4, ఏప్రిల్ 2025, శుక్రవారం

04, ఏప్రియల్, 2025🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

         *🌹శుక్రవారం🌹*

*🪷04, ఏప్రియల్, 2025🪷*

      *దృగ్గణిత పంచాంగం*                


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్ర మాసం - శుక్లపక్షం*


*తిథి : సప్తమి* రా 08.12 వరకు ఉపరి *అష్టమి* 

*వారం    : శుక్రవారం* ( భృగువాసరే )

*నక్షత్రం : ఆరుద్ర* (05) తె 05.20 వరకు ఉపరి *పునర్వసు*


*యోగం  : శోభన* రా 09.45 వరకు ఉపరి *అతిగండ* 

*కరణం : గరజి* ఉ 08.51 *వణజి* రా 08.12 ఉపరి *భద్ర*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.30 - 10.30 సా 05.00 - 06.00*

అమృత కాలం : *రా 07.33 - 09.07*

అభిజిత్ కాలం  : *ప 11.46 - 12.35*


*వర్జ్యం : మ 02.04 - 03.38*

*దుర్ముహూర్తం : ఉ 08.28 - 09.18 మ 12.35 - 01.24*

*రాహు కాలం : ఉ 10.38 - 12.10*

గుళికకాళం : *ఉ 07.33 - 09.05*

యమగండం : *మ 03.16 - 04.48*

సూర్యరాశి : *మీనం* 

చంద్రరాశి : *మిధునం*

సూర్యోదయం :*ఉ 06.00* 

సూర్యాస్తమయం :*సా 06.21*

*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 06.00 - 08.28*

సంగవ కాలం         :      *08.28 - 10.56*

మధ్యాహ్న కాలం  :      *10.56 - 01.24*

అపరాహ్న కాలం   : *మ 01.24 - 03.53*


*ఆబ్ధికం తిధి        : చైత్ర శుద్ధ సప్తమి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.21*

ప్రదోష కాలం         :  *సా 06.21 - 08.40*

రాత్రి కాలం : *రా 08.40 - 11.47*

నిశీధి కాలం          :*రా 11.47 - 12.33*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.26 - 05.13*

--------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷అగస్త్య కృత లక్ష్మీ స్తోత్రం🪷*


*జగన్మాతర్నమస్తుభ్యం* 

*నమస్తుభ్యంకృపావతీ*

*దయావతినమస్తుభ్యం* 

*విశ్వేశ్వరినమోన్నమః*


*🪷ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః🪷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

జీవితమే ఒక ఛాలెంజ్!

 శీర్షిక.. జీవితమే ఒక ఛాలెంజ్!


ఛాలెంజ్! ఛాలెంజ్! ఛాలెంజ్!

సవాలు విసురుతూ 

ఇంటా బయటా ఛాలెంజ్ 

గెలుపూ-ఓటమి మధ్య ఊగిసలాడే 

నీ బ్రతుకే ఒక ఛాలెంజ్! 


జననం నుండి మరణం దాకా

నష్టాలను భరిస్తూ..కష్టాలకు ఎదురీదుతూ

సమస్యల సుడిగుండాల్లో తీరం వెదుకుతూ 

గమ్యం చేరాలనే జీవన యానమిది..


నిత్యం అనునిత్యం  

పడుతూ లేస్తూ, అడుగడుగులో 

ఎన్నో ఆటంకాలెదురవుతూ

నీ సహనానికి పరీక్ష పెడుతూ ..


క్షణం క్షణం పరిష్కారాలను వెదుకుతున్న

కృషితో సాధిస్తావు విజయం 

అనుభవాలే నేర్పుతాయి గుణపాఠం

దృఢ సంకల్పమే నీ ఆయుధం

నీ తోడవుతుంది ఆత్మవిశ్వాసం

స్వీయ కృషితోనె సాధిస్తావు విజయం

తిమిరంలో కూడా వెలిగిస్తావు ఆశాజ్యోతిని

మార్గదర్శిగా....


అందరిలో నీవొక్కడిగా 

నీ అడుగుల్లో అడుగులు వేస్తూ 

జనసంద్రమె నీ తోడవుతుంది 

మెలమెల్లగా గమ్యం చేరే దాకా!

నీక సవాల్ విసురుతూ....

     

ఇది నా స్వీయ కవిత

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*తల్లి బిడ్డను పోషించినట్లు భక్తి భక్తుణ్ణి కాపాడుతుందని ఈ శ్లోకములో శంకరులు వివరించారు.*


 *శ్లోకము : 62*


*ఆనందాశ్రుభి రాతనోతి పులకం నైర్మల్యత శ్ఛాదనం*

          

*వాచా  శంఖముఖ స్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతైః౹*

          

*రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా*

          

*పర్యంకే విని వేశ్య  భక్తి జననీ భక్తార్భకం  రక్షతి.!!*


*తాత్పర్యము :-*


*ಓ మహాదేవా !  తల్లి ప్రేమతో ఆనంద బాష్పములు జారుతుండగా బిడ్డను చేరదీసి, రోమాంచిత గాత్రుణ్ణి చేసే విధంగా, భక్తి రసము భక్తుడికి ఆనందబాష్పములు ఒలికించి, శరీరము పులకించి ఉప్పొంగేటట్లు చేస్తుంది.* 


*తల్లి బిడ్డకు ఈగలూ, దోమలూ, చలి మొదలైన వాటి బాధ లేకుండా, బట్ట కప్పిన విధంగా భక్తి నిర్మల భావాన్ని కప్పుతుంది.*


*తల్లి శంఖములో పోసి కడుపార బిడ్డకు పాలు పట్టించినట్లు,  "భక్తి" వేదాది వాక్యముగా  నీ చరిత్రామృతమును  తనివి తీరా ఆస్వాదింప చేస్తుంది.*


*రుద్రాక్షలు ధరింప జేసి, విభూతిని పెట్టించి అంగరక్ష కావించి, తల్లి బిడ్డను మంచముపై పడుకో పెట్టి కాపాడుతున్న విధంగా, భక్తి మనస్సు నందు ఈశ్వరధారణ అనే మంచములో ప్రవేశబెట్టి కాపాడుతుంది.*


*వివరణ :-*


*భక్తి తల్లి వంటిది. తల్లి  పిల్లల. యోగక్షేమాలను స్వప్న , జాగ్రదవస్థలలోనూ కోరు కుంటుంది.*


*ఈశ్వరా !  భక్తి అనేతల్లి, నీ భావన అనే  ఉయ్యాలలో, భక్తుడు అనే శిశువును, చక్కగా ఉంచి కంటికి రెప్పలా కాపాడుతుంది.* 


*తల్లి బిడ్డను చూసుకొని మురిసిపోతూ ఉంటుంది.  ఒక్కోసారి ఆ వాత్సల్య రసం ఆనంద బాష్పాల రూపంలో పైకి తన్నుకు వస్తుంది.  ఆ బిందువులు ఒకటో రెండో బిడ్డపై పడగానే  ఆబిడ్డ ఆనంద పారవశ్యముతో  గగుర్పాటు చెందుతుంది. అలాగే భక్తి  భక్తుణ్ణి రోమాంచితునిగా చేస్తుంది.*


*తల్లి పిల్లకు దృష్టి తగలకుండా, గాలి మొదలయినవి సోకకుండా తాయెత్తులు కడుతుంది.  మంత్రించిన. విభూతిని శరీరానికి రాస్తుంది.  భక్తి అనే  తల్లి కూడా రుద్రాక్షలతో , విభూతితో  భక్తుడనే పిల్ల వాడికి రక్షకడుతుంది. భక్తుడనే పిల్లవానిని ఈశ్వర భావన అనే  ఉయ్యాల తొట్టిలో పెట్టి నిద్ర పుచ్చుతుంది.* 


*ఎంతగా ఏడుస్తున్న  పిల్లవాడైనా తల్లి  ఎత్తుకోగానే ఏడుపు మానివేస్తాడు. బిడ్డకు తల్లి ఒడిలో ఏదో అనిర్వచనీయమైన ఆనందానుభూతి కల్గుతుంది. భక్తి కూడా అటువంటిదే . భక్తి అంటే భగవంతుని పై పరమ ప్రేమ.  ఆ పరమ ప్రేమ హృదయంలో  ఆవేశిస్తే భక్తుడి కంఠం గద్గద మవుతుంది, శరీరం పులకరిస్తుంది. కండ్ల నుండీ నీరు స్రవిస్తుంది.  అంతటి  భక్తిగల భక్తులు  తమ వంశాన్ని,  ఈ భూమినీ పావనం చేస్తారని నారద మహర్షి సైతం చెప్పారు.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కుటుంబ వ్యవస్థ

 కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు. త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి...


*అందుకు గల కారణాలు*


1. అతి తెలివి, గర్వము, డబ్బులు ఉన్నాయనే అహంకారం.


2. చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం. ఓర్పు లేకపోవడం.


3. పిల్లలు, పెద్దలు కూర్చొని మనస్పూర్తిగా మాట్లాడుకోలేకపోవడం .


4. ఎక్కువ సమయం TV, ఫోన్లు, ఇతర net program లలో మునిగిపోవడం. (ఎక్కడో ఉన్న సినిమా హీరో, హీరోయిన్లు ఏం తిన్నారో, ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ, ఇంట్లో అమ్మ నాన్న ఏం తిన్నారో వాళ్ళు ఏమి చేస్తున్నారో తెలియదు)


5. చిన్న విషయాలకు అలిగి, స్వంత వారితో కూడా దూరంగా ఉండటం.


6. ఎవరో ఒకరి నోటి దురుసుతనం, కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవడం.


7. ఆర్థిక విషయాలలో ఇంటి పెద్దల సలహా తీసుకోకపోవడం


8. భార్యాభర్తలు, తలితండ్రులు తరుచు గొడవలు పడుతుండడంతో పిల్లలు పెళ్లి అంటే భయం కలుగుతుంది. పెళ్లి వద్దనుకునే స్థితికి వచ్చేశారు...


9. మనిషికి మరో మనిషంటే గిట్టనితనం... పెత్తనం కోసం పోరాటం. ఒంటరితనం ఇష్టపడుతున్నారు.


10. మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు. ఎవరిష్టానికి వారన్నారు. మంచి చెప్పినా నచ్చటం లేదు.


11. కుటుంబ నిర్వహణ ఆనేది గొప్ప కళ. అది తెలియక పోవడం మరో కారణం.


12. మానవ సంబంధాలు, సున్నితత్వం మరచిపోయి, మొరటు వ్యవహారం వచ్చేసింది. భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు. "నేను", "నేనే", " నేను చెపితే చేయాలి" అనే ధోరణి ప్రబలిపోయింది.


13. social media లో జరిగిందే నిజం, ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.


14. ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన message పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు... ఇండ్లకు వెళ్లి పలకరించడం లేదు. మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు.


15. ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు, నిర్లిప్తంగా ఉండిపోతున్నారు... ప్రక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళుతున్నారు తప్ప, ఆపే ప్రయత్నం చేయని పరిస్థితి.


ఇదే పరిస్థితి కొనసాగితే, అతి త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు, అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనడం అతిశయోక్తి కాదేమో. 💞

స్వచ్చమైన పలకరింపు

 విజయ 🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏          🔥స్వచ్చమైన పలకరింపు మనుషులకు మాత్రమే ఉన్న గొప్ప వరం..సకల జీవజీవరాసులలో మనిషికి ఉండే గొప్ప సధావకాశము..మానవీయ సంబందాల వారధి.. మనసు వ్యాకులతల పారద్రోలే మంత్రం.. ఎంత డబ్బు కుమ్మరించినా దొరకని అమూల్య సంపద.. పలకరింపుతో ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు.. ఒక బాధని తొలిగించవచ్చు.. ఒక మంచి ఆలోచనను రేకిత్తించవచ్చు.. ఒక ఆశను చిగురింప చేయవచ్చు..మంచి మాటతో మనసుకు తగిలిన గాయలను మాన్పించవచ్చు🔥మీరు చెప్పే మాట సత్య మైనది కావచ్చు.. కానీ చెప్పే విధానం సభ్యతతో ఉన్నప్పుడు సత్యత కు శోభ పెరుగుతుంది.. సభ్యత లోపించిన మాట వితండ వాదంగా కనిపిస్తుంది...మనిషి మానసికంగా కుంగిపోవడం మొదలు పెడితే రోగాలు కూడా మనిషి మీద ఆధిపత్యం వహిస్తాయి.. విజయాలకు మూలం మంచి మాట, మంచి ఆలోచన.. శాంతంగా మాట్లాడి, నిబ్బరంగా ఆలోచన చేస్తే దేనినైనా సాధించవచ్చు🔥 సంస్కారవంతమైన మాటలతో బ్రతికి ఉండగానే జీవించడం నేర్చుకుందాం!!..యెడ మొహం, పెడ మోహంతో బిగదీసుకుని కుటుంబాలను చిన్నా భిన్నం చేయకుండా ఉన్నంతలో కుటుంబ వ్యవస్థని అనందం నింపుదాం.. నిలబెట్టుకుందాం.. మంచి పలకరింపుతో జీవనం సాగిద్దాం🔥🔥మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును.9440893593.9182075510 * 🙏🙏🙏

రామాయ‌ణ

 శ్రీ‌శ్రీ‌శ్రీ‌

           *ఇంటింటా రామాయ‌ణ*

*దివ్య‌క‌థా పారాయ‌ణ‌ము*


           *6వ‌రోజు*


    *సుంద‌ర‌కాండ కొనసాగింపు*

 *రామయ్యకు శుభవార్త*

               ***

          🌸🌸🌸🌸🌸


శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి.

                ***

మనోజవం మారుత తుల్యవేగం

జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !

వాతాత్మజం వానరయూధ ముఖ్యం

శ్రీరామదూతం శిరసా నమామి

              ***


లంకలోని అశోక వనం లో సీతామాత‌ దర్శనం, ఆమె ఆశీస్సులు అంద‌డంతో హ‌నుంతుడు ప‌ట్ట‌రాని సంతోషంతో గంతులు వేశాడు.  ఇక పనిలో పనిగా రావణుడినిచూసి, రావ‌ణుడి శ‌క్తిసామ‌ర్థ్యాల‌ను తెలుసుకోవాల‌నుకున్నాడు. రావ‌ణుడితో ముఖాముఖి మాట్లాడాల‌నుకున్నాడు. అలాగే యుద్ధ వ్యూహంతో లంకను పరిశీలించాల‌ని కూడా నిశ్చయించుకొన్నాడు. అలా చేయడం వల్ల రావణుని హెచ్చరించడానికీ, లంక రక్షణా వ్యవస్థను తెలుసుకోవడానికీ వీలవుతుందనుకున్నాడు. అంతే గాకుండా ఆ ప్రయత్నంలో లంకకు వీలయినంత నష్టం కలిగించవచ్చు నని భావించాడు. ఇలా సంకల్పించిన హనుమంతుడు వెంటనే ఉగ్రాకారుడై అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. అడ్డు వచ్చిన వేలాది మంది రాక్షసులనూ పిడిగుద్దులు గుద్ది మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు.


ఈ వింత వాన‌రాన్ని బంధించమని రావణుడు అపార సైన్యాన్ని పంపాడు. హనుమంతుడు 

 *జయత్యతిబలో రామో,* 

*లక్ష్మణశ్చ మహాబల:,*

 *రాజా జయతి సుగ్రీవో,*

 *రాఘవేణాభిపాలిత:,*

 *దాసోహం కోసలేంద్రస్య,* 

*రామస్యా క్లిష్ట కర్మణః,*

 *హనుమాన్ శత్రు సైన్యానాం,*

 *నిహన్తా మారుతాత్మజః అని* జయఘోష చేశాడు -


 మహా బలవంతుడైన శ్రీరామునకు జయము. 

మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణునకు జయము. రాఘవుల విధేయుడైన కిష్కింధ ప్రభువు సుగ్రీవునకు జయము. 

నేను శ్రీరామ దాసుడను, వాయుపుత్రుడను, హనుమంతుడను. శత్రు సైన్యాన్ని నాశనం చేస్తాను. వేయి మంది రావణులైనా యుద్ధంలో నన్నెదిరించలేరు. వేల కొలది శిలలతోను, వృక్షాలతోను సకల రాక్షసులను, లంకాపురిని నాశనం చేస్తాను. నా పని ముగించుకొని, సీతమ్మకు నమస్కరించి వెళతాను. రాక్షసులు ఏమీ చేయలేక చూచుచుందురు గాక - ఇలా గర్జిస్తూ హనుమంతుడు లంక ముఖద్వారానికి బిగించిన ఇనుప గడియతో రాక్షసులనందరినీ చావగొట్టాడు. పర్వతాకారంలో దేహాన్ని పెంచి, చైత్య ప్రాసాదాన్ని కూలగొట్టి, ఆ ప్రాసాద పెద్ద స్తంభాన్ని పరిఘలా త్రిప్పుతూ అందరినీ చావగొట్టాడు.

అప్పుడు రావణుడు విషయం తెలుసుకుని, ప్రహస్తుని కుమారుడు మహా బలశాలీ అయిన జంబుమాలిని పంపాడు. హనుమంతుని చేతి పరిఘతో జంబుమాలి శరీరం చూర్ణమయ్యింది. ఆపై అగ్నివలె తేజరిల్లే యుద్ధవిద్యా నిపుణులైన ఏడుగురు మంత్రి పుత్రులు పెద్ద సేనతో కలిసి హనుమంతునిపై దండెత్తారు. హనుమంతుడు భయంకరంగా గర్జించి కొందరిని అర‌చేతితోను, కొందరిని ముష్టిఘాతాలతోను, కొందరిని తన వాడిగోళ్ళతోనూ చంపగా లంకాప‌ట్ట‌ణ వీధులు  రాక్ష‌సుల‌ రక్త మాంసాలతో నిండిపోయాయి.

 పిమ్మట విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అనే గొప్ప సేనా నాయకులు తమ సేనలతో వచ్చి వన ముఖ ద్వారంపై కూర్చున్న హనుమంతునిపై విజృంభించారు. వారంతా కూడా హనుమ చేతిలో ప్రాణాలు కోల్పోయారు. రణ భూమి అంతా రాక్షస కళేబరాలతోను, ఆయుధ, రథ శకలాలతోను నిండిపోయింది.

*అక్ష‌కుమారుడితో భీకర‌స‌మ‌రం*


ఇక  లాభం లేద‌నుకుని అక్షకుమారుడు సకలబలములతో హనుమంతుని సమీపించాడు. వారి మధ్య జరిగిన యుద్ధం సురాసురులను సంభ్రమపరచింది.  అక్షకుమారుడు హ‌నుమంతుడిపై  బాణాల వ‌ర్షం కురిపించాడు. అవి హనుమంతుని చాలా నొప్పించాయి. అతని పరాక్రమానికి హనుమంతుడు ముచ్చటపడ్డాడు. అంతటి పరాక్రమశాలిని, తేజోమయుని చంపడానికి తటపటాయించాడు. కాని అతనిని ఉపేక్షిస్తే తనకు పరాభవం తప్పదని తెలిసికొని హనుమంతుడు విజృంభించాడు. ఆకాశానికెగిరి వాయువేగంతో సంచరిస్తూ అరచేతితో అక్షకుమారుని అతని గుర్రాలను చరచి చంపేశాడు. తరువాత, గరుత్మంతుడు మహా సర్పాన్ని పట్టుకొన్నట్లుగా అక్షకుమారుని కాళ్ళను గట్టిగా చేజిక్కించుకొని, గిరగిర త్రిప్పి నేలకు విసరికొట్టాడు. అక్షకుమారుని శరీరం నుగ్గునుగ్గయ్యింది.


*ఇంద్ర‌జిత్తుతో యుద్ధం:*

అక్ష‌కుమారుడు మ‌ర‌ణించిన సంగ‌తి తెలుసుకుని రావణుడు కలవరపడడ్డాడు. ఇదెక్క‌డి వాన‌రం అని త‌ల‌ప‌ట్టుకున్నాడు. పెక్కు జాగ్రత్తలు చెప్పి, త‌న కుమారుడైన‌ ఇంద్రజిత్తును యుద్ధానికి పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మవర సంపన్నుడు, ఇంద్రాదులకు కూడా నిలువరింప శక్యంగాని పరాక్రమశాలి, మంత్ర తంత్ర యుద్ధవిద్యానిపుణుడు. అతడు తండ్రి యైన రావ‌ణాసురుడికి నమస్కరించి, రణోత్సాహంతో పొంగిపోతూ, సేనలు లేకుండా ఒకడే దివ్యరథాన్ని అధిరోహించి హనుమంతునిపైకి వెళ్ళాడు. వారిద్దరి మధ్య యుద్ధం చిత్ర విచిత్ర రీతులలో సకల గణాలకు సంభ్రమం కలిగించింది. ఒకరిని ఒకరు జయించడం అశక్యమని ఇద్దరికీ తెలిసిపోయింది. ఇక లాభం లేదు, కనీసం ఆ వానరుని బంధించాలని సంకల్పించి ,ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది హనుమంతుని బంధించింది. బ్రహ్మ హనుమంతునకిచ్చిన వరం ప్రకారం ఆ అస్త్రం అతనిని బాధించకుండా మరుక్షణమే తొలగిపోయింది. అయినా బ్రహ్మదేవునిపట్ల గౌరవసూచకంగా ఆ అస్త్రానికి కట్టుబడిపోయినట్లుగా హ‌నుమంతుడు నటించాడు. ఆ విధంగా రావణునితో మాట్లాడే అవ‌కాశం దొరుకుతుంద‌ని అనుకున్నాడు. రాక్షస సేనలు హనుమంతుని బంధించి, బాధిస్తూ రావణుని సభా ప్రాంగణానికి తీసుకుపోయాయి.


*రావణునితో సంవాదం :*

బ్రహ్మాస్త్రానికి వశుడైనట్లు నటించి, హనుమంతుడు రావణుని సభాభవనంలోకి ప్రవేశించి రావణుని చూశాడు. రావణాసురుని సభాప్రాంగణం మణిమయమై శోభిల్లుతున్నది. రావణుని కిరీటం, ఆభరణాలు, వస్త్రాలు, అత్యద్భుతంగా ఉన్నాయి. మహా తేజశ్శాలి, వీరుడును అయిన‌ రావణుడు పది శిరస్సులు క‌లిగి ఉన్నాడు. ద‌శ కంఠుడు. మణిమయాలంకృతమైన ఉన్నతాసనంపై కూర్చొని ఉన్నాడు. మంత్రాంగ నిపుణులైన నలుగురు మంత్రులచే పరివేష్టితుడై కాటుక కొండవలె ఉన్నాడు. అప్పుడు హనుమంతుడు ఇలా అనుకొన్నాడు. - ’ఆహా! ఈ రావణుని రూపం అత్యద్భుతం. ధైర్యం నిరుపమానం. సత్వం ప్రశంసార్హం. తేజస్సు అసదృశం. నిజముగా ఈ రాక్షస రాజు సర్వ లక్షణ శోభితుడు. ఈ అధర్మానికి ఒడి గట్టకపోతే సురలోకానికి సైతం ప్రభువయ్యేవాడు. లోకాలన్నీ ఇతనికి భయపడుతున్నాయి. ఇతడు కృద్ధుడైనచో సమస్త జగత్తునూ సముద్రమున ముంచి ప్రళయం సృష్టించగల సమర్ధుడు గదా!’ అనుకున్నాడు.

రావ‌ణుడు హ‌నుమంతుడిని చూశాడు. 

హనుమంతుడు ఎవరు? ఎందుకు వచ్చాడు? ఇత‌నిని ఎవరు పంపారు? - తెలిసికోమని రావణుడు మంత్రులను ఆదేశించాడు. హనుమంతుడు రావణునకు ఇలా చెప్పాడు - రాజా! నేను సుగ్రీవుడి మంత్రిని. రాముని దూతను. హనుమంతుడనే వానరుడను. నీ కుశలము తెలిసికొమ్మని సుగ్రీవుడు స్నేహ భావంతో చెప్పాడు. రాముని పత్ని సీతను అప‌హ‌రించితెచ్చి నువ్వు పెద్ద తప్పిదం చేశావు. దీని వలన నీవు చేసుకొన్న పుణ్యమంతా నిష్ఫలమై పోతున్న‌ది. వాలిని రాముడే సంహరించాడు. రాముని బాణాల ధాటికి నీవు గాని, మరెవరు గాని నిలువజాలరు. ఈ అకృత్యం వలన నీకూ,ఈ లంకకూ చేటు దాపురించింది. రాముడు మానవుడు. నీవు రాక్షసుడవు. నేను వానరుడను, నాకు పక్షపాతం లేదు. కనుక నా మాట విని సీతను రాముడికి అప్పగించి రాముని శరణు వేడుకో. రాముని క్రోధానికి గురియైనవానిని ముల్లోకాలలో ఎవరూ రక్షింపజాలరు. - అని హితవు చెప్పాడు.

ఆ మాట వింటూనే రావణుడు కోపించి ఆ వానరుని చంపమని ఆదేశించాడు. అంతలో విభీషణుడు అడ్డుపడి - దూతను చంపడం రాజ ధర్మం కాదు అని అన్నాడు.  అంతే కాకుండా హ‌నుమంతుడు తిరిగి వెళ్ళకపోతే నువ్వు శతృవులతో యుద్ధం చేసి వారిని ఓడించే అవకాశం కోల్పోతావు. కనుక, హ‌నుమంతుడిని దండించి వదిలివేయ‌మ‌ని రావణుడికి విభీషణుడు సూచించాడు. ఆ మాటలకు కాస్త నెమ్మదించిన రావణుడు ఆ వానరుని తోకకు నిప్పంటించి ఊరంతా త్రిప్పమని ఆదేశించాడు..


*లంకా దహనం*


హ‌నుమంతుడి హిత‌వ‌చ‌నాలు రావ‌ణుడికి న‌చ్చ‌లేదు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. రాక్షస కింకరులు హనుమంతుని తోకకు పాత గుడ్డలు చుట్టి నిప్పు పెట్టారు. ఊరంతా త్రిప్పసాగారు. ఈ అవకాశం చూసుకొని హనుమంతుడు లంకా నగరాన్ని నిశితంగా పరిశీలించాడు. జరిగిన సంగతి విన్న సీతాదేవి  క‌ల‌వ‌ర‌ప‌డింది. హనుమంతుని చల్లగా చూడమని అగ్నిదేవుని ప్రార్థించింది. తన తోక కాలుతున్నా గాని ఏ మాత్రం బాధ లేకపోవడం సీతమ్మ మహిమ వలన అని, తన తండ్రి వాయుదేవుని మిత్రుడైన అగ్ని కరుణ వలన అని గ్రహించిన హనుమంతుడు ఆ అగ్నికి లంకను ఆహుతి చేయాలని సంకల్పించాడు. తన బంధాలను త్రెంచుకొని, ఒక పరిఘతో రాక్షస మూకను చావబాదాడు. పైకెగిరి, మండుతున్న సూర్యునిలా విజృంభించాడు. ప్రహస్తుని ఇంటితో మొదలుపెట్టి లంకలోని అద్భుతభవనాలకు నిప్పంటించాడు. ఒక్క విభీషణుని ఇల్లు తప్ప లంకలో భవనాలను బుగ్గిపాలు చేశాడు.


అప్పుడు ఒక్కమారుగా సీత సంగతి గుర్తు వచ్చి హనుమంతుడు హతాశుడయ్యాడు. 

తన తొందరపాటువలన లంకతో పాటు సీతమ్మ కూడా అగ్నికి ఆహుతయ్యిందేమో అన్న భ‌యంతో విలవిలలాడిపోయాడు. తన చాంచల్యం వలన తన జాతికి, పనికి కీడు తెచ్చినందుకు రోదించి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. కాని సీత క్షేమంగా ఉన్నదని తెలిసి, ఊరట చెందాడు. మరొక్కమారు సీతమ్మవారిని దర్శించి, ఆమెకు సాంత్వన వచనాలు పలికి, రాముడు సకల వానరసేనతో త్వరలో లంకపై దండెత్తి రాగలడని మ‌రోమారు చెప్పి సీత‌మ్మ పాదాల‌కు న‌మ‌స్క‌రించి,  ఉత్తరదిశకు  హనుమంతుడు తిరుగు ప్రయాణం అయ్యాడు .


ఇలా హనుమంతుడు ,రాముని దూతగా సాగరాన్ని లంఘించి, సీతమ్మను కనుగొని, రాక్షసులను సంహరించి, లంకాద‌హ‌నం చేసి, రావణుని మదమణచి, సీతమ్మకు సాంత్వన కూర్చి, తిరుగు ప్రయాణానికి అరిష్టము అనే పర్వతాన్ని అధిరోహించాడు.


*తిరుగు ప్ర‌యాణం:*


హనుమంతుడి పద ఘట్టనతో అరిష్ట పర్వతం నేలలో క్రుంగిపోయింది. ఒక మహానౌక సముద్రాన్ని దాటినట్లుగా హనుమంతుడు సునాయాసంగా ఆకాశాన్ని దాటాడు. దారిలో మైనాక పర్వతాన్ని గౌరవంగా స్పృశించి, ఉత్తర సాగర తీరం సమీపించగానే పెద్దయెత్తున గర్జించాడు. ఆ కేక విని జాంబవంతాదులు ఇది హనుమంతుని విజయసూచక ధ్వానమని గ్రహించి హర్షంతో గంతులు వేయసాగారు. మేఘంలాగా హనుమంతుడు మహేంద్రగిరిపై దిగి గురువులకు, జాంబవంతాది వృద్ధులకు, యువరాజు అంగదునకు ప్రణామం చేశాడు. 

*కనుగొంటిని సీతమ్మను*. ఆమె రాక్షసుల బందీయై, రాముని కొరకు ఎదురు చూస్తూ కృశించియున్నది. " అని హనుమంతుడు చెప్పాడు. "కనుగొంటిని" అన్న  హనుమంతుడిమాటలతో వానరు లందరూ పరమానందం పొందారు. అతనిని కౌగలించుకొని సంతోషంతో చిందులు వేశారు. తరువాత తన లంకా నగర సందర్శనా విశేషాలను అన్నింటినీ తన బృందంలోనివారికి వివరంగా చెప్పాడు హనుమంతుడు.


ఇంక అంతా కలసి వెళ్ళి లంకను నాశనం చేసి, రావణుని ఓడించి, సీతమ్మను తెచ్చి రామునకు అప్పగించాలని అంగదుడు అభిప్రాయపడ్డాడు. కాని జాంబవంతుడు అందుకు వారించి, ముందుగా జరిగిన సంగతిని రామునకు, సుగ్రీవునకు నివేదించ‌డ‌మే సరైనపని అని చెప్పాడు. అందరూ సంరంభంగా కిష్కింధకు బయలుదేరారు.

*మధువనం:*

సీత జాడ తెలియడం వలన అంగదాది వానరులంతా ఉత్సాహంగా హనుమంతుని వెంట‌బెట్టుకుని కిష్కింధకు బయలుదేరారు. దారిలో మధువనమనే మనోహరమైన వనాన్ని చేరుకొన్నారు. అది సుగ్రీవునిది. దధిముఖుడనే వృద్ధ వానర వీరుని పరిరక్షణలో ఉంది. అంగదుని అనుమతితో వానరులంతా ఆ వనంలో ఫలాలను కోసుకొని తింటూ, మధువులను గ్రోలుతూ, చిందులు వేస్తూ,  వనాన్ని ధ్వంసం చేయసాగారు. అడ్డు వచ్చిన దధిముఖుని తీవ్రంగా దండించారు. దిక్కు తోచని దధిముఖుడు తన తోటి వన రక్షకులతో కలిసి వేగంగా సుగ్రీవుని వద్దకు ఎగిరిపోయి జరిగిన అకృత్యం గురించి మొరపెట్టుకొన్నాడు.


సీతాన్వేషణా కార్యం సఫలమయి ఉండకపోతే తన భృత్యులైన వానరులు అంతటి సాహసం చేయజాలరని సుగ్రీవుడు ఊహించాడు. వనభంగం అనే నెపంతో దధిముఖుడు సీతాన్వేషణా సాఫల్య సమాచారాన్ని ముందుగా సూచిస్తున్నాడని, శుభవార్త వినే అవకాశం ఉన్నదని రామలక్ష్మణులకు సుగ్రీవుడు చెప్పాడు. శుభవార్త తెలిపినందుకు దధిముఖుని అభినందించాడు. దధిముఖుడు మధువనానికి తిరిగి వెళ్ళి అంగదాదులతో సాదరంగా మాట్లాడి త్వరగా సుగ్రీవుని వద్దకు వెళ్ళమన్నాడు. అంగదుడు, హనుమంతుడు, తక్కిన బృందం రివ్వున ఆకాశానికెగిరి ఝంఝూమారుతంలాగా సుగ్రీవుని వద్దకు బయలుదేరారు.


*రాముడికి శుభవార్త*

*సీతమ్మ‌ జాడ తెలుపుట:*


అంగదాది ప్రముఖులు, హనుమంతుడు మహోత్సాహంతో సుగ్రీవుడు, రామలక్ష్మణులు మొదలైనవారున్న ప్రస్రవణగిరిపై దిగారు. *దృష్టా దేవీ (చూచాను సీతమ్మను)* అని హనుమంతుడు చెప్పగానే రామలక్ష్మణులు మహదానంద భరితులయ్యారు. హనుమంతుని కార్య సాధనపై విశ్వాసము గల లక్ష్మణుడు సుగ్రీవునివంక ఆదరంగా చూశాడు. తక్కిన వానరుల ప్రోద్బలంతో హనుమంతుడు దక్షిణ దిక్కుకు తిరిగి సీతమ్మకు ప్రణమిల్లి, ఆమె ఇచ్చిన చూడామణిని రామునికి సమర్పించి, తన సాగర లంఘనా వృత్తాంతమును రామలక్ష్మణసుగ్రీవులకు వివరించాడు.


ఓ రామా! సీతామాత నిరంత‌రం నిన్ను స్మ‌రిస్తూ రాక్షస స్త్రీల నిర్బంధములో దీనురాలై నిరంతరము నీకోసం ఎదురుచూస్తున్న‌ది. అందరిని కుశలమడిగినది. నీవు అనతి కాలములోనే వచ్చి ఆమెను విముక్తురాలను చేసి స్వీకరిస్తావ‌నే ఆశ మాత్రముననే జీవించియున్నది. ఒక నెల‌ లోపల అలా జ‌ర‌గ‌కుంటే తాను ప్రాణాల‌తో ఉండజాలనన్నది. రామా! సింహ పరాక్రముడైన రాముని, ధనుష్పాణియైన లక్ష్మణుని త్వరలో లంకా ద్వారంలో చూడగలవని ఆమెకు చెప్పాను. శుభకరమైన వచనములతో ఆమెను ఓదార్చి ఇటు వచ్చాను. - అని హనుమంతుడు శ్రీరామునకు విన్నవించాడు.


రామాయణంలో సుందరకాండకు విశేషమైన స్థానం ఉంది.

బ్రహ్మాండ పురాణం రామాయణంలోని ఒక్కొక్క కాండం పారాయణానికి

 ఒక్కొక్క ఫలసిద్ధిని పేర్కొంటూ సుందరకాండ గురించి ...

*"చంద్రబింబ సమాకారం వాంఛితార్ధ ప్రదాయకం*,

*హనూమత్సేవితం ధ్యాయేత్ సుందర కాండ ఉత్తమమ్‌* అని పేర్కొన్నది.

                  ***

ఆపదా మపహ‌ర్తారం ధాతారం సర్వసంపదామ్

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్

                    ***

నమో నమస్తే ఖిల పూజితాయ నమో నమస్తేందునిభాననాయ

నమో నమస్తే రఘువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ

                  ***

గోష్పదీకృత వారాశిం

మశకీకృత రాక్షసమ్

రామాయణ మహామాలా

రత్నం వందే అనిలాత్మజమ్.


రామాయణ పారాయణం చేస్తున్న భక్తుని ఎదురుగా కూర్చుని అదృశ్య రూపంలో హనుమ పరవశంతో వింటాడని భక్తుల విశ్వాసం.


అటువంటి మారుతికి మరొక్కమారు భక్తితో 

నమస్కారం.....

మనోజవం ,మారుత తుల్యవేగం

జితేంద్రియం,బుద్ధిమతాం వరిష్టం.

వాతాత్మజం

వానర యూధ ముఖ్యం

శ్రీ రామ దూతం

శిరసా నమామి


 *(సుంద‌ర‌కాండ స‌మాప్తం)*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం  - సప్తమి - ఆర్ద్ర -‌‌ భృగు వాసరే* (04.04.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*