16, ఫిబ్రవరి 2023, గురువారం

ఉద్యోగుల* *పరిస్థితి*

 *ఉద్యోగుల* *పరిస్థితి* 

*ఒకడు తన కష్టాలు గట్టెక్కే మార్గం కోసం పొరుగూరు లో ఉన్న యోగి ని కలవడానికి అడవి మార్గం గుండా బయలుదేరాడు . ఒకరోజుకి సరిపడా నీళ్లు పట్టుకున్నాడు . అయితే అడవిలో దారి తప్పాడు . ( *ఇప్పుడు అతని మొదటి లక్ష్యం యోగిని కలవడం కాదు . అడవి లోనుండి బయటపడడం* ) *బాగా దాహం వేసింది . నీళ్ల సీసా తీద్దాం అని సంచిలో చేయి పెట్టాడు . సీసా లేదు ఎక్కడో పడిపోయింది . గొంతు ఎండిపోతుంది . ప్రాణం పోతున్నట్టు ఉంది . ( *ఇప్పుడు అతని లక్ష్యం దారి కనుక్కకోవడం కాదు . దాహం తీర్చుకోవడం* ) . *ఇంతలో ఎదురుగా పులి కనిపించింది . గబుక్కున ఒక చెట్టెక్కేసాడు . చెట్టు కింద పులి . అలా నాలుగు గంటలు ఉన్నాడు . దాహం మర్చిపోయాడు . ( *ఇప్పుడు అతని లక్ష్యం పులి నుండి తప్పించుకోవడం మాత్రమే* ) . *పులి వెళ్ళిపోయింది . జీవితంలో ఎప్పుడూ లేని ఆనందంతో చెట్టు దిగాడు . ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అంతే మనకు రావలసిన అన్ని *బకాయిలు , ఎరియర్స్ , DA లు విడిచిపెట్టి జీతం పడితే చాలు మహా ప్రభో* *అనే విధంగా ఉద్యోగుల ఆలోచనను తీసుకొచ్చారు* .

శివరాత్రి విషయములో

 శివరాత్రి విషయములో వదంతులు నమ్మవద్దు...


పుష్కర పుష్కరకాలానికి వస్తోంది అని చెబుతున్నది అబద్దం..

శనివారం మహాశివరాత్రి రావడం చాలా సహజం,

 అందునా శని త్రయోదశీ ప్రదోషం శివరాత్రి కలిసి రావడం కూడా మరీ 144 సంవత్సరాలకు ఒకేసారి వస్తోంది అనడం కూడా అబద్దం

మామూలుగా వచ్చే విషయమే....కింద 1800 నుండి 2300 వరకూ వచ్చిన మహాశివరాత్రులలో శనివారం శనిత్రయోదశీ కలిసి వచ్చిన వివరాలు ఇచ్చాను, ఉదయకాల త్రయోదశీ, ప్రదోష కాల త్రయోదశీ వివరం కూడా ఇవ్వడం జరిగినది.. అలా ఎన్ని సార్లు వచ్చాయో పాఠకులు గమనించవచ్చును..

ఇక అడ్డమైన టీవీ లైవ్ లలో తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు..


మహాశివరాత్రి నియమం వేరు

శనిత్రయోదశీ (శని ప్రదోషం) నియమం వేరు... ఉదయ వ్యాప్తి, ప్రదోష వ్యాప్తి రెండింటికీ రెండు వేరు వేరు నియమాలు వ్రతములు ఉన్నవి..


శని త్రయోదశీ ఉదయకాలం, ప్రదోషకాలం ఉన్న రెండింటి గురించి వివరం భవిష్యోత్తరం‌లో, స్కాందంలో‌ చక్కగా చెప్పారు, రెండింటిలో ఈశ్వరారాధన చేయాలి అని...


అలాగే మహా శివరాత్రి కి కూడా ఈశ్వరారాధన చేయుట ప్రధానం.

అష్టయామములలో అలాగే లింగోద్భవ కాలములో కలిపి తొమ్మిది పూజలు ఆచరించుట శివరాత్రి నియమం లేదా శివరాత్రి వ్రతం...


కనుక ఎవరిని ముందు పూజించాలి

మొదట ఏం‌చేయాలి అని, లేదా లేనిపోని హంగులు, టీ,ఆర్,పీ రేటింగ్ ల కోసం చెప్పే అబద్దాల వీడియోలతో లైవ్ ల గోలతో కాలయాపన చేయక....


పరమాత్మను మనస్సు యందు స్మరిస్తూ యథాశక్తి పరమాత్మ‌ ఆరాధన లో ఉండటం శ్రేష్ఠం

శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు 

జగదంబశివే

చిన్న కథ:

 *చిన్న కథ:*

ఒకసారి తొమ్మిది 8ని లాగి లెంపకాయ వేసింది.... 

ఏడుస్తూ 8 "నన్నెందుకొట్టావని?" 9ని అడిగింది.

"నువ్వు నాకంటే చిన్న. అందుకే కొట్టా.." అని 9 చెప్పింది.


అది వింటూనే, ఎనిమిది 7ని బలంగా ఒక్కటిచ్చింది. 9 చెప్పిన కారణమే చెప్పుకొంది.


అలాగే 

ఏడు 6ని,

ఆరు 5ని,

ఐదు 4ని,

నాలుగు 3ని,

మూడు 2ని,

రెండు 1ని లెంపకాయలు వేశాయి.


1కి క్రింద 0 వుంది. 1మాత్రం అలాచేయక ప్రేమగా 0ని తన పక్కన ముందు నిలబెట్టుకుంది. 1 విలువ 10 ఐపోయింది. ఇప్పుడు భయపడడం 9 వంతైంది. 

.... 

.... 

....

జీవితంలో ఎవరో ఒకరు మన ప్రక్కన నిలబడాలి. (వారెవరన్నది ముఖ్యం కాదు.) 

భుజం తట్టి చెయ్యి వేసేవారు వుండాలి. 

అనుబంధాన్ని మించిన విలువ జీవితంలో లేదు.

So Don't Lose Your Good Relationships With Few People..  ఇలా పక్కన నిలబడి మన విలువను పెంచే వారిలో మొదటగా ప్రాణ స్నేహితులే ఉంటారు🤝🤝..

_పాపభీతి కలిగిఉండు...

 *_ఓ మానవుడా!!_*

*_నిజం తెలుసుకో !!_*

*_కొన్నాళ్ళే నీ జీవితం_*

*_చివరికి మట్టిలో కలవక తప్పదు!_*

*_ఎక్కడ నీ ఆస్తీ,_* *_అంతస్తులు ?_*

*_ఎక్కడ నీ కుటుంబం /_* *_బందువులు ??_*

*_ఎక్కడ నీ కులం /_* *_మతం / దేవుళ్ళు ???_*

*_గర్వం,_*

*_అహంకారం,_*

*_స్వార్థం,_*

*_నేను నాది అనే విధానం_*

*_మార్చుకో...!!_*

*_శాస్త్ర సాంకేతిక రంగాలలో_* 

*_నీవు ఎంత అభివృద్ధి_*

*_సాధించినా...‌!!_*

*_స్కాములతో_*

*_దోచుకున్న_*

*_దాచుకున్న_* 

*_ఎన్ని కోట్లకు పడగెత్తినా..!!_*

*_ఇదేగా నా చివరి జీవిత మజిలీ అని మరువకు సోదరా !!!_*


*_బతికే నాలుగు రోజులు పది మంది మంచి చేయటం మరవకు.._* *_మరువకు.._*

*_పాపభీతి కలిగిఉండు..._*

*_ఆపదలో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని ప్రేమను పంచే గుణము అలవరచుకో...!!_*

👏👏👏👏👏

*_(టర్కీ భూకంపంలో మరణించిన వారి అంతిమ సంస్కారాలు చూసి_* *_చలించిన హృదయ ఘోష)_*

*_మన్నించండి 👏👏👏👏_*


     *_మీ_*

*_శ్రేయోభిలాషి_*

ప్రధానమంత్రి

 ధనవంతుడు ప్రధానమంత్రి కాగలడు

 *నెహ్రూ* దీనిని నిరూపించారు.


 పేదవాడు పి మంత్రి కాగలడు

 *శాస్త్రి జీ* దీనిని నిరూపించారు.


 వృద్ధుడు ప్రధానమంత్రి కాగలడు

 *మొరార్జీ* దీనిని నిరూపించారు.


 యువకుడు ప్రధాని కాగలడు

 *రాజీవ్ గాంధీ* దీనిని నిరూపించారు.


 ఒక మహిళ ప్రధానమంత్రి కావచ్చు

 ఇది *ఇందిరా గాంధీ* గారు నిరూపించారు.


 నిరక్షరాస్యుడు ప్రధాని కాగలడు

 * చ.  చరణ్ సింగ్* నిరూపించాడు.


 రాజకుటుంబానికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి కావచ్చు

 ఈ *V.P.  సింగ్* నిరూపించాడు.


 విద్యావంతుడు, బహుముఖ ప్రజ్ఞావంతుడు ప్రధానమంత్రి కాగలడు

 దీనిని *పి.వి.నరసింహారావు* నిరూపించారు.


 కవి ప్రధాని కాగలడు

 *అటల్ బిహారీ వాజ్‌పేయి* దీనిని నిరూపించారు.


 ఎవరైనా ప్రధాని కావచ్చు

 ఇది *HD దేవెగౌడ* గారు నిరూపించారు.


 ప్రధాని అవసరం లేదు

 ఈ *డా.  మన్మోహన్ సింగ్* నిరూపించారు.


 ప్రధాని లేకుండా దేశాన్ని పాలించవచ్చు

 *సోనియా గాంధీ* దీనిని నిరూపించారు.


 *కానీ టీ అమ్మేవాడు ప్రధానమంత్రి కాగలడు* మరియు *వీటన్నింటి కంటే మెరుగైన పని చేయగలడు* మరియు *భారతమాత జెండాను ప్రపంచమంతటా ఎగురవేయగలడు* అని ఈ *నరేంద్ర మోదీ జీ* నిరూపించారు.


 విశ్వం మొత్తం ఒక వ్యక్తిని దించడంలో నిమగ్నమై ఉంది...... భగవంతుడు కూడా ఆలోచిస్తున్నాడు, నేను ఏ మట్టిని “మోడీ”ని చేశానో తెలియదు!!

 కొంచెం ఆలోచించు...


 ప్రధాని కావడానికి ముందు అమెరికా తలవంచగలిగితే, ఆకలితో ఉన్న నగ్న దేశమైన పాకిస్థాన్‌ను కలవరపెట్టగల వ్యక్తి

 చైనా లాంటి దేశద్రోహుల దేశంలో పతాక శీర్షికలకెక్కవచ్చు..

 కాబట్టి, సోదరుడు అతను ఖచ్చితంగా భారతదేశాన్ని ప్రపంచ గురువుగా చేయగలడు!


 *"దేశానికి మోడీ అవసరం"*


 "నేను ఉచితంగా ఆహారం ఇస్తాను" - *రాహుల్ గాంధీ*


 "నేను ఉచితంగా నీరు ఇస్తాను" - *కేజ్రీవాల్*


 "నేను ఉచితంగా నీరు ఇవ్వను, నేను మాట్లాడే ఉచిత భోజనం కూడా ఇవ్వను

 నేను చాలా ఉద్యోగాలు సృష్టించాలనుకుంటున్నాను, భారతదేశంలోని యువతను ఎనేబుల్ చేస్తాను, తద్వారా నా దేశంలో ప్రతి ఒక్కరూ గర్వంగా తమ కడుపు నింపుకుంటారు మరియు ఇతరుల దాహాన్ని కూడా తీర్చగలరు" - నరేంద్ర మోదీ


 *సమస్య కేజ్రీవాల్‌లో లేదు, ఉచిత సామాగ్రి లభిస్తే లాడెన్‌కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న భారతదేశ ప్రజలు.* 

           

 మీరు దేశం కోసం ఏదైనా చేయాలనుకుంటే, ఈ సందేశాన్ని 3 మందికి పంపండి.  మీరు లింక్‌ను జోడించాలి మరియు త్వరలో దేశం మొత్తం కనెక్ట్ అవుతుంది.


 జస్ట్...కొంచెం ఫార్వర్డ్ చేయండి.. దీనికి 2-3 సెకన్లు మాత్రమే పడుతుంది...


 జై హింద్..

పుణ్యక్షేత్రములలో నదీస్నానము*

 🌴🌹🌷🕉️🛕🕉️🌷🌹🌴

          _*గురువారం*_

    _*ఫిబ్రవరి 16, 2023*_


       _*మాఘ పురాణం*_

     _*26 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉 


*పుణ్యక్షేత్రములలో నదీస్నానము*


🌹🌷🕉️🔔🕉️🌷🌹🕉️


ఈ విధముగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన మహిమను దిలీప మహారాజునకు వశిష్టులవారు వివరించగా , ఆ రాజు *"మహర్షి ! మీ కృపవలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కాని మరొక సంశయము నాకు గలదు , అది ఏమనగా , మాఘమాసమందు యే యే తీర్థములు దర్శింపవలెనో సెలవిం"* డని వినమ్రుడై కోరగా వశిష్టులవారు మరల యిట్లనిరి. దిలీప మహారాజా ! మాఘస్నానములు చేయుట యందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థమహిమలను గురించి వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము. మాఘమాసములలో నదీ స్నానము ముఖ్యమైనది. మాఘస్నానములు చేయలేక , తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకము. ఏలననగా మాఘమాసములో యే నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసములో నదీస్నానము సర్వపాపహరమైనది. ఆవశ్యమైనది కూడా , అటులనే ప్రయాగ అతిముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములలో అతి ప్రధానమైన గంగానది సముద్రములో కలియుచోట మాఘస్నాన మాచరించిన యేడు జన్మలలోని పాపములన్నియు సహితము హరించును. మాఘమాసములో నదీస్నానముతో బాటు విష్ణు దేవాలయములు , మహేశ్వరాలయములు మొదలగు మూడువందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొప్ప ఫలము కల్గుటయేగాక మరల జన్మలనేవి కలుగదు.


ఇక త్రయంబకమను ముఖ్యమైన క్షేత్రం కలదు , ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచటనే పవిత్ర గోదావరి నది జనించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పొగొట్టుకొనుట కిచ్చటనే ఈశ్వరుని గురించి ఘోరతపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతము మీదుగా గోదావరిని ప్రవహింప జేసినాడు. కావున మాఘమాసములో గోదావరియందు స్నానము చేసిన యెడల తక్షణమే సకల పాపములూ హరించి పోవుటయే గాక , ఇహమందు , పరమందు కూడా సుఖపడుదురు , మన దేశములో యెన్నో నదులున్నవి , ప్రతి నదీతీరమున యెన్నో క్షేత్రములున్నవి , ఆ నదులలో మహానదులు , పుణ్యనదులు ముఖ్యములు అవి వందకు పైగావున్నవి. అటువంటి కొన్నిపేర్లు స్మరించినచో ఆ నదీ తీరాలలో నున్న క్షేత్రదేవతలను కూడ స్మరించినట్లే అగును. అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తుచేసుకొందాము. నందిని , మందాకిని, నళిని , తామ్రవర్ణి , భీమరధి , గంగా , యమున , నేత్రావతి , పంపానది , కృష్ణవేణీ , మహేద్రతనయ , గోదావరి , నర్మదా మొదలైనవి మహానదులు. భగీరధి , గంగ , నర్మద , యమున , సరస్వతి , కృష్ణవేణీ , బాహుద , భీమరధి , తుంగభద్ర , రేణుక , మలావహరి , కావేరి, క్పతమాల , తామ్రపర్ణి , విశోక , కేశికి , గండకి , విచిత్రక , వశిష్ఠప్రవర , కాశ్యపి , సరయు , సర్వపాపహరి , కుశాపతి , పల్గుని కరతోయ , పుణ్యద , ప్రణిత మొదలైనవి పుణ్యనదులు. మహానదులు చిరకాలము నుండి ప్రవహించుచున్నవి. పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నమువలన వారి పుణ్యము కొలది ప్రవహించి వారి పుణ్యము నందించునని , మహానదులు , పుణ్యనదులు రెండు విశిష్ట లక్షణములు కలిగిన గంగ , యమున మొదలైన నదులు , మహానదులుగానూ పుణ్యనదులుగాను అయివుండవచ్చును. ఈ నదులలో చేసిన స్నానం విశేషఫలప్రదం , మనము ఆ నదులలో స్నానము చేయలేకపోయినను , పవిత్ర మాఘమాసమున ఆ పేర్లను తలుచుకొన్నను పుణ్యమే కదా. ఈ స్మరణ వలన ఆ నదులను , ఆ నదీతీరములయందున్న పవిత్ర దైవములను కూడా స్మరించినట్లే అగును కదా. గౌతమీనదిలో మరికొన్ని ప్రసిద్దములగు ఉపనదులు కూడా కలసి తమతమ స్నేహసౌభ్రాతృత్వములను చాటుచున్నవి. అటులనే *"వరం తప"* అని ఉపనది ప్రవహించేచోట కూడా శివుడు లింగాకారముతో వెలసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రము కలదు. ఆ క్షేత్రము బ్రహ్మ హత్యా మహాపాపములను సహితము పోగొట్టగలదు. ఇందుకొక ఇతి వృత్తము గలదు. సావధానుడవై ఆలకింపుము.


విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకును , ఈశ్వరునకు అయిదేసి తలలు వుండెడివి. ఈశ్వరునికి పంచరుద్రుదు , త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు ! బ్రహ్మ దేవుడు నాకును ఐదు తలలున్నవి నేనే గొప్పవాడనని శివునితో వాదించెను. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యెను. కడకు ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదుతలలను నరికి వేసెను. వెంటనే శివునకు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకొన్నది. శివుడు భయపడి , తాను నరికిన బ్రహ్మ  తలలను చేతపట్టుకొని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమముగా చేతిలోవున్న బ్రహ్మతల యెండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు సహజముగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి *"భిక్షాందేహీ"* యనగా గృహిణులు భిక్షపట్టుకొని గుమ్మము కడకురాగా శివుని జగన్మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి , కోపం కలవారై తమ భార్యలు శివుని వెంటపోవుట సహించలేక , అతనికి *"పురుషత్వము నశించునుగాక"* అని శపించిరి. ఈశ్వరుడును చేయునదిలేక క్రింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమయి పోయినాడు , అట్లు శివుడు లింగాకారముగా మారినందువలన ఆ లింగమమితమైన తేజస్సుతో ప్రకాశించుచుండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగి , ప్రళయము సంభవించునా అన్నట్లు భయంకరముగా నుండెను. అప్పుడు బ్రహ్మ , విష్ణువులు , శివుని  వద్దకు వచ్చి వాని నోదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకువెళ్ళి అచట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి. ఆ విధముగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటినుండి లింగాకారముగా మారినందున భక్తులు ఆ లింగాకారమునే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు.


_*ఇరవైఆరవ అధ్యాయము సమాప్తం*_

    🌹🌷🕉️🛕🔔🕉️🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

శ్రీరాముని శివలింగ ప్రతిష్ఠ

 *ॐ    శ్రీరాముని శివలింగ ప్రతిష్ఠ - శివభక్తి సందేశం* 

  

*రామచరితమానస్ - వాల్మీకి రామాయణం - కూర్మపురాణం* 


 *1. రామచరిత మానస్* 


(i) వారథి నిర్మాణాన ప్రారంభంలో శ్రీరాముడు 

   "నేనిచట పరమశివుని (శివలింగమును) ప్రతిష్ఠిస్తాను. ఇది నా సంకల్పం" 

   "కరిహఉఁ ఇహాఁ సంభు థాపనా I 

   మోరే హృదయఁ పరమ కలపనా ॥" 

    - లంకా కాండ 2/2 


(ii) శివలింగమును ప్రతిష్ఠించి, యథావిధిగా పూజించి, ఈ విధంగా పలికాడు.

* *శివునివలె ప్రియమైనవారు నాకెవ్వరునూ లేరు.* 

* *శివునకు ద్రోహము తలపెట్టి, నాకు భక్తుడనని పలికెడువాడు స్వప్నంలోకూడా నన్ను పొందజాలడు.* 

* *శంకరునకు విముఖుడై నా యెడ భక్తిని ప్రకటించువాడు మూర్ఖుడు, అల్పబుద్ధి. వానికి నరకము తప్పదు.* 

* *శంకరుని ప్రేమించి, నా యందు వైరము పూనువారును,* 

    *శంకరునికి వైరులై నాకు దాసులగు వారును కల్పాంతంవరకు రౌరవాది నరకయాతనలను అనుభవింతురు.*  

* *రామేశ్వరమును దర్శించినవారు శరీరత్యాగం చేసినపిమ్మట నా లోకమును చేరెదరు.*  

* *గంగా జలములతో శివునకు అభిషేకము చేసినవారికి సాయుజ్యముక్తి లభిస్తుంది.* 

* నిష్కాముడై కపటమును త్యజించి, శ్రీరామేశ్వరుని సేవించినవానికి శంకరుడు నా భక్తిని ప్రసాదిస్తాడు. 

* నేను నిర్మించిన ఈ సేతువును దర్శించినవాడు ఎట్టి ప్రయాస లేకుండానే సంసారసాగరాన్ని దాటతాడు. 


లింగ థాపి బిధివత కరి పూజా I 

సివ సమాన ప్రియ మోహి న దూజా ॥

సివ ద్రోహీ మమ భగత కహావా I 

సో నర సపనెహుఁ మోహి న పావా ॥ 

సంకర బిముఖ భగతి చహ మోరీ I 

సో నారకీ మూఢ మతి థోరీ ॥ 

          - లంకాకాండ చౌ 2/3,4 


సంకరప్రియ మమ ద్రోహీ, సివ ద్రోహీ మమ దాస I 

తే నర కరహిఁ కలప భరి, ఘోర నరక మహుఁ బాస ॥ 

          - లంకాకాండ దో 2 

          

జే రామేశ్వర దరసను కరిహహిఁ I 

తే తను తజి మమ లోక సిధరిహహి ॥ 

జో గంగాజలు ఆని చఢాఇహి I 

సో సాజుజ్య ముక్తి నర పాఇహి ॥

హోఇ అకామ జొ ఛల తజి సేఇహి I 

భగతి మోరి తెహి సంకర దేఇహి ॥ 

మమ కృత సేతు జొ దరసను కరిహీ I 

సో బిను శ్రమ భవసాగర తరిహీ ॥ 

          - లంకాకాండ చౌ 3/1,2 


*2. వాల్మీకి రామాయణం* 


    పుష్పక విమానంలో లంకనుంచి వస్తున్నప్పుడు, సీతమ్మకు చూపుతూ శ్రీరాముడు 


    ఈ ప్రదేశము మహిమాన్వితమైన సాగరముయొక్క తీరము. 

    దీనిని "సేతుబంధం" అని పిలుస్తారు. 

    సేతునిర్మాణం ఇక్కడినుండే ప్రారంభమైనది. 

    *ఇది ఒక మహాపుణ్యక్షేత్రం.* 

    *దీనిని దర్శించివారి సమస్త పాపాలూ నశిస్తాయి.*  

    *పూర్వం ఈ పవిత్రప్రదేశమునందే పరమశివుడు నన్ను అనుగ్రహించాడు.* 


ఏతత్తు దృశ్యతే తీర్థం సాగరస్య మహాత్మనః I 

సేతుబంధ ఇతిఖ్యాంతం త్రైలోక్యేనాఽభిపూజితమ్ ॥ 

ఏతత్ పవిత్రం పరమం మహాపాతకనాశనమ్ I

అత్రపూర్వం మహాదేవః ప్రసాదమ్ అకరోత్ ప్రభుః ॥ 

            యుద్ధకాండ 126/16,17 


*3. కూర్మపురాణం* 


    సేతునిర్మాణానికి ముందే శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి, చర్మాంబరధారియైన ఆ మహాదేవుని పూజించాడు. 

    అంతట ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితోగూడి ప్రత్యక్షమై శ్రీరామునకు శ్రేష్ఠమైన ఒక వరాన్ని ఇచ్చాడు. 

   "రామా! మహాపాపకృత్యాలొనర్చిన ద్విజులుసైతము నీవు ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని దర్శిస్తే, వారి పాపాలన్నీ వెంటనే నశిస్తాయి. 

