31, ఆగస్టు 2023, గురువారం

స్కూళ్ల నిర్వాకం

 స్కూళ్ల నిర్వాకం...                                     

ఒక ప్రైవేట్ స్కూల్ కి DEO lnspection ki వెళ్లి, 

ఒక పిల్లాడిని లేపి అడిగారు


DEO: శివ ధనుస్సు విరిచినది ఎవరు ప్రశ్నించారు?


స్టూడెంట్: సార్...నేను కాదు అని ఏడుస్తూ బదులిచ్చాడు.


అది విని DEO క్లాస్ టీచర్ ని కోపంగా ఏంటి ఇది అని అడిగారు.


క్లాస్ టీచర్ : "చ..చ వీడు అలాంటి వాడు కాదు సర్.... నాకు వీడి గురించి బాగా తెలుసు" అని బదులిచ్చాడు.


కోపంతో DEO, HM ని పిలిపించి.. శివ ధనుస్సు విరిచింది ఎవరు అని అడిగితే పిల్లలకి తెలియకపోతే కనీసం క్లాస్ టీచర్ కి అయినా తెలియాలి కదా..అని అన్నారు.


వెంటనే HM: సార్ ఈ క్లాసు పిల్లలు అలాంటి వారు కాదు..6 వ క్లాస్ పిల్లలు చేసి ఉండవచ్చు.... అని అన్నారు.


కోపంతో DEO: స్కూల్ బంద్ చేయండి అని ఆర్డర్ వేసారు.


HM: వెంటనే స్కూల్ కరస్పాండెంట్ ని పిలిపించాడు.


కరస్పాండెంట్: సార్...స్కూల్ మూసేయకండి..కావాలంటే విల్లు ఖరీదు ఎంతైనా నేను ఇస్తాను....అని అన్నాడు.


కోపంతో DEO....విద్యా శాఖ మంత్రి దగ్గరికి వెళ్లి జరిగింది మొర పెట్టుకున్నాడు....


విద్యా శాఖ మంత్రి: ఏయ్.. ఏయ్ పిల్లలు అన్న తర్వాత అల్లరి చేస్తారు, ఏమైనా విరగకొడతారు. అయినా తెలిసి కూడా అక్కడ విల్లుని ఎందుకు వదిలేశారు అని అన్నారు....


DEO...తల పట్టుకుని CM దగ్గరికి వెళ్ళాడు..


CM: దీని గురించి నాకు తెలియదు.ఊరికే నేను ఏమీ చెప్పను..ఇదంతా ప్రతిపక్ష పార్టీల వాళ్ళు చేస్తున్న కుట్ర.... 


విల్లును ఎవరూ విరగ్గొట్టలేదు.... 

ఒకవేళ విరగ్గొడితే దీని పైన CBI enquiry  వేయిస్తాం. 

దీని వెనుక ఎంత పెద్ద వారు ఉన్నా సరే వదలం.

చట్టం ముందు దోషిగా నిలబెడతాం అని చెప్పారు.


DEO గారిని ఎర్రగడ్డ ఆసుపత్రిలో జాయిన్ చేశారు......😃   ఇది మన   చదువుల పరిస్థితి దుస్థితి  

🤣🤣🤣🤣🤣🤣


 ఒక్కరే నువ్వు కోకండి పక్క వారికి కూడా పంపండి.

అనురాగాలకు ప్రతీక కావాలని

 *మనసు పెట్టి ఆలోచించండీ...!* 


*మనం ముస్లింకి వ్యతిరేకం కాదు.. క్రైస్తవానికి వ్యతిరేకం కాదు... వాళ్లంతా వాళ్ల వాళ్ల ఆచారానికి , కట్టుబాట్లకు , సాంప్రదాయాలకీ కట్టుబడి జీవిస్తున్నారు..!* 


*ఒక ముస్లిం మన కోసం హలాల్ చేయని మాంసం తినడు, ఒక క్రిస్టియన్ హిందు దేవతల ప్రసాదం తినడు, బొట్టు పేట్టుకోడు...! అది వాళ్ల ఆచారం సాంప్రదాయం అని గట్టిగా నమ్ముతాడు.  ఇప్పుడు ఆలోచించండి మరి మనమెందుకు మన ధర్మాన్నీ మరిచి హలాల్ తింటాం, చర్చీకీ వెళతాం ఎందుకు? మనలా వాళ్లు ఆలోచించడం లేదెందుకు మనసు పేట్టి ఆలోచించండి..!*  


*వాళ్లకు పార్టీలతో సంబంధం లేదు , వర్గాలతో సంబంధం లేదు వాళ్ల ఆచారం మాత్రమే వాళ్లకు ముఖ్యం. మరి మన ఆచారాలకు సెక్యులర్ భావాలెందుకు మనసు పెట్టి ఆలోచించండీ...!* 


*మనలో కొంతమంది అందరం సమానమే వాళ్లను ఇలా అలా ఎందుకు అనాలి అంటుంటారు. సరే వాళ్లను మనం అనే హక్కు మనకు లేదు , కాని వాళ్లలా మనమెందుకు బతకాలో బతికేవాళ్లను అనకుండా ఎలా ఉండాలో  కాస్త మనసు పెట్టి ఆలోచించండీ...!* 


*ఒక్క ముస్లిం మన స్నేహితుడైతే ఆ స్నేహితుని కోసం మనం హలాల్ చేసి వాళ్లతో పాటే మనం తింటాం. మరి మనం వేల మంది ఉన్నారని ఏ   ఒక్క ముస్లిం అయినా మనతో కలిసి హలాల్ లేని మాంసం మనతో కలిసి తినగలుగుతున్నాడా..? లేదే మరెందుకు మనం హలాల్ చేయడం కాస్త మనసు పెట్టి ఆలోచించండీ...!* 


*ప్రతీ ఆదివారం చర్చికీ వేళ్లి ప్రార్థనలు చేసే క్రిష్టియన్ చెప్పే మాటలు పాటలు వాళ్లతో కలిసి పాడుకుంటాం ఆడుకుంటాం. అదే ఒక క్రిష్టియన్ మన గుడికి వచ్చీ మనతో భజన చేయగలడా..? లేదే! ఎందుకంటే పండగరోజు అయినా మనం మన గుడికి పోకుండా సెక్యూలరిజం అని గప్పాలు కొడుతున్నాం. సాంప్రదాయం పాటించేది వాళ్లా మనమా? కాస్త మనసు పెట్టి ఆలొచించండీ..!* 


*మనకు పార్టీలు ముఖ్యం, మనకు మన సాంప్రదాయాలు వద్దు. పక్కొడు మన దగ్గరికొచ్చి వాడి భావాలను రుద్దుతుంటే కనీసం వాళ్లను చూసైనా నేను వాళ్లలా నా ఆచారాలను పాటిస్తా అన్న సోయి కూడా లేని సన్నాసులం , దరిద్రులం... అవును కదా కాస్త మనసు పెట్టి ఆలోచించండీ...!* 


*మనం ఎవరికీ వ్యతిరేకం కాదు. వాళ్లను అనే హక్కు లేదు . వాళ్లు వాళ్ల మతం చెప్పినట్టు పాటిస్తున్నారు ఆచరిస్తున్నారు.  మరి మనం సిగ్గు శరం వదిలేసి సెక్యులర్ అని చెప్పి పీరీలు మోస్తాం, మసీదులకు వేళ్తాం, ప్రార్థనలు చేస్తాం, చర్చీలకు వెళ్తాం...  ఎందుకు ఈ సెక్యూలర్ కాస్త మనసు పెట్టి ఆలోచించండీ..!* 


*ఈ దేశంలో వాళ్లు వాళ్లలా బ్రతుకుతున్నప్పుడు మనం మనలా బ్రతుకుదాం. కొజ్జాల్లా అటు ఇటు కాకుండా బ్రతకడం ఎందుకు? నీవు నీ రాజకీయ పార్టీని ప్రేమించు , నీ కులాన్ని ప్రేమించు తప్పులేదు. కాని హిందువుగా జీవించు...* *హిందువుగా మరణించు...* 

*అనే భావాన్ని ప్రేమించు...!* 

*కాస్త మనసు పెట్టి ఆలోచించండీ అంతా అర్థమవుతుందీ...!* 


*రాఖీ పండగ ఆర్థికం కాకూడదు , అనురాగాలకు ప్రతీక కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ... నేనిస్తున్న రాఖీ సందేశం ఇది...కాస్త మనసు పెట్టి ఆలోచించండీ...!* 


       *ఎం.ఎస్ లిరిక్స్*

శతకములు సంబంధ 23 పుస్తకాలు(PDF

 *శతకములు సంబంధ 23 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

వేమన శతకము www.freegurukul.org/g/Shathakam-1


కాళహస్తీశ్వర శతకము www.freegurukul.org/g/Shathakam-2


సుమతి శతకం www.freegurukul.org/g/Shathakam-3


కుమార శతకము www.freegurukul.org/g/Shathakam-4


కుమారి శతకం www.freegurukul.org/g/Shathakam-5


దాశరధి శతకము www.freegurukul.org/g/Shathakam-6


భర్త్రుహరి సుభాషితము www.freegurukul.org/g/Shathakam-7


వేమన శతకము www.freegurukul.org/g/Shathakam-8


భాస్కర శతకం www.freegurukul.org/g/Shathakam-9


పుణ్య గానము www.freegurukul.org/g/Shathakam-10


భర్త్రుహరి సుభాషితము www.freegurukul.org/g/Shathakam-11


శతక త్రయము www.freegurukul.org/g/Shathakam-12


శతకాల్లో రత్నాలు www.freegurukul.org/g/Shathakam-13


దాశరథి శతకము-కంచెర్ల గోపన్న-రామదాసు www.freegurukul.org/g/Shathakam-14


కృష్ణ శతకం www.freegurukul.org/g/Shathakam-15


దశావతారను శతకము www.freegurukul.org/g/Shathakam-16


కృష్ణ శతకం www.freegurukul.org/g/Shathakam-17


కలివర్తన దర్పణం www.freegurukul.org/g/Shathakam-18


ఆంధ్ర నాయక శతకం www.freegurukul.org/g/Shathakam-19


మదాంద్ర నాయక శతకము www.freegurukul.org/g/Shathakam-20


మారుతి శతకం www.freegurukul.org/g/Shathakam-21


మూక పంచశతి కటాక్ష శతకం www.freegurukul.org/g/Shathakam-22


నరసింహ శతకము www.freegurukul.org/g/Shathakam-23


ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:

Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul

Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join

Panchang

 


A


 

మన సంస్కృతి

 డాక్టర్ రాధా కుసుమ 

శీర్షిక -మన సంస్కృతి


విజ్ఞాన మణిరత్నాలు

సందర్భ సౌగంధాలు

హృదయ నవోత్సవాలు

మనస్సుద్ది నిధులు

తేనియ మధుర మందస్మితాలు

మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు...!


మహాలక్ష్మి వ్రతమైనా

రాఖీ పౌర్ణమైనా

హొళీ ఉత్సవమైనా

అమ్మవారి జాతర లైనా

సమాజ శ్రేయస్సు కోసం

భావితరాలకు ఆదర్శమై

అనురాగాల వర్షితమై

జనుల సహకార సౌగంధమై

నిరంతర గంగాప్రవాహిణిలా

సాగిపోయే దే కదా

మన ఆచారాల వైభవాలు..!


స్వచ్ఛమైన మనసుతో

సుగంధ సుమధుర పారిజాత పుష్పాలై

ఆనంద శుభ కోయిల రావాలై

ఈర్ష్యా ద్వేషాలకు అతీతంగా

మంచితనపు వ్రత కమ్మదనపు

కథల్లో

నీతిని గ్రహించి

జీవించాలని

తెలిపేదే జీవన శైలి విధానాలే

మన పండుగలు...


హరిత చందనాల చేరువలో

ప్రకృతి రమణీయత కాపాడాలని

సోదర సోదరీ అనుబంధాల

సంతోషపు విరుల ఆనందం

సమాజమంతా పొందాలని

నేస్తాల గృహసీమలు

అనురాగాల శోభితమై

సుఖసంతోషాలు చేకూరాలని

కాంక్షిస్తూ

మీ అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలంటున్నది

మీ రాధా కుసుమం 🌹

శృంగేరీలో తోరణ-గణపతి

 





శృంగేరీలో తోరణ-గణపతి

400 సంవత్సరాల క్రితం మఠం మరియు దాని దేవాలయాలు & ఆస్తులు అధికారం కోసం పోరాడుతూ పొరుగు ప్రాంతాలలోని చిరు పెద్దల దాడికి గురయ్యే ప్రమాదంలో ఉన్నప్పుడు, అప్పటి జగద్గురు శంకరాచార్య, శ్రీ నృసింహ భారతి (IV) ఆలోచనలో పడ్డారు. ధ్యానంలో ఉన్నప్పుడు, తనకు దగ్గలో ఉన్న దేవుని ప్రార్థించమని సూచించిన స్వరం ఆయనకి వినిపించింది. వెతుకుతూ, జగద్గురువు తన తలపైన గుమ్మంలో (అక్షరాలా "తోరణ"పై) శ్రీ మహాగణపతి రూపాన్ని కనుగొన్నారు. అనుష్టానములను పూర్తి చేసి, గణేశుడిని పూజించి, జగద్గురువులు సభకు ప్రసాదాలు పంపిణీ చేశారు. గణేశుడి ఆశీస్సులతో జరగబోయే ప్రమాదం తప్పింది. అప్పటి నుంచి శృంగేరి శారదా పీఠంలోని జగద్గురువులు తోరణ గణపతికి పూజలు చేస్తున్నారు.

శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్వామీజీ కాలంలో శృంగేరి శారదా పీఠంలోని జగద్గురువులు తుంగనది ఉత్తర తీరంలో ఉండేవారు. ఆ నివాసంలో ఒకానొక గుమ్మం పై ఈ గణగతిని కనుగొన్నారు. ప్రస్తుత కాలంలో జగద్గురువుల మకాం తుంగనది దక్షిణ తీరంలో ‘గురునివాస్’కి మారింది. పూర్వం ఆ గణపతి ఉన్న గుమ్మం స్థానంలో గ్రానైట్ తో ‘తోరణ-గణపతి’ ఆలయం నిర్మించడం జరిగింది.

ఈ చరిత్రను ఆధారం చేసుకొని భక్తులు తమకు సమస్యలు వచ్చినపుడు, పెద్ద పెద్ద కార్యాలు నిర్విఘ్నంగా నిర్హించడానికి ఈ గుడికొచ్చి మొక్కుకుంటుంటాారు. మ్రుక్కులను 108 మొదకాలు లేదా 108 టెంకాయలు సమర్పించి తీర్చుకొంటూవుంటారు.




ఈ విషయాలకు మూలం:



Sri Torana GanapatiHistory and description of the Shrine of Sri Torana Ganapati at Sringeri


https://sringeri.net/temples/sri-torana-ganapati

శృంగేరీలో స్తంభగణపతి

శృంగేరీ పట్టణం మధ్యలో ఒక గుట్ట (కన్నడంలో బెట్ట) వుంది. దానిపై ఋష్యశృంగుని తండ్రియైన విభాండక మహాముని తపస్సుచేశాడని చెబుతారు. ఆ స్థలంలో మల్లిఖాార్జునస్వామి (కన్నడంలో మలహానికరేశ్వరస్వామి అంటారు) ఆలయం వుంది. ఈ ఆలయంలో, శ్రీ అభినవ నరసింహ భారతి (1599 - 1622: శంకరాచార్య పరంపరలో 24వ ఆచార్యడు), గణేశుడి చిత్రం లేకపోవడాన్ని గమనించి, స్తంభాలలో ఒకదానిపై పసుపు కొమ్ముతో వినాయకుని బొమ్మను గీసి పూజించారట. అప్పటి నుండి, గణేశుడి రూపురేఖలు క్రమంగా ఉబ్బెత్తుగా పొంగాయట (ఒక బేస్ రిలీఫ్‌ మాదిరిగా). ఇప్పుడు స్తంభంలో ఆ వినాయకుడి వెనుక ఉన్న గ్రానైట్ రాయి లోపల గుల్లబారి బోలుగా ఉంది. మిగిలిన స్తంభ భాగం మాత్రం బలంగానే (solid) ఉంది. దీనినే స్తంభ గణపతి (కన్నడంలో కంబద గణపతి) అంటారు.


ఈ విషయాలకు మూలం:



Sri Sthambha Ganapati - Sri Sringeri Sharada PeethamSthambha Ganapati वन्दारुजनमन्दारं इन्दुचूडतनूभवम् । सिन्दूर बन्धूरमुखं वन्दे स्तम्बेरमाननम् ॥ It is in this temple that, Sri Ahinava Narasimha Bharati(1599 – 1622) 24th Acharya, noticed the absence of any Ganesha image, drew a figure of Ganesha with a piece of turmeric on one of the front pillars and worshipped it. Ever since, the outlines of […]


https://sringeri.net/temples/sri-malahanikareshwara/sri-sthambha-ganapati

Saapaatu


 

సంప్రదాయ పచ్చళ్ళు*

 *SP PICKLES*

*సంప్రదాయ పచ్చళ్ళు*


*బ్రాహ్మణ సంప్రదాయ పద్దిలో బ్రాహ్మణ మహిళలతో తయారుచేయబడిన పచ్చళ్ళు*


**మాదగ్గర తయారు చేసిన అన్ని పచ్చళ్ళు పొడులు సంప్రయం పద్దతిలో కలర్స్ ప్రిసర్వేటివ్స్ లేకుండా క్వాలిటీ పదార్ధాలతో తయారుచేస్తాము**


*పచ్చళ్ళు*:  *1kg cost*


చింతకాయ తొక్కు450/-

ఉసిరి తొక్కు450/-

ఉప్పు గోంగూర  550/-

పులిహోర గోంగూర 750/-

పండుమిర్చి గోంగూర 650/-

పండుమిర్చి 550/-

ఉసిరికాయ 550/-

దబ్బకాయ 550/-

నిమ్మకాయ 550/-

ఆవకాయ(వెల్లుల్లి/లేకుండా) 600/-

బెల్లం ఆవకాయ 600/-

పెసర ఆవకాయ   600/-

మెంతి ఆవకాయ  600/-

నువ్వు ఆవకాయ 600/-

కాలి్ఫ్లవర్ ఆవకాయ 600/-

పనసపోట్టు ఆవకాయ 750/-

పచ్చఆవకాయ  850/-

దోసవకాయ. 600/-

మాగాయ  600/-

*వంకాయ నిల్వ పచ్చడి* 750/-

అల్లం పచ్చడి  650/-

మామిడి అల్లం పచ్చడి 650/-

టొమోటో పచ్చడి 550/-

మునక్కాయ టమోటా 650/-

*పచ్చిమిరప ఆవకాయ* 600/-


*పొడులు* :   *1kg cost*


కంది పొడి 550/

నువ్వులపొడి 500/-

ధనియాల పొడి 500/-

పప్పులపొడి 500/-

కరివేపాకు కారప్పొడి 550/-

అవిశగింజల పొడి 600/-

కొబ్బరి పొడి  550/-

రసం పొడి 500-

సాంబారు పొడి 650/-

నల్లకారం 600/-

పుదీనా కారపోదడి 750/-

మునగాకుపోడి 2000/-

మునగాకు కారపోడి 650/-


*వడియాలు* & *అప్పడాలు*: 


సగ్గుబియ్యం వడియాలు  1kg - 500/-

పెసర అప్పడాలు       650/-

మినప అప్పడాలు 650/-

మిర్చి   850/- *soldout*

గుమ్మడి వొడియలు 850/-

మినపిండి వోడియలు   600/-

*బుడందోసకాయ వొరుగు* 850/-

*మామిడి వొరుగు* 850/-


*మాదగ్గర ఇంకా*


 *చిట్టెంటాపోటు* *పాల ఇంగువ* * లభించును*


*మేము అన్నిరకాల పచ్చళ్ళు పొడులు AS బ్రాండ్ పప్పునూనెతో మాత్రమే తయారు చేస్తాము*


*అన్ని ప్రదేశాలకు కొరియర్ సౌకర్యం కలదు* *చార్జీలు అదనం*

 


*అందరికీ నమస్కారం.  మీరు దేశ విదేశాలలో ఎక్కడున్నా, మేము మీకు సహకరించగలము. మేము ఆహార పదార్థాలు (స్వీట్లు, ఖారా, పొడులు, పచ్చళ్ళు, చలిమిడి) స్వయంగా శుచి, శుభ్రతతో తయారు చేసి ఇయ్యగలము. మీ ఇంట్లో జరిగే ఏ శుభకార్యక్రమానికైనా మేము కావలసిన సరంజామా, మీ బడ్జెట్ ప్రకారం చీరలు, ధోవతులు, లుంగీలు, తువ్వాళ్ళు, జాకెట్టు బట్టలు, కర్చీఫ్లు, రిటర్న్ గిఫ్టులు పసుపు కుంకుమ పాకెట్లు, ఇట్లా మీకు కావాల్సిన ప్రతీది మీ సమయం ఆదా చేస్తూ, మీ ఇంటి దగ్గరకే ఏర్పాటు ఔతాయి. మీరు ఏ వయస్సు వారైనా మీకు పూజకైనా, పెళ్ళికైనా లేదా వ్రతాలకైనా అన్నీ ఏర్పాటు చేయబడతాయి. మీరు మమ్మల్ని సంప్రదించండి *


*దయచేసిమీకుతెలిసిన

బ్రాహ్మణ గ్రూపులలో

ఈ మెసేజ్ ని పంపవలసినదిగా

కోరుకుంటునను*


*జలసూత్రం పల్లవి*

*విజయవాడ*

*సంప్రదించండి* : *7981370664**Gp number*

*08662533848*


*7382665848* Gp or Pp number

శ్రావణ" పౌర్ణమి

 ॐ       "శ్రావణ" పౌర్ణమి శుభాకాంక్షలు. 


🍀అశ్వముఖం కలిగిన దేవుని (హయగ్రీవుడు) "జయంతి"గా ఈ పౌర్ణమికి ప్రసిద్ధివుంది.

    సర్వవిద్యలకూ ఆధారభూతుడు ఈ స్వామి. 


    క్రింది శ్లోక పఠనం ప్రతినిత్యం చేసుకుంటూ ఉంటే, 

    శ్రీమహావిష్ణువే అయిన హయగ్రీవుని అనుగ్రహంతో, 

    విద్యాజ్ఞానంతోకూడిన ఆనందం లభిస్తుంది. 


శ్లో. జ్ఞానానందమయం దేవం 

                 నిర్మల స్ఫటికాకృతిం I 

      ఆధారం సర్వవిద్యానాం 

              హయగ్రీవముపాస్మహే ॥ 


      ఓం శ్రీ లక్ష్మీహయగ్రీవాయనమః 


🍀"జంధ్యాల" పౌర్ణమిగా పిలువబడే ఈ రోజున, ప్రతీ సంవత్సరం, పాత యజ్ఞోపవీతాన్ని తీసి, క్రొత్త దానిని ధరించడం, వేద సంస్కృతిని అనుసరించే వారికి ఆనవాయితీ. 


🍀నేడు ఎక్కువగా ప్రాచుర్యం పొందిన "రాఖీ" పౌర్ణమి కూడా ఈనాడే. 

      సోదరీమణులు తమ సోదరులకు, తమ రక్షణ బాధ్యతతోబాటు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా నిలవాలని కోరుతూ, రాఖీని కడుతుంటారు. 


🍀"నేను నీకురక్ష, నీవు నాకురక్ష. మనమిరువురం దేశానికి రక్ష" అంటూ రక్షాబంధనం ధరించే "రక్షికా" పౌర్ణమికూడా ఇదే. 

      పరస్పరం రక్షించుకుంటూ

ధర్మరక్షణ, సమాజ పరిరక్షణా బాధ్యతలను తెలియజేసే అంతరార్థం ఇందులో ఇమిడివుంది.  


                         =x=x=x=x 


  — రామాయణం శర్మ 

          భద్రాచలం

ఔషధపు సీసా*

 https://chat.whatsapp.com/EgYgApRKGYKGTpoNHBUTsH


*ఒక ఔషధపు  సీసా* 

                ➖➖➖✍️

*ఈ ప్రపంచాన్ని నడిపించేది ఎవరు?*


```

రాజస్థాన్‌ లో  ‘రమేష్ చంద్ర’ అనే దయగల   ఒక శ్రీకృష్ణుని  భక్తుడు ఉండేవాడు.


అతనికి ఒక మందుల దుకాణం ఉండేది.   షాపులో ఒక మూలన శ్రీకృష్ణుడి చిన్న చిత్రం ఉంది.ప్రతిరోజూ దుకాణం తెరిచిన తర్వాత,తన చేతులు కడుక్కొని, ఆ దేవుని బొమ్మను శుభ్రం చేసి, దీపం, ధూపం మొదలైన వాటిని చాలా భక్తితో వెలిగించేవాడు.


అతనికి రాకేష్ అనే కొడుకు కూడా ఉన్నాడు, తన చదువు పూర్తి చేసి తండ్రితో పాటు దుకాణంలో కూర్చునేవాడు. తన తండ్రి రోజూ ఇదంతా చేయడం చూస్తూ ఉంటాడు.


నవీన యుగంలో చదువుకున్న యువకుడు అవడంవల్ల తన తండ్రితో, దేవుడు అంటూ ఎవరూ లేరని, ఇదంతా మన మనస్సు యొక్క భ్రమ అని వివరించేవాడు.


సూర్యుడు తన రథంలో విశ్వం చుట్టూ తిరుగుతున్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి,     భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని సైన్స్ రుజువు చేసిందని చెప్తూ.. ఇలా ప్రతి రోజూ సైన్స్‌ నుండి కొత్త ఉదాహరణలను ఇస్తూ,దేవుడు లేడని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.


తండ్రి అతనిని ఆప్యాయంగా చూసి నవ్వేవాడు తప్ప ఈ అంశంపై వాదించడానికి లేదా చర్చించడానికి ఇష్టపడేవాడుకాదు.

 

కాలం గడిచేకొద్దీ తండ్రి వృద్ధుడయ్యాడు. ఇప్పుడు తన అంతం ఆసన్నమైందని బహుశా అతను తెలుసుకుని ఉంటాడు... అలా ఒకరోజు తన కొడుకుతో ఇలా అన్నాడు… “నాయనా,నువ్వు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా, నువ్వు కష్టపడి పని చేస్తూ, దయతో, నిజాయితీగా ఉంటే చాలు. అయితే నేను చెప్పే ఈ ఒక్క మాట విని, పాటిస్తావా?”

 

కొడుకు.., “అలాగే నాన్నా, తప్పకుండా పాటిస్తాను”, అని అన్నాడు.


తండ్రి ఇలా చెప్పాడు, "నాయనా, నా మరణానంతరం, ప్రతిరోజూ దుకాణంలో ఉన్న దేవుని బొమ్మను శుభ్రం చెయ్యి; రెండవది, నువ్వు ఎప్పుడైనా ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే, చేతులు జోడించి,    శ్రీకృష్ణునికి నీ సమస్యను చెప్పుకో. నేను చెప్పినట్లు ఈ ఒక్క పని చెయ్యి చాలు.”


కొడుకు ఒప్పుకున్నాడు.


కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయాడు, కాలం అలా గడిచిపోతూ ఉంది.


ఒక రోజు జోరున వర్షం కురుస్తోంది. రాకేష్  రోజంతా షాపులో కూర్చునే ఉన్నాడు, కస్టమర్లు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఆపై కరెంటు కూడా ఇబ్బంది పెడుతోంది.


ఆ చీకటిలో అకస్మాత్తుగా వర్షంలో తడుస్తూ ఓ కుర్రాడు పరుగు పరుగున వచ్చి “అన్నా... ఈ మందు కావాలి... మా అమ్మకి చాలా జబ్బుగా ఉంది... వెంటనే ఈ మందు నాలుగు చెంచాలు  వేస్తేనే ... అమ్మ  బతుకుతుందని  డాక్టర్ చెప్పారు... నీ దగ్గర ఈ మందు ఉందా?” అని అడిగాడు.


రాకేష్ మందుచీటి చూసి వెంటనే “ఆ...నా దగ్గర ఉంది” అని వెంటనే ఆ చాకటిలోనే  తీసి ఇచ్చాడు.


బాలుడు చాలా సంతోషించి, వెంటనే మందుసీసాతో వెళ్ళిపోయాడు.

***************


అయితే ఇది ఏమిటి!!


అబ్బాయి వెళ్లిన కొద్దిసేపటికే రాకేష్ కౌంటర్ వైపు చూడగానే చెమటలు పట్టాయి... కొద్దిసేపటి క్రితం ఓ కస్టమర్ ఎలుకల మందు సీసా తిరిగి ఇచ్చేసి(రిటన్ చేసి)వెళ్ళాడు. లైట్లు వెలగకపోవడంతో లైట్లు వచ్చింతర్వాత దానిని సరైన స్థలంలో పెడదామని భావించి రాకేష్ కౌంటర్ పై సీసాను అలాగే వదిలేశాడు.  అయితే మందు కోసం వచ్చిన ఈ బాలుడు తన మందు సీసాకు బదులు ఎలుకల మందు సీసాను తీసుకెళ్ళాడు... ఆ బాలుడు నిరక్షరాస్యుడు కూడా.


“ఓరి భగవంతుడా!” అని రాకేష్ నోటి నుండి అసంకల్పితంగా ఆ మాటలు వెలువడ్డాయి, “ఏమిటి ఈ విపత్తు!” అనుకుని,   అప్పుడు తన తండ్రి మాటలు గుర్తుకొచ్చి, వెంటనే, ముకుళిత హస్తాలతో, బరువెక్కిన హృదయంతో శ్రీకృష్ణుని చిత్రపటం ముందు ప్రార్థించడం ప్రారంభించాడు…. "ఓ ప్రభూ! మీరు ఉన్నారని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. మీరు నిజంగా ఉన్నట్లయితే, దయచేసి ఈ రోజు ఈ అవాంఛనీయ సంఘటన జరగనివ్వకండి. తన కొడుకు చేతిలో నుండి తల్లిని విషం త్రాగనివ్వకండి! ప్రభూ ఆ విషాన్ని త్రాగనివ్వకండి!!”

***********


"అన్నా!" అని అప్పుడే వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది... 


"అన్నా, నేను బురదలో  జారిపోయాను, మందు సీసా కూడా పగిలిపోయింది! దయచేసి నాకు మరో సీసా ఇవ్వవా", అని అడిగాడు.


ప్రేమపూరితమైన చిరునవ్వుతో ఉన్న భగవంతుని చిత్రాన్ని చూస్తూండగా రాకేష్ ముఖంపై కన్నీళ్లు కారడం మొదలయ్యాయి!!!


ఆ రోజు, ఈ సమస్త విశ్వాన్ని నడిపేవారు ఎవరో ఉన్నారని అతనిలో ఒక విశ్వాసం మేల్కొంది..!         కొందరు ఆయన్ని భగవంతుడంటే,      మరికొందరు సర్వోన్నతుడు అంటారు, కొందరు సర్వవ్యాపి అని, మరికొందరు దైవిక శక్తి అని అంటారు!✍️


 ♾ ♾ ♾ ♾ ♾ ♾ ♾ ♾ 


ప్రేమ, భక్తితో నిండిన హృదయంతో చేసిన ప్రార్థన ఎప్పుడూ ఆలకించబడుతుంది✍️```

           *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

రాయల వర్ణనా వైభవము!

 శుభోదయం🙏


రాయల వర్ణనా వైభవము!


గోవర్ధనగిరిధారి మురారి!

   

ఆయత యుష్మదాకృతి కరాగ్ర నగాంచల వాంత వారి ధా

రాయుత చంద్రకాంత ఫలకావళి బింబితయై వెలుంగ నా

రాయణమూర్తిమ త్కవచ రత్నముచే బరిరక్ష గాంచె నా

నో యదువీర వృష్టి బసి యూరడ బ్రోవవె సప్త రాత్రముల్;

ఆముక్తమాల్యద-4-ఆ.వర్షావర్ణనము.


          యాదవులపైకోపించి దేవేంద్రుడు రాళ్ళవానగురియిమచుచుండ వారిని రక్షించుటకయి కన్నయ్య గోవర్ధన ధారియయ్యెను.

      యాదవులందరు సపరివారముగా

నాపర్వతఛత్రముక్రిందకుఁజేరి ప్రాణభయవిముక్తులైనారు.

        అదీ ఇక్కడిదృశ్యము.


కృష్ణా !!నీవుగోవర్ధనమెత్తిపట్టఁగా భయంకరమైన యావానకు జారిపడుతున్న చంద్రకాంతశిలాఖండములలోను, ఆవర్షధారలలోనూ,నీరూపే ప్రతిఫలింప,

నారాయణ కవచధారులై గోకుల సహితముగా సర్వులురక్షింపబడుచున్నారో ?యనునట్లున్నదయ్యా! ఆదృశ్యము!!

కన్నయ్యా!నీమహిమలనంతములు.అని,

         చక్కని యుత్ప్రేక్షతో నా గోవర్ధనగిరిధారి దృశ్యమున కూపిరులూదెను.

     అనిదంపూర్వమైన ఇట్టివర్ణనలు రాయలకు వెన్నతో బెట్టినవిద్య!

                                     స్వస్తి!🙏🙏🙏🙏🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷

భార్యభర్తలు ఆనందంగా గడపాలి.

 విడాకులు పొందటానికి మనదేశంలో 6 నెలల నుంచి 20 ఏళ్ల వరకూ పట్టొచ్చు.అమెరికాలో 2 ఏళ్లు, ఐరోపా దేశాల్లో 6 ఏళ్ల సమయం పడుతుంది.


ఎక్కడైనా

సవరించు

హిందూ మహి ళ ఎక్కడైనా విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని, ఇందుకు హిందూ వివాహ చట్టం అనుమతిస్తుందనీ మద్రాసు హైకోర్టు ప్రకటించింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్-19కి సవరణలు చేయడం ద్వారా భారత్‌లో ఉన్న మహిళ విదేశాల్లోని తన భర్త నుంచి విడాకులు కోరుతూ, తాను నివసిస్తున్న ప్రాంతానికి చెందిన కుటుంబ న్యాయస్థానంలోనే కేసు దాఖలు చేసుకోవచ్చు.


వైవాహిక జీవితం సజావుగా సాగాలంటే

సవరించు

భార్యా భర్తలకు ఒకరి పట్ల ఒకరు ప్రేమ, నమ్మకం, బాధ్యత కలిగియుండాలి.

సంసార జీవితంలో సంభోగం (సెక్స్) అనేది ముఖ్య భాగం. రోజుకి ఒక్కసారైనా శారీరకంగా కలవాలి.

భర్త సమకూర్చడంలోను, భార్య చక్కబెట్టడంలోను తప్పనిసరిగా బాధ్యత వహించాలి.

ఇద్దరూ కష్టపడేది పిల్లలకోసమే అని గ్రహించాలి.

భార్యా భర్తలు సాధ్యమైనంతవరకూ ఒకరిపై ఒకరు ఆధారపడాలి.

మితిమీరిన వ్యక్తిగత స్వేచ్ఛ ప్రమాదకరం అని గ్రహించాలి.

రోజులో ఎక్కవ సమయం భార్యభర్తలు కలిసి ఆనందంగా గడపాలి.

జీవితభాగస్వామి గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మరాదు.

వైవాహిక జీవితంలోని విషయాలు, భర్త/భార్య యొక్క వ్యక్తిగత విషయాలు తల్లిదండ్రులతో గాని, ఇతరులతోగాని పంచుకోరాదు.

తప్పని పరిస్థితుల్లో దాంపత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను తెలివిగా పరిష్కరించగలవారితో మాత్రమే చర్చించాలి.

వివాహం ఆనేది స్త్రీ పురుషుల మధ్య విడరాని శాశ్వత బంధం అని భార్యా భర్తలు గుర్తించాలి.

Panchaag

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


గురువారం, ఆగష్టు 31, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

నిజ శ్రావణ మాసం - శుక్ల పక్షం

తిథి:పౌర్ణమి ఉ 8.03 వరకు తదుపరి బహుళ పాడ్యమి తె5.39వరకు

వారం:గురువారం (బృహస్పతివాసరే)

నక్షత్రం:శతభిషం రా8.22 

యోగం:సుకర్మ రా8.39 

కరణం:బవ ఉ8.03  తదుపరి బాలువ రా6.50 ఆ తదుపరి కౌలువ తె5.39

వర్జ్యం:ఉ.శే.వ.6.13వరకు మరల రా2.21 - 3.50

దుర్ముహూర్తము:ఉ9.56 - 10.45 & మ2.54 - 3.44

అమృతకాలం:మ1.40 - 3.09

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30

చంద్ర రాశి:  కుంభం

సూర్యోదయం:5.48

సూర్యాస్తమయం: 6.13


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

తప్పుడు ప్రచారమని

 లవ్ జిహాద్ - ఇది ఒక తప్పుడు ప్రచారమని, హిందూ ముస్లింలను వేరు చేసి కుట్ర అని,అమాయకులైమా ముస్లిం యువకులను ఉన్మాదులుగా చిత్రీకరించేందుకు కొంత మంది హిందుత్వ వాదులు చేస్తున్న కుట్ర అని అంటుంటారు.


అయితే అలంటి ప్రశ్నలనింటికీ ప్రత్యక్ష ఉదాహరణ,సమాధానాలు ఈ రెండు లవ్ జిహాద్ కేసులు


గత రెండు నెలల క్రితం నిజామాబాద్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో వివాహం కోసం దరఖాస్తు చేసుకున్న హిందూ అమ్మాయి సోని సోలంకి ,ముస్లిం అబ్బాయి అజిమ్ అస్లాం ల దరఖాస్తు ఫారం ఫోటో సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అయింది.


ఆ మొత్తం కథను వెతుకుతూ వెళ్లగా యావత్ సమాజం విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి, సోని అనే అమ్మాయి మహారాష్ట్ర నాగ్ పూర్ కు చెందినది, ఈ అస్లాం అనే అబ్బాయి హైదరాబాద్ కు చెందిన వాడు వీరిద్దరికీ నకిలీ చిరునామా తో నిజామాబాద్ లో పెళ్లి చేయాలని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఏర్పాట్లు చేశారు, ఒక 10 రోజుల నిరంతర వెతుకులాట,పోరాటం తర్వాత సోని అనే అమ్మాయి మనకి టచ్ లోకి రావడం వల్ల ఆ అమ్మాయికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఆ పెళ్లిని తానే స్వయంగా రద్దు చేసుకుంది.


ఈ సోని అనే అమ్మాయి ఎంతో ఉన్నత విద్యావంతురాలు,వైద్య వృత్తి లో చేరాల్సిన అమ్మాయి,మంచి ఆర్థికంగా స్థిరపడిన కిటుంబానికి చెందినది


ఈ అస్లాం అనే వాడు 10వ తరగతి కూడా పాస్ కాలేదు,కనీసం అడ్రస్ లేని వ్యక్తి కేవలం మాయ మాటల ద్వారా మాత్రమే ఆ అమ్మాయిని ప్రేమ లో దింపి పెళ్లి దాకా తీసుకొచ్చాడు.


ఇప్పుడు దాదాపు అలాంటిదే మరో లవ్ జిహాద్ కేసు కామారెడ్డి రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఉన్నట్టు మన దృష్టికి రాగానే వెంటనే కామారెడ్డి కి వెళ్లి అక్కడి రిజిస్ట్రార్ గారికి వినతిపత్రం ఇచ్చి, వెంటనే ఆ అమ్మాయి వివరాలు, కుటుంబం అంతా తెలుసుకుని చివరకు ఆ అమ్మాయికి కూడా వాస్తవాలు చెప్పి,కౌన్సెలింగ్ నిర్వహించిన కారణంగా ఈ కుట్ర నుంచి ఈ అమ్మాయి కూడా తనకు తానే బయటపడింది.


ఇది చాలా పకడ్బందీగా జరుగుతున్న కుట్ర అని చెప్పడానికి ఇంతకన్నా ఋజువులేం కావాలి.


దాదాపు 10సం రాలుగా నేను,నాతో పాటు నడుస్తున్న సోదరులు, కార్యకర్తల సహకారంతో నాశక్తి మేర నేను పోరాడుతూనే వున్నాను,కానీ మా దృష్టి కి రాకుండా ఇంకెన్నో కుట్రలు జరుగుతున్నాయి, అందుకే అందరం జాగ్ర వహిద్దాం

ఇట్టి కార్యక్రమంలో పటేల్ ప్రసాద్ ,బంటు ప్రవీణ్ ,సుధాకర్, రవి, నరేష్ సాయి కిరణ్, చైతన్య, రాహుల్, ధీరజ్, రవి, తరుణ్, వంశీ, తదితరులు పాల్గొన్నారు

                            మీ 

                   పటేల్ ప్రసాద్ 

                        ఇందూర్

పంచాంగం 31.08.2023 Thursday,

 ఈ రోజు పంచాంగం 31.08.2023 Thursday,

 

స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస శుక్ల పక్ష: పౌర్ణమి తదుపరి ప్రతిపత్తి తిధి భృహస్పతి వాసర: శతభిషం నక్షత్రం సుకర్మ యోగ: బవ తదుపరి బాలవ తదుపరి కౌలవ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


పౌర్ణమి ఉదయం 07:05 వరకు తదుపరి పాడ్యమి రాత్రి 03:19 వరకు.

శతభిషం సాయంత్రం 05:46 వరకు.

సూర్యోదయం : 06:05

సూర్యాస్తమయం : 06:27

వర్జ్యం : రాత్రి 11:25 నుండి 12:50 వరకు.

దుర్ముహూర్తం: పగలు 10:12 నుండి 11:02 వరకు తిరిగి మధ్యాహ్నం 03:09 నుండి 03:59 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం : ఉదయం 07:30 నుండి 09:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

30, ఆగస్టు 2023, బుధవారం

భూచక్రగడ్డ విశేషాలు -

 భూచక్రగడ్డ విశేషాలు  -


       సకల చరాచర సృష్టికి ఆధారభూతమైన ఈ భూమి మీద ఎన్నో వింతలు , విశేషాలు ఉన్నాయి. అవి నిగూఢముగా ఉన్నాయి. వాటిలో వృక్షజాతిలో ఎన్నో విచిత్రాలు కలవు. నేను  ఛత్తీస్ గడ్ అడవులలో వెదురుబొంగులు కొట్టిన తరువాత భూమి యందు ఉండు బొంగు ముక్క నుంచి తెల్లటి వెలుగు రావటం గమనించాను. అలా కొన్ని ప్రదేశాలలో మాత్రమే కనిపించింది. సూర్యోదయం అయ్యేప్పుడు పూర్తిగా సూర్యునివైపు తిరిగే చెట్లు ఉన్నాయి అని అక్కడి కొండజాతివారు చెప్పారు . వారి వైద్యవిధానం కూడా బహుచిత్రంగా ఉన్నది. చెయ్యి విరిగినవారికి కేవలం మూడురోజుల్లో చెయ్యి ఎముక అతుక్కునే విధంగా చెయ్యగలరు. వారు ఉపయోగించే మొక్కని మాత్రం నాకు చూపించలేదు.  నా కాలుకి దెబ్బతగిలి రక్తం పోతున్నప్పుడు వెంటనే అక్కడ ఉన్న వెదురుబొంగు పైన పచ్చరంగులో ఉన్నది చాకుతో గీకి మెత్తటి చూర్ణం చేసి దానికి సున్నం కలిపి నా గాయం పైన చల్లి అద్దడం జరిగింది.వెంటనే రక్తస్రావం ఆగిపోయింది. ఆ తరువాత ప్రతినిత్యం దానిపైన వేయుటకు మరికొంత చూర్ణం ఇచ్చారు . ప్రతినిత్యం ఉదయం , సాయంత్రం దానిపైన చల్లడం వలన అది ఒక చెక్కు మాదిరి గట్టిగా అయ్యి గాయం నయం అయ్యాక ఊడి వచ్చింది. అక్కడివారు చెప్పినదాని ప్రకారం గాయం అయినపుడు ఎటువంటి ఇంజెక్షన్స్ తీసుకోరు. కేవలం దీనితోనే వారు ఎటువంటి గాయాన్ని అయినా మాన్పుకుంటారు. ఇదంతా మీకు చెప్పడానికి ప్రధాన కారణం ఎమిటంటే ప్రకృతిలోని వృక్షజాతుల్లో అంత గొప్ప ఔషధవిలువలు ఉన్నాయి. 


          ఇలాంటి వృక్షవిచిత్రాలలో ఒకటైన భూచక్రగడ్డ గురించి మీకు వివరిస్తాను. ఇప్పుడు రహదారుల పక్కన భూచక్రగడ్డ పేరు చెప్పి అడివి లో దొరికే కొన్ని గడ్డలను అమ్ముతున్నారు. అసలైన భూచక్రగడ్డ అనేది పాత ఎద్దులబండి చక్రం అంత వెడల్పుగా ఉంటుంది. ఇది అత్యంత దట్టమైన కీకారణ్యాలలో మాత్రమే లభించును. కొన్ని చోట్ల ఈతచెట్ల కింద అత్యంత అరుదుగా ఉంటుంది. ఇది ఏ వృక్షం కింద అయితే ఉంటుందో ఆ వృక్షం పైన బంగారు రంగులో ఒక తీగ అల్లుకుని ఉంటుంది. భూమిలో ఉన్న గడ్డకు చెట్టు పైన ఉన్న తీగకు మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. ఆ రెండు గొప్ప అయస్కాంత శక్తితో సంబంధం ఏర్పరచుకొని ఉంటాయి. 


             భూమిలో గడ్డ ఉన్న ప్రదేశాన్ని సరిగ్గా గుర్తించుటకు ఆ ప్రదేశం మొత్తం రెల్లుగడ్డి పరిచి నిప్పు అంటించండి. కేవలం గడ్డ ఉన్న ప్రదేశంలో రెల్లుగడ్డి ఏ మాత్రం చెక్కుచెదరదు. మిగిలిన గడ్డి కాలిపోవును. కాలని ప్రదేశం ఉన్న భాగం అంతా ఆ గడ్డ ఉన్నది అని నిర్ధారించుకొని ఆ ప్రదేశాన్ని శుభ్రపరచి ఇష్టదైవాన్ని ప్రార్ధించి చాలా జాగ్రత్తగా తవ్వడం ప్రారంభించాలి . ఇది అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని. తవ్వే సమయంలో ఏ మాత్రం భూమి అదిరినను ఆ గడ్డ ఆ ప్రదేశం నుంచి జరిగిపోవును. కావున అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని.


           ఈ గడ్డ లభించడం అంటే అమృతం లభించడంతో సమానం . ఈ గడ్డ మందం 4 అంగుళాల నుండి 20 అంగుళాల వరకు ఉంటుంది. ఇది తీపిగాను మరియు వగరు , చిరుచేదు మిశ్రమముగా ఉండును. దీని మోతాదు 30 గ్రాముల ముక్క తిని స్వదేశీ ఆవుపాలు తాగవలెను. దీనిని జాగ్రత్తగా నిలువచేసికొని మండలం (40 ) రోజులపాటు వాడిన శరీరము నందలి సర్వరోగములు నివారణ అగును. దేహము అత్యంత కాంతివంతం అయ్యి బంగారు రంగులో మారును . నరములు శక్తిమంతం అయ్యి మెదడుకు అమితమైన బలం కలిగి ఏకసంథాగ్రాహి అవుతాడు. ముసలితనాన్ని పోగొట్టగల శక్తి దీనికి ఉన్నది. దీనిని ఆయుర్వేదంలో " కాయసిద్ది " అని పిలుస్తారు . దీర్గాయుష్షును ప్రసాదించును.


        పైన చెప్పినవన్నీ అసలయిన భూచక్రగడ్డని సాధించి వాడినప్పుడు మాత్రమే కలుగుతాయి.


   

   మరింత సంపూర్ణ మరియు వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


  

తుం గ భ ద్రా న ది

 శు భో ద యం!👏👏

              చొప్పకట్ల.


తుం గ భ ద్రా  న ది

...........................


గంగా సంగమ మిచ్చగించునె, మదిన్  కావేరి  దేవేరిగా 

అంగీకారమొనర్చునే, యమునతో ఆనందమున్ పొందునే, 

రంగత్తుంగ తరంగ హస్తములతో రత్నాక రేంద్రుండు నీ 

అంగంబంటి సుఖించునేని, గుణభధ్రా తుంగభద్రా నదీ!


తెనాలి రామకృష్ణ కవి

పాండురంగ మాహాత్మ్యము

ప్రథమాశ్వాసం

139 వ పద్యం


తెనాలి రామకృష్ణ కవి తుంగభద్రానదిని స్తుతిస్తున్నాడు. 


ఓ తుంగభద్రా నదీ!

నీవు గుణభద్రవు, నీవు సముద్రునితో కలవడం లేదు. ఒకవేళ, తన ఉత్తుంగ తరంగ హస్తాలతో రత్నాకరేంద్రుడైన సముద్రుడు నీ స్పర్శా సౌఖ్యాన్ని గనక పొంద గలిగి వుంటే, అతడు తానిప్పుడు అనుభవిస్తున్న గంగాసంగమాన్ని ఇష్టపడతాడా? కావేరిని దేవేరిగా అంగీకరిస్తాడా? యమునతో ఆనందాన్ని పొందుతాడా? 

అవేవీ ఆ నదులతో పొందబోడని పద్యభావం.


ఈ పద్యంలో సముద్రంలో ప్రత్యక్షంగా కలిసే నదులు రెండు - గంగ, కావేరి. అట్లా కలవని ఉపనదులు రెండు - యమున, తుంగభద్ర. తక్కిన నదీ సముదాయాన్ని కవి పేర్కొనడం లేదు. యమున శాఖానది. త్రివేణి వద్ద గంగతో సంగమిస్తుంది. కాకపోతే, సముద్రుడు యమునతో కూడా ఆనందాన్ని పొందుతున్నాడని వక్కాణిస్తున్నాడు. అంటే, యమునానది, గంగతో బాటు రహస్యంగా ప్రవహించి, సముద్రునితో రహస్య దాంపత్యం నెరపుతున్నదని కవి భావం. అందుకే యమునతో "ఆనందమున్ పొందునే" అంటున్నాడు.

 

విశ్వనాథ వారు ఈ పద్యం గురించి రాస్తూ ఇట్లా అంటారు: "యమున ప్రయాగ వద్ద గంగతో కలిసి ఆమె వెనక దాగికొని వెళ్ళుచున్నది. గంగకు కూడా తెలియకుండా వెళ్ళు చున్నదేమో! సముద్రునకు యమున తోడి సంగమం చాల రహస్య సంగమం. అందుచేత అతడధికమైన సుఖాన్ని పొందుచున్నాడు. అందుకనియే గంగా కావేరుల విషయంలో ఉపయోగించి ఆనంద శబ్దమును వాడినాడు. గంగా కావేరితో సంసారం చేయుచున్నాడు. యమునతో ఆనందమును పొందుచున్నాడని అర్థము" .


ఇది విశ్వనాథవారి వ్యాఖ్య. మరి తుంగభద్ర విషయం? ఆ నది సముద్రునితో రహస్య కాపురం చెయ్యడం లేదని, ఒక్కసారి గనక తుంగభద్రా సౌఖ్యం సముద్రునికి కలిగితే, యమునను పరిత్యజించి, తుంగభద్ర తోనే ఆనందాతిరేకాన్ని పొందుతాడనీ కవి తాత్పర్యం.


ఇదంతా రామకృష్ణ కవి పద్యరచనలో చూపించే గడుసుదనం.


శబ్ద సౌందర్యంలో ఈయన ఎవరికీ తీసిపోడు. ఈ పద్యంలో తుంగభద్ర పొంగులను చూపడానికి శార్దూల వృత్తాన్ని ఎన్నుకున్నాడు. ఇతర నదులను వర్ణిస్తున్నా ఆయన ధ్యాస తుంగభద్ర పైనే. అందుకే అందుకు అనుగుణమైన పాదప్రాసను ఎన్నుకున్నాడు. గంగాసంగమము, అంగీకార మొనర్చడము, రంగత్తుంగ తరంగ హస్తాల సముద్రుడు, అంగంబంటి సుఖించడము - తుంగభద్రానదిని స్ఫురింపజేసే శబ్దాలు ఇవన్నీ. 

All the sounds that rhyme with the spelling of Tungabhadra.


ఇవి గాక, కావేరి దేవేరి కావడము, తుంగభద్ర గుణభద్ర కావడమూ, ఈ ప్రాసా సౌందర్యాలన్నీ ఒలకబోసి, మీదికి లంఘించే శార్దూల పద్యంలో సముద్రుడు, కనీసం భావనా ప్రపంచంలో నైనా తుంగభద్రను తన ఉత్తుంగ తరంగ హస్తాలతో గాఢ పరిష్వంగంలో చేర్చుకొక పోతాడా అనే భ్రమను సృష్టిస్తాడు.


 ( మోహన్ గారి సుదీర్ఘవ్యాసంలో ఇది కొంతభాగం మాత్రమే!)


అక్టోబర్ 1971 - నివర్తి మోహన్ కుమార్


 


👏🌸🌷🌷💐💐🌷🌷🌷👏🌷🌷💐

A


 

భూజనసురభాష

 *1866*

*కం*

భూజనసురభాష కరణి

తేజములొందెడి గతులను తీరిన తెలుగున్

ఓజులు సైతము విడిచిన

నోజమ్ములు తగ్గబోవు నుర్విన సుజనా.

*భావం*:-- ఓ సుజనా! భూజనులకు దేవభాషవలె వెలుగొందేవిధంగా సంస్కరించబడిన తెలుగు ను ఉపాధ్యాయులు (ఓజులు) కూడా విడిచిపెట్టి ననూ దాని ప్రకాశములు(ఓజములు) ఈ భువిలో తరగవు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

శ్రీ రాజీవ్ లోచన్ Temple

 🕉 మన గుడి 


⚜ ఛత్తీస్‌గఢ్ : రాజిమ్ (రాయపూర్)






⚜ శ్రీ రాజీవ్ లోచన్ Temple


💠 రజిమ్‌ను ఛత్తీస్‌గఢ్‌లోని ప్రయాగ్ అని పిలుస్తారు.  నదులు, అందమైన దృశ్యాలు మరియు దేవాలయాలు ఈ మూడింటిని ఒకే చోట చూడాలనుకుంటే, ఖచ్చితంగా రజిమ్‌కు రండి. వర్షాకాలంలో దీని అందం మరింత పెరుగుతుంది.  


💠 ఇది గరియాబంద్ యొక్క ఈశాన్యంలో మహానది యొక్క కుడి ఒడ్డున ఉంది, ఇక్కడ పరి మరియు సొంధూర్ అనే దాని ఉపనదులు కలుస్తాయి. 

మహానది, పారి నది మరియు సొంధూర్ నది సంగమించడం వల్ల దీనిని ఛత్తీస్‌గఢ్ త్రివేణి సంగమం అంటారు.  ప్రతి సంవత్సరం మాఘ పూర్ణిమ నుండి మహాశివరాత్రి వరకు ఇక్కడ భారీ జాతర జరుగుతుంది.  


💠 సంగం మధ్యలో కులేశ్వర్ మహాదేవ్ యొక్క భారీ ఆలయం ఉంది. 

శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రదేశంలో మహాదేవ్‌ను పూజించాడని నమ్ముతారు.  

ఈ ప్రదేశం యొక్క పురాతన పేరు కూడా కమల క్షేత్రం.


💠 రాజిమ్‌లో అనేక ప్రధాన ఆలయాలు మరియు ఆకర్షణీయ కేంద్రాలు ఉన్నప్పటికీ.  అయితే ఈ రోజు మనం ఇక్కడ ఉన్న ప్రసిద్ధ రాజీవ్ లోచన్ దేవాలయం గురించి మాట్లాడుకుందాం.  


💠 రాజీవ్‌లోచన దేవాలయం చతుర్భుజంగా నిర్మించబడింది.  ఇది శంఖం, చక్రం, గద మరియు పద్మాలతో నల్లరాతితో చేసిన నాలుగు చేతుల శ్రీ మహావిష్ణువు విగ్రహం. 


💠 ప్రజల విశ్వాసాల ప్రకారం, రాజీవ్ లోచన్ ఆలయాన్ని విశ్వకర్మ స్వయంగా నిర్మించాడు.

రాజీవ్ లోచన్ దేవాలయం ప్రాచీన భారతీయ సంస్కృతి మరియు హస్తకళల యొక్క ఏకైక సంగమం.  ఈ ఆలయంలో విష్ణువు విశ్రమిస్తాడని ప్రజల నమ్మకం.


🔅 ఆలయ చరిత్ర 🔅


💠 ఈ ఆలయం 5వ శతాబ్దంలో నిర్మించబడింది.  

ఈ ఆలయం లోపల 1197  యొక్క శాసనం ఉంది . ఈ ప్రదేశం యొక్క పురాతన పేరు కమల క్షేత్రం.  విశ్వం ప్రారంభంలో విష్ణువు నాభి నుండి ఉద్భవించిన కమలం ఇక్కడ ఉందని మరియు బ్రహ్మా ఇక్కడ నుండి విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు, అందుకే దీనికి కమలక్షేత్రం అని పేరు వచ్చింది.  ప్యారీ నది, సొంధూర్ నది మరియు మహానది సంగమం అయిన రజిమ్ ఛత్తీస్‌గఢ్ యొక్క ప్రయాగగా పరిగణించబడుతుంది.  

ఈ స్థలంలో అస్తికల నిమజ్జనం మరియు పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు మరియు పిండతర్పణం నిర్వహిస్తారు.


💠  రాజీవ్‌లోచన్ దేవాలయంలో ఉత్తరం మరియు దక్షిణంలో ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మహామండపం మధ్యలో గరుడుడు ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్నాడు. గర్భగుడిలో, రాజీవ్లోచన్ అంటే సింహాసనంపై విష్ణుమూర్తి ఉన్నాడు. ఈ విగ్రహం నల్లరాతితో చేసిన చతుర్భుజి విష్ణుమూర్తి. శంఖ, చక్ర, గద, పాదములను చేతిలో ఉన్నవాడు, లోచన నామముతో పూజింపబడువాడు. ఆలయానికి రెండు వైపులా పరిక్రమ మార్గం ఉంది.

మహామండపం పన్నెండు రాతి స్తంభాలతో నిర్మించబడింది.


💠 ఉత్తరం వైపున ఉన్న ద్వారంలోంచి బయటకు వస్తే సాక్షి గోపాల్‌  ఆలయం కనిపిస్తుంది. తరువాత, చుట్టూ నరసింహ అవతారం, బద్రీ అవతారం, వామనావతారం, వరాహ అవతారం ఉప ఆలయాలు ఉన్నాయి.


💠 రెండవ ప్రకారంలో రాజరాజేశ్వర్, సతీ మాత ఆలయం ఉన్నాయి.

దీని తరువాత నదుల వైపు వెళ్ళడానికి ఒక మార్గం ఉంది. ఇక్కడి ద్వారం పశ్చిమ దిశలో ఉన్న ప్రధాన మరియు పురాతన ద్వారం. దానిపై రజిమ్ పురాతన పేరు కమలక్షేత్ర పద్మావతి పూరి అని వ్రాయబడింది.


💠 నది ఒడ్డున భూతేశ్వర్ మరియు పంచేశ్వర్ నాథ్ మహాదేవ్ ఆలయాలు ఉన్నాయి మరియు త్రివేణి మధ్యలో కులేశ్వర్ నాథ్ మహాదేవ్ యొక్క శివలింగం ఉంది.


💠 రాజీవ్‌లోచన్ దేవాలయం ఇక్కడి దేవాలయాలన్నింటిలో కెల్లా పురాతనమైనది.


💠 రాజీవ్‌లోచన ఆలయంలో ఒక మూలలో, గజరాజు తన తొండంతో తామరపువ్వును పట్టుకొని ఉన్నట్టు విగ్రహాలు ఉంటాయి.

గజేంద్ర మోక్షాన్ని గుర్తుకు చేస్తూ గజరాజు పుష్పాలతో చతుర్భుజడైన శ్రీమహావిష్ణువుని ఆరాధిస్తున్న విగ్రహం దేశంలో ఇంకా ఎక్కడ ఉండదు. ఇది ఇక్కడి విశేషం.


💠 దీని గురించి ప్రముఖ కథనం ఇలా ఉంది : మొసలి చేత హింసించబడిన గజరాజు తన తొండంతో తామర పువ్వును పట్టుకుని రాజీవ్ లోచన్‌కు అందించాడు. ఈ తామర పువ్వు ద్వారా, గజరాజు తన బాధనంతా విష్ణువు ముందు విన్నవించాడు. ఆ సమయంలో విష్ణువు విశ్రాంతి తీసుకుంటున్నాడు. మహాలక్ష్మి అతని పాదాలను నొక్కుతోంది. గజరాజు బాధను చూసిన దేవుడు వెంటనే లేచి చెప్పులు లేకుండా పరుగెత్తుకుంటూ ప్రస్తుతం రాజీవ లోచన ఆలయం ఉన్న ప్రాంతానికి చేరుకుని గజరాజును రక్షించాడు. గజేంద్రమోక్ష ఘట్టం ఈ ప్రదేశంలోనే జరిగింది అని ఈ ప్రాంత వాసుల నమ్మకం.


💠 త్రివేణి సంగమం మధ్యలో ఉన్న "కులేశ్వర్ మహాదేవ్" ఆలయం, దాని మహామండపం దగ్గర ఒక శాసనం ఉంది, దాని ప్రకారం ఈ ఆలయం 8-9వ శతాబ్దంలో నిర్మించబడింది . ఆనాటి సాంకేతిక పరిజ్ఞానానికి ఈ దేవాలయం సజీవ సాక్ష్యం. 


💠 రైలులో : రాయ్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి 50 కి.మీ.

నీలిరంగు చందమామ

 🎻🌹🙏నేడు నీలిరంగు చందమామ  ఆవిష్కృతం..!!



🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿హైదరాబాద్ :ఆగస్టు 30

ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానున్నది. ఇటీవల శనిగ్రహం ఖగోళ ప్రియులను కనువిందు చేయగా.. అంతకు ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. 


🌸బుధుడు, యురేనస్‌, గురుగ్రహం, నైప్యూటర్‌, శనిగ్రహాలు ఒకే వరుసలోకి చేరాయి. ఈ ఘట్టాన్ని ఎలాంటి పరికరాలు లేకుండా చూడే అవకాశం కలిగింది.ఈ క్రమంలోనే బుధవారం మరో అరుదైన దృశ్యం నీలిరంగు చందమామ ఆవిష్కృతం కాబోతున్నది.


🌿ఈ నెలలో రెండు పున్నములు ఉండగా.. ఒకటి ఆగస్టు ఒకటో తేదీన ఏర్పడింది. దీన్ని సూపర్‌మూన్‌గా పిలువగా.. 


🌸నేడు నీలిరంగు చందమామ బుధవారం ఏర్పడబోతున్నది. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్‌ మూన్స్‌ ఏర్పడుతుంటాయి..


🌿కానీ, బుధవారం ఏర్పడబోయే బ్లూమూన్‌ మాత్రం అరుదైనది. పౌర్ణమి సమయంలో చందమామ భూమికి దగ్గరగా వచ్చిన సూపర్‌ మూన్‌ ఆవిష్కృతమవుతుంది. 


🌸సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్‌ మూన్‌ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు.


🌿 సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెలను పంచబోతున్నాడు..స్వస్తి.. సేకరణ...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

నవగ్రహా పురాణం🪐* . *14వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *14వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*సూర్యగ్రహ జననం - 5*


ఆనాడు కశ్యప ప్రజాపతి ఆశ్రమం దేవ సభను తలపింపజేస్తోంది. శ్రీలక్ష్మీ మహావిష్ణువులూ , సరస్వతీ సమేతంగా సృష్టికర్త బ్రహ్మా, సతీసమేతంగా శివుడూ , ఆదితేయులైన ఇంద్రాది దేవతలూ , కశ్యపుని తల్లి కళా , తండ్రి మరిచీ , ప్రసూతి దక్ష ప్రజాపతులూ , నారద మహర్షీ , ఇతర బ్రహ్మ మానస పుత్రులైన అత్రీ , అంగిరసుడూ , కర్దముడూ , పులహుడూ , పులస్త్యుడూ , భృగువూ , వసిష్ఠుడూ , క్రతువూ , వాళ్ళ పత్నులూ.... కాశ్యపేయుడి నామకరణ మహోత్సవానికి విచ్చేశారు.


కశ్యపుడు శ్రీమహావిష్ణువుకు నమస్కరిస్తూ యిలా అన్నాడు. *"పరమ పురుషా ! మా చిన్న కొడుకు తమ వరప్రసాదమే ! సార్థక నామధేయం అనుగ్రహించి , ఆశీర్వదించండి !"*


*"కశ్యపా ! ఈ పుత్రుణ్ని నీకు ప్రసాదించింది. కేవలం మీ దంపతుల కోసమే కాదు. సమస్త విశ్వం కోసమూ ! నవగ్రహ దేవతలలో ఆద్యుడూ , అధికుడూ అయిన సూర్యుడు మీ దంపతుల పుత్రుడుగా ఆవిర్భవించాడు. భవిష్యత్తులో ఈ చిన్నారి బాలుడు గ్రహరాజు అవుతాడు ! జ్యోతిర్మండలంలో , నక్షత్రాల కలయికతో రూపొందిన ద్వాదశ రాశులలో నెలకొకరాశిలో నెలకొంటూ సంచరిస్తూ వుంటాడు..."*


*"ద్వాదశ రాశులా !"* కశ్యపుడు ఆశ్చర్యంగా అడిగాడు..


*"ఔను కశ్యపా !"* బ్రహ్మ వివరిస్తూ అన్నాడు. *"మా జనకులు శ్రీమహావిష్ణు దేవుల సంకల్పం ప్రకారం అంతరిక్షంలో నక్షత్రాలు బృందాలుగా చేరాయి. మేషం , వృషభం , మిథునం , కర్కాటకం , సింహం , కన్య , తుల , వృశ్చికం , ధనస్సు , మకరం , కుంభం , మీనం - ఆకారాలలో స్థిరపడి వున్నాయి !"*


*"ద్వాదశ రాశులలో ద్వాదశ మాసాలలో ద్వాదశ నామ ధేయాలతో అదితి కశ్యపుల అనుంగు సుతుడైన ఈ సూర్యుడు సంచరిస్తాడు..."* అంటూ శ్రీమహావిష్ణువు బ్రహ్మనూ , శివుణ్నీ సాభిప్రాయంగా చూశాడు. *"పరమేష్ఠీ పరమేశ్వరులూ , నేనూ చిరంజీవికి ద్వాదశ నామ నిర్దేశం చేస్తాం !"*


*"చాలా సంతోషం. ప్రారంభించండి !"* పరమ శివుడు అన్నాడు..


అదితి లేచి , శ్రీమహావిష్ణువు దగ్గరగా వచ్చింది. తన చేతుల్లోని పురిటి బిడ్డను ఆయనకు అందించింది. విష్ణువు బాలుణ్ని చిరునవ్వుతో చూస్తూ శ్రీలక్ష్మికి అందించాడు. బాలుణ్ని చూస్తున్న లక్ష్మి దేవి ముఖం కమలంలా వికసిస్తోంది !


*"లక్ష్మీ ! బాలసూర్యుణ్ని ఆ వేదిక మీద పడుకో బెట్టు !"* అన్నాడు విష్ణువు.


లక్ష్మి బాలుణ్ని నుదురు మీద ముద్దు పెట్టి అరుగు మీద పడుకో బెట్టింది. శ్రీమహావిష్ణువు బాలుణ్నే చూస్తూ నామ నిర్దేశం ప్రారంభించాడు. *"ధాత ! ఆర్యముడు..."*


అందర్నీ ఆశ్చర్యంలో ముంచివేస్తూ బాలసూర్యుడి పక్కనే అదే పోలికతో మరొక బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు.


*"మిత్రుడు !"* ఆశ్చర్యంతో ఏర్పడిన నిశ్శబ్దాన్ని విష్ణువు గంభీర కంఠస్వరం ఛేదించింది మూడవ బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు.


*"శక్రుడు !"* విష్ణువు నాలుగవ నామధేయాన్ని ప్రకటించాడు. నాలుగవ బాలసూర్యుడు సాక్షాత్కరించాడు.


విష్ణువు బ్రహ్మదేవుడి వైపు చూశాడు. బ్రహ్మ ఆయన దృష్టిలోని ఆజ్ఞను అర్ధం చేసుకుంటూ , బాలసూర్యుడికి తన వంతుగా నాలుగు నామధేయాలు ప్రకటించాడు.


*"వరుణుడు ! అంశుమంతుడు ! భగుడు ! వివస్వంతుడు !"* బాలసూర్య రూపాలు మరో నాలుగు ప్రత్యక్షమయ్యాయి.


పరమశివుడు బాలసూర్యుడికి మరొక నాలుగు పేర్లు ప్రసాదించాడు. *"పూషుడు ! సవిత్రుడు ! త్వష్ట ! విష్ణువు !"* బాలసూర్యుని రూపాలు ఇప్పుడు పండ్రెండు కనిపిస్తున్నాయి.


పండ్రెండు రూపాలూ ఒకదాని పక్కన ఒకటి - వలయాకారంలో కనిపిస్తున్నాయి. సున్నితంగా కదలాడుతున్న చిన్నారి కాళ్ళూ , చేతులూ ! చిరునవ్వుల కాంతుల్ని వెదజల్లుతున్న గుండ్రటి ముఖాలు ! తామరరేకుల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు ! ద్వాదశ బాలాదిత్యులతో ఏర్పడిన వలయం సజీవంగా ఉన్న రంగవల్లిగా అందరి దృష్టినీ లాగి పట్టింది.


నారదుడు తన మృదుమధుర కంఠస్వరంతో వరసగా ఆ ద్వాదశ బాలాదిత్యుల నామధేయాలను ఆనందంగా వల్లె వేశాడు. *"ధాత! ఆర్యముడు ! మిత్రుడు ! శక్రుడు ! వరుణుడు ! అంశుమంతుడు ! భగుడు ! వివస్వంతుడు ! పూషుడు ! సవిత్రుడు ! త్వష్ట ! విష్ణువు !"*


త్రిమూర్తులూ , దేవతలూ , మానస పుత్రులూ , వాళ్ళ పత్నులూ , నారదుడూ , కశ్యపుడు , ఆయన పత్నులూ అక్షింతలు వేస్తూ ఆశీర్వదించారు.


*"త్రిమూర్తులు నా మనుమడికి సార్థక నామధేయాలు ప్రసాదించారు ! వెలుగు వేలుపు పితామహుడు కావడం నా అదృష్టం !"* మరీచి చేతులు జోడిస్తూ అన్నాడు.


*"సకల ప్రాణుల్నీ సమదృష్టితో చూసే లోకబాంధవుడైన పుత్రుడు కావాలన్న మహదాశయంతో తపించింది అదితి ! ఉన్నతమైన ఆ కోరికతో - ఆమె గ్రహరాజును పుత్రుడిగా పొందే అదృష్టాన్నీ , అర్హతనూ సంపాందించుకుంది ! ఈ బాలాదిత్యుడు పెరిగి పెద్దవాడై గ్రహసార్వభౌముడిగా అందరి అర్చనలూ అందుకుంటాడు !"* విష్ణువు అన్నాడు.


*“తథాస్తు !"* అన్నారు శివుడూ , బ్రహ్మా.


అదితి ఆనందబాష్పాలతో తన అందాల పాపడి వైపు చూస్తోంది. పన్నెండు ముద్దుల మూటలను చూస్తుంటే ఆమె మాతృత్వం పొంగి పొర్లసాగింది. పన్నెండుగుర్నీ ఒకేసారి ఎత్తుకుని , వక్షానికి హత్తుకుని , బొజ్జల నిండుగా పాలు పట్టాలన్న కోరిక ఆమె సర్వస్వాన్నీ ఆవరించి కుదిపి వేస్తోంది.


అదితి ఆవేశంగా కదిలి చేతులు ఎడంగా చాపి , తన ద్వాదశ పుత్రుల్ని వొడిసి పట్టుకోబోయింది. విచిత్రంగా అన్ని రూపాలూ ఒక్కసారిగా కలిసి , ఒక్కటిగా మారిపోయాయి. తన చేతుల్లోకి వచ్చిన బాలసూర్యుణ్ని ఆశ్చర్యానందంతో చూస్తోంది. అదితి. కశ్యపుడు ఆమె పక్కకు జరిగాడు. అందరూ నవ్వుతున్నారు. బాలసూర్యుడు. అందర్నీ కలయజూస్తూ నవ్వుల వెలుగుల్ని వెదజల్లుతున్నాడు.


 *సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

నవగ్రహా పురాణం🪐* . *14వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *14వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*సూర్యగ్రహ జననం - 5*


ఆనాడు కశ్యప ప్రజాపతి ఆశ్రమం దేవ సభను తలపింపజేస్తోంది. శ్రీలక్ష్మీ మహావిష్ణువులూ , సరస్వతీ సమేతంగా సృష్టికర్త బ్రహ్మా, సతీసమేతంగా శివుడూ , ఆదితేయులైన ఇంద్రాది దేవతలూ , కశ్యపుని తల్లి కళా , తండ్రి మరిచీ , ప్రసూతి దక్ష ప్రజాపతులూ , నారద మహర్షీ , ఇతర బ్రహ్మ మానస పుత్రులైన అత్రీ , అంగిరసుడూ , కర్దముడూ , పులహుడూ , పులస్త్యుడూ , భృగువూ , వసిష్ఠుడూ , క్రతువూ , వాళ్ళ పత్నులూ.... కాశ్యపేయుడి నామకరణ మహోత్సవానికి విచ్చేశారు.


కశ్యపుడు శ్రీమహావిష్ణువుకు నమస్కరిస్తూ యిలా అన్నాడు. *"పరమ పురుషా ! మా చిన్న కొడుకు తమ వరప్రసాదమే ! సార్థక నామధేయం అనుగ్రహించి , ఆశీర్వదించండి !"*


*"కశ్యపా ! ఈ పుత్రుణ్ని నీకు ప్రసాదించింది. కేవలం మీ దంపతుల కోసమే కాదు. సమస్త విశ్వం కోసమూ ! నవగ్రహ దేవతలలో ఆద్యుడూ , అధికుడూ అయిన సూర్యుడు మీ దంపతుల పుత్రుడుగా ఆవిర్భవించాడు. భవిష్యత్తులో ఈ చిన్నారి బాలుడు గ్రహరాజు అవుతాడు ! జ్యోతిర్మండలంలో , నక్షత్రాల కలయికతో రూపొందిన ద్వాదశ రాశులలో నెలకొకరాశిలో నెలకొంటూ సంచరిస్తూ వుంటాడు..."*


*"ద్వాదశ రాశులా !"* కశ్యపుడు ఆశ్చర్యంగా అడిగాడు..


*"ఔను కశ్యపా !"* బ్రహ్మ వివరిస్తూ అన్నాడు. *"మా జనకులు శ్రీమహావిష్ణు దేవుల సంకల్పం ప్రకారం అంతరిక్షంలో నక్షత్రాలు బృందాలుగా చేరాయి. మేషం , వృషభం , మిథునం , కర్కాటకం , సింహం , కన్య , తుల , వృశ్చికం , ధనస్సు , మకరం , కుంభం , మీనం - ఆకారాలలో స్థిరపడి వున్నాయి !"*


*"ద్వాదశ రాశులలో ద్వాదశ మాసాలలో ద్వాదశ నామ ధేయాలతో అదితి కశ్యపుల అనుంగు సుతుడైన ఈ సూర్యుడు సంచరిస్తాడు..."* అంటూ శ్రీమహావిష్ణువు బ్రహ్మనూ , శివుణ్నీ సాభిప్రాయంగా చూశాడు. *"పరమేష్ఠీ పరమేశ్వరులూ , నేనూ చిరంజీవికి ద్వాదశ నామ నిర్దేశం చేస్తాం !"*


*"చాలా సంతోషం. ప్రారంభించండి !"* పరమ శివుడు అన్నాడు..


అదితి లేచి , శ్రీమహావిష్ణువు దగ్గరగా వచ్చింది. తన చేతుల్లోని పురిటి బిడ్డను ఆయనకు అందించింది. విష్ణువు బాలుణ్ని చిరునవ్వుతో చూస్తూ శ్రీలక్ష్మికి అందించాడు. బాలుణ్ని చూస్తున్న లక్ష్మి దేవి ముఖం కమలంలా వికసిస్తోంది !


*"లక్ష్మీ ! బాలసూర్యుణ్ని ఆ వేదిక మీద పడుకో బెట్టు !"* అన్నాడు విష్ణువు.


లక్ష్మి బాలుణ్ని నుదురు మీద ముద్దు పెట్టి అరుగు మీద పడుకో బెట్టింది. శ్రీమహావిష్ణువు బాలుణ్నే చూస్తూ నామ నిర్దేశం ప్రారంభించాడు. *"ధాత ! ఆర్యముడు..."*


అందర్నీ ఆశ్చర్యంలో ముంచివేస్తూ బాలసూర్యుడి పక్కనే అదే పోలికతో మరొక బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు.


*"మిత్రుడు !"* ఆశ్చర్యంతో ఏర్పడిన నిశ్శబ్దాన్ని విష్ణువు గంభీర కంఠస్వరం ఛేదించింది మూడవ బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు.


*"శక్రుడు !"* విష్ణువు నాలుగవ నామధేయాన్ని ప్రకటించాడు. నాలుగవ బాలసూర్యుడు సాక్షాత్కరించాడు.


విష్ణువు బ్రహ్మదేవుడి వైపు చూశాడు. బ్రహ్మ ఆయన దృష్టిలోని ఆజ్ఞను అర్ధం చేసుకుంటూ , బాలసూర్యుడికి తన వంతుగా నాలుగు నామధేయాలు ప్రకటించాడు.


*"వరుణుడు ! అంశుమంతుడు ! భగుడు ! వివస్వంతుడు !"* బాలసూర్య రూపాలు మరో నాలుగు ప్రత్యక్షమయ్యాయి.


పరమశివుడు బాలసూర్యుడికి మరొక నాలుగు పేర్లు ప్రసాదించాడు. *"పూషుడు ! సవిత్రుడు ! త్వష్ట ! విష్ణువు !"* బాలసూర్యుని రూపాలు ఇప్పుడు పండ్రెండు కనిపిస్తున్నాయి.


పండ్రెండు రూపాలూ ఒకదాని పక్కన ఒకటి - వలయాకారంలో కనిపిస్తున్నాయి. సున్నితంగా కదలాడుతున్న చిన్నారి కాళ్ళూ , చేతులూ ! చిరునవ్వుల కాంతుల్ని వెదజల్లుతున్న గుండ్రటి ముఖాలు ! తామరరేకుల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు ! ద్వాదశ బాలాదిత్యులతో ఏర్పడిన వలయం సజీవంగా ఉన్న రంగవల్లిగా అందరి దృష్టినీ లాగి పట్టింది.


నారదుడు తన మృదుమధుర కంఠస్వరంతో వరసగా ఆ ద్వాదశ బాలాదిత్యుల నామధేయాలను ఆనందంగా వల్లె వేశాడు. *"ధాత! ఆర్యముడు ! మిత్రుడు ! శక్రుడు ! వరుణుడు ! అంశుమంతుడు ! భగుడు ! వివస్వంతుడు ! పూషుడు ! సవిత్రుడు ! త్వష్ట ! విష్ణువు !"*


త్రిమూర్తులూ , దేవతలూ , మానస పుత్రులూ , వాళ్ళ పత్నులూ , నారదుడూ , కశ్యపుడు , ఆయన పత్నులూ అక్షింతలు వేస్తూ ఆశీర్వదించారు.


*"త్రిమూర్తులు నా మనుమడికి సార్థక నామధేయాలు ప్రసాదించారు ! వెలుగు వేలుపు పితామహుడు కావడం నా అదృష్టం !"* మరీచి చేతులు జోడిస్తూ అన్నాడు.


*"సకల ప్రాణుల్నీ సమదృష్టితో చూసే లోకబాంధవుడైన పుత్రుడు కావాలన్న మహదాశయంతో తపించింది అదితి ! ఉన్నతమైన ఆ కోరికతో - ఆమె గ్రహరాజును పుత్రుడిగా పొందే అదృష్టాన్నీ , అర్హతనూ సంపాందించుకుంది ! ఈ బాలాదిత్యుడు పెరిగి పెద్దవాడై గ్రహసార్వభౌముడిగా అందరి అర్చనలూ అందుకుంటాడు !"* విష్ణువు అన్నాడు.


*“తథాస్తు !"* అన్నారు శివుడూ , బ్రహ్మా.


అదితి ఆనందబాష్పాలతో తన అందాల పాపడి వైపు చూస్తోంది. పన్నెండు ముద్దుల మూటలను చూస్తుంటే ఆమె మాతృత్వం పొంగి పొర్లసాగింది. పన్నెండుగుర్నీ ఒకేసారి ఎత్తుకుని , వక్షానికి హత్తుకుని , బొజ్జల నిండుగా పాలు పట్టాలన్న కోరిక ఆమె సర్వస్వాన్నీ ఆవరించి కుదిపి వేస్తోంది.


అదితి ఆవేశంగా కదిలి చేతులు ఎడంగా చాపి , తన ద్వాదశ పుత్రుల్ని వొడిసి పట్టుకోబోయింది. విచిత్రంగా అన్ని రూపాలూ ఒక్కసారిగా కలిసి , ఒక్కటిగా మారిపోయాయి. తన చేతుల్లోకి వచ్చిన బాలసూర్యుణ్ని ఆశ్చర్యానందంతో చూస్తోంది. అదితి. కశ్యపుడు ఆమె పక్కకు జరిగాడు. అందరూ నవ్వుతున్నారు. బాలసూర్యుడు. అందర్నీ కలయజూస్తూ నవ్వుల వెలుగుల్ని వెదజల్లుతున్నాడు.


 *సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-33🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-33🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*ధ్రువబేరం:*


తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. ఈ మూర్తి స్వయంభూమూర్తి (అనగా స్వయంగా వెలసినది, ఎవరూ చెక్కి ప్రతిష్ఠించలేదు) అని భక్తుల విశ్వాసం. 


మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. 


మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. వీరస్థానక పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు.


 నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.



 18 అంగుళాలున్న పద్మాకారం వేదికపై స్వామివారు నిలుచుని ఉంటారు. గురువారం సాయంకాలం, మరియు శుక్రవారం నాడు తప్ప ఇతర దినాలలో ఈ వేదిక, స్వామివారి పాదాలు తులసి దళాలతో కప్పబడి ఉంటాయి


ధృవబేరం చక్కని ముఖకవళికలతో వెలసి ఉంటుంది. ముక్కు మరీ ఎత్తూ కాదు, చప్పిడీ కాదు. కన్నులు స్పష్టంగా అమరి ఉంటాయి. నుదుటిపై రేఖారూపంగా ఏర్పడిన నామం ఉంది.


 నిత్యం పచ్చకర్పూరంతో పెట్టిన నామం కన్నులను కొంతభాగం కప్పివేస్తుంది. నామం రూపం, సైజూ వంటి వివరాలు వైఖానస ఆగమంలో చెప్పినవిధంగా కచ్చితంగా పాటిస్తారు. 


స్వామివారి శిరస్సుపై (నుదుటిపైభాగం వరకు) కిరీటం ఉంది. ఆయన జటాజూటము భుజాలపై పడుతూ ఉంటుంది. 


కచ్చితమైన కొలతలు తీసికొనబడనప్పటికీ స్వామివారి ఛాతీ వెడల్పు సుమారు 36-40 అంగుళాల మధ్య సైజులోనూ

, నడుము భాగం వెడల్పు 24-27 అంగుళాలు సైజులోనూ ఉంటుంది. 


స్వామివారి నడుము పైభాగం ఆచ్ఛాదనారహితంగా ఉంటుంది. ఆయన వక్షస్థలం కుడిభాగాన శ్రీలక్ష్మీదేవి రూపం ఉంది. స్వామివారు చతుర్భుజములను కలిగియున్నారు. పై కెత్తిన కుడిచేతిలోనున్న సుదర్శన చక్రము, ఎడమచేతిలోనున్న పాంచజన్య శంఖము విగ్రహంలో భాగాలు కావు. 


అదనంగా స్వామివారి చేతులలో ఉంచిన అలంకారాయుధాలు. దిగువనున్న రెండుచేతులలోను కుడిచేయి వరదహస్తము (అరచేయి భక్తులకు కనిపిస్తూ, వరములను ప్రసాదిస్తున్నట్లుగా ఉంటుంది).


 ఎడమచేయి కట్యావలంబిత ముద్రలో (నడుమువద్ద మడచినచేయి. అరచేయి స్వామివారివైపు ఉంటుంది) ఉంది. నడుము క్రిందభాగంలో స్వామివారు ధోవతి ధరించి ఉంటారు. రెండు మోకాళ్ళూ కొంచెంగా వంగినట్లు కనిపిస్తాయి (స్వామివారు భక్తుల రక్షణకు నడచి రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా). 


స్వామివారు ఆయుధాలను ధరించిన త్రిభంగ రూపంలో ఉండనప్పటికీ స్వామివారి భుజాలపై ధనుర్బాణాల ముద్రలున్నాయి



వేంకటేశ్వరునిగా వ్యవహరించే ఈ ధృవభేరం ఏ దేవతామూర్తిది, మొదటి నుంచి ఏ రూపంగా అక్కడ అర్చన కొనసాగింది అన్న విషయంపై తీవ్ర వాదోపవాదాలు సాగాయి.


నాగేంద్రభూషణ గోవిందా, మంజీర మండిత గోవిందా, తులసిమాలప్రియ గోవిందా, ఉత్పమాలాంకృత గోవిందా; |

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||33||


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 27*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 27*

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩


.               *ఆధ్యాత్మిక అనుభూతి*


1.ఆత్మ, భగవంతుడు లాంటి సత్యాలను ధ్రువీకరించడానికిగల ఒకే మార్గం ప్రత్యక్ష అనుభవమే. శాస్త్రాలు సంకేత ఫలకాలలా ఈ సత్యాలను సూచించ గలుగుతాయేగాని వాటిని నిరూపించలేవు. వర్షం ఎప్పుడు పడుతుందో పంచాంగం తెలుపుతుంది. అలాగని పంచాంగాన్ని పిండితే ఒక చుక్కనీరు కూడా రాదు.


2. ఆధ్యాత్మిక అనుభవాలకు హద్దులు లేవు. కనుక పొందిన అనుభవాలతో తృప్తిచెంది ఆగిపోకుండా ముందుకు సాగాలి.


 3. కుండలినీ శక్తి జాగృతమయినప్పుడే ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయి.


4. ద్వైతం కాని స్థితియైన అద్వైతానుభవమే అత్యంత ఉన్నతమైన అనుభవం.


5. కాని అద్వైతం చరమ అనుభూతి కాదు. అద్వైత అనుభవం పొందిన కొందరు మళ్లీ సామాన్య స్థితికి వస్తారు. వారు సర్వత్రా భగవంతుణ్ణి చూస్తారు, ఆ భగవదానందంలోనే జీవిస్తారు. ఈ స్థితి 'విజ్ఞానం' అనబడుతుంది. ఈ స్థితిని పొందిన వ్యక్తిని 'విజ్ఞాని' అని పేర్కొంటారు. ఆ వ్యక్తి భగవంతుడు (నిత్యం), జగత్తు (లీల) రెంటినీ సత్యంగా దర్శిస్తాడు.


6. ఎన్నడూ బద్ధుడుకాని, సదా ముక్తి స్థితిలోనే నెలకొనివున్న వారుకొందరున్నారు.

నిత్యముక్తులయిన వీరు భగవంతుడు అవతరించే తరుణంలో ఆయనతో బాటే జన్మించి, ఆయన అవతార కార్యానికి తోడ్పడతారు. వీరిని ఈశ్వర కోటులుగా పేర్కొంటారు.


శ్రీరామకృష్ణులు వీటిని బోధించడంమే కాక సత్యాలను ధ్రువీకరించడానికి కొందరి జీవితాలను రూపొందించి నిష్క్రమించారు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 11*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 11*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి*

*ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః |*

*చతుశ్చత్వారింశత్ వసుదళ కలాశ్రత్రివలయ*

*త్రిరేఖబి సార్ధం తవ శరణకోణాః పరిణతాః ||*



ఈ శ్లోకంలో అమ్మవారు శ్రీచక్ర స్థిత అయిన వైనం వివరిస్తున్నారు. దీనిలో అనేకమైన శ్రీచక్ర రహస్యాలను నిక్షిప్తం చేశారు శంకరులు. అందంతా ఒక విజ్ఞాన శాస్త్రం, ఒక సాంకేతిక పరిజ్ఞానం. గురూపదేశం,గురు శిక్షణ లేకుండా శ్రీచక్ర ,బిందు కోణచక్ర వివరణ అర్థం చేసుకోవడం కష్టం.గురూపదేశం లేకుండా శ్రీచక్రార్చన చేయరాదు.


చతుర్భిః శ్రీకంఠైః = నాలుగు శివ  చక్రాలతోనూ


శివయువతభిః పంచభిః = ఐదు శక్తి చక్రములతోనూ  కలిసి ఏర్పడింది శ్రీచక్రము.


ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలపృకృతిభిః = ఇవ్వన్నీ కలిసి పరమేశ్వరుని నవాంశములతో కూడిన మూలప్రకృతిని తెలియచేస్తున్నాయి.


చతుశ్చత్వారింశత్ వసుదళ కలాశ్ర త్రివలయ =  44 త్రికోణాలతోను,అష్ట గణాధి దేవతలు దళములతోను, షోడశ కళల దళములతోను, మూడు వలయములతోను


త్రిరేఖభిః సార్ధం తవ శరణకోణతాః = మూడు రేఖలతోను,నీ ఆశ్రయమైన శ్రీచక్రము విరాజిల్లుతున్నది తల్లీ! శ్రీచక్రమును ఎలా భావన చేయాలో భావనోపనిషత్ చెప్తుందట.అమ్మవారి నామాల్లో *భవానీ భావనాగమ్యా* దీనికి సూచన.


            🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

యజ్ఞోపవీత ధారణ

 *"ఓ బ్రాహ్మణా" నీ కోసం నీకు నువ్వే కేవలం 10 ని.ల సమయం కూడా కేటాయించుకోలేవా...??*


*ది.31/8/23 గురువారం నాడు ఉదయం పూట జంధ్యాల పౌర్ణమి/శ్రావణ పౌర్ణమి సందర్భంగా కనీసం నీ వంటి మీద వున్న నీ పవిత్ర జంధ్యాన్ని కూడా నేడు మార్చుకోలేవా...?? దయచేసి మార్చుకో...!!🙏*


*""నూతన యజ్ఞోపవీత ధారణ విధానము ప్రార్థన:""*


శుక్లాంబరధరం విష్ణుం

శశివర్ణం చతుర్భుజం |

ప్రసన్న వదనం ధ్యాయేత్ 

సర్వ విఘ్నోపశాంతయే ||


గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః 

గురు దేవో మహేశ్వరః |

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: 

శ్రీ గురవే నమః ||


అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాం గతో పివ |


యస్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్సుచి: ||


పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష!


(అంటూ తల పైకి నీళ్ళు చల్లుకొనవలెను)


ఆచమన విధానం:

ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,

1.   ఓం కేశవాయ స్వాహా,


2.   ఓం నారాయణాయ స్వాహా,


3.   ఓం మాధవాయ స్వాహా,


అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.


4.   ఓం గోవిందాయనమః,


5.   ఓం విష్ణవే నమః,


6.   ఓం మధుసూదనాయనమః,


7.   ఓం త్రివిక్రమాయనమః,


8.   ఓం వామనాయనమః,


9.   ఓం శ్రీధరాయనమః,


10.  ఓం హృషీకేశాయనమః,


11.  ఓం పద్మనాభాయనమః,


12.  ఓం దామోదరాయనమః,


13.  ఓం సంకర్షణాయనమః,


14.  ఓం వాసుదేవాయనమః,


15.  ఓం ప్రద్యుమ్నాయనమః,


16.  ఓం అనిరుద్ధాయనమః,


17.  ఓం పురుషోత్తమాయనమః,


18.  ఓం అధోక్షజాయనమః,


19.  ఓం నారసింహాయనమః,


20.  ఓం అత్యుతాయనమః,


21.  ఓం జనార్దనాయనమః,


22.  ఓం ఉపేంద్రాయనమః,


23.  ఓం హరయేనమః,


24.  ఓం శ్రీకృష్ణాయనమః.

అని నమస్కరించవలెను. అటు పిమ్మట:


*భూతోచ్చాటన:*


(చేతిలో ఉద్ధరిణి తో నీరు పోసుకుని యీ క్రింది మంత్రమును చదివిన పిమ్మట భూమిపై నీళ్ళు జల్లవలెను.)


ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః | దేవీ గాయత్రీచ్చందః ప్రాణాయామే వినియోగః


(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)


గృహస్తులు ఐదు వ్రేళ్లతో నాసికాగ్రమును పట్టుకొని మంత్రము చెప్పవలెను. బ్రహ్మచారులు బొటన వ్రేలి తో కుడి ముక్కును, అనామిక ఉంగరం వ్రేళ్లతో ఎడమ ముక్కును పట్టుకొని ఈ క్రింది మంత్రమును చెప్ప వలెను.


ఓం భూః, ఓం భువః, ఓగ్ మ్ సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ మ్ సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం బర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ | ఓం ఆపో జ్యోతి రసో2మృతం, బ్రహ్మ భూర్భువస్సువరోమ్||


*తదుపరి సంకల్పం:*


మమ ఉపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, ఆద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే, గంగా కావేరీయోర్మధ్యే, స్వగృహే (లేదా శోభన గృహే), సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల, పురుషార్ధ సిద్ధ్యర్ధం, ఆయుష్యాభివృద్ధ్యర్ధం, మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే


(బ్రహ్మచారులు “ధర్మపత్నీ సమేతస్య” అని చెప్పనక్కర లేదు)


యజ్ఞోపవీతములు ఐదింటిని ఐదు ముడుల వద్దను, మరి రెండు సమానదూర స్థలముల వద్దను, కుంకుమను తడి చేసి అలంకరించి అధిష్టాన దేవత అయిన గాయత్రిని ధ్యానించి, యజ్ఞోపవీత ధారణా మంత్రము స్మరించి ఈ క్రింది విధముగా ధరించవలెను.


*1 మొదటి యజ్ఞోపవీతం ధారణ:*


యజ్ఞోప వీతే త్తస్య మంత్రస్య పరమేష్టీ పరబ్రహ్మర్షి: పరమాత్మా,


దేవతా, దేవీ గాయత్రీచ్చందః యజ్ఞోపవీత ధారణే వినియోగః ||


*“ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం*


*ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్*


*ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం*


*యజ్ఞోపవీతం బలమస్తు తేజః”*


అని చెప్పి అని మొదటి ముడి ఉన్న జంధ్యాన్ని ధరించవలెను.


(మంత్ర పఠన సమయమున కుడి బాహువును పైకెత్తి శరీరము తగలకుండా జందెమును పట్టి యుంచి మంత్రాంతము నందు కుడిబాహువు మీదుగా ఎడమ బాహువు నందు ధరించవలెను.)


*2 ద్వితీయోపవీత ధారణం:*


తిరిగి ఆచమనం చేసి “మమ నిత్యకర్మానుష్టాన యోగ్యతా సిద్ధ్యర్ధం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని రెండవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.


*3 తృతీయ యజ్ఞోపవీత ధారణం:*


తిరిగి ఆచమనం చేసి “ఉత్తరీయార్ధం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని మూడవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.


*4,5 చతుర్ధ, పంచమ యజ్నోపవీతములు ధరించుట:*


తిరిగి ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ “ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని నాలుగు, ఐదు ముడులను ఒక దాని తరువాత మరి యొకటి దరించవలెను. మొత్తము ఐదు ముడులు వచ్చునట్లు సరిచేసుకొనవలెను.


తరువాత పాత, కొత్త జంధ్యములను కలిపి, కుడి చేతి బొటన వ్రేలు, చూపుడు వ్రేలు మధ్యలో పట్టుకొని పైన కండువా కప్పి, “దశ గాయత్రి” (పదిమారులు గాయత్రి మంత్రము) జపించి, “యధాశక్తి దశ గాయత్రీ మంత్రం గాయత్రీ దేవతార్పణమస్తు” అని నీటిని వదలవలెను. (బ్రహ్మచారులు ఒక్క ముడినే ధరించవలయును)


*గాయత్రీ మంత్రము:*


“ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం


భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్ ”


తరువాత ఈ క్రింది విజర్జన మంత్రము చదువుతూ పాత జందెమును తీసి వేయవలెను.


*జీర్ణోపవీత విసర్జనం:*


తిరిగి మరలా ఆచమనం చేసి


శ్లో: ఉపవీతం భిన్నతంతుం కశ్మల దూషితం


విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తుమే ||


శ్లో: పవిత్రదంతా మతి జీర్ణవంతం


వేదాంత వేద్యం పరబ్రహ్మ రూపం


ఆయుష్య మగ్ర్యం ప్రతిమంచ శుభ్రం


జీర్నోపవీతం విసృజంతు తేజః ||


శ్లో: ఏతా వద్దిన పర్యంతం


బ్రహ్మత్వం ధారితం మయా


జీర్ణత్వాత్తే పరిత్యాగో


గచ్ఛ సూత్ర యథా సుఖం ||


విసర్జన సమయములో తీసివేస్తున్న పాత జందెమును పాదములకు తాకకుండా చూసుకోవలెను.


తిరిగి ఆచమనం చేసి కొత్త యజ్ఞోపవీతముతో కనీసం పది సార్లు గాయత్రి మంత్రము జపింఛి యధాశక్తి “గాయత్రీ దేవతార్పణమస్తు” అని నీరు విడువ వలెను. ఆ తరువాత గాయత్రీ దేవికి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించవలెను.


తీసివేసిన పాత జందెమును ఏదైనా పచ్చని మొక్కపై వేయవలెను.


నూతన యజ్ఞోపవీత ధారణ సమయములు:


శ్రావణ పౌర్ణమి నాడు, జాతాశౌచ శుద్ధి యందు, మృతాశౌచ శుద్ధియందు, గ్రహణానంతరము, ప్రతి నాలుగు మాసముల అనంతరము నూతన యజ్ఞోపవీతమును ధరించి, పూర్వ యజ్ఞోపవీతమును త్యజించవలెను. ఎవరు తొక్కని ప్రదేశంలోనో, చెట్ల మొదలులోనో, పారే నదిలోనో,బావిలోనో విసర్జించవలెను.


ఓం శ్రీ గాయత్రి దేవై నమః

        🔥శివేశ్రీ🔥


*బ్రాహ్మణ చైతన్య వేదిక*

సుభాషితమ్

 🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


*ఇదే మే హి పాండిత్యం*

*ఇయమేవ విదగ్ధతా.*

*అయమేవ పరోధర్మః*

*యత్ ఆయావ్యధికోవ్యయ*


*- _తాత్పర్యము_-* 


*సంపాదనకు మించి ఎప్పుడూ ఖర్చు పెట్టకూడదు. అలా ఖర్చుపెట్టకుండా ఉండడమే పాండిత్యం, అదే గొప్ప నేర్పరితనం, అదే ముఖ్య కర్తవ్యం.*


 *కనుక ఎప్పుడూ ఆదాయానికి మించి వ్యయం చేయకూడదు*.....!!!!


🧘‍♂️🙏🪷 ✍️🙏

విలువుండని(విలువెరుగని) వారలతో


*కం*

విలువుండని(విలువెరుగని) వారలతో

విలువగు సమయంబునెల్ల వెచ్చించినచో

అలతులు బల్లిదులగుదురు

విలువగు నీ విలువలెల్ల వెడలును సుజనా.

*భావం*:-- ఓ సుజనా! విలువ లేని వారి తో విలువైన సమయమంతా గడపడం వలన ఆ అల్పులు బలవంతులై విలువైన నీ విలువ లన్నీ తగ్గిపోవును.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


*కం*

వంశజనులపెంచగనే

వంశోధ్ధారకులుగారు పరిగణమొనరన్(ప్రముఖులు మెచ్చన్)

వంశ(పు)ప్రతిష్ఠ బెంచగ

వంశోధ్ధారకుడనబడు పదపడి (బలముగ)సుజనా

*భావం*:-- ఓ సుజనా! వంశం లో జనులను పెంచినంతమాత్రాన వంశోధ్ధారకుడనబడరు. పరిగణించేస్థాయిలో వంశం యొక్క ప్రతిష్ఠ పెంచినప్పుడే వంశోధ్ధారకుడనబడును.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

మొదటి* *భాషగా సంస్కృతం✍️📚*

 *📚✍️పాఠశాల విద్యలో మొదటి*

 *భాషగా సంస్కృతం✍️📚*


*♦️ఆరో తరగతి నుంచి ఎంపికకు అవకాశం*


*♦️ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన*


*🌻ఈనాడు, అమరావతి*: పాఠశాల విద్యలో మొదటి భాషగా సంస్కృతం సబ్జెక్టును తీసుకురాబోతున్నారు. పాఠశాల విద్యా శాఖ ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వ నికి పంపింది. త్వరలో ఉత్తర్వులు రానున్నాయి. మొదటి భాషగా దీన్ని ఎంచుకున్న విద్యార్థులు రెండో భాషగా హిందీకి బదులు తెలుగు సబ్జెక్టు చదవాల్సి ఉంటుంది. మూడో భాషగా ఆంగ్లం ఉంటుంది. తెలుగు సబ్జెక్టును మొదటి భాషగా తీసు కున్న వారు రెండో భాషగా హిందీ చదవాల్సి ఉంటుంది. విద్యార్థులు ఆరో తరగతిలో మొదటి భాషను ఎంపిక చేసుకునే

అవకాశం కల్పిస్తారు. సంస్కృతం పుస్తకాలు ఆరో తరగతి నుంచి ఉన్నాయి. పదో తరగతి పరీక్షల సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం కాంపొజిట్ తెలుగును తొలగించింది. ఇందులో తెలుగు 70 మార్కులు, సంస్కృతం 30 మార్కులకు ఉండేది. తెలుగునే వంద మార్కులకు చేసినందున సంస్కృతం సబ్జెక్టుకు అవకాశం కల్పించాలనే డిమాండ్ వచ్చింది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కృతం ఉపాధ్యాయులు పని చేస్తు న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కన్నడ, తమిళం, ఒడియా, హిందీ, ఉర్దూ మొదటి భాషగా చదువుతున్న విద్యార్థులు 10వేల వరకు ఉన్నారు. ఇప్పుడు సంస్కృతం తీసుకువస్తే ఈ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. సంస్కృతంలో ఎక్కువ మార్కులు సాధించే వీలుంది. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువ మంది ఈ సబ్జెక్టును ఎంచుకునే అవకాశం ఉంది.


🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

⚜ శ్రీ మా దిద్నేశ్వరి దేవి మందిర్

 ⚜ ఛత్తీస్‌గఢ్ : మల్హర్‌






⚜ శ్రీ మా దిద్నేశ్వరి దేవి మందిర్


🕉 మన గుడి :


⚜ ఛత్తీస్‌గఢ్ : మల్హర్‌( బిలాస్‌పూర్)


⚜ శ్రీ మా దిద్నేశ్వరి దేవి మందిర్



💠 ఛత్తీస్‌గఢ్‌లోని సిద్ధ శక్తిపీఠాల శ్రేణిలో, బిలాస్‌పూర్ సమీపంలోని మల్హర్‌లో ఉన్న మా దిద్నేశ్వరి అనే ఆలయం మత విశ్వాస కేంద్రానికి పేరు . 


💠 పురావస్తు సంపద అక్కడక్కడ చెల్లాచెదురుగా ఉంది. 

ఈ ప్రాంతంలోని ప్రతి రాతిలోనూ దేవతలు కొలువై ఉంటారని చెబుతారు. 

విరిగిన విగ్రహాలు, రాతి, రాగిపై గీసిన విచిత్రమైన అక్షరాలు, కాల్చిన మట్టి బొమ్మలు, ముక్కలు మరియు బంగారం, వెండి, రాగి నాణేలు, అనేక రకాల అవశేషాలు మరియు పాత దేవాలయాల శిథిలాలు ఎన్ని ఉన్నాయో తెలియదు.

సహజ మరియు పురావస్తు ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాంతంలో అమ్మవారు కొలువై ఉన్నారు.


💠 పద్మాసనంలో కూర్చున్న ఈ అమ్మవారు  10వ-11వ శతాబ్దపు  స్వచ్ఛమైన నల్ల గ్రానైట్‌తో తయారు చేయబడింది, తపస్సు చేస్తున్న మా దిద్నేశ్వరి విగ్రహం యువరాణి అనుభూతిని ఇస్తుంది.


💠 16 అలంకారాలతో, కాంతిరేఖతో ఉన్న ఈ దివ్య అతీంద్రియ విగ్రహం ఉదయం పూట చిన్నపిల్లగా, మధ్యాహ్నం ఆడపిల్లగా, రాత్రిపూట స్త్రీగా దర్శనమిస్తుంది. 

ఈ విగ్రహం నుండి ఒక ప్రత్యేక ధ్వని వెలువడుతుంది.


💠 స్థానిక ప్రజలే కాకుండా, ఛత్తీస్‌గఢ్ మరియు దేశం మొత్తం నుండి ప్రజలు కూడా ఈ విగ్రహాన్ని సందర్శించడానికి మల్హర్ చేరుకుంటారు. అమ్మవారి గుమ్మం నుండి ఏ భక్తుడు ఖాళీ చేతులతో వెళ్ళడు అని గట్టి నమ్మకం 


💠 10-11వ శతాబ్దం నాటి ఈ ఆలయాన్ని శక్తి పీఠం అంటారు.

 శివుడిని పొందడానికి పార్వతి రాత్రి తపస్సు చేసిన అనుభూతిని కలిగించే ఈ విగ్రహం విగ్రహ కళకు అద్భుతమైన ఉదాహరణ.


💠 బిలాస్‌పూర్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోధ్రా రహదారిపై ఛత్తీస్‌గఢ్‌లోని పురాతన నగరం మల్హర్ కౌశాంబిలో మా దిద్నేశ్వరి దేవి ప్రతిష్టించబడింది. 

త్రవ్వకాల నుండి లభించిన అవశేషాలను బట్టి, ఈ ఆలయం క్రీస్తు పూర్వం నుండి సుమారు వెయ్యి సంవత్సరాల నుండి మరాఠా కాలం వరకు ఉందని తెలుస్తుంది. 

1000వ సం.లో మౌర్యుల కాలం, రెండవ శాతవాహన కుషానుల కాలం, మూడవది, శరబ్‌పురియా, మరియు సోమవంశీ కాలం, నాల్గవ మరియు ఐదవ కల్చూరి కాలం. 

కల్చూరి తర్వాత మరాఠా మరియు బ్రిటీష్ పాలన వరుసగా ఉంది. 

మల్హర్ దిద్నేశ్వరి విగ్రహంతో పాటు, ఇది చక్కటి మరియు గొప్ప హస్తకళకు ప్రసిద్ధి చెందింది. దీనితో పాటు, శైవ, శాక్త, జైన మరియు బౌద్ధ కళలు మరియు విష్ణువు యొక్క పురాతన చతుర్భుజ విగ్రహం కూడా చాలా ప్రసిద్ధి చెందాయి.


💠 కాలగర్భంలో పడిన ఈ ఆలయాన్ని నిషాద్ సమాజ్ పునరుద్ధరించింది. నిషాద్ సమాజంలో అబ్బాయిని దిండ్వా అని, అమ్మాయిని దిండ్వి అని అంటారు. బహుశా ఈ కారణంగా ఈ పేరు పెట్టబడి ఉండవచ్చు లేదా శంకరుడి  యొక్క డమరుకం లోని డిండిమ్ శబ్దం కూడా దీనికి కారణం కావచ్చు.


💠 భూమిలో జరిగిన త్రవ్వకాలలో ఈ భారీ ఆలయం కనుగొనబడింది. 

విగ్రహాన్ని పునరుద్ధరించారు.

 1981 ఏప్రిల్ 18న దొంగలు విగ్రహాన్ని దొంగిలించి మెయిన్‌పురి పొలాల్లో పాతిపెట్టారు. 

బ్రిటీష్ హయాంలో కూడా విగ్రహాన్ని దొంగిలించడానికి విఫలయత్నాలు జరిగాయి. దొంగలకు శారీరక నొప్పి రావడంతో విగ్రహాన్ని వదిలి పారిపోయారు.


💠 చాలా మంది సాధకులు దీనిని సిద్ధపీఠంగా ధృవీకరించారు. 

ఇక్కడ రాత్రి సమయంలో అమ్మవారి విగ్రహo చీలమండ ప్రాతం నుండి ఒక మృదువైన ధ్వని ప్రతిధ్వనిస్తుంది. 

ఈ విషయాన్ని స్థానిక పూజారులు అలాగే  కామాఖ్య అన్వేషకులు ధృవీకరించారు. ముంగేర్‌లోని యువ తాంత్రికుడు కూడా దీనిని ప్రత్యక్షంగా అనుభవించాడు


💠 నవరాత్రులలో ప్రత్యేక కార్యక్రమాలు,

చేత్ర నవరాత్రుల రోజుల్లో, ప్రజలు మాతా దిద్నేశ్వరి ఆలయానికి రంగులలో పెయింట్ చేస్తారు. 


గ్రామంలో భక్తి వాతావరణం నెలకొని, అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు చేరుతారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు, మతపరమైన కార్యక్రమాలు కూడా జరుగుతాయి.


💠 మల్హర్‌లోని కేవత్ ప్రాంతంలో జైన తీర్థంకర్ సుపత్వనాథ్‌తో పాటు తొమ్మిది తీర్థంకర్ విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి. 

గ్రామస్థులు దీనిని నందమహల్ అని పిలుస్తారు. దేవాలయాలు, రాళ్లు, విగ్రహాలే కాకుండా, పురావస్తు సంపద ఇక్కడ చెల్లాచెదురుగా ఉంది.



💠 బిలాస్‌పూర్ నుండి 40 కిమీ దూరంలో ఉంరి  ఉన్న మల్హర్ గ్రామం

అమ్మకడుపునుండి

 *సీసము*

అమ్మకడుపునుండి కమ్మంగనేర్చిన

   యమ్మవంటి కలిమి యాంధ్రభాష

ఆనందమందైన నావేశమందైన

  నావేదనందైన ననుగునైన

ఉత్సాహమందైన నుద్వేగమందైన

  కూర్మికైననుగాని పేర్మినైన

అంధులైననుగాని బంధుజనంబైన

   వితతమ్ము వాడెడి వెలుగు తెలుగు.

*ఆ.వె.*

ఎల్లవేళలందు నుల్లంబునందుండ

తెగడుచుండు జనుల తెగులు గాంచి

భావి చెరచ బడెడి బాలుర మదినెంచి

తల్లి వంటి తెలుగు తల్లడిల్లు.


*అందరికీ ప్రపంచ తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు.*


*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -32🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -32🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*“ వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన !*

*వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి !!*


తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని భవిష్యోత్తరపురాణం లోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం. 


శ్రీ మహావిష్ణువు తిరుమలలో మొదటిసారి వెలసింది మొదలు ఇప్పటివరకు మొత్తం మూడుసార్లు ఆలయ నిర్మాణం జరిగింది. విశ్వకర్మ, తొండమాన్ చక్రవర్తి- ఇద్దరు కట్టించిన రెండు ఆలయాలు ఇప్పటికీ సప్తగిరుల్లో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్నాయి.


 మూడోసారి భరద్వాజ మహర్షి కట్టించిన ఆలయమే నేటి తిరుమల క్షేత్రంగా భాసిల్లుతోంది. అప్పటినుంచి తిరుమలేశుడు దేవదేవుడిగా పూజలందుకుంటున్నాడు.


ద్వాపరయుగం చివర్లో, కలియుగం ఆరంభాన స్వామివారికి తొండమాన్ చక్రవర్తి ఒక ఆలయం కట్టించారు. రెండు గోపురాలు, మూడు ప్రకారాలతో వేంకటేశ్వరస్వామికి ఆలయం నిర్మించినట్టు అష్టాదశ పురాణాల్లో ఉంది.


అయితే, తొండమాన్ చక్రవర్తి కట్టించిన గుడి కూడా కొన్ని నైసర్గిక వైపరీత్యాల వల్ల కాలగర్భంలో కలిసిపోయింది. 


దాంతో స్వామివారి దివ్యమంగళ అర్చావతార స్వరూపం కూడా భూగతమైపోయింది. 


రెండో ఆలయం కూడా శిథిలం కావటంతో చాలాకాలం తర్వాత మళ్లీ శ్రీనివాసుడి కోసం ఆలయ నిర్మాణం జరిగింది. 


1900 సంవత్సరాల క్రితం భరద్వాజ మహర్షి ఆధ్వర్యంలో దేవాలయం నిర్మించారు. తిరుపతి పట్టణానికి సమీపంలో ఉన్న శ్రీకృష్ణ ఆలయ అర్చకులు శ్రీ గోపీనాథ దీక్షితులు, మరో గ్రామానికి చెందిన యాదవునికి స్వామివారు ఒకేసారి కలలో కనిపించారు. 


తన అర్చావతార స్వరూపం స్వామివారి పుష్కరిణికి దక్షిణం దిశగా ఒక చింతచెట్టు కింద భూగతమై ఉన్నట్టు చెప్పారు. దానిని వెలికితీసి అదే చోట మళ్లీ ప్రతిష్టించమని ఆదేశించారు. స్వామివారి ఆదేశానుసారం వాళ్లిద్దరూ దివ్యమంగళ స్వరూపం కోసం వెతుకుతూ వెళ్లి ఒక చోట కలుసుకుంటారు. 


ఇద్దరూ కలిసి చెట్టు కింద స్వామివారి రూపాన్ని కనుగొంటారు. తర్వాత కపిలగోవు పాలను కుండల్లో తీసుకొచ్చి పుట్ట మీద పోస్తారు. దాంతో పుట్టమన్ను కరిగిపోయి, అర్చావతారంలో ఉన్న స్వామివారు దర్శనమిస్తారు. సరిగ్గా అదే చోట భరద్వాజ మహర్షి ఆధ్వర్యంలో వైఖానస ఆగమోత్తంగా స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేశారు


భరద్వాజ మహర్షి నిర్మించిన ఆలయాన్ని అనేక మంది రాజులు, రారాజులు అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఆలయం చుట్టుపక్కల అనేక నూతన నిర్మాణాలు చేపట్టారు. తరతరాలుగా భరద్వాజ గోత్రానికి చెందిన గోపీనాథ దీక్షితుల వంశం వాళ్లే స్వామి వారికి సేవలు అందిస్తున్నారు. వారికి మాత్రమే మూలవిరాట్టుని తాకే అర్హత ఉంది. 


 క్రీ.శ.614. పల్లవ రాణి సామవై కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్దారణ కావింపబడింది. సామవై పెరిందేవి క్రీ.శ. 614 లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బహుకరించింది. అక్కడి అర్చకులు సూచించిన విధంగా ఈ విగ్రహాన్ని బహుకరించి శ్రీ వైఖనస భగవఛ్ఛాస్త్రోక్తంగ ప్రతిష్టింపజేసింది. ఇదే తిరుమల ఆలయంలో మొట్టమొదటి కానుకగా దేవాలయంలోని గోడల మీది శాసనం వలన తెలుస్తోంది


ఆ వెండి విగ్రహాన్ని మనవాల పెరుమాల్ అని పిలుస్తారు. అప్పటికే స్వామివారి ఆలయంలో గర్భాలయం, అంతరాలం, విమాన గోపురం ఉన్నాయి.

అంతరాలం అనేది స్వామివారికి ఏకాంత సేవ జరిపే శయన మంటపం! ఈ మంటపం బయట రాములవారి మేడ ఉన్న ప్రదేశంలో ఒకప్పుడు స్వామివారి ఆలయ ప్రదక్షిణ ఉండేది. 


1150వ సంవత్సరంలో శ్రీవారి ఆలయంలో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి. స్వామివారి విమాన ఆకారాన్ని పెంచి, ఆ బరువును మోయడానికి గర్భాలయ గోడలను మరింత పటిష్టం చేశారు.


 ఆ క్రమంలోనే ప్రస్తుతమున్న వైకుంఠ ప్రదక్షిణ ఏర్పాటు చేశారు. రాములవారి మేడను మూసేసి అర్థమంటపం, ముఖ మంటపం కట్టారు. గరుడాళ్వార్ సన్నిధి, ఇరువైపులా ద్వారపాలకులను కూడా ఆసమయంలోనే నిర్మించారు. ప్రదక్షిణ మార్గంలో ఈశాన్యం వైపు యోగ నరసింహస్వామి దేవాలయం, ఆగ్నేయంలో వరదరాజులస్వామి వారి ఆలయం, దక్షిణ ఆగ్నేయంలో యాగశాల మంటపం, పచన మంటపం, పాకశాల నిర్మించారు. అప్పుడే విమాన ప్రదక్షిణం ఏర్పడింది. 


గరుడాళ్వార్ సన్నిధి వెనకవైపు ధ్వజస్తంభం, బలిపీఠాన్ని ప్రతిష్టించారు. ఆ సమయంలోనే రెండో ప్రాకారంగా పిలిచే వెండివాకిలి నిర్మించారు.

13వ శతాబ్దంలో శ్రీవారి ఆలయానికి మరిన్ని హంగులద్దారు. ఆలయం బయట రంగనాయకుల మండపాన్ని నిర్మించారు. 


అప్పుడే అద్దాల మండపం కూడా కట్టారు. ఈ అద్దాల మండపంలోనే వరాహస్వామి కొలువై ఉండేవారని చెప్తుంటారు. అప్పట్లో అక్కడ ఒక పూలబావి ఉండేది. 14వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల హయాంలో మహద్వార గోపురం, మహాప్రాకారం నిర్మించారు. 


మహద్వార గోపురం లోపల 16 స్తంభాలతో ప్రతిమా మంటపాన్ని కట్టారు. అందులో శ్రీ కృష్ణ దేవరాయలు ఒక సామాన్య భక్తుడిగా తన ఇద్దరు రాణుల ప్రతిమలను ఏర్పాటు చేయించారు. ఆ రెండు విగ్రహాలు స్వామివారికి నమస్కరిస్తున్నట్టుగా కనిపిస్తాయి. 


అప్పటికే ఆలయంలో సుమారు 9, 10 శతాబ్దాల్లో నిర్మించిన వెయ్యి కాళ్ల మంటపం, వాహన మంటపం ఉండేవి. తిరుమల వెంకన్న ఆలయంలోని మండపాలు, ప్రాకారాలు, సోపానాలు, జలాశయాలే కాదు- ప్రతీరాయి ప్రతీస్తంభం వైఖానస ఆగమశాస్త్రం ప్రకారమే నిర్మించారు. ఎక్కడా శాస్త్రాన్ని మీరలేదు. కించిత్ వాస్తుదోషం లేకుండా దివ్యక్షేత్రంగా తిరుమల ఆలయ నిర్మాణం జరిగింది.


 ఒకపక్క వరదహస్తం మరోపక్క కటిహస్తంతో నిశ్చలానంద మందార మకరందంతో కనిపించే శ్రీనివాసుడి రూపం మధురం! ఆయన నామం బతికించే సిద్ధమంత్రం! ఆయన పాదం పరమపదం! అందుకే వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన! ఎన్నిసార్లు కైమోడ్పులు అర్పించినా.. పునర్‌దర్శనం ఇప్పించు స్వామీ అని వేడుకుంటాం.


పద్మావతీస గోవిందా, పద్మ మనోహర గోవిందా, ఆనంద నిలయ గోవిందా, ఆనంద రూపా గోవిందా; |


గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||32


మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు, పురాణ గాథల కోసం *సనాతన హిందూ ధర్మం* పేజీని లైక్ చేసి ఫాలో చేయండి.


ఈ పోస్ట్ నచ్చితే షేర్ చేయండి.


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహా పురాణం🪐* . *13వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *13వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*సూర్యగ్రహ జననం - 4*


శ్రీ మహావిష్ణువు లక్ష్మిని శేషతల్పం వైపు నడిపించాడు. ఆమెను కూర్చోబెట్టి , పక్కనే కూర్చున్నాడు.


శ్రీదేవి ముఖపద్మాన్ని తన రెండు అరచేతుల మధ్య ఇమిడ్చి పట్టుకుని , సున్నితంగా తన వైపు తిప్పుకున్నాడు శ్రీమహావిష్ణువు. ఆమె విశాల నేత్రాలలోకి ఆయన నేత్రాలు తదేకంగా చూశాయి.


*"ఒక జ్యోతి వెలుగును తీసుకువెళ్ళి , దానితో రెండవ జ్యోతిని వెలిగించినప్పటికీ , మొదటి జ్యోతిలోని కాంతి తరిగిపోలేదు. అంటే అక్కడ కాంతి 'వ్యయం' కాలేదు. కాదు కూడా ! అది అవ్యయం ! మూలరూపాలు కూడా అంతే ! అవ్యయాలే ! వేరొక అవతారాన్ని ధరించాక మూల రూపంలో కొరత ఏర్పడదు. దాని శక్తి తగ్గదు; చేవ తరగదు !”* 


*"స్వామీ !"* లక్ష్మి భావావేశంతో అంది.


విష్ణువు చిన్నగా నవ్వాడు. *"నువ్వే చూస్తావుగా దేవీ ! భవిష్యత్తులో నువ్వూ , మేమూ ఎన్నో అవతారాలు ధరిస్తాం ! కానీ మన ఈ 'మూలరూపాలు' ఇలాగే వుంటాయి !"*


మెరుస్తున్న శ్రీలక్ష్మి కళ్ళకి తోడుగా , ఆమె పెదవులు కూడా చిరునవ్వుతో మెరిశాయి. *“కాబట్టి , ఇక్కడ సూక్ష్మరూపంలో మీ నయన కమలాలలో ప్రకాశిస్తున్న సూర్యుడు - అక్కడ స్థూల శరీరంతో కూడా ప్రకాశిస్తూ వున్నాడు. స్వామీ , అంతేకదా ?"*


“అంతే కదా ? లక్ష్మి ప్రశ్నకు విష్ణువు ప్రశ్న సమాధానం చెప్పింది. *"స్వామీ ! మీ నయన సూర్యుడు ఎక్కడ , ఎవరికి జన్మించాడు ? ఎందుకు జన్మించాడు ?"* లక్ష్మి కుతూహలంగా అడిగింది.


*"కశ్యప ప్రజాపతి సతి అదితికి ప్రియ పుత్రుడుగా జన్మించాడు ! నరుల ఆరాధనా సౌలభ్యం కోసం అంతరిక్షంలో సూక్ష్మ రూపాలలో ఉన్న 'నవగ్రహాలు' స్థూలదేహాలు ధరించి అవతరించాలనీ , గ్రహదేవతలను ప్రసన్నం చేసుకుని ప్రాణులు తరించాలనీ మేం సంకల్పించాం. సూర్యుడి జననంతో మా సంకల్పానికి అంకురార్పణ జరిగింది !"* శ్రీమహావిష్ణువు కంఠంలో తృప్తి ధ్వనించింది.


*"దివ్య సంకల్పం స్వామీ , మీది !"* లక్ష్మి ఉత్సాహంగా అంది. *"అయితే మిగిలిన గ్రహదేవతలు ఎప్పుడు ఎవరెవరికి జన్మిస్తారు ?”*


*"ఎప్పటి మాటో ఇప్పుడెందుకు దేవీ ?"* విష్ణువు చిరునవ్వుతో అన్నాడు. శ్రీలక్ష్మి ఏదో అనబోయింది. అయితే , 'నారాయణ !' అనే నారదుడి కంఠధ్వని ఆమెకు అడ్డు తగిలింది. నారాయణ నామ ధ్వనిని వెంబడిస్తూ నారదుడు ప్రవేశించాడు.


*“నమో నమః ! నమో నమః !”* నారదుడు ఆదిదంపతులకు చేతులెత్తి నమస్కరించాడు. *“నారదా ! కుశలమా ?”* శ్రీమహావిష్ణువు పలకరింపుగా అన్నాడు.


*“సర్వకాల సర్వావస్థల్లో నా నాలుక మీద నాట్యం చేసే నీ దివ్య నామం నాకు రక్షగా వుందిగా , నారాయణా ! నీది నిర్హేతుక కృప కదా ! కారణం లేకుండా కరుణించే అమృత తత్వం కదా నీది ! నా తండ్రి గారి శాపాన్ని స్వీకరించి , నీ నామస్మరణ యాగం ప్రారంభించిన వెంటనే మహత్తర సంగీత సాధనమైన ఈ 'మహతి'ని బహూకరించావు. ఇంక ఈ నారదుని క్షేమానికి కొరత ఎక్కడ !"* నారదుడు నవ్వుతూ అన్నాడు. *"ఊ ! నీ 'కుశలము' నకూ కొరత లేదు. 'కౌశలము' నకూ కొరత లేదు' శ్రీ మహావిష్ణువు నవ్వుతూ అన్నాడు.*


*“నారాయణ !"*


*"రాక రాక వచ్చావు ! రాకలో ఏదైనా రహస్యముందా ?"* లక్ష్మి చిరునవ్వుతో అడిగింది.


*"చిత్తం ! ఒక శుభవార్త విన్నవించే కోరికతో వచ్చాను మాతా ?"* నారదుడు. ఉత్సాహంగా *"అయితే ఆ వార్త మాకు అందలేదనుకుంటున్నావా , నారదా ?"* శ్రీ మహావిష్ణువు నవ్వుతూ అన్నాడు.


*"మీకు తెలియని దేముంటుంది ? పాపం... చెప్పనివ్వండి స్వామీ !"* లక్ష్మి మందలింపుగా అంది. 


*“సరే ! మంచిమాట మాటిమాటికీ వినడం మంచిదే ! వినిపించు , నారదా !”* విష్ణువు చిరునవ్వు నవ్వాడు.


*"ధన్యోస్మి ! సాధ్వీమణి అదితికి పుత్రుడు జన్మించాడు... కశ్యప ప్రజాపతి జాతకర్మ , నామకరణ మహోత్సవాలకు సంకల్పించాడు...”*


*"శుభం ! చతుర్ముఖుజ్జీ , త్రినేత్రుణ్ణి , ఇంద్రాదులనూ ఆహ్వానించు , నారదా ! సూర్య జననం అందరికీ హర్షం కలిగించేదే !"* విష్ణువు అన్నాడు. *"నారాయణ ! అలాగే !"* నారదుడు నమస్కరించి నిష్క్రమించాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 10*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 10*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*సుధాధారసారైః చరణ యుగళాన్తః విగళితైః*

*ప్రపచం  సిఞ్చన్తీ పునరపి రసామ్నాయ మహసః |*

*అవాప్య స్వాం భూమిం భుజగనిభ మధ్యుష్టవలయం*

*స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి ||*



సాధకుడు గత శ్లోకంలో చెప్పినట్లు సహస్రా పద్మాన్ని కుండలినీ శక్తితో చేరగలిగినప్పుడు ఎలాంటి అనుభూతి పొందుతాడు?


చరణయుగళాన్తః విగళితైః = అమ్మవారి పాదాల నుండి వెలువడుతున్న


 సుధాధారాసారైః = అమృతప్రవాహం


ప్రపంచం సిన్ఞంతీం = శరీరంలోని 72వేల నాడులను తడుపుతూ ఉంటుంది.


పునరపి రసామ్నాయ మహసః =  మళ్ళీ మళ్ళీ ఆ ఆనందామృత ప్రవాహం శరీరంలో ప్రవహిస్తూ ఉంటుంది.


రసః = ఆర్ద్రత,తడి, ఆనందానుభవము


మహసః = మహత్


కాంతి = జ్ఞాన కాంతి 


అవాప్య స్వాం ... కులకుండే కుహరిణి = ఆ విధంగా షట్చక్రములను ఛేదించి సహస్రార పద్మమునందు శివసాయుజ్య స్థానమైన, అమృత కాంతి తుల్యమైన చంద్రుడిని వీడి కుండలినీ శక్తి స్వస్థానమైన మూలాధార చక్రాన్ని మరల చేరుకుని, స్వస్వరూప జ్ఞానముతో సర్పము వలే చుట్ట చుట్టకుని నిద్రిస్తుంది.


            🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

తెలుగుభాష! రతనాలభాష!*

 *నా తెలుగుభాష! రతనాలభాష!*


*అంశం* : *"అధికారభాషపై అధికారుల నిర్లక్ష్యం*

*శీర్షిక* :    *నా తెలుగుభాష! రతనాలభాష!*

*పేరు* : *~శ్రీశర్మద*


సంస్కృతామృతమ్ము నాపోశనంబట్టి 

నన్నయ్య చిన్నయ్య సంస్కరించిన భాష 

తీయతేనెలకన్న కమ్మనై యలరారి 

నయగారములనొలుకు నా తెలుగుభాష 


అల కందుకూరి గురజాడ జాడలన్ 

చిలకమర్తి వారి పల్కులందున కులికి 

పిడుగు వంటి గిగుడు గొడుగు ఛాయన జేరి 

కడిగిన ముత్యమైన భాష నా తెలుగుభాష


రాజుల కాలన రాజసమ్మొలికించి 

చట్టభాషగ తాను మెలగి చెలగి 

చుట్టమై ప్రజకెల్ల అలరారిన భాష 

కమ్మతేనెల మాధురి నా తెలుగుభాష 


భాషోద్యమమునందు వ్యావహారికస్థాయి 

నందిబుచ్చుకొని వచ్చి అందివచ్చిన భాష 

నా తెలుగుభాష నాదరింపగ రారె!

అధికార వ్యవహార డోలలూపగ రారె! 

అందివచ్చును భాష అందగించును భాష 

నిర్లక్ష్యమిక వద్దు లక్ష్యమే ఇక ముద్దు 


జై తెలుగుభాష! జై తెలుగుభాష! 

----------------------------------------------------------

రచన:

*కవితాభారతి*

*~శ్రీశర్మద*

8333844664 

తెనాలి.

పాలిటానా

 


🛕🛕 గుజరాత్‌లోని పాలిటానా 900 కంటే ఎక్కువ దేవాలయాలను కలిగి ఉన్న ప్రపంచంలోని ఏకైక పర్వతం. మొత్తం పర్వతం అత్యంత పవిత్రమైన తీర్థ క్షేత్రంగా పరిగణించబడుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ సముదాయం, ఇది విమానం వీక్షణలో చూపబడింది. అయితే ఇప్పటికీ తాజ్‌మహల్‌ ప్రపంచంలోనే అద్భుతం. మనలో చాలామంది దీని గురించి వినలేదు, చూడలేదు. ఎందుకంటే పబ్లిసిటీ లేదు. అద్భుతం..🎊🙌✊

తెలుగు భాషా దినోత్సవo

 గోరు ముద్దల తోటి తల్లి నేర్పిన భాష

గోముగా తండ్రి మనని పలుకరించే భాష

బంధు మిత్రులతో ఊసు లాడెడి భాష

బాధ గల్గినప్పుడు బయటకొచ్చే భాష

పలుకుటకు సొంపుగా, వీనులకు ఇంపుగా ఒదిగిపోయే భాష.

అదె మన మాతృభాష, తేనెలొలికెడి మన తెలుగు భాష.

తెలుగులోనే మాట్లాడదాం!

తెలుగును పిల్లలకు నేర్పించుదాం!

అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.

సుబ్బు శివకుమార్ చిల్లర💐💐.

Panchaag


 

నీలిరంగు చందమామ

 *నేడు నీలిరంగు చందమామ  ఆవిష్కృతం*


ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానున్నది. ఇటీవల శనిగ్రహం ఖగోళ ప్రియులను కనువిందు చేయగా.. అంతకు ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. బుధుడు, యురేనస్‌, గురుగ్రహం, నైప్యూటర్‌, శనిగ్రహాలు ఒకే వరుసలోకి చేరాయి. ఈ ఘట్టాన్ని ఎలాంటి పరికరాలు లేకుండా చూడే అవకాశం కలిగింది.ఈ క్రమంలోనే బుధవారం మరో అరుదైన దృశ్యం నీలిరంగు చందమామ ఆవిష్కృతం కాబోతున్నది.


ఈ నెలలో రెండు పున్నములు ఉండగా.. ఒకటి ఆగస్టు ఒకటో తేదీన ఏర్పడింది. దీన్ని సూపర్‌మూన్‌గా పిలువగా.. నేడు నీలిరంగు చందమామ బుధవారం ఏర్పడబోతున్నది. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్‌ మూన్స్‌ ఏర్పడుతుంటాయి..


కానీ, బుధవారం ఏర్పడబోయే బ్లూమూన్‌ మాత్రం అరుదైనది. పౌర్ణమి సమయంలో చందమామ భూమికి దగ్గరగా వచ్చిన సూపర్‌ మూన్‌ ఆవిష్కృతమవుతుంది. సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్‌ మూన్‌ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు. సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెలను పంచబోతున్నాడు..

ఆలయానికి చేరుకోవాలి.

 *ప్రతి మంగళవారం సాయంత్రం 7:00 నుండి 7:30 మధ్య, మీరు ఎక్కడ ఉన్నా ఆలయానికి చేరుకోవాలి.*


క్రైస్తవులు ఆదివారాల్లో చర్చికి వెళ్లినట్లు 


మరియు ముస్లింలు ఖచ్చితంగా శుక్రవారం రోజున మసీదుకు వెళతారు.     

                                  మనం హైందవులం మంగళవారం రోజు, బలం మరియు బుద్ధి రోజు, శక్తి రోజు, హనుమాన్ జీ రోజును నిర్ణయించుకోవాలి.


హిందువు ఎప్పటికీ హిందువు కోసం నిలబడలేడని మీరందరూ ఫిర్యాదు చేస్తున్నారు.  


మీరు కనీసం వారానికి ఒకసారి ఒకరినొకరు కలుసుకోలేని వారు అలాంటి పిర్యాదు ఎలా చేస్థారు.


ఎడారిగా ఉన్న మన దేవాలయాలను శక్తి మరియు సంస్థాగత ప్రదేశాలుగా అభివృద్ధి చేసుకుందాం.


 *ప్రతి మంగళవారం సాయంత్రం 7:00 నుండి 7:30 మధ్య, మీరు ఎక్కడ ఉన్నా ఆలయానికి చేరుకోవాలి.*


ఇది హనుమాన్ చాలీసా మరియు హారతి సమయం.



 మీ ఇంట్లో ఉంటే ఇంటి దగ్గర ఉన్న గుడిలో..


షాపులో ఉంటే షాప్ దగ్గర ఉన్న గుడిలో..


ఆఫీస్ దగ్గర ఉన్న గుడిలో.. 


ప్రతి మంగళవారం సాయంత్రం 7:00 గంటలకు ఆలయానికి చేరుకోవాలి. 7:00 నుండి 7:30 వరకు.

భారతదేశంలో లక్షలాది దేవాలయాలు ఉన్నాయని ఊహించుకోండి,


కేవలం 50 నుండి 100 మంది మాత్రమే ప్రతి ఆలయానికి చేరుకుని, శంఖం మరియు హారతి శబ్దాలు వారి గంటలతో ప్రతిధ్వనించి నట్లయితే, 


భారతదేశం మొత్తంలో ప్రతి మంగళవారం సరిగ్గా 7:00 గంటలకు మిశ్రమ సంగీతం. 7 .

 30 నిమిషాల మధ్యలో ప్రతిధ్వనిస్తే, 


ఈ స్వరం ప్రపంచం మొత్తానికి వెళుతుంది, 


దాని ప్రభావం చాలా విస్తృతంగా ఉంటుంది.  నన్ను నమ్మండి, ఈనాటి సమస్యలన్నీ కర్పూరంలా ఎగిరిపోతాయి, 


హిందువులు ఇంత పెద్ద సంఖ్యలో తమ దేవాలయాలకు చేరుకున్నప్పుడు, 


అది కూడా ప్రతి వారం, హిందువులను ఆటపట్టించే ధైర్యం ఎవరికి ఉండదు.

 

వీలైతే 

భార్యాబిడ్డలను తీసుకుని గుడికి వెళ్లండి, 


ప్రతి మంగళవారం ఈ విధంగా క్రమం తప్పకుండా గుడికి చేరుకుంటే మీ ఇరుగుపొరుగు వారు కూడా మిమ్మల్ని కలుస్తారని మీకే తెలుస్తుంది, 


మీ బాంధవ్యం పెరుగుతుంది. 


ఆపై మీరు కూడా ఒకరికొకరు సుఖ దుఃఖాలలో పాలుపంచుకుంటారు, 


అదే విధంగా మనమందరం ఐక్యత అనే దారంలో కట్టుబడి ఉంటాము.


మీకు సందేశం నచ్చినట్లయితే, 

దానిని అన్ని సమూహాలకు విస్తరించండి.  (అన్ని గౄపులకు పంపండి) 


మరియు ఈరోజే ప్రతిజ్ఞ చేయండి, 


మనం ఏమి చేస్తున్నా, ప్రతి మంగళవారం 7:00 నుండి 7:30 వరకు, 


మేము ఖచ్చితంగా ఆలయానికి చేరుకుంటాము, 

మన కోసం కాదు, మన సమాజం మరియు మన కుటుంబాల భద్రత కోసం.  


ఇప్పుడు ఇది అవసరం అయిందని గుర్తుంచుకోండి, మీరు ఇంకా వాయిదా వేస్తే, మీరు చాలా ప్రమాదంలోకి వెళ్ళాల్సి వస్తుంది.  


మీరు దీన్ని ఎంత త్వరగా ప్రారంభిస్తే, అంత త్వరగా మీరు ఐక్యత యొక్క దారంలో ఒకరికొకరు ముడిపడి ఉంటారు.


 *ఈ సందేశాన్ని కనీసం ఐదు గ్రూపులకు పంపండి*

 *కొందరు పంపరు కానీ మీరు తప్పకుండా పంపుతారని నేను నమ్ముతున్నాను ఆశిస్తున్నాను*