీ ఇష్టం.." అన్నాను..


అనుకున్న విధంగానే మరో రెండురోజులూ వున్నారు..మొత్తం మూడు రాత్రులు స్వామివారి మంటపం లోనే నిద్ర చేశారు..మంగళవారం నాటి ఉదయం పది గంటల వేళ..మరొక్కసారి స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని..నాతో వెళ్లిస్తామని చెప్పి..వెళ్లిపోయారు..పదిహేను రోజుల తరువాత.."ప్రసాద్ గారూ..నేను ఉపేంద్ర ను మాట్లాడుతున్నాను..రెండువారాల క్రితం మొగిలిచెర్ల క్షేత్రం లో మూడు రాత్రులు నిద్రచేసిన దంపతులము..గుర్తు ఉన్నదా..రేపుదయం అక్కడికి వస్తున్నాము.." అని ఫోన్ చేసాడు..వెంటనే గుర్తుకొచ్చారు..ప్రక్కరోజు ఉదయం తొమ్మిది గంటలకల్లా ఆ దంపతులు కార్లో వచ్చారు..నేరుగా నా వద్దకు వచ్చి.."మేమనుకున్న కాంట్రాక్ట్ మాకే వచ్చింది..రెండోది కూడా దాదాపుగా మాకే ఖరారు అయ్యింది..స్వామివారు మామీద దయ చూపారు..మా మూడు నిద్రలు వృధా పోలేదు.." అని గబ గబా అతను చెప్పాడు.."స్వామివారిని దర్శించుకొని వస్తాము.." అని అడిగారు..లోపలికి వెళ్లి స్వామివారి సమాధిని దర్శించుకొని ఇవతలికి వచ్చి.."శని ఆదివారాల్లో ఇక్కడకు ఎక్కువమంది వస్తుంటారు కదా..మేమూ కళ్లారా చూసాము..ఒక వారానికి అయ్యే అన్నదానము ఖర్చు ఎంతో చెపితే ఇచ్చేస్తాము.." అన్నారు..


మొగిలిచెర్ల లో సిద్ధిపొందిన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి గురించి ఏమాత్రం అవగాహన లేని ఆ దంపతులిద్దరూ..ఇక్కడకు రావడమేమిటి?..మూడు నిద్రలు చేయడమేమిటి?..తమ కోర్కె నెరవేరిందని సంతోషపడటమేమిటి..? శ్రీ స్వామివారి అవ్యాజ కరుణకు ఆ దంపతులు నోచుకోవడమేమిటి..? అంతా ఒక మాయలాగా అనిపిస్తుంది మేము ఆలోచించుకుంటే..


వీటన్నిటికీ సమాధానం ఒక్కటే..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

శుభోదయమ్

 🌸 *!!సుభాషితమ్!!* 🌸

🙏 *!! శుభోదయమ్!!*🙏

శ్లో|| న తద్ బలం యన్మృదునా విరుధ్యతే

సూక్ష్మో ధర్మస్తరసా సేవితవ్యః

ప్రధ్వంసినీ క్రూరసమాహితా శ్రీ

ర్మృదుప్రౌఢాగచ్ఛతి పుత్రపౌత్రాన్.!!


*విదురనీతి*


తా|| మృదుస్వభాము గలవారితో విరోధము పెట్టుకొన్నచో ఆది బలము కాదు. సూక్ష్మమైన ధర్మమును త్వరితముగా సేవింపవలెను. క్రూరత్వము చేత ఆర్జింపబడిన సంపద త్వరలోనే నశించుచున్నది. మృదుత్వముతో ప్రౌఢత్వముతో ఆర్జింప బడిన సంపద పుత్ర పౌత్రాదుల వఱకును సంక్రమించును....... 

🙏✨💖🌷

మాఘమాసం ప్రారంభము

 *చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం ప్రారంభము అవుతోంది.* 


కార్తీక మాసం లో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత....అంత ప్రాధాన్యత!


ఈ మాసం అంతా తెల్లవారుఝామునే లేచి స్నానం ఆచరించటం ప్రధానం. ఆ తరువాత సూర్య భగవానుడికి పూజ విశేషం.


దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషణాయచ

ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం "


అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ, నదులలోగాని, చెరువులలో గాని ,బావులవద్దగాని, స్నానం చెయ్యడం విశేషం.


పైన చెప్పిన ప్రదేశాలలో కుదరకపోతే ,కనీసం ఇంట్లో స్నానం చేస్తునప్పుడు, గంగ,గోదావరి, కావేరి వంటి పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం ఆచరించవలెను.


స్నానాంతరం ఏదైనా ఆలయానికి వెళ్ళడం మంచిది.


ఈ మాసంలో శివాలయంలో నువ్వులనూనెతో దీపాలను వెలిగించవలెను. 

ఈ మాసంలోని ఆదివారాలు సూర్య ఆరాధనకు ఎంతో ఉత్కృష్టమైనవి. 

అసలు మాఘ మాసం లో ప్రతి వారు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి.

ఉపనయనం అయిన వారు మంత్రంతో అర్ఘ్యం ఇస్తారు.


అలాకాని పక్షంలో ప్రతి ఒక్కరు ప్రొద్దున్నే సూర్యోదయ సమయంలో, శుచిగా , సూర్యుడి నామాలు చెబుతూ అర్ఘ్యం ఇచ్చుకోవాలి. 


కనీసం ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యుడిని ఆదిత్య హృదయంతో స్తుతించడం వల్ల, అన్ని అనారోగ్యాలు నశించి, ఆయురారోగ్యాలను కలుగ చేస్తాడు సూర్య భగవానుడు. ఇది శాస్త్ర వచనం.

అలాగే ఈ మాసంలో రథ సప్తమితో పాటు చాలా విశేషమైన రోజులు ఉన్నాయి...శ్రీ పంచమి, వరచతుర్డశి , వరుణ షష్టి, భీష్మ అష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పూర్ణిమ.

మన మహర్షులు- 18

 మన మహర్షులు- 18


గర్గ మహర్షి 


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


గర్గుడు బ్రహ్మమానస పుత్రుడు.

గర్గ మహర్షికి స్వయంగా శివుడే గురువు. ఆయన దగ్గర వేలకు వేలు శిష్యులు వేదాలు, శాస్త్రాలు నేర్చుకునే వాళ్ళు,


 హైహయవంశం వాళ్ళు, యాదవులు ఇంకా ఎంతోమంది రాజులు గర్గుడిని కులగురువుగా పెట్టుకున్నారు


ఒకసారి గర్గుడు శిష్యుల్ని తీసుకుని దేవకీ వసుదేవుల కోరిక ప్రకారం వ్రేపల్లె వచ్చాడు. యశోద కృష్ణుడికి పాలిస్తూ ఒక బంగారు ఆసనం మీద కూర్చుంది. శిష్యులతో సహా వచ్చిన గర్గ మహర్షిని చూసి యశోద సత్కారం చేసి కూర్చోమని చెప్పి మహర్షీ ! మీరెవరో గొప్ప తేజస్సుతో మనిషిరూపంలో ఉన్న విష్ణుమూర్తిలా ఉన్నారు. మీ పేరు చెప్తారా? అని అడిగి "స్వామీ! ఈ చిన్ని కృష్ణుణ్ని దీవించండి" అంది యశోద


గర్గుడు యశోదానందుల్ని చూసి తల్లీ ! నేను గర్గ మహర్షిని, మీకిద్దరికి ఏకాంతంలో నేను వచ్చిన పని చెప్తాను అన్నాడు


గర్గుడికి సాష్టాంగ నమస్కారం చేసి చెప్పండి అని రహస్య మందిరానికి తీసికెళ్ళారు యశోదానందులు, 


గర్గ మహర్షి వాళ్ళతో కృష్ణుణ్ణి గురించి ఇలా చెప్పాడు. ...


మీ యింట్లో ఉన్న ఈ చిన్నవాడు దేవకీ వసుదేవుల కొడుకు. రోహిణికి పుట్టినవాడు ఇతనికి అన్న అవుతాడు. కంసుడు చంపేస్తాడనే భయంతో మీకు పుట్టిన కూతుర్ని తీసికొని ఈ పిల్లవాడిని ఇక్కడ ఉంచారు. ఈ పిల్లవాడు సాక్షాత్తూ నారాయణుడే! దుష్టుల్ని శిక్షించడానికి, శిష్టుల్ని రక్షించడానికి మనిషి రూపంలో పుట్టాడు నారాయణుడు

రాధేశ్వరడు, భార్గవీకాంతుడు, నలినాక్షుడు, నరనారాయణులు, కపిలుడు మొదలైన

వారు విష్ణుమూర్తి అంశతో పుట్టినవాళ్ళే. అంతమంది కలిసి ఒకటిగా ఈ పిల్లవాడు పుట్టాడు .


ఇతడు పుట్టగానే నిజస్వరూపం దేవకీ వసుదేవులకి చూపించాడు. ఇతడు ప్రతియుగంలోనూ పేరు రంగు మార్పులతో పుడతాడు, కృతయుగంలో తెల్లగాను త్రేతాయుగంలో ఎర్రగాను, ద్వాపరయుగంలో పీతవర్ణంతోను ఇపుడు కృష్ణవర్ణంతో కృష్ణుడు అని పిలవబడతాడు అని చెప్పాడు గర్గ మహర్షి -


ఈ కృష్ణ అనే పేరులో ఎంత గొప్పతనం ఉందో చెప్తాను వినండని గర్గ మహర్షి యశోదానందులకిలా చెప్పాడు. కకారం బ్రహ్మవాచకం, ఋకారం అనంతవాచకం, షకారం

శంకరవాచకం, ణకారం ధర్మవాచకం, అకారం విష్ణువాచకం, విసర్గం నరనారాయణ వాచకం, కృష్ణ నామం స్వరశక్తిమయం. ఈ పేరు పలకడం వల్ల మోక్షం కలుగుతుంది అని చెప్పాడు


కృష్ణుడికి ఇంకా ఎన్ని పేర్లున్నాయో చెప్పాడు గర్గ మహర్షి, శ్రీకృష్ణుడు, పీతాంబరుడు కంసధ్వంసి, విష్ణరశ్రవుడు, దేవకీనందనుడు, శ్రీమంతుడు, యశోదానందనుడు, హరి సనాతనుడు, అచ్యుతుడు, విష్ణుడు, సర్వేశ్వరుడు, సర్వరూపధరుడు, సర్వాధారుడు, సర్వగతి, సర్వకారణకారుడు, పరిపూర్ణతముడు, పరబ్రహ్మ, గోవిందుడు, గరుడధ్వజుడు రాధాబంధుడు, రాధికాంతరాత్మ, రాధికాజీవనుడు మొదలయినవి. ఈ పేర్లు వేదాల్లో కూడ ఉన్నాయనీ, ఈ పేర్లు పలకడం వల్ల పాపాలన్నీ పోతాయని చెప్పాడు గర్గ మహర్షి


 ఈ పిల్లవాడి అన్న పేరు బలరాముడు. రాధాకృష్ణులు గోలోకంలో ఉన్న శ్రీదామ రాధికలే! అని కృష్ణుడు చెయ్యబోయే అన్నీ పనుల గురించి విపులంగా చెప్పి జాతకర్మ నామకర్మ, అన్నప్రాశన అన్ని చేయించాడు గర్గ మహర్షి.


 ఆ తర్వాత కొంతకాలానికి గర్గ మహర్షి బలరామకృష్ణులకి ఉపనయనం చేసి సాందీపని మహర్షి దగ్గరకు వాళ్ళని శిష్యులుగా పంపించాడు.


హైహయవంశం వాడయిన కార్తవీర్యార్జునుడికి గొప్ప వైరాగ్యం వచ్చి రాజ్యం వదిలేసి తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోతానన్నాడు. 

అతని కులగురువు గర్గుడు ఎంత చెప్పినా వినలేదు. అయితే నువ్వు దత్తాత్రేయుడి గురించి తపస్సు చెయ్యి అన్నాడు గర్గుడు.


 కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడి కోసం తపస్సు చేసి వరం పొంది ఆ గర్వంతో జమదగ్ని మహర్షి హోమధేనువుని తెచ్చేసుకున్నాడు.


 ఆ మహర్షిని హింస పెట్టవద్దని గర్గుడు ఎంత చెప్పినా వినలేదు కార్తవీర్యార్జునుడు.ఆ తర్వాత పరశురాముడి చేతిలో మరణించాడు.


ఒకసారి గర్గ మహర్షిని యాదవులు అవమానించారు. గర్గుడికి కోపం వచ్చి "మూర్ఖులారా ! నావలన పుట్టిన కాలయవనుడు మిమ్మల్ని నానాబాధలు పెడ్తాడని" శపించాడు యాదవులు తమ తప్పు తెలుసుకుని బాధపడి బ్రతిమాలుకున్నారు. కృష్ణుడు మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పాడు గర్గ మహర్షి.


యవనరాజు దగ్గర ఉన్న గర్గ మహర్షి తనకు సేవలు చేస్తున్న అప్సరసకి కాలయవనుడనే కొడుకుని ప్రసాదించాడు.  యవన మహారాజు కాలయవనుడ్ని పెంచాడు. కాలయవనుడు యాదవుల్ని నానా బాధలు పెడ్తుంటే కృష్ణుడు అతడ్ని చంపేశాడు.


గర్గ మహర్షి “గర్గసంహిత" రాశాడు. ఖగోళశాస్త్రాన్ని రాసిన ఈయన జ్యోతిష్యంలో కూడ గొప్పవాడు.


గర్గ మహర్షి ఎంత గొప్పవాడో తెలుసుకున్నాముగా .... ధర్మప్రవక్తగా, వేదశాస్త్రాలు తెలిసిన వాడుగా, ఖగోళశాస్త్ర గ్రంథకర్తగా, జ్యోతిషశాస్త్ర పండితుడుగా ఎంత గొప్పవాడో చూశారా మరి......


స్వయంగా భగవంతుడికి జాతకర్మ, నామకరణం, ఉపనయనం, చేశాడంటే ఎంత గొప్పవాడో కదా మరి...


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

_మాఘమాసం విశిష్టత

 *_మాఘమాసం విశిష్టత ఏమిటి ?_*




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*'మఘం'* అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది.


మాఘ స్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. *మృకండుముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం.*


కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం.


మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీల లోహిత , పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20నుంచి మార్చి 30వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని , వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు.


ఈ స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం.


*మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని , తటాక స్నానం ద్విగుణం , నదీస్నానం చాతుర్గుణం , మహానదీ స్నానం శతగుణం , గంగాస్నానం సహస్ర గుణం , త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయని పురాణవచనం.*  మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో *'ప్రయాగ'* ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం.


మాఘ పూర్ణిమను *'మహామాఘం'* అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు.


*మాఘమాసం మహిమ*


అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు.


శివుడైనా , విష్ణువైనా , ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి , సూర్య తదితర దేవతల పూజలు , వ్రతాలు కూడా జరుగుతుంటాయి.


మాఘ విశిష్టతను గురించి , ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది , చెరువు , మడుగు , కొలను , బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం.


*తిథులు:-*


1. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన , నువ్వులతో హోమం , నువ్వుల దానం , నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం , ఉప్పు దానం చేయటం మంచిది. 

2. శుద్ధ విదియ 

3. శుద్ధ చవితి 

4. శుద్ధ పంచమి 

5. శుద్ధ షష్టి 

6. శుద్ధ సప్తమి 

7. అష్టమి 

8. నవమి 

9. ఏకాదశి 

10. ద్వాదశి 

11. త్రయోదశి 

12. మాఘ పూర్ణిమ 

13. కృష్ణపాడ్యమి 

14. కృష్ణ సప్తమి 

15. కృష్ణ ఏకాదశి 

16. కృష్ణద్వాదశి 

17. కృష్ణ చతుర్దశి 

18. కృష్ణ అమావాస్య ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు , పర్వదినాలు , వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది.


ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి *"శుక్ల పక్ష చవితి"* దీనిని *"తిల చతుర్థి"* అంటారు. దీన్నే *"కుంద చతుర్థి"* అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున *"డుంఢిరాజును"* ఉద్దేశించి , నక్త వ్రతము పూజ చేస్తారు ! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు. *"కుంద చతుర్థి"* నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు , సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి.


మాఘమాసంలో ప్రాతఃకాలంలో చేసే స్నాన , జప , తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు *"దుఃఖ దారిద్ర్య నాశాయ , శ్రీ విష్ణోతోషణాయచ ! ప్రాతఃస్నానం కరోమ్య , మాఘ పాప వినాశనం!"* అని చేసిన తరువాత *"సవిత్రేప్రసవిత్రేచ ! పరంధామజలేమమ ! త్వత్తేజసా పరిబ్రష్టం , పాపం యాతు సస్రదా !"* అని చదవాలి. సూర్య భగవానునికి ఆర్గ్యమివ్వాలి.


ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు. కొంతమంది ఈ నెలనాళ్ళు ముల్లంగి దుంపను తినరు. ఈ మాసంలో నవ్వులను , పంచదారను కలిపి  తినాలట. నువ్వులను దానమివ్వాలట. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది. ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్దిస్తుందట. *"మాఘశుద్ద పంచమి"ని శ్రీ పంచమి అంటారు. ఈ పంచమి నాడే "సరస్వతీదేవి" జన్మించిందట. ఈనాడు "రతీ మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు.*


ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని , సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ధతతో ఉందట. అవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్థతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్దులకు అదిష్టాత్రి అయింది ఆ దేవి.


అప్పటి నుండి శ్రీ పంచమి రోజును సరస్వతిని పూజించడం జరుగుతుంది.


ఇక మాఘశుద్ద సప్తమి ఇదే *"సూర్య సప్తమి"అని కూడా పిలువబడుతుంది. ఇదే రథసప్తమి సుర్య గ్రహణదినం వలె ఇది పరమపవిత్రమైనది.* ఈ రోజున అరుణోదయకాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలాపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానికి ముందు చెరకుగడతో నీటిని కదిలిస్తారు. నమస్కారం ప్రియ:సూర్య: అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడని తెలుస్తుంది. ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం.


సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే *"శమంతకమణి"* ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజ్ఞవల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. *ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్* అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. *రథసప్తమి నాటి స్నానం సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా ! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్‌క్షణాత్ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట.*


భీష్మాష్టమి *"మాఘమానస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్థివ !ప్రాజాపత్యేచ నక్షత్రే మద్యఃప్రాప్తే దివాకరే !"* శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట. స్వచ్చంద మరణం ఆయనకి వరం.


ఆయనకు తర్పణలు విడిచి పెట్టడం నెలగంటు పెట్టినప్పటినుంచీ పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమినాడే దైవ సాయుజ్యం పొందినా శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే. ఈ విధంగా మాఘమాసమంతా *"శివరాత్రి"* వరకూ అన్ని పర్వదినాలే.


🍃🍂🌹🌷🌹🌷🍃🍂