30, జులై 2020, గురువారం

పుత్రదా ఏకాదశి_*

జై శ్రీమన్నారాయణ
*🕉ఓం అస్మత్ గురుభ్యోనమః🕉*


శ్రావణ మాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశిని పుత్రాద ఏకాదశి / పవిత్రోపన ఏకాదశి అంటారు. వివాహమై సంతానం లేక బాదపడుతుంటే జంట ఈ ఏకాదశి నాడు ఉపవసించి శ్రీ హరిణి విష్ణు సహస్రానామలతో అర్చిన్చినట్లయితే తప్పక సంతానం కలుగుతుంది. అందుకీ దీనిని *పుత్రాద ఏకాదశి* అని అంటారు .

శ్రీ కృష్ణుడు యుధిష్టర మహా రాజు కి వివరించిన పురానా గాథ

పూర్వము మహజిత్ అనే రాజు ఉండేవాడు . అతను మహా దైవ భక్తుడు ప్రతి నిత్యం దేవునికి ఎంతో భక్తీ శ్రద్దలతో పూజ కార్యక్రామాలు నిర్వహించేవాడు కాని రాజా వారికి సంతానం కలుగలేదు. ఎంతో మంది ఋషులను , పండితులను సంప్రదించిన తన సమస్య కు దారి దొరకలేదు .

చివరిగా లోమేష్ మహర్షి తన ఆశ్రమం లో తపస్సు చేసుకుంటూ ఉండగా మహారాజ వారు అక్కడికి చేరుకొని వెళ్లి తన దుఃఖాన్ని వివరిస్తాడు అప్పుడు మహర్షి నువ్వు పడుతున్న బాదలు ఏంటి , నువ్వు చేసిన పాపా కర్మములు ఏంటి అని అడగగా అప్పుడు తన పుర్వహృత్తంతం అంత చెప్పగా దయర్తా హృదయడైన మహర్షి నీకు నేను ఒక ఉపాయం చెప్పేదను అని చెప్పి శ్రావణ మాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశి రోజు మీ దంపతులు ఇద్దరు భక్తీ శ్రద్దలతో ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువును భక్తీ శ్రద్దలతో పూజిస్తే తప్పకుండ మీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు .

పూర్వం రాజు వర్తక వ్యపారం చేస్తూ ఒకసారి దప్పిక వేసి ఒక కొలను దగ్గరికి నీరు త్రాగడానికి వెళ్లి అక్కడే నీళ్లు త్రాగుతూ ఉన్న ఒక ఆవు ని నిల్లలోకి తోసేసాడట దానికి పాపా పరిహారంగా రాజు గారికి సంతానం కలుగలేదు అని కథనం .
మహర్షి వారు చెప్పినట్లు మహజిత్ రాజు భక్తి శ్రద్దలతో కుటుంబ సమేతంగా ఉపవాసం ఉండి నియమ నిష్టలతో స్వామి వారిని పూజిస్తాడు . ఆ తరువాత రాజు గారి మంచి సంతానం కలుగుతుంది . దానికి రాజు చాల సంతోషపడి బ్రాహ్మణులకు , రాజ్యం లో ఉన్న ప్రజలకు చాల దాన ధర్మాలు చేసాడట .
శ్రావణ మాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశి ఉపవాసం ఉండడం వలన మనం చేసుకున్న పాపా లు అన్ని హరిస్తాయని , మంచి సంతానం కలుగుతుంది అని పురాణాలూ చెబుతున్నాయి . భవిస్య పురాణం లో వివరించడం జరిగింది .

*🌹🙏ఓం నమో వేంకటేశాయా🙏🌹*
*🙏లోకాసమస్తా సుఖినోభవంతు🙏*
****************

కామెంట్‌లు లేవు: