31, అక్టోబర్ 2021, ఆదివారం

శివ పరమాత్మ బోధించిన ఆరోగ్య రహస్యం

 శివ పరమాత్మ బోధించిన ఆరోగ్య రహస్యం


మీ మనస్సు ఎలా ఆలోచిస్తుందో మీరు అలాగే తయారవుతారు అందువలన ఎప్పుడూ మిమ్మల్ని మీరు రోగిగా భావించకండి. మంచిగా అవుతాను అనే కోరికను ఎప్పుడూ వదలకండి. మీ ప్రతీ బాధ త్వరలోనే తొలగిపోతుంది, నవ జీవితం మీకు తిరిగి తప్పక లభిస్తుంది. దు:ఖం యొక్క లక్ష తుఫానులు వచ్చినా కానీ భగవంతుడు మీ తోడుగా ఉన్నారు. ఈ అదృష్టాన్ని చూసుకుని మురిసిపోండి. స్వయాన్ని దేహానికి అతీతంగా ఆత్మగా భావించి మనస్సుని శివపరమాత్మతో జోడించండి, శరీరానికి ముందు ఎంత అవసరమో మనస్సుకి పరమాత్మ స్మృతి అంతే అవసరం, ప్రతి శ్వాసలోను శివ తండ్రి జ్ఞాపకం ఉంటే ఎలాంటి  రోగం అయినాతగ్గిపోతుంది. . మనస్సుని అచంచలంగా ఉంచుకునే వారు నిరోగి శరీరాన్ని తిరిగి పొందుతారు. మీలో ధైర్యాన్ని ఎప్పుడూ వదలకండి, సదా సంతోషంగా ఉండండి. అప్పుడు ఎటువంటి బాధ అయినా దూరం అయిపోతుంది. జ్ఞాన దీపాన్ని మనస్సులో వెలిగించుకుని ప్రతి సమస్యను ఆటగా భావించి నడవండి. గౌరవం-అగౌరవం, జయం-పరాజయం ఏదైనా సరే అన్నిటిని సమదృష్టితో చుడండి. మీ మనస్సుని స్థిరంగా చేస్కోండి అప్పుడు సదా మీరు ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా వుంటారు. ఎటువంటి ఉద్రేకాలకు లోను కాకండి. ప్రశాంతంగా వుండండి. ఇతరులతో సున్నితంగా మాట్లాడండి. అప్పుడు వారు కూడా మీ యెడల సద్భావనతో వుంటారు. ఆవేశం అనారోగ్యహేతువు అని గుర్తుంచుకోండి. ప్రేమే ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇస్తుంది మరవకండి. 

అన్నింటిలోను మనసారా శివపరమాత్మను జ్ఞాపకం చేయండి.  

సంస్కృత మహాభాగవతం

 *31.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఇరువదియవ అధ్యాయము*


*జ్ఞాన, కర్మ, భక్తి యోగములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*20.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*యత్కర్మభిర్యత్తపసా జ్ఞానవైరాగ్యతశ్చ యత్|*


*యోగేన దానధర్మేణ శ్రేయోభిరితరైరపి॥13037॥*


*20.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*సర్వం మద్భక్తియోగేన మద్భక్తో లభతేఽఞ్జసా|*


*స్వర్గాపవర్గం మద్ధామ కథంచిద్యది వాంఛతి॥13058॥*


కర్మతో, తపస్సుతో, జ్ఞానవైరాగ్యములతో, యోగముతో, దానధర్మములతో ఇతర శ్రేయస్సాధనములతో ఏయే ఫలములు లభించునో, వాటినన్నింటినీ భక్తిప్రభావముచే నా భక్తుడు అవలీలగా పొందగలడు. ఒకవేళ నా భక్తుడు స్వర్గమునుగానీ, మోక్షమునుగానీ, నా ధామమునుగానీ ఏది కోరిననూ దానిని అతడు సునాయాసముగనే పొందగలడు.


*20.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*న కించిత్సాధవో ధీరా భక్తా హ్యేకాంతినో మమ|*


*వాంఛంత్యపి మయా దత్తం కైవల్యమపునర్భవమ్॥13039॥*


నా యొక్క ఏకాంతభక్తుడు ధీరుడై, సాధుశీలిగా నుండును. అతడు ఏదీ కోరనే కోరడు. ఒకవేళ నేను స్వయంగా కైవల్యమును లేదా మోక్షమును ఇచ్చిననూ, వాటిని అతడు కోరడు. కోరుమని కోరినా నాయందు భక్తిని తప్ప వేరేదానిని కోరనేకోరడు.


*నాఽఽస్థా ధర్మే న వసునిచయే నైన కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్! పూర్వకర్మానురూపమ్|*


*ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్నజన్మాంతరేఽపి త్వత్పాదాంభోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు॥*


దేవా! నాకు జన్మజన్మలయందును నీ పాదపద్మములను సేవించుచుండెడి నిశ్చలభక్తి అబ్బిన చాలును. మఱి దేనినీ వాఛింపను అని అన్నారు భక్తశిరోమణియైన ఆళ్వారులవారు. (ముకుందమాల 5)


*20.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*నైరపేక్ష్యం పరం ప్రాహుర్నిఃశ్రేయసమనల్పకమ్|*


*తస్మాన్నిరాశిషో భక్తిర్నిరపేక్షస్య మే భవేత్॥13040॥*


ఉద్ధవా! నిరపేక్షము అనగా అపేక్ష లేకుండుట సర్వోత్కృష్టము. ఉత్తమోత్తమము. పరమమంగళప్రదము. ఎంతో గొప్పది. కావున, నిష్కాముడు, నిరపేక్షుడు ఐన వానికే నా యందు అనన్యభక్తి పాదుకొనును. 


*20.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*న మయ్యేకాంతభక్తానాం గుణదోషోద్భవా గుణాః|*


*సాధూనాం సమచిత్తానాం బుద్ధేః పరముపేయుషామ్॥13041॥*


నాయందు ఏకాంతభక్తి గలిగినట్టి మహాత్ములు సమచిత్తమును కలిగి, సమదర్శనులై బుద్ధికి అతీతమైన పరమతత్త్వమును పొందెదరు. అట్టివారిని గుణదోషములతో ఏర్పడు గుణములు ఎంతమాత్రము బాధింపవు.


*20.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*ఏవమేతాన్ మయాఽఽదిష్టాననుతిష్ఠంతి మే పథః|*


*క్షేమం విందంతి మత్ స్థానం యద్బ్రహ్మ పరమం విదుః॥13042॥*


ఉద్ధవా! ఈ విధముగా నాచే ఉపదేశింపబడిన జ్ఞాన, భక్తి, కర్మమార్గములను అనుష్ఠించువారలు నా యొక్క పరబ్రహ్మతత్త్వమును ఎరుగుదురు. కావున వారలు మిగుల కళ్యాణస్వరూపమగు నా పరంధామమును క్షేమముగా చేరుకొందురు.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే వింశోఽధ్యాయః (20)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *జ్ఞాన, కర్మ, భక్తి యోగములు* అను ఇరువదియవ అధ్యాయము (20)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కార్తీక_మాస_విశిష్టత

 💐💐💐#కార్తీక_మాస_విశిష్టత💐💐💐


శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీకమాసం నెలరోజులూ పర్వదినాలే. కార్తీకంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి, తులసికోట ముందు భగవన్నామ సంకీర్తన చేస్తూ ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండి అలౌకికమైన, అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. మామూలు రోజులలో భగవదారాధన మీద అంతగా శ్రద్ధ పెట్టనివారు, గుడిలో కాలు పెట్టని వారిని సైతం పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణమే గుడికి తీసుకెళ్తుంది. వారిని దేవుని ముందు కైమోడ్చేలా చేసి, పాపాలు పటాపంచలు చేసి మోక్షప్రాప్తి కలిగిస్తుంది ఈ మాసం. అందుకే ఇది ముముక్షువుల మనసెరిగిన మాసం.


న కార్తీక నమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్ నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః


కార్తీక మాస మహాత్మ్యాన్ని మొదటగా వశిష్ట మహర్షి జనక మహారాజుకు వివరించగా శానకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు.


కార్తీక మాసంలో ఆర్చనలు, అభిషేకాలతోపాటు, స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవే. నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్ల కాలువలలోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపీ, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు మొదలయిన నదులన్నింటి నీరూ ఉందని భావించాలి.


కార్తీకమాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతోటీ, కమలాలతోటి పూజిస్తే జీవించినన్నాళ్లూ ధనానికి లోటు లేకుండా ఉండి, సమస్త సౌఖ్యాలు కలగటంతోపాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుందట. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున, మాసశివరాత్రినాడు, సోమవారం నాడు, కార్తీక పున్నమి నాడూ రుద్రాభిషేకం చేసి, బిల్వదళాలతోనూ, రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతోబాటు అంత్యమున శివసాయుజ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది.


ఈ మాసంలో ప్రతి రోజూ పుణ్యప్రదమైనదే. అయితే ఏ తిధిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.


కార్తీక శుద్ధపాడ్యమి: తెల్లవారు జామునే లేచి స్నానం చేసి, అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికెళ్లి, 'నేను చేయ దలచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి.