    *ఈ మహాసముద్రతీరాన స్నానమొనర్చి శివలింగాన్ని దర్శించినంతమాత్రాననే వారి ఇతర దోషాలూ తొలగిపోతాయి. ఇందు సందేహంలేదు.*" 

    

సేతుమధ్యే మహాదేవమ్ ఈశానం కృత్తివాససమ్ I 

స్థాపయామాస వై లింగం పూజయామాస రాఘవః ॥ 

తస్య దేవో మహాదేవః పార్వత్యా సహ శంకరః I 

ప్రత్యక్షమేవ భగవాన్ దత్తవాన్ వరముత్తమమ్ ॥ 

యే త్వయా స్థాపితం లింగం ద్రక్ష్యంతీహ ద్విజాతయః I 

మహాపాతకసంయుక్తాః తేషాం పాపం వినశ్యతి ॥ 

అన్యాని చైవ పాపాని తీరే తత్ర మహోదధేః I 

దర్శనాదేవ లింగస్య నాశం యాంతి న సంశయః ॥ 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

               భద్రాచలం

కళాప్రపూర్ణ

 Telugu people always remember this great legend for generations 🙏

నేడు "కళాప్రపూర్ణ" "చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి" గారి 72 వ వర్ధంతి. 


"జండాపై కపిరాజు", "బావా ఎప్పుడు వచ్చితీవు", "చెల్లియో చెల్లకో", "అలుగుటయే ఎరుంగని", "తమ్ముని 

కొడుకులు", "సంతోషంబున సంధిచేయుడు" అనే ప్రసిద్ధిగాంచిన పద్యాలు గుర్తుండే ఉంటాయి.

ఇవి రచించిన జంటకవులలో వారే "శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి" గారు.


చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి

జననం : ఆగస్టు 8, 1870, కడియం

మరణం:  15 ఫిబ్రవరి 1950

ఇతర పేర్లు "తిరుపతి వేంకట కవులు", "జంట కవులు"


ప్రసిద్ధి: తెలుగు కవిత్వం, నాటకాలు, అవధానం (ప్రప్రథమ శతావధాని), పాండవ జనన- ఉద్యోగ - ప్రవాస  - అశ్వమేధ  - విజయాలు , శ్రీ కృష్ణ రాయబారం, కాశి  యాత్ర, శ్రవణానందం, జాతక చర్య, ఇటీవలి చర్య , కింగ్ జార్జ్ V పట్టాభిషేక పద్యాలు, మృత్యుంజయ స్తవము మరెన్నో....


వీరు రచించిన పద్యాలు, నాటకాలు ఎన్నో తెలుగు చలన 

చిత్రాలలో వాడుకున్నారు.


"సూపర్ స్టార్" కృష్ణ నిర్మించి నటించిన "కురుక్షేత్రం" చిత్ర  శీర్షికలలో "చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి" గారి పేరు వేసి గౌరవించారు.


#చెళ్లపిళ్లవేంకటశాస్త్రి, #తిరుపతివెంకటకవులు, #జంటకవులు, #తొలిఆస్థానకవి,

గాయత్రీ మంత్రాన్ని

 గాయత్రీ మంత్రాన్ని చిన్నతనంలోనే నేర్చుకుంటే లేత చెట్టుకు వేసిన మేకులా నిలిచిపోతుంది. 

గాయత్రీ మానసిక శక్తి, మెరుపు మరియు ఆరోగ్యాన్ని గొప్ప కొలతలో అందిస్తుంది. 

ఇది పిల్లల ఏకాగ్రత శక్తిని పెంచుతుంది, అతని తెలివితేటలను పదునుపెడుతుంది మరియు శారీరకంగా బలంగా చేస్తుంది. 

తరువాత జీవితంలో, అతను కామ యొక్క కోరికను అనుభవించినప్పుడు, గాయత్రి అతనిని క్రిందికి లాగకుండా నిరోధిస్తుంది మరియు అతని శరీరం మరియు తెలివితేటలకు రక్షణ కవచంగా ఉంటుంది. 

చిన్నతనంలోనే గాయత్రిని ధ్యానించడం నేర్చుకుంటే, పెద్దయ్యాక, తన విత్తనాన్ని వృధా చేయకుండా, బ్రహ్మ మెరుపును మరియు అధ్యయనశీలత, వినయం, భగవంతుని పట్ల భక్తి మరియు విషయాల పట్ల ఆసక్తి వంటి లక్షణాలను పొందడంలో అది గొప్ప సహాయం అవుతుంది. 

నేనే.


ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు అటువంటి గొప్ప ప్రయోజనాలను పొందే అవకాశాన్ని మరియు ఎటువంటి కారణం లేకుండా తిరస్కరించారు.

మీరు కోరింది దొరుకుతుంది

 తొందరలేదు మీరు కోరింది దొరుకుతుంది పార్ట్ 3


స్వామివారు చలించలేదు. నిశ్చలంగా మౌనంగా వుండిపోయారు. చాలా సేపయాక “అలాగే పంపుతాను. భారతదేశంలోని యోగసిద్దుల్లో ఇద్దరినే నే నెరుగుదును. వారిలో యెవరైనా మీ కోరిక తీర్చగలరు. వారిలో ఒకరు వారణాసిలో వున్నారు. విశాలమైన మైదానంలోని విశాలమైన యింట్లో ఎక్కడో దాగినట్లుంటారు. వారిని కలుసుకోటం చాలా కష్టం. ఏ కొందరికో అనుమతి దొరుకుతుంది. ఏ పాశ్చాత్యుడూ ఇంతవరకు వారి సమక్షంలోకి వెళ్లలేకపోయాడనేది మాత్రం నిజం. మిమ్ము వారి దగ్గరకు పంపవచ్చు. కాని, వారు పాశ్చాత్యునికి దర్శన మివ్వరేమో అని నా భయం” అన్నారు.


“రెండోవారు?” రెట్టింపు కుతూహలంతో అడిగాను.


“దక్షిణాదిన దూరానెక్కడో వున్నారు. వారు ఉత్తమ గురువులని నే నెరుగుదును. వారి దగ్గరకు వెళ్లండి” అన్నారు. “వారిని 'మహర్షి' అంటారు. అరుణాచలంలో వారి నివాసం. అరుణాచల మంటే పొడుపుమల అని అర్థం. ఉత్తరార్కాటుజిల్లాలో వుంది. వారిని కలుసుకోటానికి కావలసిన వివరాలన్నీ యిచ్చేదా”? అని అడిగారు.


నా మనోనేత్రాల ముందు ఒకమూర్తి ఆకస్మికంగా కదిలింది. 


కాషాయవస్త్రాలు కట్టిన సన్న్యాసి ఒకడు తన గురువు దగ్గరకు రమ్మని వృథాగా నాకు నచ్చచెప్పబోవటమూ, ఆ కొండ పేరు అరుణాచలమనటమూ గుర్తొచ్చాయి. “మీ కెంతో కృతజ్ఞుణ్ణి. నన్నక్కడకు తీసుకువెళ్లే వారున్నారు. వారిది ఆ ఆశ్రమమే” అన్నాను.


"అయితే మీ రక్కడికి వెళతారా?” అని స్వామి వారడిగారు.


నేను అజ్జాయించాను. “నేను దక్షిణ భారతంనుండి వెళిపోవటానికి ప్రయాణ సన్నాహాలన్నీ పూర్తిచేసుకు కూర్చున్నా”నని మాత్రం అన్నాను, ఏం చెప్పటానికీ పాలుపోక.


"అయితే, నాకొక మాటివ్వండి” అన్నారు వారు. 


"తప్పకుండా” అనేశాను భరోసాగా.


“మహర్పుల వారిని సందర్శించకుండా దక్షిణాన్ని వదలి వెళ్లనని మాటివ్వండి అన్నారు.


ఎలాగైనా ఆధ్యాత్మిక మార్గంలో నాకు సాయపడాలనే కృతనిశ్చయం వారి కళ్లల్లో కనబడింది.


అలాగే వాగ్దానం చేశాను. 


దయార్ద్రమైన హాసరేఖ వారి ముఖంలో తారాడింది.. “తొందరలేదు. మీరు కోరింది దొరుకుతుంది” అభయకంఠంతో అన్నారు. 


వీథిలో ఏదో, సందడి వినబడింది. 


“విలువైన మీ కాలం చాలా సేపు వాడుకున్నాను. మన్నించండి” అన్నాను.


గంభీరమైన వారి పెదవులు విచ్చుకున్నాయి. వెనుకగదిలోకి నాతోబాటు వచ్చి, నా సహచరుడికేదో రహస్యంగా చెప్పారు. అందులో నా పేరు వినబడింది.


తలుపు దగ్గర వారికి వీడ్కోలుగా నమస్కరించి వెనుదిరిగాను. స్వామివారు మళ్లీ పిలిచి -.


“నన్నెప్పుడూ గుర్తుంచుకోండి. మిమ్మూ నేను గుర్తుంచుకుంటాను” అన్నారు.


గూఢమైన యీ మాట లెంతో దిగ్ర్భాంతి కలిగించాయి నాకు. పసితనంనుండి జీవితాన్ని భగవంతునికే అంకితం చేసిన ఆ వింతవ్యక్తిని అయిష్టంగానే వదలి బయటికి వచ్చాను.


వారు పరమాచార్యులు. ప్రాపంచికమైన అధికారాలు లక్ష్యపెట్టనివారు. అన్నీ రోశారు. అన్నీ రోశారు.  అన్నీ వదిలేశారు. మనం ఏ వస్తువు లిచ్చినా వాటిని అవసరమున్న వారికి తక్షణం ఇచ్చేస్తారు. వారి సౌమ్యసుందరమైన మూర్తిని నేను మరిచిపోను, మరచిపోలేను.


నేను విడిదికి వచ్చేసరికి దాదాపు అర్ధరాత్రయింది. తలెత్తి పైకి చూచాను. లెక్కలేనన్ని నక్షత్రాలు - వినువీథిలో క్రిక్కిరిసి కనిపించాయి. యూరప్ లో ఎక్కడా యిన్ని నక్షత్రాలు కనిపించవు. చరచరా మెట్లెక్కి వరండాలోకి వెళ్లాను. చేతిలో టార్చి వెలుగుతోంది. ఎవరో, ఆ చీకటో ఓమూర్తి నన్ను చూచి నమస్కరించింది. “సుబ్రహ్మణ్యా”! అని ఆశ్చర్యపడి పిలిచాను. కాషాయాంబరధారియైన ఆ యోగి చిరునవ్వు నవ్వారు.


“నేను మళ్లా వస్తానని చెప్పానుగా” అని మందలింపుగా గుర్తుచేశారు.


నిజమే.


పెద్దగదిలోకి వచ్చాక అడిగాను. “మీ గురువుగారిని 'మహర్షి' అంటారా”? అని.


ఆశ్చర్యపడి ఒక్కడుగు వెనక్కి వేశారు వారు. 


“మీకెలా తెలుసు? ఎవరు చెప్పారు?” అన్నారు.


“ఎవరోలెండి. రేపు మనిద్దరం వారి దగ్గరకు వెళుతున్నాం. నా ప్రయాణం మారింది” అన్నాను.


“ఎంత మంచిమాట చెప్పారు!” అన్నారు.


“ఎక్కువరోజు లుండనక్కడ, బహుశా కొన్నాళ్లు” అంటూనే ప్రశ్నలు గుప్పించాను, ఓ అరగంట దాకా. అలసిపోయి పడుకున్నాను.


సుబ్రహ్మణ్యం ఓ కొబ్బరాకు చాప మీద క్రిందే పడుకున్నారు. ఓ పలచటిగుడ్డ పరుచుకుని దాన్నే కప్పుకున్నారు. పక్కబట్ట లిస్తానంటే ఒప్పుకోలేదు.


తరువాత నాకు తెలిసిందల్లా ఎవరో తట్టితే, ఉలిక్కిపడి లేచి కూర్చోటం. చుట్టూ కటిక చీకటి. నరాలు హఠాత్తుగా బిగుసుకున్నట్లు, గాలిలో విద్యుత్తు నిండినట్లూ అనిపించి దిండు క్రిందున్న 'వాచ్' తీసి చూచాను. దానిది రేడియం డయల్. రెండూ నలభై అయిదయింది.


ఇంతలో కాళ్లవైపున ఓ మనిషి! మనిషిని చుట్టుకుని వెలుగు, మళ్ళీ ఉలిక్కిపడి నిటారుగా కూర్చున్నాను. ఎదురుగా శంకరాచార్యస్వామివారు. నిశ్చయంగా స్పష్టంగా స్వామివారే! వారు లౌకికమైన అతీంద్రియమూర్తిగా లేరు. పాంచభౌతికమైన స్థూలదేహంతోనే వున్నారు. చుట్టూ దురవగాహమైన వెలుగు. ఆ రూపాన్ని నుండి వేరుచేస్తున్న వెలుగు.


ఆ దృశ్యం నిజంగా అసాధారణమైన దృశ్యం. అసంభావ్యమైన దృశ్యం అయినా కళ్ల యెదుట నిజంగా కనబడుతున్న దృశ్యం. అయితే, మరి, వారిని చెంగల్పట్టులో వదిలిరాలేదా?


కళ్లు గట్టిగా, మరీ గట్టిగా మూసుకున్నాను. అయినా ఆ రూపం స్పష్టంగా ఎదుట కనబడుతూనే వుంది. మార్పు లేదు.


సౌహార్దంతో, కారుణ్యంతో నన్ను కనిపెట్టి వుండే అండ ఒకటి దొరికిందని తృప్తిపడ్డాను. కళ్లు తెరిచాను. కాషాయాంబరధారి కనబడ్డాడు.


ముఖంలో మార్పుంది. పెదవులమీద చిరునవ్వు. నన్ను చూచి "అణకువగా వుండు. అలా వున్నావా, నీవు కోరింది దొరుకుతుంది” అన్నట్లనిపించింది.


ఓ వ్యక్తి, సజీవంగా వున్న వ్యక్తి! నాతో అన్నారని యెందుకనుకోవాలి? కనీసం, ఓదయ్యమో, భూతమో నా కలా చెప్పిందని యెందుకనుకోకూడదు?


ఆ దర్శనం ఎలా కలిగిందో రెప్పపాటులో మాయమయింది. నాకు మాత్రం, ఓ అనిర్వచనీయమైన ఔన్నత్యం, ఆనందం, తృప్తి మిగిలాయి. ఆ సంఘటనకు సంబంధించిన అలౌకికత్వాన్ని పట్టించుకోలేదు. కల అని కొట్టేసినా ఒరిగేదేముంది? జరిగింది జరిగిపోయింది.


ఆ రాత్రి మరి నిద్రపోలేదు, పగలు జరిగింది తలపోస్తూ, మేలుకునే వున్నాను. ఆ సమావేశం, ఆ సంభాషణ దక్షిణ భారతంలోని సామాన్యజనం దేవుడి వారసుడుగా కొలిచే ఆ నిరాడంబరవ్యక్తి, కళ్లల్లో కదులుతూనే వున్నారు.


--- పాల్ బ్రంటన్


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

వ్యాకరణం మాత్రం నేర్చుకో

 *శ, ష, స  అనే అక్షరాలు ఎలా పలకాలో తెలియని కొందరు దీనిని గమనిస్తారని ఆశ.* 


    *యద్యపి బహునాధీషే*

        *తథాపి పఠ పుత్ర! వ్యాకరణమ్ |*

    *స్వజనః శ్వజనో మా భూత్*

        *సకలం శకలం సకృత్ శకృత్ ||*

భావం: నాయనా! నీవు ఎక్కువ చదవకపోయినా పర్వాలేదు, వ్యాకరణం మాత్రం నేర్చుకో. ఎందుకంటే స్వజన అనగా  (మన వాళ్ళు)  అన్న శబ్దాన్ని శ్వజన అంటే (కుక్కలు) అనకుండా, సకలం అనగా (సర్వం) అన్న శబ్దాన్ని శకలం అంటే (ముక్కలు) అని పలకకుండా, 

సకృత్ అనగా (ఒకసారి) అన్న శబ్దాన్ని శకృత్ అంటే (మలము) అని పలకకుండా ఉండడానికే కాక 

తదితర పదాలను కూడా సక్రమముగా పలకడానికి  ఉపయోగపడుతుంది — అని ఒక తండ్రి తన కుమారునికి చెబుతున్నాడు.  


నాగరిక ప్రపంచం *కళ్ళని -కల్లు అనీ* శిరీష-షిరీష అనీ,  వేళ-వేల అనీ, 

కళ-కల అనీ,  పళ్ళు-పల్లు అనీ,  కాళ్ళు-కాల్లు అనీ,  ఇలాగే ఇంకా ఎన్నెన్నో.....అపస్వర శబ్దాలు...వినలేని అపస్వరాలు..ముఖ్యంగా టీవీల వల్ల..


విదేశాలలో ఉన్న తెలుగు వారు, చక్కటి భాషా  ప్రావీణ్యతతో రాణిస్తున్నారు..


కొంతమంది తెలుగువారే.. సగం తెలుగు -సగం ఆంగ్లము మాట్లాడడంలో మాతృభాషకు ఇచ్చే విలువలు వారికే తెలియాలి. 


అలాగే వ్యాకరణం తెలియనివారు ఏ అక్షరం ఎలా ఉచ్ఛచరించాలో తెలుసు కోలేరు. ఉచ్ఛారణ సరిగా లేకపోతే వారు తలంచిన అర్థం రాకపోగా విరుద్ధార్థం వస్తుంది - అని భావం.


అందుకనే, వ్యాకరణ సిద్ధి ఉంటేనే,వాక్‌ సుద్ధి వస్తుంది.   మన నాలుక శుభ్ర పడుతుంది.  ఆ వాగ్దేవి కరుణా ప్రవాహం అపారంగా లభ్యమవుతుంది.


అందుకేనేమో పవన సుతుడు శ్రీ హనుమ, శ్రీ సూర్య నారాయణుని సన్నిధిలో సకల విద్యలు నేర్చుకొని, నవ వ్యాకరణ విద్యను అభ్యాసానికి

వివాహముచేసుకొని (వివాహితుడే అర్హుడు కనుక),  నవ వ్యాకరణ పండితుడై, భవిష్యత్‌

బ్రహ్మ గా ప్రకటించ బడ్డాడు.


తెలుగు వారికి పురాణ గ్రంధమైన పెద్ద బాల శిక్ష   దొరకటం మహా పుణ్య ఫలం.

ఆ మహాగ్రంధం చదివి పెద్దలు, పిల్లలూ మహా జ్ఞానులవుతారు.. అందులో వ్యాకరణ సంపద అపారంగా లభిస్తుంది.. తప్పక చదవండి. భావితరాలకు మన జ్ఞాన సంపదను తరలించండి..

🙏 మన మాతృ భాషను మనం పూజిద్దాం..

భూచక్రగడ్డ

 భూచక్రగడ్డ విశేషాలు -


       సకల చరాచర సృష్టికి ఆధారభూతమైన ఈ భూమి మీద ఎన్నో వింతలు , విశేషాలు ఉన్నాయి. అవి నిగూఢముగా ఉన్నాయి. వాటిలో వృక్షజాతిలో ఎన్నో విచిత్రాలు కలవు. నేను ఛత్తీస్ గడ్ అడవులలో వెదురుబొంగులు కొట్టిన తరువాత భూమి యందు ఉండు బొంగు ముక్క నుంచి తెల్లటి వెలుగు రావటం గమనించాను. అలా కొన్ని ప్రదేశాలలో మాత్రమే కనిపించింది. సూర్యోదయం అయ్యేప్పుడు పూర్తిగా సూర్యునివైపు తిరిగే చెట్లు ఉన్నాయి అని అక్కడి కొండజాతివారు చెప్పారు . వారి వైద్యవిధానం కూడా బహుచిత్రంగా ఉన్నది. చెయ్యి విరిగినవారికి కేవలం మూడురోజుల్లో చెయ్యి ఎముక అతుక్కునే విధంగా చెయ్యగలరు. వారు ఉపయోగించే మొక్కని మాత్రం నాకు చూపించలేదు. నా కాలుకి దెబ్బతగిలి రక్తం పోతున్నప్పుడు వెంటనే అక్కడ ఉన్న వెదురుబొంగు పైన పచ్చరంగులో ఉన్నది చాకుతో గీకి మెత్తటి చూర్ణం చేసి దానికి సున్నం కలిపి నా గాయం పైన చల్లి అద్దడం జరిగింది.వెంటనే రక్తస్రావం ఆగిపోయింది. ఆ తరువాత ప్రతినిత్యం దానిపైన వేయుటకు మరికొంత చూర్ణం ఇచ్చారు . ప్రతినిత్యం ఉదయం , సాయంత్రం దానిపైన చల్లడం వలన అది ఒక చెక్కు మాదిరి గట్టిగా అయ్యి గాయం నయం అయ్యాక ఊడి వచ్చింది. అక్కడివారు చెప్పినదాని ప్రకారం గాయం అయినపుడు ఎటువంటి ఇంజెక్షన్స్ తీసుకోరు. కేవలం దీనితోనే వారు ఎటువంటి గాయాన్ని అయినా మాన్పుకుంటారు. ఇదంతా మీకు చెప్పడానికి ప్రధాన కారణం ఎమిటంటే ప్రకృతిలోని వృక్షజాతుల్లో అంత గొప్ప ఔషధవిలువలు ఉన్నాయి. 


          ఇలాంటి వృక్షవిచిత్రాలలో ఒకటైన భూచక్రగడ్డ గురించి మీకు వివరిస్తాను. ఇప్పుడు రహదారుల పక్కన భూచక్రగడ్డ పేరు చెప్పి అడివి లో దొరికే కొన్ని గడ్డలను అమ్ముతున్నారు. అసలైన భూచక్రగడ్డ అనేది పాత ఎద్దులబండి చక్రం అంత వెడల్పుగా ఉంటుంది. ఇది అత్యంత దట్టమైన కీకారణ్యాలలో మాత్రమే లభించును. కొన్ని చోట్ల ఈతచెట్ల కింద అత్యంత అరుదుగా ఉంటుంది. ఇది ఏ వృక్షం కింద అయితే ఉంటుందో ఆ వృక్షం పైన బంగారు రంగులో ఒక తీగ అల్లుకుని ఉంటుంది. భూమిలో ఉన్న గడ్డకు చెట్టు పైన ఉన్న తీగకు మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. ఆ రెండు గొప్ప అయస్కాంత శక్తితో సంబంధం ఏర్పరచుకొని ఉంటాయి. 


             భూమిలో గడ్డ ఉన్న ప్రదేశాన్ని సరిగ్గా గుర్తించుటకు ఆ ప్రదేశం మొత్తం రెల్లుగడ్డి పరిచి నిప్పు అంటించండి. కేవలం గడ్డ ఉన్న ప్రదేశంలో రెల్లుగడ్డి ఏ మాత్రం చెక్కుచెదరదు. మిగిలిన గడ్డి కాలిపోవును. కాలని ప్రదేశం ఉన్న భాగం అంతా ఆ గడ్డ ఉన్నది అని నిర్ధారించుకొని ఆ ప్రదేశాన్ని శుభ్రపరచి ఇష్టదైవాన్ని ప్రార్ధించి చాలా జాగ్రత్తగా తవ్వడం ప్రారంభించాలి . ఇది అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని. తవ్వే సమయంలో ఏ మాత్రం భూమి అదిరినను ఆ గడ్డ ఆ ప్రదేశం నుంచి జరిగిపోవును. కావున అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని.


           ఈ గడ్డ లభించడం అంటే అమృతం లభించడంతో సమానం . ఈ గడ్డ మందం 4 అంగుళాల నుండి 20 అంగుళాల వరకు ఉంటుంది. ఇది తీపిగాను మరియు వగరు , చిరుచేదు మిశ్రమముగా ఉండును. దీని మోతాదు 30 గ్రాముల ముక్క తిని స్వదేశీ ఆవుపాలు తాగవలెను. దీనిని జాగ్రత్తగా నిలువచేసికొని మండలం (40 ) రోజులపాటు వాడిన శరీరము నందలి సర్వరోగములు నివారణ అగును. దేహము అత్యంత కాంతివంతం అయ్యి బంగారు రంగులో మారును . నరములు శక్తిమంతం అయ్యి మెదడుకు అమితమైన బలం కలిగి ఏకసంథాగ్రాహి అవుతాడు. ముసలితనాన్ని పోగొట్టగల శక్తి దీనికి ఉన్నది. దీనిని ఆయుర్వేదంలో " కాయసిద్ది " అని పిలుస్తారు . దీర్గాయుష్షును ప్రసాదించును.


        పైన చెప్పినవన్నీ అసలయిన భూచక్రగడ్డని సాధించి వాడినప్పుడు మాత్రమే కలుగుతాయి.


     ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .