30, జులై 2020, గురువారం

పుత్రదా ఏకాదశి_*

జై శ్రీమన్నారాయణ
*🕉ఓం అస్మత్ గురుభ్యోనమః🕉*


శ్రావణ మాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశిని పుత్రాద ఏకాదశి / పవిత్రోపన ఏకాదశి అంటారు. వివాహమై సంతానం లేక బాదపడుతుంటే జంట ఈ ఏకాదశి నాడు ఉపవసించి శ్రీ హరిణి విష్ణు సహస్రానామలతో అర్చిన్చినట్లయితే తప్పక సంతానం కలుగుతుంది. అందుకీ దీనిని *పుత్రాద ఏకాదశి* అని అంటారు .

శ్రీ కృష్ణుడు యుధిష్టర మహా రాజు కి వివరించిన పురానా గాథ

పూర్వము మహజిత్ అనే రాజు ఉండేవాడు . అతను మహా దైవ భక్తుడు ప్రతి నిత్యం దేవునికి ఎంతో భక్తీ శ్రద్దలతో పూజ కార్యక్రామాలు నిర్వహించేవాడు కాని రాజా వారికి సంతానం కలుగలేదు. ఎంతో మంది ఋషులను , పండితులను సంప్రదించిన తన సమస్య కు దారి దొరకలేదు .

చివరిగా లోమేష్ మహర్షి తన ఆశ్రమం లో తపస్సు చేసుకుంటూ ఉండగా మహారాజ వారు అక్కడికి చేరుకొని వెళ్లి తన దుఃఖాన్ని వివరిస్తాడు అప్పుడు మహర్షి నువ్వు పడుతున్న బాదలు ఏంటి , నువ్వు చేసిన పాపా కర్మములు ఏంటి అని అడగగా అప్పుడు తన పుర్వహృత్తంతం అంత చెప్పగా దయర్తా హృదయడైన మహర్షి నీకు నేను ఒక ఉపాయం చెప్పేదను అని చెప్పి శ్రావణ మాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశి రోజు మీ దంపతులు ఇద్దరు భక్తీ శ్రద్దలతో ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువును భక్తీ శ్రద్దలతో పూజిస్తే తప్పకుండ మీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు .

పూర్వం రాజు వర్తక వ్యపారం చేస్తూ ఒకసారి దప్పిక వేసి ఒక కొలను దగ్గరికి నీరు త్రాగడానికి వెళ్లి అక్కడే నీళ్లు త్రాగుతూ ఉన్న ఒక ఆవు ని నిల్లలోకి తోసేసాడట దానికి పాపా పరిహారంగా రాజు గారికి సంతానం కలుగలేదు అని కథనం .
మహర్షి వారు చెప్పినట్లు మహజిత్ రాజు భక్తి శ్రద్దలతో కుటుంబ సమేతంగా ఉపవాసం ఉండి నియమ నిష్టలతో స్వామి వారిని పూజిస్తాడు . ఆ తరువాత రాజు గారి మంచి సంతానం కలుగుతుంది . దానికి రాజు చాల సంతోషపడి బ్రాహ్మణులకు , రాజ్యం లో ఉన్న ప్రజలకు చాల దాన ధర్మాలు చేసాడట .
శ్రావణ మాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశి ఉపవాసం ఉండడం వలన మనం చేసుకున్న పాపా లు అన్ని హరిస్తాయని , మంచి సంతానం కలుగుతుంది అని పురాణాలూ చెబుతున్నాయి . భవిస్య పురాణం లో వివరించడం జరిగింది .

*🌹🙏ఓం నమో వేంకటేశాయా🙏🌹*
*🙏లోకాసమస్తా సుఖినోభవంతు🙏*
****************

ఋణానుబంధం

ఒక యోగి  ఒక్కనాడు   ఒకరి చెప్పులు వేసుకున్న కారణానికి, మోక్షానికి వెళ్లవలసిన వాడు ఈ ఋణం ఉండిపోవటంతో
అతని ఇంట పుత్రుడై, జన్మిస్తాడు.

రుణానుబంధం తీర్చుకోవటానికి ఆ యోగి మళ్ళీ పుడతాడు.

జాతకం చూసిన వాడు తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తాడు.

ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు.

వాడి చేతి నుంచి పైసా కూడా తీసుకోకండి.

వాడికి అన్నీ ఇస్తూండండి. అని చెప్తాడు.

నాటినుంచీ తల్లిదండ్రులు వానినుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు.

 పూర్వజన్మ గుర్తున్నందున అతడు వారి రుణంతీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.

పెద్దయ్యాక తండ్రి ఇతడిని రాజుగారి కొలువుకి తీసుకుపోయి ఉద్యోగం ఇమ్మంటాడు.

రాజు రాత్రి గస్తీ ఉద్యోగం ఇస్తాడు.

అపుడు ప్రతి జాముకీ ఒకసారి ఆ యువకుడు ఇలాటి ఉపదేశాన్ని నిద్రలో ఉన్న వారికి జాగ్తేరహో.....

అనే అర్ధంలో ఇస్తాడు.
దొంగలంటే ధనం ఎత్తుకుపోయేవారేకాదు.

ఇవన్నీ కూడా దుఃఖభాజనాలే సుమా అని చెపుతుంటాడు.

ప్రతి జాముకీ ఇలాంటి హితవు ఒకటి చెబుతుండేవాడు..

రాజుగారికి రాచకార్యాలతో నిద్రపట్టక తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడని గుర్తిస్తాడు.

మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్లి రాత్రి తాను అన్నీ విన్నాననీ, తన మనసు ప్రశాంతి పొందిందనీ అంటాడు.

 పళ్లెంలో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందిస్తాడు.

అతడు వెంటనె ఆ ధన రాశిని తల్లికి ఇవ్వగా ఆమె పుత్రోత్సాహంలో నియమం మరచి ఆ పళ్లెం అందుకుంటుంది.

వెంటనే అతడు తనువును విడిచి ముక్తి పొందుతాడు.
తలిదండ్రులు దుఃఖిస్తే రాజు ఆ యోగి కావలి సమయంలో చెప్పిన ఉపదేశాలు వినిపించి ఓదారుస్తాడు

తస్మాత్ జాగ్రత జాగ్రత !

1. శ్లో|| మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః|
         అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

2. శ్లో|| జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|
      సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

3. శ్లో|| కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
      జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

4. శ్లో|| ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|
      ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న జీవిత కాలమును గుర్తింపరు.
కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

5. శ్లో|| సంపదః స్వప్రసంకాశాః యౌవనం కుసుమోపమ్|
      విధుఛ్చచంచల ఆయుషం తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, యౌవనము ఒక పూవు వలె మనజీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

6. శ్లో|| క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయోః|
      యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

7. శ్లో|| యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్ఠతి జంతవః|
      తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్ర కా పరివేదన||

తా:- మనుషులకు వారి కర్మానుసారము జీవితకాలము ఉండును. అది తీరిన తరువాత వారును నశింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?

8. శ్లో|| ఋణానుబంధ రూపేణ పశుపత్నిసుతాలయః|
      ఋణక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన||

తా:- గత జన్మ ఋణానుబంధముచే పశు, పత్ని పుత్ర గృహ లాభము గల్గును. ఆ ఋణము తీరగనే వారును పోవుదురు. దానికై దుఃఖించుట ఎందులకు?

9. శ్లో|| పక్కాని తరుపర్ణాని పతంతి క్రమశో యథా|
      తథైవ జంతవః కాలే తత్ర కా పరివేదన||

తా:- చెట్ల యొక్క పండిన ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?

10. శ్లో|| ఏక వృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః|
      ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన||

తా:- రాత్రి చెట్లపై వివిధ జాతుల పక్షులు చేరును. మరల సూర్యోదయము కాగానే ఒక్కటోక్కటిగా ఎగిరిపోవును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?

11. శ్లో|| ఇదం కాష్టం ఇదం కాష్టం నధ్యం వహతి సంగతః|
      సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన||

తా - ప్రవహించుచున్ననది లో కళేబరములు తేలుచు, ఒకప్పుడు కలియుచు ఒకప్పుడు విడిపోవుచుండును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?
                                     
 స్వస్తి.....

*******************

రామాయణమ్ 15

అస్త్రప్రయోగము తెలియటం ఎంత ముఖ్యమో ,ఉపసంహారము తెలియటం అంతే ముఖ్యము! ప్రయోగ,ఉపసంహారాలు రెంటినీ ముని వద్ద నుండి ఉపదేశము పొందాడు రామచంద్రుడు!
ఆయనతో పాటు లక్ష్మణుడు కూడా ఉపదేశం పొందాడు.
.
అలా మునితో నడుస్తూ నడుస్తూ ప్రయాణం సాగించారు!
వారికి అత్యంత మనోహరంగా ,ప్రశాంతంగా ,దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్న ఒక ఆశ్రమము కనపడ్డది .అది చూడగనే రాముడు మునితో ఇన్ని కాంతులు వెదచల్లుతూ ప్రకాశమానంగా ఉన్న ఈ ప్రాంతము ఇలా ఉండటానికి కారణమేమిటి? అని ప్రశ్నించాడు!.
.
మహర్షి అందుకు ప్రతిగా ,రామా ! ఇది పూర్వము విష్ణువు వామానావతారంలో నివసించిన పుణ్యభూమి ,ప్రస్తుతం నేను ఉంటున్నాను ,దీని పేరు సిద్ధాశ్రమము.
.
ఆశ్రమంలో ప్రవేశించగనే అచట నివాసముండే మునులందరూ మహర్షికి ఎదురేగి స్వాగతం పలుకారు.
 ,రాముడు మహర్షితో స్వామీ మీరు యాగ దీక్షాస్వీకారం గావించండి మేము రక్షణబాధ్యతలు ఈ క్షణం నుండే స్వీకరిస్తున్నాము అని పలికి మహర్షి యాగ శాల చుట్టూ తిరుగుతూ వేయికళ్ళతో కాపలా కాస్తున్నారు!
.
యాగము ఆరురోజులు కొనసాగుతుంది! అయిదురోజులు ఏవిధమైన విఘ్నము లేకుండా గడచిపోయింది !
.
ఆరవ రోజు అన్నదమ్ములిద్దరూ ఏమాత్రము అజాగ్రత్త లేకుండా కళ్ళలో వత్తులేసుకొని కాపలా కాస్తున్నారు. తమ్ముడిని రాముడు హెచ్చరించాడు ఇంకా జాగ్రత్తగా ఉండమని!
.
ఇంతలో అందరూ చూస్తూ ఉండగనే ఒక్కసారిగా యజ్ఞకుండంలోనుండి భగ్గుమని ఒక్కసారిగా అగ్నిజ్వాలలు పైకి లేచినవి! ఆ విధంగా జ్వలించటం రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నది!.
.
యజ్ఞం సాగుతున్నది మంత్రపూర్వకంగా ,శాస్త్రానుసారంగా యజ్ఞనిర్వహణగావిస్తున్నారు విశ్వామిత్రునితో కూడిన ఋత్విక్కులు. ఇంతలో ! ఆకాశం బ్రద్దలయినంత చప్పుడు !
ఒక్కసారిగా ఆకాశమంతా నల్లని మేఘాలావరించినట్లుగా మిడతలదండులాగా రాక్షస సైన్యం యాగశాల పయిన ఆకాశాన్ని కప్పివేసింది! చిమ్మచీకట్లు కమ్మినట్లున్నది! .
.
పెద్దపెద్ద కడవలు పట్టుకొని మారీచ,సుబాహులు యజ్ఞకుండంలోకి రక్తధారలు కురిపిస్తున్నారు రక్తంతో ఆ వేదిక నిండిపోయింది!.
.
((మారీచసుబాహులు నానారాత్రించరులతోడ నభమున మాయా
నీరదములుపన్ని యసృగ్ధారలు వేదిపయి గురిసి గర్జనలెసగన్
( భాస్కర రామాయణం నుండి)
.
లక్ష్మణ చూడు నా "లా" వంచు విజయ లక్ష్మీ ధనుర్ఘోష లక్షణం బెసగ నెలకొని వినువీధి నిజదృష్టి నిలిపినాడట..
(ఇది గోనబుద్ధారెడ్డిగారు వ్రాసిన రంగనాధరామాయణంలోని వాక్యము).)
.
వీరు చేస్తున్న దుష్కార్యాన్ని గమనిస్తూనే ఒక్కసారిగా విల్లు ఎక్కుపెట్టి నారిసారించి మానవాస్త్రం మంత్రించి విడిచిపెట్టాడు !
అది రయ్యిన దూసుకుంటూ వెళ్ళి మారీచుడికి తగిలి వాడిని తోసుకుంటూ తీసుకెళ్ళి నూరుయోజనాల దూరంలోని సముద్రంలో పడవేసింది! ఆ దెబ్బకు వాడిదిమ్మతిరిగి కళ్ళు బైర్లుగమ్మి మూర్ఛపోయాడు.
.
మరల క్షణం కూడా వ్యవధి లేకుండా ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించి సుబాహుడిమీదకు వదిలాడు అది వాడి గుండెల మీద పిడుగులా కూలి శరీరాన్ని చీల్చి ఛిద్రం చేసి వాడిని నేల కూల్చింది !
మిగిలిన రాక్షసులందరూ రాముడు ప్రయోగించిన వాయవ్యాస్త్రం దెబ్బకు ఎక్కడివారక్కడ చెల్లాచెదురయై చెట్టుకొకరు పుట్టకొకరుగా నేల కూలారు!
.
యజ్ఞం నిర్విఘ్నంగా పరిసమాప్తమయ్యింది.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

పోత‌న త‌ల‌పులో‌ ...(4)

ప్రణవ స్వరూపుడు , ప్రమద గణాధిపతి ,పార్వతీ పరమేశ్వరుల ప్రియ పుత్రుడు - సకల జగతికి ప్రేమపాత్రుడైన  గ‌జ‌ముఖుడి రూపాన్ని గుండెనిండా నింపుకున్న‌ పోత‌న త‌న ఘంటం నుంచి తెలుగు జాతికి అందించిన ఆణిముత్యం, ఈ గ‌ణేశుడి ప‌ద్యం.
                 ****
ఆదరమొప్ప మ్రొక్కిడుదు - నద్రిసుతా హృదయానురాగ సం
పాదికి - దోష బేధికి - బ్రపన్న వినోదికి - విఘ్నవల్లికా
చ్ఛేదికి - మంజువాదికి - నశేష జగజ్జన - నందవేదికిన్
మోదక ఖాదికిన్ - సమద మూషకసాదికి - సుప్రసాదికిన్

                   ****
హిమగిరినందిని  హృదయానురాగాన్ని పొందినవాడు, కలిపురుషుని  దోషాలను తొలగించువాడు ,ఆశ్రితుల విఘ్నాల‌ను ఛేదిస్తూ ,ప్రపన్నులను ఆనందింపజేస్తూ తన మధుర భాషణలతో అందరికీ ఆనందాన్ని ఇచ్చు వాడు,మోదక ప్రియుడు ,మూషకము (ఎలుక) ను అధిరోహించు వాడు, ముదమును కలుగ జేయువాడైన ఆ వినాయకుని నేను స‌భ‌క్తికంగా మ్రొక్కుతున్నాను. అంటూ తెలుగుజాతి చేత ఆనాటినుంచి గ‌ణ‌ప‌య్య‌కు ఈ ప‌ద్యంతో మ‌నచేత అక్ష‌రార్చ‌న చేయిస్తున్నాడు పోత‌న‌.

🏵️పోత‌న ప‌లుకులు---భ‌క్తిర‌స గుళిక‌లు🏵️

ద్వితీయ స్కంధము 4 అధ్యాయము

వ్యాస భాగవతం ద్వితీయ స్కంధము 4 అధ్యాయము లోని ఈ కింది శ్లోకం విద్యార్థులు చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి

ప్రచోదితా యేన పురా సరస్వతీ వితన్వతాజస్య సతీం స్మృతిం హృది
స్వలక్షణా ప్రాదురభూత్కిలాస్యతః స మే ఋషీణామృషభః ప్రసీదతామ్

భాగవతం 2-4-22

బ్రహ్మకు కూడా ఎవరి అనుగ్రహంతో వాక్కు ( సరస్వతీ, వేదం) ప్రసన్నమై సృష్టి కలిగించే స్వచ్చమైన జ్ఞ్యానాన్ని ప్రసాదించిందో. (భాగవత ప్రారంభ శ్లోకంలో ఉన్న 'తేనే బ్రహ్మ బృదా యదా ఆది కవయే' బ్రహ్మకు ఎవరి సంకల్పంతో వేదములను ఎవరుపదేశించారో)
అలాంటి బ్రహ్మ ఈ జ్ఞ్యానమును పొంది పరమాత్మ యొక్క స్వస్వరూప (స్వలక్షణా )జ్ఞ్యానాన్ని పొందాడో.
స్వలక్షణ అంటే వేదం కూడా కేవలం వేదం కాకుండా - సృష్టి స్థితి సంహారములు, ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములు, హ్రస్వమూ ధీర్ఘము ప్లుతము ఉదాత్తము అనుదాత్తము స్వరితమూ, పశ్యంతి మద్యమా వైఖరీ (అందులో స్వరములు మూడు , అందులో భేధములు మూడు, ఇలా ఒక్క వర్ణం 32 రకములు ఉంటుంది, 'ఆ అన్నమంటే ఇది హ్రస్వమా ధీర్ఘమా ప్లుతమా? ఉదాత్తమా అనుదాత్తమా స్వరితమా, మంద్రమ మధ్యమమా ఉత్తమమా, తరమా వితారమా అనుతారమా, వివృతమా సంవృతమా, సంవృతములో మళ్ళీ ఉదాత్తమా అనుదాత్తమా, కంఠ్యమా లేక ఉపకంఠ్యమా - ఇవన్నీ వేద లక్షణాలు, స్వరములతోటి - మంద్ర మధ్య తారాది వర్ణ కంఠగత భేధములతోటి ఉర: కంఠ శిరోరాది స్థాన భేధములతోటి కంఠాల్వాది అవస్థా భేధములతోటి ఇన్ని రకములుగా ఉన్న వేదం) ఎవరి సంకల్పంవలన బ్రహ్మకు భాసించిందో అటువంటి ఋషులకు ఋషి అయిన స్వామి ప్రసన్నుడగు గాక

స్నేహితుల దినోత్సవం

స్నేహితుల దినోత్సవం   శుభాకాంక్షలు
చెలిమి నీవెక్కడ అంటే
నిర్మల మైన మనసులో
నిష్కల్మషమైన ప్రేమలో
ఉంటానంది
చెలిమి నీవెక్కడ అంటే
చెలిమికై ప్రాణం ఇవ్వకున్నా
మాటలతో చేతలతో గాయం చేయని
మంచి మితృల మదిలో
ఉంటానంది
మన చెలిమి ఈజన్మకే కాదు
ఎన్ని జన్మలెత్తిన ఉండాలి అంది
సృష్టి లో తీయని ది మన స్నేహం కావాలంది
మల్లెపూలు వాడి పోయినా
మన స్నేహం వాడిపోలేనిదై
ఉండాలి అంటుంది
చెలిమి నీవెక్కడ అంటే
చంద్రునికైనా మచ్చ ఉండవచ్చు కానీ
మన స్నేహానికి ఉండకూడదు
అంటుంది
ఇలాంటి లక్షణాలు కలిగిన
స్నేహితులు అందరికీ
నా కవిత అంకితం
ధన్యవాదాలు
****************