విదియ: ఈ రోజు సోదరి ఇంటిల్లి ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి.


తదియ: అమ్మవారికి కుంకుమపూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి.


చవితి: కార్తీక శుద్ధ చవితి: నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి పుట్టలో పాలు పోయాలి.


పంచమి: దీనికి జ్ఞానపంచమి అని పేరు. ఈ రోజు సుబ్ర హ్మణ్య ప్రీత్యర్థం ఆర్చనలు చేయించుకున్నవారికి జ్ఞానవృద్ధి కలుగుతుంది.


షష్టి: నేడు బ్రహ్మచారికి ఎర్రగ కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. 


సప్తమి: ఈరోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్షు వృద్ధి అవుతుంది. 


అష్టమి: ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలనిస్తుంది.


నవమి: నేటి నుంచి మూడు రోజులపాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.


దశమి ఈ రోజు రాత్రి విష్ణుపూజ చేయాలి.


ఏకాదశి: ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు. ఈ రోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. 


ద్వాదశి: ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి. నేటి సాయంకాలం ఉసిరి మొక్క. తులసి మొక్కల వద్ద దామోదరుని ఉంచి పూజ చేసి, దీపాలు వెలిగించడం సర్వపాపాలనూ నశింపచేస్తుంది.


త్రయోదశి: ఈరోజు సాలగ్రామ దానం చేయడం వల్ల సర్వకష్టాలూ దూరమవుతాయి.


చతుర్దశి: పాషాణ చతుర్ధశి వ్రతం చేసుకునేందుకు మంచిది.


కార్తీక పూర్ణిమ: మహా పవిత్రమైన ఈ రోజు నదీస్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వపాపాలూ ప్రక్షాళనమవుతాయి.


కార్తీక బహుళ పాడ్యమి: ఈ రోజు ఆకుకూర దానం చేస్తే శుభం.


విదియ: వనభోజనం చేయడం విశేష ఫలాలనిస్తుంది. 


తదియ: పండితులకు, గురువులకు తులసి మాలను సమర్పించడం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి.


చవితి: పగలంతా ఉపవసించి, సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించి, ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పడుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సకల సంపదలూ కలుగుతాయి.


పంచమి: చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం తినిపించడం శుభఫలితాలనిస్తుంది.


షష్ఠి: గ్రామదేవతలకు పూజ జరిపించడం మంచిది.


సప్తమి: జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి అవుతాయి.


అష్టమి: కాలభైరవాష్టకం చదివి గారెలతో దండచేసి, కాల భైరవానికి (కుక్కకు) సమర్పించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.


నవమి: వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు.


దశమి: ఈ రోజు అన్న సంతర్పణ చేస్తే విష్ణు వుకు ప్రీతిపాత్రులై, కోరికలు తీరతాయి.


ఏకాదశి: విష్ణ్వాలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ విశేషఫల ప్రదం.


ద్వాదశి: అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించడం శుభప్రదం.


త్రయోదశి నవగ్రహారాధన చేయడం వల్ల గ్రహదోషాలు తొలగుతాయి.


చతుర్దశి: ఈ మాస శివరాత్రినాడు చేసే ఈశ్వరార్చన, అభిషేకం అపమృత్యుదోషాలను, గ్రహబాధలను తొలగిస్తాయి.


అమావాస్య: నేడు పితృదేవతల పేరిట అన్నదానం లేదా ఉప్పు పప్పుతో కూడిన సమస్త సంబారాలను దానం చేయడం వల్ల పెద్దలకు నరక బాధ తొలగి, స్వర్గసుఖాలు కలుగుతాయి.


ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ లేదా కనీసం ఒక్క సోమవారం నాడయినా సరే నియమ నిష్టలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం తనవల్ల కాదని బ్రహ్మ చెప్పాడు. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలూ భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతివృత్తాలు, ఉపకథలను బట్టి తెలుస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, సత్యనారాయణస్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలు.


గడపదాటి వెళ్లనివారు సైతం కార్తీక మాసంలో వన సమా రాధనలో వనసమారాధనలో ఉసిరిగ చెట్టు నీడన సాలగ్రామ రూపంలో శ్రీహరిని పూజించి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధన చేసిన వారిని యముడు కన్నెత్తి కూడా చూడలేడని కార్తీక పురాణం బోధిస్తోంది. వనభోజనం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి విష్ణుసాయుజ్యం పొందుతారు. కార్తీకమాసంలో వనభోజనం ఎవరు చేస్తారో, పురాణం ఎవరు వింటారో వారికి ఉత్తమ గతులు కలగడంతో పాటు హోమం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు, దేవతార్చన సమయంలో, పితృతర్పణ సమయంలో, భ్రష్టులు, చండాలురు, సూతకం ఉన్న వాళ్ల మాటలు వినడం వల్ల కలిగే పాపాలు తొలగుతాయి.


కార్తీకమాసం విష్ణుస్వరూపమని విష్ణు భక్తులు, కాదు, ఈశ్వరార్చనే ప్రశస్తమని శివభక్తులు భావిస్తారు. ఒకరకంగా ఆ ఇరువురిదీ వాదనా సరైనదే. ఎలాగంటే ఈ మాసం శివకేశవులకిరువురికీ ప్రీతిపాత్రమైనదే.


తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోరాదు. ఎవ్వరికీ ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవదూషణ తగదు. దీపారాధనలకు తప్ప నువ్వులనూనెను ఇతరత్రా అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు. నలుగు పెట్టుకుని స్నానం చేయరాదు. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు.


ఈ మాసంలో చేసే ఉపవాసం, జాగరణ, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్నిస్తాయి. విష్ణువును తులసి దళాలు, మల్లి, కమలం జాజి, అవి సెపువ్వు, గరిక. దర్భలతోను, శివుని బిల్వదళాలతోనూ, జిల్లేడుపూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమ గతులు కలుగుతాయి. శక్తి లేని వారు ఉదయం స్నానం, జపం, దేవతారాధన యధావిధిగా చేసి మధ్యాహ్న భోజనం చేసి, రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు, పళ్లు తీసుకోవచ్చు.

బహుముఖ శివలింగం -

 బహుముఖ శివలింగం - 360 శివ ముఖాలతో శివలింగం

 కుడల్ సంగమేశ్వర్, షోలాపూర్, కర్ణాటక


 శ్రీ హరిహరేశ్వర్ ఆలయ త్రవ్వకాల్లో లభించిన అసాధారణ శిల్పం ఇది. ఇది లింగ ఆకారంలో ఉంటుంది మరియు నాలుగు మీటర్ల చుట్టుకొలత మరియు నాలుగున్నర టన్నుల బరువు ఉంటుంది.

శిల్పం పై నుండి కింది వరకు ఎత్తు 117 సెం.మీ. ఈ లింగంపై 359 శివ విగ్రహాలు మరియు ఒక ఎక్లింగ్ సహా 360 శివ విగ్రహాలు చెక్కబడ్డాయి. శివుని విగ్రహం తలపై కోబ్రా కిరీటం మరియు చేతిలో త్రిశూలం మరియు డమ్రూ ఉన్నాయి. కొన్ని విగ్రహాలు కూర్చుని కొన్ని నిలబడి ఉన్నాయి.,🙏🌿🙏🌿🙏🌿🙏🌿🙏🌿🙏

*దాసో-హం*

 *దాసో-హం* 

💫🌻💫🌻💫🌹🌈🌹🌻💫🌻💫


💫 *దాసోహం* అన్న పదంలో *అహం* ఒక భాగం. విడదీయరాని అక్షర సమాహారం. 


💫 *అహం* అంటే నేను. నేను నీ దాసుణ్ని అని మనసా, వాచా చెప్పగలగాలి.


💫 *'దాసోహం'* అన్నమాటను ఒక మంత్రంగా స్మరించడం, గుణాత్మకంగా మరీమరీ గుర్తు చేసుకోవడం, మనసును ఏకాగ్రం చేసి అక్కడే నిలపడం - చెప్పినంత తేలిక కాదు.


💫 *శ్రవణం,* *మననం,* *ధ్యానం,* అనేవి *భక్తియోగ* సాధన కు కలిసివచ్చే *భౌతిక,* *మానసిక,* *ఆంతరంగిక* ప్రక్రియలు. *దాసోహానికి* *దారిదీపాలు.*


💫 ఒకరికి తలవంచి నమస్కరించడం బానిసత్వానికి నిదర్శనం. 


💫 ఒకరి గొప్పతనాన్ని బేషరతుగా ఒప్పుకొని శరణాగతి కోరడం భక్తి పరాకాష్ఠకు సంకేతం.


💫 ప్రతి నిమిషం, ప్రతి విషయంలోనూ బయటపడి అడ్డుకునేది *'అహం'.* 


💫 ‘నన్ను అడిగావా?’ అని నిలదీయడం, ‘నాకు తెలియదే!’ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించడం... అదే *అహంకారం* !


💫 *పూర్ణ దాసత్వం* ఆషామాషీ కాదు. 


💫 *నవవిధ భక్తి మార్గాల* లో *దాస్యానికి* సముచితమైన స్థానం ఉంది. 


💫 నమ్రతా భావంతో కూడిన వినయ విధేయతల త్రివేణీ సంగమంతో సమానమైనది *దాస్య భక్తి.* 


💫 నిజమైన హరిదాసుడు *దాసోహం* అనడానికి, అలా కావడానికి ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటాడు. తన అస్తిత్వాన్ని పోగొట్టుకుని పరతత్త్వంలో లీనం కావడానికి - పాలలో పంచదారగా మారాలి. దాసుడికి అది ఒకరకమైన జీవన్ముక్త దశ. 


💫 అహంకారం బండరాయిలా ఎప్పటికప్పుడు అడ్డుతూ, చాపకింద నీరులా తెలియకుండా తడిగట్టి పడగొట్టుతుంది.


💫 *హరిదాసు* అనగానే... సంక్రాంతి పండుగ రోజుల్లో తలపైన పాత్ర, చేత చిడతలు, భుజాన తంబురా వేసుకుని *'హరిలో రంగ హరి'* అంటూ చిందులు వేసే ఆసామీ కళ్లకు కడతాడు. 


💫 *హరిదాసు* అన్న బిరుదు బ్రహ్మ మానసపుత్రుడైన నారద మహర్షికే చెల్లుతుంది. సదా నారాయణ నామస్మరణలో కాలంగడిపే నారదుడి కన్నా మిన్న అయిన విష్ణుభక్తుడు ఎవరైనా ఉన్నారా? 


💫 *రామదాసు* అన్న పేరు మన దేశంలో మిక్కిలి జనప్రియమైన నామం. *రామదాసు* అంటే *రామబంటు* - హనుమంతుడు. ఈ పేరులో రాముడు తప్ప మనకు హనుమంతుడు కనిపించడు. ఆ పదాన్ని విడదీసి శల్యపరీక్ష చేస్తేగాని అందులో దాగిన *దాసుడు- ఆంజనేయుడు* బయటికి రాడు. 


💫 *తులసీదాసు* - *తులసికి దాసుడు* శ్రీమహావిష్ణువు. తులసిలో కలిసి ఉన్న ఆ పరమాత్మను స్మరించడానికి, మనోనేత్రంతో దర్శించడానికి *'కృష్ణ తులసి'* అన్న ప్రయోగం మనకు ప్రయోజనకరంగా కలిసి వస్తుంది. రుక్మిణి ఒక్క తులసిదళంతో కృష్ణ తులాభారంలో నెగ్గింది.


💫 మనల్ని మనం *దాసుడిగా* గుర్తించడానికి ముందుగా *మోహనిద్ర* నుంచి మేలుకుని బయటపడాలి. 


💫 చెలికాడు, శిష్యుడు, బావమరిది అయిన అర్జునుడికి తాను *కృష్ణదాసుడిని* అని తెలుసుకోవడానికి, పద్దెనిమిది అధ్యాయాలు, ఏడువందల శ్లోకాలు అవసరమయ్యాయి. 


💫 చిట్టచివరికిగాని, ‘ఓ అచ్యుతా! నువ్వు చెప్పినట్లే చేస్తాను’ అన్న సమాధానం కిరీటి నోటంట రాలేదు. 


💫 *దాస* సంప్రదాయంలో సర్వోత్తమమైన భక్తి నివేదనా గరిమకు ఉదాహరణ *దాసకూటం* పేరు చెప్పగానే మన తలపులో మెరుపులా *కనకదాసు* కనిపిస్తాడు. 


💫 ఆ భక్త శిఖామణి కోసం ఉడుపిలోని బాలకృష్ణుడు తన దిశను మార్చుకుని, కనకదాసు దశను మార్చాడు. క్షణంలో భక్తుడికి మోక్షం ప్రసాదించాడు. 


💫 *పురందరదాసు* శ్రీకృష్ణ దేవరాయల రాజధాని హంపీ క్షేత్రంలో తన కీర్తనలు వినిపించి, స్వర సేవకులందరికీ ఆదర్శంగా స్ఫూర్తిమన్మూర్తిగా ఈనాటికీ సంప్రదాయ భక్తి సంగీతపు మెరుపులు కురిపిస్తున్నాడు. 


💫 బద్ధ జీవులను *భక్తిసేవ* లతో తన అక్కున చేర్చుకోవడానికి భగవంతుడు సర్వదా సిద్ధంగా ఉంటాడు. ఆయన *దాసులకు దాసుడు* !



*సేకరణ:* 

💫🌻💫🌻💫🌹🌈🌹🌻💫🌻💫

తాంత్రిక పూజలు

 తాంత్రిక పూజలు..............!!


తంత్ర పూజలు 5 విధములు అవి:

1.సూర్య 2.గణపతి 3.విష్ణువు

4.శివుడు 5.శక్తి పూజ లనునవి.

ప్రతి శక్తికి 5 రూపములు 5 సాధనలు గలవు.


ఉపాసకుని శక్తి సామర్థ్య,భావముల ననుసరించి సాధనలు 4 విధములుగా పేర్కొనబడినవి.

అవి:

1.పూజ 2. జపము 3.ధ్యానము

4.బ్రహ్మత్వము అనునవి. 

వీనిలో సాధకుని భావములు 

మూడు తెగలుగా విభజింపబడినవి.

అవి:

1.పశుభావము 2.వీరభావము

3.దివ్యభావము


1.పశుభావము:

లజ్జ,కామ,క్రోధాది అరిషడ్వర్గములచే కట్టబడిన వారు పశ్వాచారులు.


2.వీరభావము:

పశుపాశములను విడిపించుకొనిన జితేంద్రియులు వీరాచారులు


3.దివ్యభావము:

బ్రహ్మజ్ఞానులైనవారు

దివ్యాచారులనదగిన వారు. 

వివిధ సాధనా విధానములను గమ్యమును చేరుకొను అంతస్థులను,ఆచారములనినారు.

కులార్ణవతంత్రము ఈ ఆచారములను

ఆరునొక్కటి (7)గా పేర్కొనినది.


అవి:

1.వేదాచారము:

బహిః పూజాపద్ధతి దీనిలోనిది క్రియామార్గమై స్థూలదేహము వంటిది.


2.వైష్ణవాచారము:

భక్తి యోగ ప్రాధాన్యమై హృదయ సాధనకు దోహదమిచ్చును.


3.శైవాచారము:

జప యోగముతోకూడి

ధర్మస్థాపన కుపక్రమించినది.


4.దక్షిణాచారము:

దక్షిణ కాళిక పూజా పూర్వకమైనది.

ఈ తెగవారికి సమయాచారులని మరియొక పేరు గలదు. వీరికి దేవి గాయత్రీ మంత్ర ముపదేశింపబడును.

త్రిశక్తుల కావ్యశక్తి బ్రహ్మశక్తి యగుటవలన బ్రాహ్మణత్వ సాధనకిది నాందియై శక్తి పూజార్హత్వము లభించును.

ఈ ఆచారములో ధ్యాన యోగ ప్రాప్తియై ప్రవృత్తి మార్గమునుండి నివృత్తికి,

తన్మూలమున యోగసిద్ధి కలుగుటకు

ప్రారంభమగును.


5.వామాచారము:

దక్షిణాచారములో పుట్టిన మానవుడు గురువులచేత దీక్షనందుకొని (తంత్ర దీక్ష) వామాచారుడగును.వామమనగా వ్యతిరేక పక్షము,విప్లవ మార్గము అని పేరు. ఇచ్చట సాధకుడు ప్రవృత్తి మార్గమును పూర్తిగా వదలి నివృత్తి పదములో నిమగ్నుడగుటయే ప్రత్యేకత.అనగా సంసార బంధ విముక్తుడై యోగిగా నుండు స్థితి.

వీరినే వీరాచారులని,హఠయోగులని పిల్తురు.


6.సిద్ధాంతాచారము:

లజ్జ,భయ,మోహాది అరిషణ్మార్గములకుకుల శీలాలకు నతీతులుగా వీరు స్మశాన వాసులై 

శివ స్థితి నొందినవారు.

వీరికి యోగ రహస్యములు కరతలామరకములు.

మనో నిగ్రహము,ప్రాణవాయు 

సంచార సమస్థితి, 

వాని గతులయొక్క జ్ఞానము

వీరికి అనుభవ సిద్ధము.

వీరికి గురువులు వేదాచార

రహస్య ముల నుపదేశించి దీక్షయొసంగుదురు.

అష్టాంగయోగ సాధనచే 

వీరు తురీయులై కాలాచార పరాయణులగుటకు

అర్హతను బడయుదురు.

వీరినే అఘోరయోగాచారులని,

దివ్యాచారులని వ్యవహరింతురు.

(శివుని వామ పార్శ్వమగు శక్తిని పూజించువారుగూడా వామాచారులనబడుదురు.)


7.కౌలాచారులు:

ఇచట శత్రు మిత్రత్వము,శీతోష్ణ సుఖ దుఃఖ స్థితి కతీతమైన స్థిత ప్రజ్ఞత్వము కలిగి బ్రహ్మీభూతులగుదురు.ఇచటి వారు లాభ నష్టముల (మన్ను-పొన్ను) భేదము లెరుంగని ద్వందాతీతులైనారు.వీరికి సర్వము బ్రహ్మమయమే.బేధభావన యుండదు. భగవద్గీతలో చెప్పబడిన బ్రహ్మభావము నంది,సమతా భావము గలవారు వీరు. అప్పుడప్పుడు భ్రష్టులవలె,ఉన్మత్తులవలె,శిశువులవలె,భూత,ప్రేత,పిశాచవర్తనులై 

కాన నగుదురు. 

ఏకాంత స్థలములలో

శ్మశాన వాటికలో నుండి 

నిర్వికల్ప సమాధి స్థితి

నందుకొనెడివారు. 

వీరిని జీవన్ముక్తులు,పూర్ణమానవులు, పరమహంసలని పిల్తురు.


ఈ పై పేర్కొనిన వివిధ తంత్ర శాస్త్ర మార్గములలో సామాన్యులు మొదటి నుండి ప్రారంభించి జన్మజన్మల సంస్కారమునొంది చివరకు కౌలాచారమున సిద్ధులగుదురు. 

కాని పూర్వజన్మ సంస్కారము కలవారు మాత్రము సిద్ధాంతాచారము 

నుండియే సాధనచేసి పరమహంస లగుదురు.దీనికి తార్కాణముగా రామకృష్ణపరమహంస ,

తురీయాచారములైన సిద్ధాంత కౌలాచారముల సాధనతో మహా భావన కలిగి వామాచార పరాయణులుగానే సిద్ధినొందిరి.

వీరికి జగజ్జనని పిలిచిన వెంటనే సాక్షాత్కరించెడిదట.

అంతటి మహనీయులు వారు కనుకనే పరమహంసయని పిలువబడిరి.


ఇట్టి తంత్ర రహస్యములను మన దేశములోని హిందువులేగాక హేతువాద ప్రధానముగా గల ఆంగ్లదేశములో పుట్టి, పెరిగి, ఉన్నతవిద్యనభ్యసించి,క్రైస్తవ మత

సిద్ధాంతాచారము కలిగిన వంగదేశ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, పనిచేసిన ప్రఖ్యాత న్యాయశాస్త్రజ్ఞులు,

మేధావులునైన, సర్ జాన్ ఉడ్ రాఫ్ దొర గారు చక్కటి కృషిచేసి కొన్ని విషయములలో భారతదేశము తంత్ర శాస్త్రమునకు ఎంతయో ఋణపడి యున్నదని వాక్రుచ్చినారు.

వైద్య నిపుణులకు కూడ నయముకాని మొండి వ్యాధులు కేవలము మంత్రములచేత నయమగుటను 

వారు స్వయముగా చూచి,పరీక్షించి 

ఏ తన్మాహాత్మ్యమునకు కచ్చెరువంది సంస్కృతభాష నభ్యసించి తంత్ర శాస్త్రములో చక్కని కృషిచేసి,

ఈ గ్రంథములను ఆంగ్లభాషలో వివరించి వ్రాసి,తంత్ర శాస్త్రమును పునరుజ్జీవింపజేసినారు.శరీరము,

ప్రాణము,మనస్సు,బుద్ధి, నాడి,జ్యోతిష, వైద్య,రసాయన, శాస్త్రముల కెంతయో తంత్ర శాస్త్రము దోహదమిచ్చి మహత్తర సేవ గావించినదని వీరు చాటినారు.

శ్రీ మాక్సుముల్లర్ దొరగారు

వేదములకెట్టి సేవ చేసినారో అట్టి సేవనే వీరు తంత్ర శాస్త్రమునకుచేసి,యందు గల శాస్త్రీయ విజ్ఞానమును బయట పెట్టిరి.తంత్ర శాస్త్రముల విలువ ఎట్టిదో

వాని ప్రాధాన్య మెట్టిదో మనకిపుడు బోధపడినది గదా!


మరియు నింకొక విషయము.ఆత్మజ్ఞాన గ్రంథములు రహస్య గ్రంథములని పెద్ద లనినారు.అందువలన రహస్య భాషలోనే ఈ తంత్ర శాస్త్రములను రచియించినారు.దీనినే సంధ్యాభాష యని గూడ యందురు.సంధ్యలో చీకటి వెలుగులున్నట్లు వీనిలో వాడిన పదములకు కూడా రెండర్థములు గలవు.అనగా సామాన్యులకు సామాన్యర్థము,సాధకులకు విశేషార్థములందు బోధపడును.

దీనిచే నివి గోప్యమైనవని చెప్పబడినవి.రహస్యముగా నుంచబడుటచే వీని పవిత్రత చెడకుండా మహిమతో నొప్పియుండుటయైనది.

దీనినే గీతాచార్యుడు

 "జ్ఞాన మాఖ్యాంతం గుహ్యాద్గుహ్యంతరం" అని నుడివియున్నాడు.

ఇట్లు తంత్ర శాస్త్రములు నిగూఢమైన శక్తులతో నిండి సాధకులకు పరమార్థ మార్గదర్శకములై విలసిల్లినవి.

*కార్తీక మాసంలో

 *కార్తీక మాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి.*

దీపావళి మరుసటి రోజు నుంచి మొదలయ్యే *కార్తీక_మాసం *అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి..

న కార్తీక సమో మాసో 

న శాస్త్రం నిగమాత్పరమ్

నారోగ్య సమముత్సాహం 

న దేవః కేశవాత్పరః 

అంటే *కార్తీక_మాసం* లోని ప్రతీ రోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది.. ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం...

*కార్తీక శుద్ధ పాడ్యమి :* తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి గుడికి వెళ్లాలి.. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి.

*విదియ :* సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు.

*తదియ :* అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి.

*చవితి :* నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి.

*పంచమి :* దీనిని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది.

*షష్ఠి :* ఈరోజున బ్రహ్మచారి అర్చకునికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది.

*సప్తమి :* ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి అర్చకునికి దానం ఇస్తే ఆయుఃవృద్ధి ప్రాప్తిస్తుంది.

*అష్టమి :* ఈరోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు.

*నవమి :* నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.

*దశమి :* నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.

*ఏకాదశి :* దీన్నే బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణుపూజ చేస్తే సద్గతులు కలుగుతాయి.

*ద్వాదశి :* ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది.

*త్రయోదశి :* సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.

*చతుర్దశి :* పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.

*కార్తీక పూర్ణిమ :* కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈరోజున నదీస్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.

*కార్తీక బహుళ పాడ్యమి :* ఆకుకూర దానం చేస్తే మంచిది.

*విదియ :* వనభోజనాలు చేయడానికి అనువైన రోజు.

*తదియ :* పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి.

*చవితి :* రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి.

*పంచమి :* చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది.

*షష్ఠి :* గ్రామదేవతలకు పూజ చేయాలి.

*సప్తమి :* జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి.

*అష్టమి :* కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.

*నవమి :* వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు.

*దశమి :* అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి.

*ఏకాదశి :* విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.

*ద్వాదశి :* అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం.

*త్రయోదశి :* ఈరోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.

*చతుర్దశి :* ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.

*అమావాస్య :* పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి.

(సేకరణ)

న్యాయవాది వృత్తి గొప్పతనాన్ని

 *న్యాయవాది వృత్తి గొప్పతనాన్ని చిహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు*

46 మంది దోషులను మరణశిక్ష (ఉరి) నుండి రక్షించాలని సీనియర్ న్యాయవాది వాదించారు.

 అప్పుడు అతని సహాయకుడు వచ్చి అతనికి ఒక చిన్న కాగితం ఇచ్చాడు. న్యాయవాది దాన్ని చదివి జేబులో పెట్టుకుని తన వాదనను కొనసాగించాడు


భోజన విరామ సమయంలో న్యాయమూర్తి అతనిని స్లిప్‌లో మీకు ఏ సమాచారం వచ్చింది అని అడిగారు. న్యాయవాది నా భార్య చనిపోయింది అని అన్నారు. న్యాయమూర్తి ఆశ్చర్యపోయాడు మరియు అప్పుడు మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు?" ఎందుకు మీరు మీ ఇంటికి వెళ్ళలేదు న్యాయవాది ఇలా అన్నార నేను నా భార్య జీవితాన్ని తిరిగి తీసుకురాలేను, కాని ఈ 46 స్వాతంత్య్ర సమరయోధులకు జీవితాన్ని ఇవ్వడానికి మరియు వారు చనిపోకుండా నిరోధించడంలో నేను సహాయపడగలను. 


దీంతో ఆంగ్లేయుడైన న్యాయమూర్తి మొత్తం 46 మందిని విడుదల చేయాలని ఆదేశించారు. 

న్యాయవాది మరెవరో కాదు, 

*సర్దార్ వల్లభాయ్ పటేల్*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

సంస్కృత మహాభాగవతం

 *31.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఇరువదియవ అధ్యాయము*


*జ్ఞాన, కర్మ, భక్తి యోగములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*20.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*యది కుర్యాత్ప్రమాదేన యోగీ కర్మ విగర్హితమ్|*


*యోగేనైవ దహేదంహో నాన్యత్తత్ర కదాచన॥13030॥*


యోగి ఎట్టి నిషిద్ధకర్మలను చేయడు. ఒకవేళ ప్రమాదవశమున (మోహకారణముగా) ఏదైనను అపరాధము జరిగినచో యోగము ద్వారానే తొలగించుకొనుటకు ప్రయత్నింపవలెను. కాని, ఇతర ఉపాయముల జోలికి పోరాదు.


*20.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*స్వే స్వేఽధికారే యా నిష్ఠా స గుణః పరికీర్తితః|*


*కర్మణాం జాత్యశుద్ధానామనేన నియమః కృతః|*


*గుణదోషవిధానేన సంగానాం త్యాజనేచ్ఛయా॥13031॥*


సాధకులు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి, ఆయా కర్మలను ఆచరించుటయే గుణము. అట్లుగాక, అందులకు విరుద్ధముగా పరధర్మములను ఆచరించుట దోషము. ఏలనన, పుట్టుకచేతనే (స్వభావరీత్యా) కర్మలు అనర్థహేతువులు. కావున కర్మలపట్ల విషయాసక్తిని తొలగించుటకే శాస్త్రములు గలవు. ఇట్టి శాస్త్రములద్వారా కర్మలయొక్క గుణదోషములు, విధినిషేధములు వివరింపబడినవి. వీటిద్వారా కర్మలయందలి ప్రవృత్తిని విడనాడి, నివృత్తిమార్గమును అనుసరింపవలెను.


*20.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*జాతశ్రద్ధో మత్కథాసు నిర్విణ్ణః సర్వకర్మసు|*


*వేదదుఃఖాత్మకాన్ కామాన్ పరిత్యాగేఽప్యనీశ్వరః॥13032॥*


*20.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*తతో భజేత మాం ప్రీతః శ్రద్ధాలుర్దృఢనిశ్చయః|*


*జుషమాణశ్చ తాన్ కామాన్ దుఃఖోదర్కాంశ్చ గర్హయన్॥13033॥*


*20.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*ప్రోక్తేన భక్తియోగేన భజతో మాసకృన్మునేః|*


*కామా హృదయ్యా నశ్యంతి సర్వే మయి హృది స్థితే॥13034॥*


నా కథలయందు శ్రద్ధ గలిగినవాడు సర్వకర్మలయందు విరక్తిని పొందినవాడు. సమస్త భోగములకు - భోగ్యవిషయములు, కామ్యములు - కామ్యకర్మలు దుఃఖమయములు అని తెలిసికూడా వాటిని త్యజించుటకు అసమర్థుడైనచో, నా పట్ల శ్రద్ధాళువై దృఢనిశ్చయమును గలిగి అత్యంత ప్రేమభావముతో నన్ను భజింపవలెను. ఆ విధముగా నాయందు భక్తితత్పరుడై భోగములను అనుభవించుచూ, అవి దుఃఖహేతువులని, నిందనీయములు అని మానసికముగా చింతించుచు, వాటిని విడిచిపెట్టలేని దుఃస్థితికి లోలోన నొచ్చుకొనుచుండవలెను. ఈ విధమగా చెప్పబడిన భక్తియోగముద్వారా నిత్యనిరంతరము నన్నే భజించెడు ఆ మునియొక్క హృదయమునందు నేను స్వయంగావచ్చి నిలిచెదను. నిలిచినవెంటనే అతనిలోగల సమస్తభోగవాసనలు నశించిపోవును.


*20.30 (ముప్పదియవ శ్లోకము)*


*భిద్యతే హృదయగ్రంథిశ్ఛిద్యంతే సర్వసంశయాః|*


*క్షీయంతే చాస్య కర్మాణి మయి దృష్టేఽఖిలాత్మని॥13035॥*


సర్వాత్మస్వరూపుడనైన నేను, నా భక్తుని హృదయములో సాక్షాత్కరించిన ఉత్తరక్షణముననే అతని హృదయమునందు గల అనుమానపు ముడులు విడిపోవును. సమస్త సందేహములు తీరిపోవును. అతనిలోగల వాసనలన్నియును సంస్కారములతో సహా సమసిపోవును.


*20.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*తస్మాన్మద్భక్తియుక్తస్య యోగినో వై మదాత్మనః|*


*న జ్ఞానం న చ వైరాగ్యం ప్రాయః శ్రేయో భవేదిహ॥13036॥*


అందువలన నా భక్తియుక్తుడైన యోగి నాయందే చిత్తమును నిలుపుటవలన నాకు ఆత్మీయుడైపోవును. కావున అతనికి జ్ఞానవైరాగ్యములు లేకపోయిననూ, కేవలము నా భక్తివల్లనే అతడు శ్రేయస్సును పొందును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*484వ నామ మంత్రము* 31.10.2021


*ఓం డాకినీశ్వర్యై నమః* 


విశుద్ధి చక్ర అధిష్ఠానదేవత అయిన డాకినీ స్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *డాకినీశ్వరీ* యను అయిదక్షరముల నామ మంత్రమును *ఓం డాకినీశ్వర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ తల్లికరుణచే ఆయురారోగ్యములు, శాంతిసౌఖ్యములు, భోగభాగ్యములు, కీర్తిప్రతిష్టలు సంప్రాప్తమగును.


*విశుద్ధిచక్రనిలయా* యను 475వ నామ మంత్రము నుండి *అమృతాది మహాశక్తి సంవృతా* యను 483వ నామ మంత్రము వరకూ, విశుద్ధిచక్రాధిష్ఠానదేవతయైన డాకినీశ్వరియొక్క విశేషణములు (లక్షణములు) చెప్పబడినవి.


ఈ డాకినీశ్వరి *ఆరక్తవర్ణా* (476వ) యను నామ మంత్రములో) పాటలవర్ణముతో (ఎఱుపు, తెలుపుల మిశ్రమవర్ణముతో) భాసిల్లుచున్నదని చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *త్రిలోచనా* (477వ) యను నామ మంత్రములో మూడునేత్రములు కలిగినదిగా చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *ఖట్వాంగాదిప్రహరణా* (478వ) యను నామ మంత్రములో నాలుగు చేతులందు కపాలము గ్రుచ్చబడిన కర్ర (ఖట్వాంగము), ఖడ్గము, త్రిశూలము, మహాచర్మము ధరించినదిగా చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *వదనైక సమన్వితా* (479వ) యను నామ మంత్రములో ఒకే శిరస్సు గలిగినదిగా చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *పాయసాన్నప్రియా* (480వ) యను నామ మంత్రములో పాయసాన్నమనిన ప్రీతిగలిగినదిగా చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *త్వక్ స్థా* (481వ) యను నామ మంత్రములో చర్మధాతువునందు ఉండి, చర్మమును రక్షించునదిగా చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *పశులోకభయంకరీ* (482వ) యను నామ మంత్రములో అజ్ఞానులై పశుప్రాయులుగా ఉండు సమూహమునకు భయంకరిగా గోచరిస్తుందని చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *అమృతాది మహాశక్తి సంవృతా* (483వ) యను నామ మంత్రములో విశుద్ధి పద్మమునందలి పదహారు దళములందు పదహారుమంది అమృతాది మహాశక్తులచే డాకినీశ్వరి పరివేష్ఠింపబడినది అని చెప్పబడినది.


డాకినీ స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం డాకినీశ్వర్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*483వ నామ మంత్రము* 31.10.2021


*ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః*


అమృతా మొదలైన పదహారుమంది మహాశక్తులచే పరివేష్ఠింపబడి ఉన్న పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అమృతాది మహాశక్తి సంవృతా* యను పదునొకండక్షరముల నామ మంత్రమును *ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి ఆత్మానందానుభూతితోబాటు, అంతఃకరణశుద్ధి మరియు భౌతికపరమైన శాంతిసౌఖ్యములు అనుగ్రహించును.


విశుద్ధిపద్మమునకు పదునారు దళములు గలవు. వానిలో *అ* కారాది *అః* వరకు గల బీజాక్షరములు ఉండును. ంఅదేవిధంగా ఒక్కొక్క బీజాక్షరమునకు ఒక్కొక్క మహాశక్తి చొప్పున పదహారు మహాశక్తులు ఉండును. ఆ శక్తులే అమృతాది మహాశక్తులు. మధ్యలో విశుద్ధిచక్రాధిష్ఠానదేవత అయిన డాకినీశ్వరి ఉంటుంది. ఈ డాకినీశ్వరినే వజ్రేశ్వరియందురు. ఈ వజ్రేశ్వరీదేవి మంత్రమునకు బీజము, శక్తి, కీలకము అన్నియును డ కార సంకేతమగుటచే వజ్రేశ్వరీదేవి డాకినీశ్వరి అయినది. ఈ వజ్రేశ్వరీదేవికి అమృతాది పదహారు మహాశక్తులు చుట్టూ ఉండును గనుక వజ్రేశ్వరీ స్వరూపిణియైన అమ్మవారు *అమృతాది మహాశక్తి సంవృతా* యని అనబడినది. 'అనాహత చక్రమునకు పైన పదునారు అక్షరములుగల విశుద్ధచక్రము గలదు. దాని మధ్య కర్ణికయందు డాకినీదేవి గలదు. విశుద్ధ పద్మదళమునందు అమృత మొదలు అక్షర వఱకు గల పదునారు దేవతలు గలరు. వీరే స్వరరూపలు. విశుద్ధమునకు పైన చంద్రబింబము గలదు' అని స్వచ్చంద్ర తంత్రమునందు గలదు. 


*అమృతాది మహాశక్తుల పేర్లు:*


1. అమృతా, 2. ఆకర్షిణి, 3. ఇంద్రాణి, 4. ఈశాని, 5. ఉషఃకేసి, 6. ఊర్ధ్వ, 7. ఋద్ధిత, 8. ౠకార, 9. కార, 10. షా, 11. ఏకపదా, 12. ఐశ్వర్యా, 13. ఓంకారి, 14. ఔషధి, 15. అంబికా, 16. అఃక్షరా.


పైనుదహరించిన పదహారు మహాశక్తులు వజ్రేశ్వరీస్వరూపిణియైన పరమేశ్వరిని చుట్టి ఉండుటచే *అమృతాది మహాశక్తి సంవృతా* యని అనబడినది.


అమ్మవారికి నమస్కరించునపుడు *ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంస్కృత మహాభాగవతం

 *30.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఇరువదియవ అధ్యాయము*


*జ్ఞాన, కర్మ, భక్తి యోగములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*20.17 (పదిహేడవ శ్లోకము)*


*నృదేహమాద్యం సులభం సుదుర్లభమ్ ప్లవం సుకల్పం గురుకర్ణధారమ్|*


*మయానుకూలేన నభస్వతేరితం పుమాన్ భవాబ్ధిం న తరేత్స ఆత్మహా॥13022॥*


(ఆద్యమ్) మొదటగా మానవదేహము అత్యంత దుర్లభమైనదని గ్రహింపవలెను. అయితే భగవంతుని అపారమైన కృపచేత అది ఎంతయో సులభమైనది. సకలశ్రేయఃఫలములను పొందుటకు ఇదియే ముఖ్యసాధనము. అగాధమైన సంసారసాగరమును సులభముగా దాటిపోవుటకు ఇదియే దృఢమైన నౌక. ఈ నావకు గురువే కర్ణధారుడు. అనుకూలవాయువుగా తోడ్పడుటకు స్వయంగా భగవంతుడే సిద్ధంగా ఉన్నాడు. దైవకృపచే సకలసౌకర్యములు లభించుచున్నవి. కావున వెంటనే - ఏమాత్రమూ జాగు సేయకుండా భవసాగరమును దాటిపోవుటకు సాధకుడు ఉద్యమింపవలెను. ఇంతటి సువర్ణావకాశమును వదిలిపెట్టి చేతులు ముడుచుకొని యుండువాడు ముమ్మాటికీ ఆత్మఘాతకుడే.


*20.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*యదాఽఽరంభేషు నిర్విణ్ణో విరక్తః సంయతేంద్రియః|*


*అభ్యాసేనాఽత్మనో యోగీ ధారయేదచలం మనః॥13023॥*


పురుషుడు కామ్యకర్మల ఫలముగా దుఃఖములకు లోనై వాటియెడ విరక్తుడైనప్పుడు బాహ్యాభ్యంతర ఇంద్రియములను జయించి (జితేంద్రియుడై) యోగమునందు స్థితుడు కావలెను. క్రమముగా అభ్యాసముద్వారా మనస్సును నిశ్చలముగా నాయందే లగ్నముచేయవలెను.


*20.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*ధార్యమాణం మనో యర్హి భ్రామ్యదాశ్వనవస్థితమ్|*


*అతంద్రితోఽనురోధేన మార్గేణాత్మవశం నయేత్॥13024॥*


సాధకుడు మనస్సును స్థిరముగా నిలుపుటకు ప్రయత్నించుచున్నను అది చంచలమై ఇటునిటు పరుగెత్తుచుండును. అప్పుడు అతడు వెంటనే అప్రమత్తుడై ఆ మనస్సును బుజ్జగింపువంటి తగిన ఉపాయములద్వారా వశపఱచుకొనవలెను.


*20.20 (ఇరువదియవ శ్లోకము)*


*మనోగతిం న విసృజేజ్జితప్రాణో జితేంద్రియః|*


*సత్త్వసంపన్నయా బుద్ధ్యా మన ఆత్మవశం నయేత్॥13025॥*


ఇంద్రియములను, ప్రాణములను వశమునందు ఉంచుకొని, మనస్సుయొక్క విశృంఖలత్వమును అదుపు చేయవలెను. అందులకై సాత్త్వికాహారములను స్వీకరించుట మొదలగు ఉపాయముల ద్వారా సత్త్వసంపన్నమొనర్చిన బుద్ధితో మనస్సును వశపరచుకొనవలెను.


*20.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*ఏష వై పరమో యోగో మనసః సంగ్రహః స్మృతః|*


*హృదయజ్ఞత్వమన్విచ్ఛన్ దమ్యస్యేవార్వతో ముహుః॥13026॥*


మొండికేసి దారికిరాని గుర్రమును రౌతు తన మనోభావములకు అనుగుణముగా తిన్నతిన్నగా బుజ్జగించుచు సరియైన దారికి మళ్ళించినట్లు అటునిటు పోవుచున్న మనస్సును మెల్లమెల్లగా సంయమనమొనర్చి భగవత్పరము గావించుటయే పరమయోగము.


*20.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*సాంఖ్యేన సర్వభావానాం ప్రతిలోమానులోమతః|*


*భవాప్యయావనుధ్యాయేన్మనో యావత్ప్రసీదతి॥13027॥*


సాంఖ్యశాస్త్రమునందు తెలిపినరీతిగా ప్రకృతినుండి శరీరపర్యంతము జరుగు సృష్టిక్రమమును మరియు శరీరమునుండి ప్రకృతివరకు జరుగు లయక్రమమునుగూర్చి (అనులోమ ప్రతిలోమ క్రమముగా) చక్కగా మనస్సునందు తర్కించుకొనవలెను. మనస్సు ప్రశాంతమై స్థిరత్వమును పొందువరకును ఈ ప్రక్రియను కొనసాగించుచునే యుండవలెను.


*20.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*నిర్విణ్ణస్య విరక్తస్య పురుషస్యోక్తవేదినః|*


*మనస్త్యజతి దౌరాత్మ్యం చింతితస్యానుచింతయా॥13028॥*


సాంసారిక విషయములవలన దుఃఖముల పాలైనవాడు విసుగు చెంది క్రమముగా వాటియందు విరక్తుడగును. అప్పుడు అతడు తన గురుజనుల ఉపదేశములను చక్కగా అవగాహన చేసికొని పదేపదే తన ఆత్మస్వరూప ధ్యానమనందే నిమగ్నుడగును. ఇట్లు అభ్యసించుటద్వారా మనస్సుయొక్క చంచలత్వము దూరమగును.


*20.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*యమాదిభిర్యోగపథైరాన్వీక్షిక్యా చ విద్యయా|*


*మమార్చోపాసనాభిర్వా నాన్యైర్యోగ్యం స్మరేన్మనః॥13029॥*


'యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు' అను అష్టాంగయోగ మార్గములద్వారాను, తత్త్వవిమర్శనాత్మక విద్యద్వారాను, నన్ను అనన్యభక్తితో ఉపాసింపవలెను. అట్లు ఒనర్చుట వలన మనస్సు చాంచల్యమును వీడి ప్రశాంతమై పరమాత్మయందు లగ్నమగును. అంతేగాని, మనస్సు నిశ్చలమగుటకు మఱియొక ఉపాయములేదు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

స్వామి వివేకానంద


స్వామి వివేకానంద యూనివెర్సిటీలో Law చదువుకునేటప్పుడు..

ఒక తెల్ల ప్రొఫెస్సర్ కి వివేకానందుడు అంటే ఎందుకో నచ్చేది కాదు...!!


ఒక రోజు, డైనింగ్ రూమ్ లో ప్రొఫెస్సర్ లంచ్ చేస్తుండగా..


వివేకానందుడు వచ్చి ప్రొఫెస్సర్ పక్కనే కూర్చోని తన బాక్స్ ఓపెన్ చేస్తుండగా...


ప్రోఫెసర్ ఇలా అన్నాడు..!!

" పంది, పావురం పక్క పక్కన కూర్చోని భోజనం చెయ్యవు అది నువ్వు తెలుసుకోవాలి"


దానికి వివేకానందుడు..!!

ప్రొఫెసర్ తో గొడవెందుకు అనుకుని ( చమత్కారంగా) :

" మీరు దిగులు పడకండి సార్, నేను ఎగిరిపొతా" అని వేరే టేబుల్ దగ్గరకెళ్లిపోయాడు.

(1St Punch👊)


ప్రోఫెసర్ మొహం ఎర్రటి కందగడ్డలా కందిపోయింది...!!

ఎలాగైనా వివేకానంద మీద ప్రతీకారం తీర్చుకోవాలుకున్నాడు..!!


ఆ తరువాత ఒకరోజు క్లాస్ రూమ్ లో...

వివేకానందని ప్రోఫెసర్ ఓ ప్రశ్న వేసారు...!!

"వివేకానందా..!!

నువ్వు రోడ్ మీద నడుస్తున్నప్పుడు..

నీకు రెండు బాగ్ లు రొరికాయి అనుకుందాం...!!

ఒక దానిలో జ్ణానం, ఇంకో బాగ్ లో డబ్బు వున్నాయి. నువ్వు దేనిని తీసుకుంటావు?"


వివేకానందుడు (సందేహించకుండా)...

"అనుమానమెందుకు సర్,డబ్బులున్న బ్యాగ్ నే తీసుకుంటాను" ఆన్నారు..!!


ప్రోఫెసర్ వంకరగా నవ్వుతూ..వ్యంగ్యంగా..

"అనుకున్నా...నీ సమాదానం అదేనని...!!

నేనే నీ ప్లేస్ లో వుంటే, జ్ణానమున్న బ్యాగ్ నే తీసుకుంటా" అన్నాడు..!!


దానికి వివేకానందుడు..!! 

" నిజమే. ... సహజంగా.... ఎవరికి ఏది తక్కువో అదే తీసుకుంటారు కదా సర్..!!"

(2nd Punch👊)


ప్రొఫెసర్ కి తిక్కరేగిపోయింది..!!

అవకాశం, టైమ్ కలిసి వచ్చినప్పుడు...

వివేకానందని వదలకూడదు అని మనసులో ప్రతిజ్ణ పూనాడు..!!


టైము, అవకాశం రెండు కిలిసి రానే వచ్చాయి ప్రొఫెసర్ కి...!!

ఆ రోజు, దిద్దిన ఆన్సర్ పేపర్ లు, క్లాస్ లో ఇవ్వలి..!!


కోపంతో రగిలిపోయు వున్న ప్రొఫెసర్..

వివేకానంద ఆన్సర్ పేపర్ మీద ఈడియట్ అని వ్రాసి వివేకానందకి ఇచ్చాడు..!!


ఆన్సర్ షీట్ అందుకున్న వివేకానంద...

తన సీట్లో కూర్చొని ప్రొఫెసర్ రాసిన " ఈడియట్" అనే Word చూసి...తనని తాను శాంత పరచుకోవడానికి చాలాసేపు పట్టింది

కోపం తగ్గిన తరువాత హుందాగా.. 

ప్రొఫెసర్ టేబుల్ దగ్గరకెళ్ళి...

గౌరవప్రదంగా...

వినమ్రమయిన శాంత స్వరంతో...

"సర్...!! తమరు నా అన్సర్ షీట్ లోసంతకం చేసి మార్కులు వేయడం మరిచారు... (లాస్ట్ పంచ్👊)

my mother .

 *Thanks to the writer, who posted this*…💐🙏🙏


1) *My first restaurant* => * my mother's breast *

2) *My first toilet* => * my mother's laps *

3) *My first school* => * Mother’s kitchen *

4) *My first teacher* => * my mother *

5) *My first doctor* => * it's my mother*

6) *My first thermometer* => * my mother's fingers *

7) *My first friend* => * it's my mother*

8) * My first dresser* => * it's my mother*

9) *My first vehicle* => * my mother's back *

10) My first lawyer => * it's my mother . *


Thank you mom for all you did for giving me life💐🙏🙏


* Long live all mothers*💐🙏🙏


*A mother can easily maintain 6 children*, but 

Unfortunately it would be difficult for children to maintain a *mother*?!?!


*Submitted To all the moms and Children of the world*.

మననాత్రాయతే

 మననాత్రాయతే ఇతి మంత్ర: అంటారు.


నా సందేహమేమిటంటే, మననం అంటే బయటకు వినపడకుండా చేయడమా? (లేక) బయటకు వినపడేటట్లు చేయడమా?


ఈ సందేహానికి కారణం, మంత్రంలోని ఉదాత్త అనుదాత్తాలను పాటించాలంటే, స్వరం వినపడాలికద!

గాజులు

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*స్త్రీలు గాజులు దభరించవలసిన విధి విధానాలు*


🌳🕉️🦚🍁📿🛕🌳🕉️🦚🍁📿🛕


📿చేతికి గాజులందము...చెంపకు సిగ్గులందము’ అంటారు నిజమే...లేత తామరతూడులాంటి కన్నెపిల్ల చేతికి గాజులిచ్చే అందము మరేది ఇవ్వదు. కేవలం అందం కోసమే గాజులయొక్క ప్రయోజనం.. అని అనుకోవడం పొరపాటు.


📿 గాజులు..స్త్రీకి రక్షాకంకణం వంటిది. ఈ గాజులు ధరించడం వెనుక సాంప్రదాయబద్ధమైన ఎన్నో ప్రయోజనాలు దాగివున్నాయి. 


📿 అప్పుడే పుట్టిన పసిబిడ్డలకు దిష్టి తగలకుండా ఉండడానికి నల్లగాజులు వేస్తారు. ఆ పసిబిడ్డ మెలుకువగా ఉన్నప్పుడు చేతులు ఆడిస్తూంటే.. ఆ చేతులకు ఉండే గాజులు..లయబద్ధంగా చేసే చిరుసవ్వడులు..ఆ పసివాణ్ణి పలకరిస్తాయి. అవి వింటూ..ఆ చిన్నారి ఆడుకుంటాడు. 


📿ఇలా ప్రారంభమైన గాజుల ప్రస్థానం..జీవితం చివరి వరకూ కొనసాగుతూనే ఉంటుంది. ప్రాచీనకాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ గాజులు ధరించేవారు. 


📿వీటిని ధరించడం వల్ల మనకు తెలియకుండానే నడకలో ఒక లాలిత్యం, లయ ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు చాలా చిన్నతనంనుంచే ఈ గాజుల వాడకాన్ని అలవాటు చేస్తారు.


📿 ‘జీవితం చాలా విలువైనది..ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. గాజులాగే ఫగిలిపోతుంది’ అనే జీవన సత్యాన్ని చిన్నతనం నుంచే తెలిసేలా చెయ్యడం కోసమే.. ఆడపిల్లలకు ఈ గాజులు ధరింపజేసే ఆచారాన్ని అలవాటు చేసారు.


📿అయితే..‘ఆడపిల్లకే ఈ జాగ్రత్త అవసరమా..మగవాడికి అవసరం లేదా’ అనే సందేహం నేటి ఆధునిక స్త్రీలకు కలగడం తప్పు కాదు.


📿 కానీ..ప్రాచీనకాలం నుంచీ, నేటి వరకూ..స్త్రీని ‘గృహలక్ష్మి’ అని గౌరవించారేగానీ.. పురుషుని ‘గృహవిష్ణువు’ అని గౌరవించిన దాఖలాలు ఎక్కడా లేవు. అందుకే.. ఇల్లాలిని చూసి ఇంటిని చూడమన్నారు...పెద్దలు.


📿 మగవాడు..దుబారా మనిషి అయినా.. ఆ ఇంటి ఆడది జాగ్రత్తపరురాలైతే..ఆ ఇంట్లో ఏ లోటు ఉండదు. అందుకే చిన్నతనం నుంచీ ఆడపిల్లకు జాగ్రత్త అలవాటు చెయ్యడం కోసమే..గాజులు వేసేవారు. రెండు చేతుల నిండా గాజులేసుకుని, పట్టుపరికిణీ కట్టుకుని.,సాక్షాత్తు లక్ష్మీదేవిలా..ఆడపిల్ల నట్టింటిలో తిరుగుతూంటే..చూడడానికి శోభాయమానంగా ఉంటుంది


📿 కానీ... బోసి చేతులేసుకుని..నడకలో ఓ లాలిత్యం లేకుండా పెద్ద పెద్ద అడుగులేస్తూ, రాక్షసిలా ఆడపిల్ల తిరిగితే ఏం బావుంటుంది చెప్పండి.


📿 సరే...గాజుల విషయానికొద్దాం. గాజులు అందానికే కాదు.,సౌభాగ్యానికి కూడా చిహ్నం. గాజులు...తమ రంగునుబట్టి రకరకాల అర్థాలను తెలియచేస్తాయి.


*గాజుల రంగులు ఫలితాలు*


📿ఎరుపురంగు గాజులు శక్తిని,పితృదోష నివారణకు


 నీలంరంగు గాజులు విఙ్ఞానాన్ని,భయ నివారణ


 ఊదారంగు గాజులు స్వేచ్ఛను,ధైర్యాన్ని


 ఆకుపచ్చరంగు గాజులు అదృష్టాన్ని,సద్బుద్ధినీ


పసుపురంగు గాజులు సంతోషాన్ని,సంతానాన్ని


 నారింజరంగు గాజులు విజయాన్ని,రుణ రోగ శత్రు నివారణకు


 తెల్లరంగు గాజులు ప్రశాంతతను,దంపతుల అనుకులన్ని


 నలుపురంగు గాజులు అధికారాన్ని,


 వెండి గాజులు బలాన్ని


బంగారు గాజులు ఐశ్వర్యాన్ని

 సూచిస్తాయి. 


📿పెళ్లయిన ఆడపిల్ల...కడుపు పండి, పురిటికని పుట్టింటికి వచ్చిన వేళ.. ఐదోనెలలో గాని, ఏడోనెలలో గాని, సీమంతం చేస్తారు. 


📿ఈ కాలంలో తొమ్మిదో నెలలో కూడా చేస్తున్నారనుకోండి. అది వేరే సంగతి. 

ఈ సీమంతోత్సవంలో..పేరంటానికి వచ్చిన ప్రతి ముత్తయిదువు...ఆ సీమంతవధువు చేతులకు తలో జత మట్టిగాజులు తొడగడం అనాదినుంచి వస్తున్న ఆచారం. ఇలా గాజులు తొడగడం ఎందుకు అంటే... ఐదో నెలలోనే గర్భస్థ పిండానికి ప్రాణం వస్తుంది. అప్పటినుంచి ఆ స్త్రీ మరింత జాగ్రత్తగా ఉండాలి.


📿 గాజులేస్తే జాగ్రత్త వస్తుందా.? వస్తుంది. గాజులు ఫగలడాన్ని అమంగళంగా, అశుభంగా భావిస్తారు మన భారత స్త్రీలు. అందుకే గాజులు ఫగలడాన్ని ఇష్టపడరు. గాజులు ఫగలకుండా నడవడం కోసమే.. సీమంతంలో గాజులువేసే సాంప్రదాయాన్ని ప్రతిపాదించింది మన శాస్త్రం. 


📿ధనవంతులు రెండు చేతులనిండా ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా..ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టి (గాజు)గాజులు వేసుకోవాలని శాస్త్రం చెప్తోంది.


📿 అమ్మవారి పూజల్లో పసుపు, కుంకుమలతోపాటు గాజులను కూడా ఉంచి పూజించడం మన ఆచారం. ముత్తయిదువులకు గాజులిచ్చి గౌరవించే సాంప్రదాయం మనది. 


🛕ఎంత పేదింటి అన్నయినా..చెల్లెలిని చూడడానికి వచ్చి, తిరిగి వెడుతున్నప్పుడు..ఓ పదో, పరకో చేతిలోపెట్టి..‘గాజులేయించకోమ్మా’ అంటాడు. ఇలా స్త్రీ జీవితంలో గాజులు చోటుచేసుకుని, వారికి అందాన్నిస్తూ, జాగ్రత్తలు నేర్పుతూ, తాము ఫగలకుండా, మన సాంప్రదాయాలు ఫగలకుండా కాపాడుతూ వస్తున్న గాజులను గౌరవిస్తే మన సాంప్రదాయాలను గౌరవించినట్టే.


🦚🦚🦚🦚🦚🦚🦚🦚

శ్రీమద్వాల్మీకి రామాయణం

ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 

(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే పత్రంలోని ఒక అంశం) 


               ----------------------- 


          10. వైద్యశాస్త్రం 


       విదేశీ వైద్య విజ్ఞానం ప్రస్తుత కాలంలో బహుళ వ్యాప్తి చెందియుంది. కానీ దానిని సంపూర్ణ జ్ఞానంగా పరిగణించలేము. ఆ విధానంలో 

  - ఇప్పుడున్న వ్యాధులకూ చికిత్సా విధానం సంపూర్ణంగా గానీ, కొన్నిటికి అసలు చికిత్సేగానీ లేకుండా ఉంది. 

  - క్రొత్త వ్యాధులకు చికిత్స సంగతి సరేసరి. 

    ఈ రెండు సందర్భాలలోనూ, నిరంతర పరిశోధన జరిగినా, ఫలితం సంపూర్ణతను అందివ్వడం జరుగదు. 


      శ్రీమద్రామయణంలో కొన్ని సంఘటనలు, ఆ కాలంలో వైద్యవిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందిందో తెలుస్తుంది. 


సంజీవని 


      ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రామలక్ష్మణులు మూర్ఛిల్లుతారు. 

      అప్పుడు జాంబవంతుడు హనుమంతునితో హిమవత్పర్వతాలకి వెళ్ళాలని సూచిస్తూ, నాలుగు ఓషధులను గూర్చి తెలిపాడు. అవి 

1. మరణించినవారిని బ్రతికించే "మృత సంజీవని", 

2. శరీరంలో ఉన్న ములుకులు తొలగించే "విశల్యకరణి", 

3. విరిగిన శరీరభాగాలని అతికించే "సంధానకరణి", 

4. దేహానికి మంచిరంగు కలిగించే "సువర్ణకరణి". 


    సంధానకరణికి ఈ కాలంనాటి ఉదాహరణ: 

    అవిభక్త ఖమ్మం జిల్లాలో భాగమైన చర్ల సమీపాన ఒక గిరిజన గ్రామంలో 

    పరదేశీ అనే ఒక గిరిజనుడు ఒక పసరును కోడి ఈకతో రాస్తే, విరిగిన ఎముక వెంటనే అతుక్కునేదట. 

    కొలది కాలం క్రాతమే అతను మరణించాడు. 

    అతను ప్రదర్శనగా, 

    మాంసం కోసం చంపిన మేకని, దాని ముక్కలను చేర్చి, ఆ పసరు రాసి విరిగిన ఎముకలు కలవడం చూపేవాడట. 

    అతనినీ, అతని చికిత్సనీ ప్రత్యక్షంగా చూసినవాళ్ళు ఇప్పటికీ సాక్ష్యంగా ఉన్నారు. 

    ఇతరులు ఆ వైద్యం నేర్చుకోవటానికి ఉత్సాహం చూపనందువలన అది అతనితోనే అంతమైపోయింది.

     

 సువర్ణకరణి: 

     హనుమ తెచ్చిన పర్వత ఓషధుల వాసనను ఆఘ్రాణించగానే, రామలక్ష్మణుల దేహంలోని శల్యాలూ తొలగిపోయాయి. 

    రుగ్మత మాయమైంది. 

    మరణించిన వానరులందఱూ ప్రాణాలతో లేచారు. 


    బాలరాజు మహర్షి హిమాలయాలకి వెళ్ళి, మూలికా వైద్యశాస్త్రాన్ని పొంది తెలియజేశారు. 

    దానిని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యరూపంలోకి తీసుకువచ్చింది. అది ఒక సమగ్ర పుస్తకరూపంలో లభించడం గొప్ప విశేషం. 


బాధోపశమనం 


    ఇంద్రజిత్తు వధానంతరం లక్ష్మణునికి సుషేణుడు చికిత్స చేశాడు. 

    లక్ష్మణుడు నాసిక ద్వారా ఉత్తమ ఓషధిని పీల్చగానే, 

    శరీరంలోని శల్యాలన్నీ తొలగిపోయి, 

    గాయాలు మాని, 

    అలసట తగ్గి, 

    స్వస్థతపొంది, 

    క్షణకాలంలోనే బాధోపశమనంతో సంతసించాడట. 

    ప్రస్తుత విదేశీ వైద్యపద్ధతిలో మందులవలె ముందుగా తాత్కాలికోపశమనం పొందే విధానంగా కాకుండా, 

    క్షణంలో తగ్గి, శరీరం పూర్వపు ఆరోగ్యస్థితికి వెంటనే రావడం విశేషం. 


శస్త్ర చికిత్స 


    సీతామాత లంకలో తనలోతనే బాధపడుతూ, 

   "శస్త్ర చికిత్సకుడు గర్భస్థప్రాణిని ఛేదించినట్లు, ఆ రావణుడు తన అవయవాలని శస్త్రంతో ముక్కలు చేస్తాడ"ని అనుకుంటుంది. 

    తద్వారా ఆనాటి శస్త్రచికిత్సా విధానాన్ని సూచనప్రాయంగా తెలియజేసింది. 


అవయవ మార్పిడి 


    కైక దశరథునితో మాట్లాడుతూ, 

    గతంలో అలర్క మహారాజును ఒక వేదపండితుడైన బ్రాహ్మణుడు యాచిస్తే, 

    ఆ రాజు తన నేత్రములను పెకలించి, ఆ బ్రాహ్మణునికి దానం చేశాడని ఉదహరిస్తుంది. 

    తద్వారా అవయవ మార్పిడి చికిత్స ఆ రోజులలోనే ఉండేదని స్పష్టమౌతుంది.


ఆయుర్వేదం 


    ఆయుర్వేదం అద్భుతమైన భారతీయ వైద్యశాస్త్రానికి వేద ప్రామాణికమైనది. 

    అద్భుత చికిత్సలు చేసిన, చరకుడు - శుశ్రుతుడు వంటి ఆయుర్వేద వైద్యులు, 

    అందుబాటులో ఉన్న ఇప్పటి చరిత్ర కాలానికి చెందినవారే కదా!

    భారతీయ వైద్య విధానం ఆయుర్వేద వైద్యపద్ధతికి చెందినది. 


    మనం ఇప్పటిదాకా పరిశీలించిన

శ్రీమద్రామాయణంలోని వైద్యవిధానం ఆ భారతీయ వైద్య ప్రామాణికమైనదని తెలుస్తుంది కదా! 

    అభివృద్ధిచెందిన ఆ సంప్రదాయ వైద్యవిధానాన్ని మనం స్వీకరిస్తే, 

    - ఏ రుగ్మతలకైనా ప్రామాణికమైన చికిత్స, 

    - ఆర్థిక పరమైన అవుసరాలులేక 

    (ఒళ్ళూ ఇల్లూ గుల్లవకుండా) 

    వ్యాధులనుండీ బయటపడే అవకాశం ఉంటుంది కదా!


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం