6, ఫిబ్రవరి 2021, శనివారం

సంపూర్ణ తిరుమల చరిత్ర - 14**

 **దశిక రాము**


**సంపూర్ణ తిరుమల చరిత్ర - 14**


కర్కటే పూర్వఫల్గున్యాం తులసీ కాననోద్భవం, పాండ్యే విశ్వంభరాం గోదాం 


వందే శ్రీరంగ నాయకీం నీలంగస్తన గిరితటీసుప్త ముద్యోధ్య కృష్ణం పారార్ధ్యం 


స్వం శృతి శత శిరస్సిద్ధ మధ్యావయంతీ స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా 


బలాత్కృత్య భుంక్తే, గోదా తస్యైనమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ


విష్ణుచిత్తుడు శ్రీవిల్లిపుత్తూరు నందు శ్రీకృష్ణ ఆలయానికి నిత్య పుష్ప కైంకర్య మూర్తి. మూర్తీభవించిన భగవత్స్వరూపులు. తనువూ, మనసు అంతా శ్రీమహావిష్ణువు ధ్యానం తప్ప మరేమీ తెలీనివాడు. రకరకాల పూలమాలలతో శ్రీకృష్ణుని అలంకరించడంలో ఆనందానుభూతిని పొందడంలో దివ్యానురాగ చక్రవర్తి.


అది క్రీస్తుశకం 776వ సంవత్సరం. కర్కట లగ్నం, పుబ్బా నక్షత్రం. ఆ పవిత్ర దినాన, నిత్య హరినామదాసుడు విష్ణుచిత్తుడు ఆలయ ఉద్యానవనంలో ఇంద్ర ధనుస్సును పోలిన పుష్పవనంలో హరినామ సంకీర్తన చేస్తూ, భగవానుని పాదార్చనలో తనువు బాయాలని అర్రులు చాచే పూబాలల సేకరణకై ఉద్యానవనం కలయతిరుగుతున్నాడు. రకరకాల పూమాలల అలంకరణతో వాసుదేవుని దివ్యమంగళ రూపం చూడాలనే తపన విష్ణుచిత్తునిది. అలా తిరుగాడుతున్న విష్ణుచిత్తునకు తులసిమొక్కల చెంత బంగారు వర్ణ రంజితమైన ఒక పసిపాప బోసినవ్వులు విరబూస్తూ పూలామాలికల మధ్య పూబాలిక మాదిరిగా కనిపించింది. పరిసరాలు గమనించాడు. ఎవరూ లేరు. చుట్టుపక్కల విచారించాడు. ఎవరూ తమ బిడ్డ కాదన్నారు. అంతట ఆ పసిడి బాలిక తనవైపే నవ్వులు చిందిస్తూ ఉండటంతో పరవశుండైన విష్ణుచిత్తుడు ఆ బాలిక భగవంతుని అరుగ్రహించిన బిడ్డగా తన భార్యకు అందజేశాడు. సంతాన విహీనులైన ఆ దంపతులకు బాలిక పూమాలిక అయింది. ఎంతో అందంతో, నిత్యసంతోషిణి అయిన ఆ చిన్నారికి కోదై అని నామకరణం చేశారు. ఈమెకు ''చూడిక్కొడుత్త నాచ్చియార్'', ''ఆండాల్'', గోదాదేవి'', ''ఆముక్తమాల్యద'' – అని పేర్లున్నాయి. ఈమె కధనే శ్రీకృష్ణదేవరాయలు ''ఆముక్తమాల్యద'' పేరుతో అమూల్య గ్రంధంగా మలచాడు. ఈమె భూమాత అంశగా జన్మించింది. అల్లారుముద్దుగా ఉన్న గోదాదేవికి విష్ణుచిత్తుడే పంచ సంస్కారాలు చేశాడు.


నారాయణుడీతడు నరులార మీరు శరణనరో మిమ్ము గాచును 


తలచిన చోటను తానే ఉన్నాడు వలెననువారి కైవశమెపుడు 


కొలచెను మూడడుగుల జగమెల్లను కొలచినవారిని చేకొననుండునా 


ఎక్కడ పిలిచిన ఏమి అని పలికి మొక్కిన మన్నించు మునుముగాను 


రక్కసులనణచి రక్షించు జగములు దిక్కని నమ్మిన తిరముగ నేలడా 


చూచిన యందెల్ల చూపును రూపము ఓచిక పొగడిన ఉండునోటను


అన్నట్లు నిరంతరం వాసుదేవుడినే నమ్ముకున్న విష్ణుచిత్తుడు తన నిత్య కైంకర్యమైన పూమాలలు వనమాలికి అందించే విషయంలోనూ అల్లికలోనూ, అలంకరణలోనూ తన కుమార్తె కూడా చిట్టి చిట్టి చేతులతో సహకారం అందించి చిట్టి చిట్టి సేవలు చేసేది. ఆ చిరుసేవయే తండ్రికి మహదానందం కలగాజేసేది. పరవశించి తండ్రి పోయేవాడు ఆ చిన్నారి సేవలకు. ఇలా దినదిన ప్రవర్ధమానంగా అతి సౌందర్య రాశిగా పెరగసాగింది గోదాదేవి. ఈ సుగుణాల రాశిని చూసి విష్ణుచిత్తుడు ఒక వంక పరమానందభరితుడౌతూ మరోవంక ఇంత సద్గుణ సౌందర్యరాశికి ఎవరిని వరునిగా తేవాలి - అని ఆందోళనపడసాగాడు. నిత్యం స్వామి అలంకరణకే కాదు తన అలంకరణలో కూడా ఎనలేని శ్రద్ధ చూపించేది గోదా. యువతులకు ఆ వయసులో అలంకరణపై ధ్యాస ఉండటం సహజమే కదా! పూలమాలలతో రకరకాల అలంకరణలు చేసుకోవాలని తపించేది. కానీ తండ్రి ఆ తోటలోని పూలన్నీ మాధవుని సేవకేనని ఆజ్ఞాపించడంతో ఆ పూలను తాను అలంకరించుకునేందుకు తటపటాయించేది. కానీ తన సౌందర్యాన్ని పూమాలల అలంకారంతో మరింత శోభింపచేసుకోవాలనే తన ఆశను ఎలా తీర్చుకోవాలని ఆలోచించి ఒకరోజు తన తండ్రి మాధవుని అలంకరణకు సిద్ధం చేసుకున్న పూమాలలను తాను ధరించి ఆ తోటలో ఉన్న బావినీటిలో తన అందాన్ని చూసుకుని మురిసిపోయింది. తర్వాత ఆ పూమాలలను యధాస్థానంలో ఉంచి స్వామి సేవకు అందించేది. ఇది గమనించని విష్ణుచిత్తుడు ఆ పూమాలలను పరమ పావనమూర్తికి పరవశంతో అలంకరణకు ఆలయంలో అందించాడు. ఎందుకో ఆనాడు శ్రీకృష్ణుడు ఆ మాలలను ధరించినంతలో మరింత సౌందర్యంగా గోచరించాడు. అంతటా విష్ణుచిత్తుడు గోదాదేవి అందించినందువల్ల వాసుదేవుడు ఆరోజు మరింత సౌందర్యంగా కనిపించాడు అనుకుని ప్రతిరోజూ గోదాదేవిచేత అందుకున్న పూలమాలలానే స్వామికి సమర్పించేవాడు. ఇలా కొంతకాలం గడిచింది.


ఎప్పుడూ కాలం ఒకలాగే ఉండదుకదా! ఎంతో భక్తి పారవశ్యంతో గోదాదేవి చేత అందుకున్న పూమాలలను భట్టనాథునకు ఒకరోజు ఆ పూలమాలల్లో ఒక పొడవాటి వెంట్రుక కనిపించింది. వెంటనే విష్ణుచిత్తుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి అది స్త్రీమూర్తి కేశంగా భావించి తన కుమార్తె గోదాదేవిని ఆ విషయమై విచారించాడు. గోదాదేవి ప్రతిరోజూ తాను చేసే పనిని తెలుసుకున్న విష్ణుచిత్తుడు నిశ్చేష్టుడయ్యాడు. ఎంతో గారాబంగా పెంచుకున్న తన కుమార్తె చేసిన పనికి నొచ్చుకుని ఇకపై అలాంటి తప్పు చేయొద్దని మందలించాడు. అంతేకాదు, నిర్మాల్యమైన ఆ పూలమాలలను స్వామికి నివేదించకుండా ఎంతో విచారంగా ఇంటికి చేరుకొని తన కుమార్తె చేసిన తప్పు క్షమించమని ఆ దేవదేవుని వేడుకుని నిద్రలోకి జారుకున్నాడు.


అలసటతో నిద్రించిన విష్ణుచిత్తునికి కలలో మహావిష్ణువు వటపత్రశాయిగా ప్రత్యక్షమై ''ఏం భట్టనాథా! ఈరోజు నాకు పూమాలలు సమర్పించలేదేం?'' అని ప్రశ్నించాడు. దానికి ముకుళిత హస్తాలతో వినమ్రతాంజలి ఘటించిన విష్ణుచిత్తుడు ''స్వామీ! ఈరోజు ఘోర తప్పిదం జరిగింది. తమకు సమర్పించవలసిన పూలమాలలు నా కుమార్తె ధరించినందున ఆ నిర్మాల్య మాలలను తమకు సమర్పించ ఇచ్చగించనందున ఆలయానికి తేలేదు, మన్నించండి'' అని వేడుకున్నాడు. అంతట భగవానుడు నవ్వుతూ ''ఓ విప్రుడా! నీకు ఇప్పుడే తెలిసింది. కానీ ఆ బాల ముడిచిన పూలమాలలు చాలాకాలం నుండే నేను అమితానందంతో ధరిస్తున్నాను. అవే నాకు సంతోషాన్ని, ఆనందాన్ని కలగాజేస్తున్నాయి. కనుక నీవు నిర్భీతిగా ఆమె ధరించిన మాలలనే నిత్యం నాకు సమర్పించవచ్చు'' అని ఆనతిచ్చాడు. అంతటా ఉలిక్కిపడి నిద్ర లేచిన విష్ణుచిత్తుడు భగవానుడు ఆదేశించిన విధంగా గోదాదేవి ధరించి ఇచ్చిన మాలలనే ఇకపై ఆలయంలోని వటపత్రశాయికి సమర్పించ సంకల్పించాడు.


ఇదే విషయాన్ని అక్కడి ప్రజలకు తెలియజేసి తన బిడ్డ మహాలక్ష్మి అంశగా ఎంచి నిత్యం ఆమె ధరించి విడిచిన మాలలనే ఆలయస్వామికి సమర్పించసాగాడు. అప్పటినుండి ఆమెను చూడికొడుత్త నాచ్చియార్ అని, ఆముక్తమాల్యద అని పిలవసాగారు. ఇదే పేరుతో శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద గ్రంథాన్ని రచించి ఆంధ్రభోజుడని పేరు తెచ్చుకున్నాడు.


విష్ణు కైంకర్య నిరత అయిన గోదాదేవి అత్యంత భక్తితో, దైవీగుణ సంపన్నయై దివ్య సౌరభంతో జ్ఞాన వైరాగ్యాదులగు విశేష గుణాలతో ఆళ్వారులను మించి వికసింపసాగెను. అందునా పరమపురుషుడైన వటపత్రశాయియే తాను ధరించినప్పుదు ఏ మగువ మాత్రం తన జీవిత సర్వస్వం అర్పించకుండునా?!


ఈవిధంగా తన కుమార్తె పరమాత్ముని పరిష్వంగానికై పరితపిస్తుందని భావించిన విష్ణుచిత్తుడు ''అమ్మా! పూర్వం గోపికలు శ్రీకృష్ణుని పొందగోరి ఒక వ్రతం ఆచరించారు. నీవు కూడా ఆ వరం ఆచరించి పరమాత్మను చేపట్టగలవని చెప్పి ఆనాడు గోపికలు ఆచరించిన ధనుర్మాస వ్రతాన్ని ఉపదేశించాడు. అంతేగాక ఆ వ్రతాన్ని ఎలా చేయాలో విశదీకరించి వ్రత మహిమను కూడా బోధించాడు.


హేమంతే ప్రథమే మాసి నంద ప్రజకుమారికా


చేరుర్హవిష్యం భుంజానా కాత్యాచన్యర్చన వ్రతం


కాత్యాయనీ మాత వ్రతాన్ని చేయ సంకల్పించిన గోదాదేవి ఎముకలు కోరికే చలికాలంలో ఉదయాన్నే చన్నీటితో స్నానం చేసి, ఒంటిపూట భోజనంతో ఆనాడు గోపికలు ఆచరించిన వ్రతాన్ని ఆచరించింది. అంతేకాకుండా ఆ మాసమంతా రోజుకొక గీతాన్ని గానం చేసింది. అలా కూర్చిన ముప్పై పాశురాలనే తిరుప్పావై పేరుతో ప్రసిద్ధిచెందింది. ఇంతేకాకుండా గోదాదేవి నాచ్చియార్ తిరుమొళి అనే 140 గాథలున్న మరొక ప్రబంధాన్ని కూడా రచించింది. ఈమె రచించిన భావనామృన్ని గ్రహించిన మీరాదేవి కూడా హిందీలో ఆ మురహరునిపై విరహగీతాలాపన చేసింది.


నిత్యం మురహరుని ధ్యానంలో మునిగిపోయి నిద్రాహారాలు మరచి కృశించిపోతున్న తన కుమార్తె గోదాదేవిని చూసిన విష్ణుచిత్తుడు ''ఏమ్మా! ఎందుకలా ఉన్నావు? నీవు కోరిన విధంగా ఆ మురహరునికే నిన్ను కట్టబెడతాను. కానీ ఆ మహావిష్ణువు ఈ భువిపై 108 దివ్య తిరుపతుల్లో వెలసియున్నాడు. నీవు కోరిన వానికిచ్చి వివాహం చేయదలచాను'' అని ఆ 108 దివ్య తిరుపతుల వైభవాన్ని అక్కడ వెలసిన శ్రీమహావిష్ణువు దివ్య రూపాన్ని వర్ణించసాగాడు. ఆసాంతం అన్ని గాథలు విన్న గోదాదేవికి శ్రీరంగనాథుని వైభవం గురించి వర్ణిస్తున్నప్పుడు ఆమె ముఖారవిందం వికసించడం చూసి ఆ శ్రీరంగనాథుదే తన గారాలపట్టికి తగిన వరునిగా ఎంచి అతనికే ఇచ్చి వివాహం చేయ నిశ్చయించుకున్నాడు.


ఎగిరి నీ పాదముల చెంత కెట్లు వచ్చి వాలుడునో యన్న యుత్సుకత్వంబు కలడు సాధ్యసాధనమైన పక్షముల జంట హృదయమున కుండి శరీరమునకు లేదు ఓ శ్రీరంగపతీ, ఇంతకాలం ఈవిధంగా నీ కొరకు పరితపించవలె? ఒక్కమారుగా ఎగిరి వచ్చి నీ పాదాంబుజములను చేరవలెనాన్న ఆశ మిక్కిలి అధికమగుచున్నది. అయ్యో నా హృదయమునకు రెక్కలు ఉన్నవి కానీ, నా శరీరమునకు లేవే. ఒక పక్షిగా పుట్టిన నిన్ను క్షణంలో చేరి నీ పరిష్వంగం చేరేదాన్ని కదా'' అని వాపోయింది.


భట్టనాథుని వాక్యాలకు తన హృదయ విపంచి వినీలాకాశంలో పయనించసాగింది. భట్టనాథుని కోరిక మేరకు ఆలయాధికారులు ఈ విషయాన్ని ఆ దేశపు రాజైన వల్లభదేవునికి విన్నవించారు. దానికి ఎంతో సంతోషించిన వల్లభదేవుడు శ్రీవిల్లి పుత్తూరులోని శ్రీకృష్ణ ఆలయ పరిసరాలు సర్వాలంకారాలతో అలంకరించి పెళ్ళి శోభ తెచ్చాడు. మంగళవాద్యాలు, గజ, తురగ పదాతి దళాలతో వల్లభదేవుడు రాచమర్యాదలతో గోదాదేవిని శ్రీరంగం తీసుకుని వచ్చాడు. దారంతా గోదాదేవి రచించిన తిరుప్పావై జనులంతా పఠిస్తుండగా శ్రీరంగంలోని సప్త ప్రాకారాలు వివాహ శోభతో దేదీప్యమానంగా ప్రకాశించసాగాయి. పెళ్ళి పల్లకిలో శ్రీరంగం చేరిన గోదాదేవికి ఘనంగా స్వాగతం పలికారు అక్కడి ప్రజలు. ఆలయ ప్రాంగణం అంతా ముత్యాలముగ్గులతో, మంగళతోరణాలతో శోభిస్తోంది.


అక్కడి ప్రజలంతా దివ్య ప్రబంధంలోని పాశురాలను మనోహరంగా గానం చేయసాగారు. ఆలయ ప్రాంగణం అంతా శ్రీరంగనాథుని నామస్మరణతో మారుమోగింది. శ్రీవైష్ణవులు దివ్య పాశురాలను గానంచేస్తున్నారు. వందిమాగధులు స్తోత్ర వచనాలు పలుకుతున్నారు. గజాలు, అశ్వాలు ప్రత్యెక అలంకరణతో ఆలయ ప్రాంగణం చేరుకున్నాయి. మంగళవాద్యాలు శ్రావ్యంగా గానం చేస్తున్నాయి. అప్సరసలను పోలిన నృత్యాంగనలు ఆడుతూ పాడుతున్నారు. భట్టనాథులు, వల్లభదేవుడు గోదాదేవి ఉన్న పల్లకికి ఇరువైపులా నడుస్తున్నారు. నగరకాంతలు గోదాదేవిపై మంగళజలములు కురిపించసాగారు. శ్రీరంగనాథుని కూడా నూతన వధువుగా అలంకరించారు. శ్రీమహాలక్ష్మి ఆగమనాభిలాషియైన శ్రీమహావిష్ణువు కూడా అత్యంత శోభతో ప్రకాశించాడు.


అంతట గోదాదేవి శంతను మండపం నుండి శ్రీరంగవిమానం చేరుకుంది. అక్కడ శేషశాయి అయిన శ్రీరంగని పాదపద్మములను చేరిన గోదాదేవి ఆ రంగానిలో ఐక్యమైంది. ఈ దివ్యదృశ్యాన్ని కాంచిన విష్ణుచిత్తునికి గుండె ద్రవించగా విచారగ్రస్తుదగుట చూసిన శ్రీరంగనాథుడు అశరీరవాణితో ధైర్యం చెప్పి ''శ్రీవిల్లి పుత్తూరులో తనకు నిత్యం పుష్ప కైంకర్యం చేయమని, తన సతి తనను చేరినందున నీవు నిశ్చింతగా ఉండ''మని ఆనతిచ్చాడు. తదుపరి విష్ణుచిత్తుడు శ్రీవిల్లి పుత్తూరు చేరి తన కుమార్తె రచించిన దివ్య ప్రబంధమైన తిరుప్పావై, నాచ్చియార్ తిరుమొళి నిత్యం గానం చేస్తూ తన 85వ ఏట శ్రీవిష్ణుసాయుజ్యం చేరాడు.


తరువాత శ్రీరంగనాథుని ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా గోదాదేవికి ఒక ఆలయం కట్టించి నిత్యోత్సవాదులతో ఆమె అర్చనకు ఏర్పాటు చేశారు. నాటి నుండి దివ్య దేశాలయిన ప్రతి వైష్ణవాలయాలలో గోదాదేవిని కూడా ప్రతిష్ఠించి అర్చించసాగారు. పన్నిద్దరు ఆళ్వారులలో కనీసం గోదాదేవి, శఠగోపులు, రామానుజులు, తిరుమంగ ఆళ్వారులు గల వైష్ణవాలయాలే దివ్యదేశాలుగా పేర్కొనబడ్డాయి.


క్షీరాబ్ది జిల్కిన శ్రీధవు గోశపు నమ్యగలంకృత చంద్రముఖులు 


చేరి సంప్రార్ధించి స్థిరమైన కోరికల్ పొందిన రీతిగ పుడమియందు 


శ్రీవిల్లి పుత్తూర సిత పద్మ మాలికల్ దాల్చిన భట్టరుతనయద్రవిడ 


భాషను పరమమౌ పద్యమాలికలను ముప్పది సాయంచె నొప్పిదముగ 


భక్తివీనిని పఠియించు భక్తవరులు 


నాల్గు భుజభూధరంబుల పెల్గునత్తి 


యరుణలోచనముల నొప్పు హరి కటాక్ష 


మంది సుఖ సంపదల గాంతు రనవరతము


(ఇంతటితో ఆళ్వారుల చరిత్ర సమాప్తం)


వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి 


దయచేసి షేర్ చేయండి 


స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన నామం " గోవిందా " ... ఎవరు తనని గోవిందా అని పిలుస్తారా అని ఎదురు చూస్తుంటారట స్వామి వారు ... 


కనుక మనం ఆలస్యం చేయక 


అందరం " గోవిందా గోవిందా " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ...


గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా


🙏🙏🙏

సేకరణ

*శ్రీ శివ మహా పురాణం

 **దశిక రాము**


**శ్రీ శివ మహా పురాణం**


26  by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


ఒకనాడు పార్వతీదేవి చెలికత్తెలయిన జయ విజయలు అమ్మవారితో ఒకమాట చెప్పారు. ‘అమ్మా, నంది నిన్నూ వహిస్తాడు, శంకరుడినీ వహిస్తాడు. కానీ ఆయనకు కొంచెం శంకరుని మాల ఔదలదాల్చడంలోనే సంతోషం ఎక్కువ. భ్రుంగీ అంతే. మన మాటే వినేవాడు ఒకడు లేడు. అలాంటి వాడు మనకి ఒకడు ఉంటే బాగుంటుంది. అందుకని నీవు ఒకడిని సృష్టించి ద్వారపాలకుడిగా పెడితే వాడు నీ మాటే వింటూంటాడు. అలాంటి వాడిని తయారు చెయ్యి. అతడు మన అంతఃపురమును కాపాడడానికి పనికివస్తాడు” అని చెప్పారు. వారి మాటలు విన్న పార్వతీ దేవి అలాగే చేద్దాం అని తన శరీరమునకు ఉన్న మలమును స్నానం చేసేటప్పుడు నలుగు పిండిలా తీసి దానిలోంచి ఒక పిల్లవాడిని తయారు చేసింది. నలుగులోంచి తయారు చేయబడిన పిల్లవాడు ఎలా ఉన్నాడన్నది ఎవరికీ తెలియదు. చాలా బాగుండాలని అమ్మవారు సంకల్పం చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. వాడు లేచి కూర్చున్నాడు. అపుడు వానితో నీవు వెళ్లి ద్వారము దగ్గర కూర్చుని ఎవరూ లోపలి రాకుండా నిలుపు’ అంది అపుడు ఆ పిల్లవాడు ద్వారం దగ్గర కూర్చున్నాడు.

ప్రమథగణములలో ముందు నందీశ్వరుడు విజయం చేస్తుండగా శివుడు లోపలి వెళ్ళబోయాడు.ఈ పిల్లవాడు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. ముందు శంకరుడు జ్యోక్యం చేసుకోలేదు. అపుడు ప్రమథగణములకు ఆ పిల్లాడికి మధ్య యుద్ధం జరిగింది. ఎవరు సలహా చెప్పారో వాళ్ళే అమంవారి దగ్గరకు వచ్చి అమ్మా పిల్లవాడు యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి నీ శక్తులను పిల్లవాడికి ఇవ్వవలసింది అని చెప్పారు. అమ్మవారు శక్తులను ఇచ్చింది. ఆ పిల్లవాడు అద్భుతమయిన యుద్ధం చేసి ప్రమథగణములనన్నిటిని ఓడించేశాడు. ఇంక అక్కడ నుండి బ్రహ్మ, విష్ణువు కూడా వచ్చేశారు యుద్ధానికి. అయినా ఆ పిల్లవాడు శంకరుడిని లోపలికి పంపించలేదు. అపుడు శంకరుడు చేతిలో త్రిశూలమును పట్టుకుని పిల్లవాని కంఠమునకు గురి పెట్టి విసిరాడు. అపుడు త్రిశూలం ఆ పిల్లవాని కంఠమును ఉత్తరించేసింది. ఆ పిల్లవాడు క్రిందపడి మరణించాడు. తరువాత శంకరుడు లోపలికి వెళ్ళాడు. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో పార్వతీదేవి బయట కాపలా పెట్టిన పిల్లవాని ప్రస్తావన వచ్చింది. అపుడు శివుడు ఆ పిల్లవానిని త్రిశూల ధారల చేత చంపేశాను అన్నాడు. అపుడు పార్వతీదేవి అయ్యో ఆ పిల్లాడిని నేనే సృష్టించాను – చంపేశారా అని దుఃఖమును పొందింది. ఆవిడ దుఃఖమును ఉపశమింపజేయడానికి దేవతలు అందరూ వచ్చారు. ఆవిడ శంకరుని తన బిడ్డను మరల బ్రతికించమని అడిగింది. అప్పుడు ఆయన తన అనుచరులను పిలిచి మీరు ఉత్తర దిక్కుగా వెళ్ళి మీకు మొట్టమొదట కనపడిన ప్రాణి ఏదయితే ఉంటుందో దాని తలకాయ తీసుకురండి. ఆ తలకాయ పిల్లవాడికి పెడతాను’ అన్నాడు. వాళ్లకి మొట్టమొదట ఏనుగు కనపడింది. వాళ్ళు దాని తలకాయ పట్టుకొచ్చారు. దానిని ఈ పడిపోయిన పిల్లవాని కంఠమునకు కలిపాడు. ఆ పిల్లవాడు చక్కగా లేచి కూర్చున్నాడు. ఇప్పుడు వానికి శంకరుడెవరో తెలిసి శంకరునికి నమస్కారం చేశాడు. వెంటనే శంకరుడు కూడా వాడిని ఎత్తి తొడమీద కూర్చోపెట్టుకున్నాడు. ఈలోపుగా సుబ్రహ్మణ్య జననం కూడా జరిగిపోయింది. ఈ ఇద్దరి పిల్లలతో సంసారం చక్కగా నడిచిపోతోంది.

ఒకరోజు ఒక యోగ్యమయిన సంబంధం వచ్చింది విశ్వరూప ప్రజాపతి అనే ఆయన తన ఇద్దరు కుమార్తెలయిన సిద్ధిబుద్ధి అనే వాళ్ళను ఇవ్వాలనుకుంటున్నాను అని వచ్చాడు. అపుడు శంకరుడు తన కుమారులను పిలిచి ఎవరు ముందు భూప్రదక్షిణ చేసి వస్తే వారికి ముందుగా పెళ్ళి చేస్తానన్నాడు. ఇద్దరూ బయలుదేరారు. గణపటిది మూషిక వాహనం. అందుకని ఆయన తల్లిదండ్రులిద్దరికీ ఏడుమార్లు ప్రదక్షిణం చేసి వారిని పత్ర పుష్పములతో పూజ చేశారు. సుబ్రహ్మణ్యుడికి ఎక్కడికి వెళ్ళినా వినాయకుడు ముందుగా వెళ్ళిపోతున్నట్లు కనపడుతున్నాడు. పార్వతీ పరమేశ్వరునకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసిన ఫలితమును ఆయన ఖాతాలో వేసి ‘నువ్వు చెప్పినటువంటి నియమమును పాటించిన వాడివి కనుక నీకు ముందు వివాహం చేస్తున్నాను అని చెప్పి సిద్ధి బుద్ధిలను గణపతికిచ్చి వివాహం చేశారు. సుబ్రహ్మణ్య స్వామీ వారు క్రౌంచ పర్వతం దగ్గరకు వెళ్ళారు. పార్వతీ పరమేశ్వరులు కూడా వెళ్ళారు.

ఇక్కడ మనకు కొన్ని సందేహములు కలగడానికి అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా శంకరుడు ఆ పిల్లవాని తలను తీసివేసి ఉంటే ఏనుగు తల పెట్టడం ఎందుకు? పడిపోయిన తలకాయనే అతికించవచ్చు కదా! అని. పార్వతీ దేవి అనగా పరమ ప్రక్రుతి. పరమ శివుడనగా పరమ పురుషుడు. పరమ ప్రకృతి అంటే పంచ భూతములు. పంచభూతములయందలి కదలిక పరమేశ్వరుడు. అమ్మవారు భూతములన్నిటిని తయారుచేస్తుంది. కానీ లోపల చైతన్యం శివుడు. అంటే శివ సంబంధమయిన ఎరుక లేదు. లోపల ఉన్న చైతన్యము ‘నేను’ అన్నది తెలియదు. పైన ఉన్న శరీరము మూడు గుణముల చేత బంధింపబడి ఉంది. ఈ మూడు గుణములే ప్రకృతి యొక్క మలము. అదే అమ్మవారి శరీరంలోంచి వచ్చిన మలము. ఆ మలముతో పిల్లవాడు తయారు అయాడు. అంటే త్రిగుణములయందు కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి ఈ తలకు ప్రకృతి తెలుసు శివుడు తెలియదు. లోపల ఉన్న చైతన్యం బయట నిలబడిన శివుడు అని తెలియదు. కాబట్టి ఆయన దానితోనే పోరాటం చేశాడు. శంకరుడు ఆ పిల్లవాని తలను త్రిశూలంతో తరిగేశాడు. త్రిశూలమునకు ఉన్న మూడు త్రిగుణములు, వీటికి ఆధారమైన సత్యము శంకరుని చేతిలో ఉన్న త్రిశూలం. శంకరుడు గుణాతీతుడు. ఎప్పుడయితే శివుడి చేతి త్రిశూలం పిల్లవాని కంఠమునకు తగిలిందో త్రిగుణములకు సంబంధించిన బుద్ధి పోయింది. ఇప్పుడు ‘గజ’ – ఏనుగు తల పెట్టబడింది. ‘గ’ అంటే గతి అంటే కదలడం; ‘జ’ అంటే పుట్టడం. ఇపుడు ఆ పిల్లవానికి ఇందులోంచి పుట్టి ఇందులోకి వెళుతున్నాడో తెలిసిపోయింది. అంటే ఇప్పుడు శివసంబంధం వచ్చేసింది. శివుడు తెలిసిపోయాడు. తెలిసిపోవడం గజముఖం. అందుకని శంకరుడికి నమస్కారం చేశాడు. ఇది మీరు చెయ్యవలసిన ఉపాసనా క్రమమును వినాయకుని మూర్తి ద్వారా లోకమునకు తెలియజెప్పడం. ఏనుగు తల బ్రహ్మాండమును చెప్తే మనిషి శరీరం పిండాండమును చెప్తుంది. బ్రహ్మాండం, పిండాండం రెండింటి యందు పంచభూతములు ఉన్నాయి. రెండూ పంచ భూతములలో నిండి ఉన్నప్పటికీ రెండింటియందు ఉన్నది ఒక్కటే అని జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్త్వమసి అర్థమయితే ‘తత్ త్వం అసి’ ‘అదే వాడి ఉన్నాడు’ జీవుడే ఈశ్వరుడై ఉన్నాడు అని తెలియడమే ఏనుగు ముఖం మనుష్యుడు తల కంఠం దగ్గర శివానుగ్రహంతో కలవడం. కాబట్టి తత్త్వమసి మహావాక్యం నడయాడితే మహాగణపతిగా తిరుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడాయన వినాయకుడు అయ్యాడు. ‘వి’ అంటే విశిష్టమయిన – అనగా విశిష్టమయిన నాయకుడు అయ్యాడు. మీరు ఆయనను ఉపాసన చేస్తే ఆయన మిమ్మల్ని అటువంటి పథంలోకి తీసుకు వెడతాడు. ఆయన విఘ్నములకు నాయకుడు. విఘ్నమును తీసేస్తాడు. మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుస్తాడు.

గణపతి పరబ్రహ్మమై ఉన్నాడు. ఈయనకు సిద్ధిబుద్ధి భార్యలు. ఎవరు బుద్ధిని ఉపయోగిస్తాడో వాడు సిద్ధిని పొందగలడు. బుద్ధి అనేది ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. గణపతి ఆరాధన చేత మంచి బుద్ధి వచ్చి సిద్ధి పొందడమే ఆయనకీ సిద్ధి బుద్ధి భార్యలు అయి ఉండడం. ఆ అనుగ్రహం మీయందు ప్రసరింపబడడం. ఏనుగుకు అన్నిటికన్నా ఇష్టమైనది దాని దంతం. కానీ అది నమలడానికి పనికిరాదు. ఏనుగు ముఖం ఉన్న గణపతి వ్యాసుడు భారతం చెప్తుంటే తన దంతమును విరిచేసి దానితో రచన చేశాడు. మనకి ఉన్న వస్తువులను లోకోపకారానికి ఉపయోగించాలి. భారతమును రచించడానికి తన దంతం ఉపయోగ పడితే కొన్ని యుగాలపాటు పంచమ వేదమయిన భారతమును లోకం చదువుకుని ఉద్ధరింపబడుతుంది అని భావించి తన దంతమును విరిచేసి దానితో భారతమును రచన చేశాడు. ‘ఏకదంతం, శూర్పకర్ణం, లంబోదరం’ అని పేర్లు సంపాదించాడు. ఎంతో శాశ్వతమయిన యశస్సు పొందాడు. శివుడు ఎంత సులభుడో వినాయకుడు అంత సులభుడు. ఇరువది ఒక్క గరిక తెచ్చి ఆయన పాదముల మీద వేస్తే చాలు. అన్నీ ఇచ్చేస్తాడు. కొద్దిగా సింధూరమును గండయుగ్మమునాకు రాస్తే చాలు పొంగిపోతాడు. ఏనుగు తల కనపడితే మంగళ ప్రదము. చివరకు కలలోకి ఏనుగు వచ్చినా అది మంగళప్రదమే.

గణపతి స్వరూపంలో చిత్రమయినది ఎలుక. గణపతికి వాహనం ఎలుక. ఎలుక దొంగతనానికి ప్రతీక. మనతో పాటే ఉంటుంది. మన వస్తువులన్నీ ఎత్తుకుపోతూ ఉంటుంది. మన బ్రతుకూ అంతే. విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే మనకి ఆయన పదిమంది హృదయాలను కొల్లగొట్ట గలిగిన దొంగతనమును పొందుతాడు. అనగా ఈశ్వరాభిముఖుడై భగవద్భక్తి చేత తాను మాట్లాడిన మాటలకు పరవశులై చాలామంది హృదయాలను తాను కొల్లగొట్టే దొంగ అవుతాడు. ఇలా మారడానికి ఎలుక విఘ్నేశ్వరుడిని వహించింది. మీరు కూడా అలా వహించడం నేర్చుకోవాలి. పదిమంది ప్రేమను సంపాదించుకోవడం నేర్చుకోవాలి. దీనిని సూచించదానికే ఎలుకను వాహనంగా పెట్టుకున్నాడు. ఎలుక చెవులు పెద్దవిగా ఉంటాయి చేట లాగా. గణపతిని నమ్మి ఆవాహన చేసి జాగ్రత్తగా ఉపాసన చేస్తే లోకంలో పొల్లు తీసేసి సారం వైపుకి మనలను నడిపిస్తాడు. పరమభక్తిని ఇస్తాడు. ఆయన ఆయుధమయిన గొడ్డలితో కర్మ పాశములను తెంచి భక్తీ పాశములను వేసి తన వైపుకి లాక్కుంటాడు.

చవితి తిథి ఆయనకు చాలా ఇష్టమైన తిథి. ఆరోజు ఎవరయినా వినాయకుడి గురించి ప్రత్యేకంగా వినినా, చదివినా వారు ఎంతో ప్రయోజనమును పొందుతారు. పరమ భక్తితో స్వామికి నమస్కారం చేసినా ఎవరు కోరుకున్నది వారికి అనుగ్రహిస్తాడు. విద్యార్థికి విద్య వస్తుంది. ద్రవ్యార్థికి ద్రవ్యం వస్తుంది. కన్యార్థికి కన్య దొరుకుతుంది. పుత్రార్థికి పుత్రుడు పుడతాడు. భోగార్థి అయిన వాడికి భోగములు కలుగుతాయి. మోక్షార్థికి మోక్షం దొరుకుతుంది. రాజ్యార్థికి రాజ్యం, కీర్తి కావాలనుకున్న వారికి కీర్తి వస్తుంది. ఆరోగ్యం కుదుటపడక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్లకి ఆరోగ్యం కలుగుతుంది. ఋణభారంతో ఉన్నవాడికి ఋణం తొలగుతుంది. ఇక్కట్టులలో ఉన్న వాడికి ఇక్కట్టులు తొలగిపోతాయి. గణపతి దర్శనం చేత గణపతి యొక్క అనుగ్రహం చేత గణపతి కథను చదవడం చేత సమస్త శుభములు సమకూడతాయని పెద్దలు మనకు ఫలశ్రుతిని వివరణ చేసి ఉన్నారు. కాబట్టి ఆ గజానన స్వరూపము అంత గొప్ప స్వరూపము.


🙏🙏🙏

*శ్రీ శివ మహా పురాణం

 **దశిక రాము**


**శ్రీ శివ మహా పురాణం**


25  by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


నటరాజు


మనకి పరమశివుని స్వరూపము అనేకరకములయిన మూర్తులుగా గోచరిస్తూ ఉంటుంది. పరమ శివునికి అరువది నాలుగు మూర్తులు ఉన్నాయి. శివుని స్వరూపమేమి అని అడిగితె మనకి శివలింగం అనే సమాధానం వస్తుంది. సాధారణంగా శివాలయముల అన్నిటియందు లింగ స్వరూపమే ఉంటుంది. కానీ సాకారంగా పరమశివుడికి పార్వతీదేవికి మూర్తి ఉన్నది. ఈ అరువది నాలుగులో ఒక భాగమును ‘ఘోర స్వరూపములు’ అంటారు. ఇవి సాధారణంగా శిక్షించడానికి వస్తాయి. రెండవది ‘అఘోరరూపములు’. మంగళప్రదంగా ఉంటాయి. అటువంటి మూర్తిని మీరు చూసినప్పుడు మీకు చాలా ఆనందం కలుగుతుంది. మీకు ప్రపంచంలో ఎన్ని రకములయిన విద్యలు ఉన్నాయో ఎన్ని కళలు ఉన్నాయో అంతమందీ కూడా తమ తమ కళలను ప్రదర్శన ప్రారంభం చేసే ముందు నమస్కరించవలసిన మూర్తి ఒకటి లోకంలో ఉంది. దానిని ఆనంద తాండవమూర్తి అంటారు. దానిని మనం ‘నటరాజు’ అని పిలుస్తుంటాం. కానీ శైవాగమం దానిని ‘ఆనంద తాండవ మూర్తి’ అని పిలుస్తుంది. ఆ తాండవం చెయ్యడంలో గొప్ప రహస్యములు కొన్ని ఉంటాయి. ఆనంద తాండవం చేసిన పరమశివుడు ఎవరు ఉన్నారో ఆయనలోంచే సమస్త శాస్త్రములు ఉద్భవించాయి. ఆయనలో నుంచే సమస్తమయిన కళలు వచ్చాయి. ఒక్క శంకరుడు చేసిన తాండవంలోంచి 650 రకాలైన నాట్యములు పుట్టాయి. ఈవేళ ఇప్పటికీ కర్మభూమిలో బ్రతికినవి 108 రకముల నాట్యములు. కూచిపూడి, ఒడిస్సీ, భరతనాట్యము ఇవన్నీ ఆనంద తాండవ మూర్తి అయిన శంకరుని దగ్గరనుంచే వచ్చాయి.

ఈ ఆనంద తాండవ మూర్తి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈ చిత్రమును గీయడం లేదా నిలబెట్టడం చాలా కష్టం. చేతులు కట్టుకుని ఆయన నాట్యమును నలుగురు మాత్రమే చూస్తారు. అందులో ఒకడు నందీశ్వరుడు, రెండవ వాడు భ్రుంగి, మూడవ వాడు పతంజలి, నాల్గవ వాడు వ్యాఘ్రపాదుడు. ఈ తాండవం ఆ స్వరూపంలో అప్పుడు సమస్త లయకారకమై ఉంటుంది. ఈ తాండవం ప్రదోష వేళలో జరుగుతూంటుంది. ఆయన నాట్యము చేత ఈ లోకమునకు రాజయ్యాడు. అందుకే ‘నటరాజు’ అని పిలుస్తుంటాము. ఆయన చేసే నాట్యం మామూలు నాట్యం కాదు. అది మీరు తెలుసుకుంటే చిదంబరంలో కనకసభ దగ్గరకు వెళ్లి అంత పెద్ద ఆనంద మూర్తిని మీరు చూడవచ్చు. అక్కడ ఆ మూర్తిని చూడగానే మీరు ప్రణిపాతం చేసి సాష్టాంగనమస్కారం చేసేస్తారు. అఘోర స్వరూపముల యందు చాలా గొప్ప స్వరూపములలో ఆనందమూర్తి స్వరూపం ఒకటి.

ఆనంద తాండవం చూసే స్థాయి పొందిన వాళ్ళలో మొదటి వాడు నందీశ్వరుడు. ఆయన అయ్యవారికి చాలా గొప్ప భక్తుడు. రెండవ వాడు భ్రుంగి. మూడవ వాడు పతంజలి. ఆదిశేషుని అవతారము. అందుకని ఆయన తల మనుష్యుడిగా ఉంటుంది. మిగిలిన శరీరం పాముగా ఉంటుంది. వ్యాఘ్రపాదుడికి తలకాయ మనుష్యుడిది. పాములు పెద్దపులివి ఉంటాయి. ఈ నలుగురు నిలబడి తాండవం చూస్తూంటారు. ముప్పది మూడు కోట్లమంది దేవతలు అక్కడే ఉంటారు. బ్రహ్మ శ్రీమహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటారు. పతంజలి తప్ప మిగిలిన దేవతలు ఎవరికీ తోచిన వాద్య విశేషణాన్ని వారు వాయిస్తూంటారు. డమరుకం కదలిక చేత ఇన్ని రకములయిన సృష్టి ప్రారంభం అయింది. ఆయన చేతిలో ఉన్న డమరుకం కారణంగా ఈయన సృష్టికర్త అయ్యాడు. పరమేశ్వరుని సృష్టి కదలిక వలన కొత్తగా కొన్ని ప్రాణులు లోకంలోకి వచ్చాయి. ఈ లోకంలోకి కొత్తగా ప్రాణులు రావడం అనే సమస్త కదలికలకు డమరుక సంకేతం. ఇవన్నీ జరుగుతున్నాయి అనడానికి ఆయన కదలికే కారణము. ఈశ్వరుని కదలికకు నర్తనమని పేరు. ఇదే ఆనంద తాండవము. ఆనంద తాండవ మూర్తి చేతిలో కుడివైపు డమరుకం ఉంటుంది. ఎడమచేతి వైపు అగ్నిహోత్రం ఉంది. ప్రపంచంలోని అన్ని వస్తువులు చివరకు భస్మమే అయిపోతాయి. ఈ విషయం లోపల బాగా నాటినట్లయితే వ్యక్తి తప్పుడు పనులు చేయడు. ఏది కాలంలో వచ్చిందో అది కాలమునందు ఉండదు అని మీకు అర్థం అయిపోతే మీ నడవడి యందు మార్పు వచ్చేస్తుంది. నటరాజ స్వామిని పరిశీలించినట్లయితే ఆయన కుడికాలి క్రింద ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈయన కాలుకింద పడుకుని తల ఎత్తి నవ్వుతూ ఉంటాడు. ఏడవడు. మాయను గెలవడమే కుడికాలి కింద రాక్షసుని తొక్కి పట్టడం. ఎడమ కాలు బ్రాహ్మీ స్థితిని సూచిస్తుంది. కుడికాలు మాయను తొక్కితే పైకి లేచేది ఎడమకాలు. అందుకే ఆనంద తాండవ మూర్తి ఎడమకాలు పైకి లేచి ఉంటుంది. నీవు ఊర్ధ్వ ముఖ చలనము చేసి ఈశ్వరుడిని తెలుసుకునే ప్రయత్నం చేసి బ్రాహ్మీభూతుడవై ధ్యానము చేసి ధ్యానమునందు ఆనందమును పొంది ‘నేనుగా ఉండడం’ నీవు నేర్చుకో. నీవు నేనై ఉన్నాను అని తెలుసుకో. దానికి ధ్యానం అవసరం. ఇది చెప్పడానికి ఎడమచెయ్యి పైకి లేచిన ఎడమ పాదమును చూపిస్తుంది. కుడి చేయి అభయ ముద్ర పట్టింది. శివుడు చాలా తేలికయిన వాటిని పుచ్చుకుని పెద్ద శుభ ఫలితములను ఇస్తాడు. ఇది చెప్పడానికే ఆయన అభయముద్రను ప్రదర్శించాడు. పాపమును హరిస్తానని చెప్పాడు. హరించినప్పుడు ఉపాసకుడు క్రమంగా పెరుగుతాడు. పెరిగి ‘శివ’ – అంటే మంగళమును చేరతాడు. ఈ ‘శివ’ నుండి ఆనంద తాండవ మూర్తిలోనికి లయం అయిపోవాలి, తాను ఆనందంగా మారిపోవాలి. అలా మారిపోతుంటే ఇప్పుడు ఆయన దిగంబరుడుగా వచ్చాడు. అంటే శరీర భ్రాంతి లేకపోవడాన్ని ఆనందం అంటారు. ఆత్మస్వరూపి అయిన ఆనంద తాండవ మూర్తియండు సాధకుడు కలిసిపోతే తానె ఆనంద తాండవ మూర్తి అయిపోతాడు. ఆయనకి మరల చావడం అనేది ఉండదు. ఇదే ఆఖరి చావు.

శివుని విశేషములను వేటినీ మీరు సామాన్యముగా తీసుకొనుటకు ఉండవు. మీరు కేవలం ఒక నటరాజ స్వామి వారి మూర్తిని పెట్టుకుని అష్టోత్తరం చేస్తాను, సహస్రం చేస్తాను అంటే మీకు ఈ తత్త్వము ఆవిష్కరింపబడదు. ఇలా చూడాలన్న కోరిక పుట్టడమే చాలా కష్టం. కోరిక పుట్టినా అది నిలబడడం చాలా కష్టం. ఎందుకు అంటే కింద కుడికాలిక్రింద నవ్వుతూ ఒకడు బ్రతికే ఉంటాడు. వాడు ఎప్పుడు లేచి పట్టేసుకుంటాడో మనకి తెలియదు. ఎప్పుడయినా మాయ మళ్ళీ పట్టేస్తుంది. మళ్ళీ కూపంలోకి పడిపోతాడు. ఉదాహరణకు రావణాసురుడు శంకరుని ప్రార్థన చేశాడు. తనకు ఎటువంటి శంకరుని చూడాలని ఉన్నదో వివరిస్తూ స్తోత్రం చేశాడు “జటాటవీ గలజ్జల’ అని. ఇంత స్తోత్రం చేసిన రావణాసురుడు అలా నిలబడ లేకపోయాడు. పరమేశ్వరుని తనతో లంకకు రమ్మన్నాడు. ఏమయిపోయింది ఈ స్తోత్రం. అంటే అంతలో మాయ కమ్మింది. అడగడం కాదు. అడిగినవాడు నిలబడడం కూడా చాలా కష్టం. నిలబడడానికి శివానుగ్రహం ఉండి తీరాలి. శివానుగ్రహం కలిగితే ఆయనే నడిపిస్తాడు. కాబట్టి అటువంటి ఆనంద తాండవ మూర్తి అనుగ్రహం మనకు కలిగి మనుష్యజన్మ ప్రయోజనం నెరవేరేటట్లుగా నిర్హేతుక కృపాకటాక్షవీక్షణముల చేత ఈశ్వరానుగ్రహం మనయందు ప్రసరింపబడాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థన చేద్దాము.


🙏🙏🙏

మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము**


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


భీష్మపర్వం.154


శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత ఉపదేశిస్తున్నాడు, కురుక్షేత్రంలో, మహాసంగ్రామం మొదలయ్యే ముందు.


షష్టాధ్యాయం ధ్యానయోగం.


యం సంన్యాసమితి ప్రాహుర్యోగం తం  విద్ధి పాండవ 

న హ్యసంన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన//   (  6  . 2  )

ఓ పాండుకుమారా !  దేనిని సన్యాసమని విజ్ఞులు అందురో, అదియే యోగము.  అన్ని  సంకల్పములను త్యజించినవాడే  సన్యాసి, అతడే యోగి.  కర్మలను సన్యసించినను వాని సంబంధమైన విషయములను, సంకల్పములను వదలనివారు యోగి కాజాలరు. 


చిత్తస్పందన సంకల్పములు యేర్పడటానికి మూలము. దానికి కారణము  రజోగుణము.  రజోగుణము యోగాభ్యాసం వలన నశించును.  రజోగుణం  నశిస్తే, చిత్త స్పందనలు నశిస్తాయి.  చిత్త స్పందనలు లేకపోతె, సంకల్పాలు కలుగవు.  సంకల్ప త్యాగియే   సన్యాసి.  అతడే యోగి.  కర్మలు చేయకున్న మాత్రమున సన్నాసి కాదు. వాటి గురించి కూడా ఆలోచించకూడదు. 


ప్రశాన్తాత్మా విగతభీ ర్బ్రహ్మచారి వ్రతే స్థిత : 

మన : సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పర : //   ( 6 .14  )

శాంతిపొందిన మనసు కలవాడై, ప్రశాంతచిత్తుడై, దేనికీ భయపడనివాడై బ్రహ్మచారి   జీవితం గడుపుతూ, మనో నిరోధనము చేసి, విషయసుఖములను దూరంగా వుంచి,  నాయందే మనసు లగ్నం చేసినవాడై వుండవలెను.  


యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు 

యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖహా //  ( 6 . 17 )

తగిన ఆహార విహార నియమాలతో, యోగి చెయ్యవలసిన  పనులు మాత్రమే చేస్తూ, శరీరతాపము కలుగజేయని పనులు మాత్రమే చేస్తూ, యెక్కువ సమయం మేల్కొనక, యెక్కువ సమయము నిద్రించక, జాగరూకుడై  వుండువాడే యోగ సిద్ధిని పొంది దుఃఖమునకు దూరమగును.  


యధా దీపో నివాతస్థో   నేఁగతే సోపమాస్మృతా 

యోగినో యత చిత్తస్య యుజ్ఞతో యోగమాత్మన :  //  (6 .19  )

సంయమన చిత్తంతో యోగి తన  ధ్యాసను ఆత్మావలోకనం చేసుకుంటూ ' వాయురహిత ప్రదేశము నందు వుంచబడిన దీపమువలే ,  ఐహిక విషయములకు దూరంగా, చలన రహితుడై ప్రకాశిస్తూ వుండును. 


శనై శ్శనై రుపరమేద్బుద్ధ్యా ధృతి గృహీతయా 

ఆత్మసంస్థం మన: కృత్వా న కించదపి చింతయేత్ //   ( 6  .25  )

ప్రాణవాయువు నిరోధించడమే మనోనిగ్రహానికి మొదటిమెట్టు.  నెమ్మది నెమ్మదిగా ప్రాణవాయు స్పందనలను నిగ్రహించుట ద్వారా, మనోనిగ్రహం సాధించవలెను.  సాత్వికమైన ఆలోచనలతో, ఇంద్రియములను విషయముల నుండి విరమింప జేసి, యోగ బలంతో యితర వ్యాపకాల మీదకు మనోదృష్టి వెళ్లనీయక, ఆత్మస్థానమనే బుద్ధి గుహలో ప్రవేశించి ఆత్మయందు మనస్సును వుంచవలెను.  


యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి      

తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి // ( 6 . 30  )

సర్వభూతములలో నన్ను దర్శించిన వానికి, నాయందు సర్వభూతములను దర్శించిన వానికి, నానుండి దూరమయ్యే ప్రశ్న వుత్పన్నం కాదు.  అనగా, నానుండి అతడు వేరు కాదు.   సమ్యగ్దర్శకుడైన యోగి వేరు, పరమాత్మ వేరు కాదని భావము.  


సప్తమాధ్యాయము  జ్ఞాన విజ్ఞాన యోగము.


మనుష్యాణాం సహస్రేషు   కశ్చిద్యతతి సిద్ధయే 

యతతామపి సిద్ధానాం కశ్చిన్మామ్ వేత్తి తత్త్వత :  //  ( 7 . 3  )

అర్జునా !  వేలకొద్దీ మనుషులలో యెవరో ఒకడు మాత్రమే తత్వజ్ఞాన సిద్ధికోసం ప్రయత్నిస్తాడు.  అలా ప్రయత్నించిన అనేకమంది సిద్ధపురుషులలో, యే ఒక్కరో యదార్ధంగా తత్వజ్ఞాని అగును.  

యోగమును అభ్యసించుట వలన త్త్వజ్ఞాన సిద్ధి కలుగును.   అట్టి జ్ఞాన సిద్ధులు తననుండి   ఆత్మ వేరు గాదని  , యోగసిద్ధిలో  దర్శించి, అదే ఆత్మ అన్ని జీవరాసులలో కలదని తెలుసుకోబడతాడు..  అట్టివాడు, పరమాత్మకన్నా భిన్నం కాదు. 


భూమిరాపో>నలో వాయు:: ఖం మనో బుద్ధిరేవచ 

అహంకార  ఇతీయం  మే భిన్నా ప్రకృతి రష్టధా  //   ( 7 . 4  )

భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు బుద్ధి , అహంకారము అను ఎనిమిది విధములుగా యీ ప్రకృతి విభజించబడి యున్నది.   ఇవి వాటి అంతట అవి యేర్పడలేదు.  ఈశ్వర కల్పితములు,


చతుర్విధా భజంతే మాం జనా : సుకృతినో>ర్జున  

ఆర్తో, జిజ్ఞాసురార్ధార్ధీ జ్ఞానీ చ భరతర్షభ //  ( 7 . 16 ) 

అర్జునా !  భరతవంశ శ్రేష్టా ! ఆర్తులైనవారు, జిజ్ఞాసువులూ, ప్రయోజనం ఆశించేవారు, జ్ఞానులు, అను నాలుగురకాల వారు నన్ను యెల్లప్పుడూ సేవించాలని పరితపిస్తూ వుంటారు.  అది వారి పూర్వజన్మ పుణ్యము వలన యేర్పడిన సాంగత్యము.  


జ్ఞాని ఏకాగ్ర బుద్ధితో యే కోరికలూ లేకుండా నన్ను సేవిస్తాడు.  అతనికి నేను అత్యంత ప్రియుడను.  నాకును అతడు అంత ప్రీతిపాత్రుడే.    పెక్కు జన్మలలో నా గురించి పరితపించి, ఈ సర్వమూ నేనే అను అనుభూతి చెంది జ్ఞాని నన్ను ఆశ్రయించును.  


సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదు : 

ప్రయాణకాలే>పి చ మాం తే విధుర్యుక్తచేతస  :  //   ( 7 . 30 )

అధిభూత, అధి దైవ, అధియజ్ఞములతో కూడిన నన్ను తెలుసుకున్నవారు   వారి అంత్యకాలమున పరమాత్మనగు నాయందే మనసు లగ్నము చేసి, నన్ను చేరుకుందురు.  


అష్టమాధ్యాయము  అక్షర పరబ్రహ్మ యోగము.


ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ 

య : ప్రయాతి త్యజన్దేహం స యాతి పరమాం గతిం //  ( 8 . 13  )

ఏకాక్షర మంత్రమగు ఓంకారమును స్మరించుచు నా నామము స్మరించుచు  దేహాన్ని త్యజించువాడు ఉత్తమగతులు చేరతాడు.

యోగబలంతో సహస్రారంలో  ప్రాణం వుంచి, నన్ను తలుచుకుంటూ,ప్రణవ మంత్రం జపించుటకన్నా, ప్రశాంతమరణమేమున్నది ? 

ఓంకార స్మరణలోనే, స్వరం ఊర్ధ్వ స్థాయికి అసంకల్పితంగా వెళ్లే ప్రక్రియ వున్నది.  సహస్రారంలోనికి ప్రాణం తీసుకు వెళ్ళడానికి శ్రేష్టమైన మార్గం ఓంకార స్మరణ.    

 

అగ్నిర్జ్యోతిరహ : శుక్ల : షణ్మాసా  ఉత్తరాయణం

తత్ర ప్రయాతా గచ్చన్తి బ్రహ్మ బ్రహ్మవిదో జనా  :  //  ( 8 . 24 )

అగ్ని జ్యోతి, పగలు, శుక్లపక్షం,ఉత్తరాయణము, ఈ సమయములలో శరీరము త్యజించిన బ్రహ్మజ్ఞానులు ,  దేవయానములో  పయనించి  బ్రహ్మైక్యము   పొందుదురు.  ధూమ సమయములో, రాత్రివేళ, కృష్ణ పక్షంలో, దక్షిణాయనంలో   మరణించినవారు, పితృయానం మార్గంలో ప్రయాణించి,  చంద్రజ్యోతిని దర్శించి, కొంతకాలము తరువాత మరల పుట్టెదరు.


ఈ రెండు మార్గములు తెలిసిన యోగి, వేదాధ్యయనము, యజ్ఞకర్మలు, తపస్సు, ధ్యానము, దానములు  వంటి అనేక పుణ్య కార్యములు శాస్త్రోక్తంగా ఆచరించి, దేవయాన మార్గంలో బ్రహ్మైక్యం పొందడానికి కృషి చేస్తాడు., 

**దశిక రాము**


**మహాభారతము**


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


భీష్మపర్వం.155


శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత ఉపదేశిస్తున్నాడు, కురుక్షేత్రంలో, మహాసంగ్రామం మొదలయ్యే ముందు.


నవమాధ్యాయం రాజవిద్యారాజగుహ్య యోగం.


అశ్రద్దధానా : పురుషా ధర్మస్యాస్య పరన్తప 

అప్రాప్య మాం నివర్తన్తే మృత్యుసంసార వర్త్మని // ( 9 .3 )

ఆత్మజ్ఞాన ధర్మమును విశ్వసించని దేహాభిమానులగు నాస్తికులు మృత్యుమార్గాన సంసారచక్రంలో పునరపి జననం పునరపి మరణం చెందుతూ నానుండి దూరమగుదురు. 


అవజానన్తి మాం మూఢ మానుషీమ్ తనుమాశ్రితం 

పరం భావమజానన్తో మమ భూత మహేశ్వరం // ( 9 . 11 )

సర్వప్రాణులకు అధిదేవతగు నేను మనుష్యరూపములో నున్న పరమేశ్వరుడినని యెరుగక, నన్ను సామాన్య మానవునిగా మూఢజనులు, వివేకహీనులు, అనుకుంటారు.


అహం క్రతురహం యజ్ఞ: స్వధాహమహమౌషధం   

మంత్రో>హమహ మేవాజ్య మహమగ్ని రహం హుతం // ( 9 .16 )

పార్ధా ! నేనే క్రతువును. నేనే యజ్ఞాన్ని. సర్వప్రాణులకు ఆహరం యిచ్చే శక్తిని నేనే. నేనే ఔషధాన్ని. నేనే మంత్రాన్ని. నేనే నెయ్యిని. నేనే అగ్నిని. హోమద్రవ్యాన్ని కూడా నేనే. 


తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి 

ఏవం త్రయీధర్మమనుప్రసన్నా గతాగతం కామకామా లభంతే // ( 9 .21 )

కోరికలు అనేకం కలవారు, యజ్ఞాది కర్మల ద్వారా స్వర్గలోకములోని భోగములను అనుభవించి, పుణ్యము క్షీణించిన, తిరిగి మనుష్యలోకంలో పుడతారు. కేవలం కర్మల వలన పుణ్యం సంపాదించి, మోక్షం పొందజాలరు. యోగనిష్ఠ వలననే బ్రహ్మైక్యం పొందగలరు.   


అనన్యాశ్చిన్తయన్తో మాం ఏ జనా : పర్యుపాసతే 

తేషామ్ నిత్యాభి యుక్తానాం యోగక్షేమం వహామ్యహం. // ( 9 . 22 )

కోరికలను త్యజించినవారు, నన్ను తమకంటే వేరుగా చూడరు. తమఆత్మగా నన్ను సర్వ వేళలా భావిస్తూ ఆరాధిస్తారు. అట్టివారి యోగక్షేమాలను నేను చూసుకునే బాధ్యత వహిస్తాను.  


కిమ్ పునర్బ్రాహ్మణా: పుణ్యా భక్తా రాజర్షయస్తథా

అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మాం // ( 9 . 33 )

పుణ్యాచారణ కలిగి సదాచారులైన బ్రాహ్మణులూ, భక్తి భావం కలిగిన రాజర్షులు గానీ, నాన్నాశ్రయించి ఉత్తమగతి పొందుదురని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.  

శాశ్వతం కాని, తాత్కాలిక సుఖాన్ని యిచ్చే ఈ మనుష్యలోకంలో జన్మించినందుకు నన్ను భజించి, నన్ను చేరుకునే ప్రయత్నం చెయ్యి.


దశమాధ్యాయం విభూతియోగం.


మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంత: పరస్పరం 

కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్తిచ రమన్తిచ // ( 10 . 9 )

చిత్తము నాయందే నిలిపి ఇంద్రియములు నాలో లీనమొనర్చి, జన సమూహములలో నాగురించి బోధిస్తూ, సత్కాలక్షేపంతో , సత్సంగాలతో వుండువారు యెంతో తృప్తిగా ఆనందభరితులై జీవింతురు


అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత : 

అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవచ // ( 10 . 20 )

ఇంద్రియాలను జయించిన ఓ అర్జునా ! అన్ని ప్రాణులలో వుండే ఆత్మను నేనే. సర్వ జీవుల జననము, పెరుగుదల, అంతము అన్నీ నేనే. నా యోగ మహిమచే, ఒకడినే, పెక్కు స్వరూపాలుగా భాసిస్తూ వున్నాను.

ఆదిత్యులలో నేను విష్ణువును. జ్యోతిశ్చక్రమున సూర్యునిగా వున్నది నేనే. దేవతలలో శ్రేష్ఠుడైన మరీచిని నేనే. నక్షత్రములలో చంద్రుడను నేనే. వేదములలో సామవేదము, దేవతలలో ఇంద్రుడు, ఇంద్రియములలో మనస్సును, ప్రాణులలో చైతన్యము నేనే. రుద్రులలో శంకరుడను. యక్షులలో కుబేరుడను. వసువులలో పావకుడను. పర్వతములలో మేరు పర్వతాన్ని.  

పురశ్రేష్ఠులలో బృహస్పతిని, సేనానులలో కుమారస్వామిగా, నీటి సమూహములలో సముద్రునిగా నన్ను యెరుంగుము. మహర్షులలో భృగుడను. అక్షరాలలో ఓంకారాన్ని. యజ్ఞాలలో మానసిక యజ్ఞాన్ని. పర్వతములలో హిమ పర్వతాన్ని. వృక్షములలో రావి చెట్టును. దేవఋషులలో నారదుడను. గంధర్వులలో చిత్రరధుడను. సిద్ధులలో కపిలమునిని. 


గుఱ్ఱములలో అమృతంతో పాటు పుట్టిన ఉచ్చయిశ్రవాన్ని. ఏనుగులలో ఐరావతాన్ని. నరులలో చక్రవర్తిని. ఆయుధములలో వజ్రాయుధాన్ని. గోవులలో కామధేనువును. సంతానకారకుడైన మన్మధుడను కూడా నేనే. నేనే విష సర్పములలో వాసుకిని. నాగులలో అనంతుడిని. జలదేవతలలో వరుణుడను. పితృ దేవతలలో ఆర్యముడను. దిక్పాలకులలో యముడను.  

రాక్షసులలో ప్రహ్లాదుడను. కాల పురుషుడను నేనే. మృగాలలో సింహాన్ని. పక్షులలో గరుడపక్షిని. పవిత్రత కలిగించే సాధనాలలో వాయువును నేను. ఆయుధాలు ధరించే వారిలో రాముడను నేనే. మత్స్యములలో మొసలిని నేను. నదులలో గంగానదిని నేను. విద్యలలో ఆత్మవిద్యను నేను. తర్కం చేసే వాళ్లలో వాదపటిమను నేనే. 

అక్షరములలో ఆకారమును. సమాసములలో ద్వంద్వ సమాసమును. అనంతమగు కాలము కూడా నేనే. అభ్యుదయం, స్త్రీలలో కీర్తిని, సిరిని, వాక్కును, జ్ఞాపక శక్తిని, తెలివిని, ఓర్పును కూడా నేనే. 


ఛందస్సులో గాయతీ ఛందస్సు నేనే. మాసములలో మార్గశీర్ష మాంసమును నేనే. ఋతువులలో వసంత ఋతువును నేనే. అంతెందుకు. స్థావర జంగములలో ఏది కూడా నా అంశలేకుండా మనజాలదు.


అర్జునా ! నా దివ్యవిభూతులు అనంతములు. పైన నేను చెప్పినదంతా, సంక్షిప్తము మాత్రమే. ఎక్కడ సంపద, శక్తి కలిగిన వస్తువుండునో, అక్కడ నా అంశకలదని తెలుసుకొనుము.

 

స్వస.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు


🙏🙏🙏

స్వస.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.


🙏🙏🙏

సౌందర్య లహరి**

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఇరవైనాల్గవ శ్లోక భాష్యం - మొదటి భాగం


జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే

తిరస్కుర్వ-న్నేతత్ స్వమపి వపు-రీశ-స్తిరయతి !

సదా పూర్వః సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివ-

స్తవాఙ్ఞా మలంబ్య క్షణచలితయో ర్భ్రూలతికయోః !!


అమ్మా! నీ లతలవంటి కనుబొమల కదలికనుండి ఆజ్ఞను స్వీకరించి బ్రహ్మ ప్రపంచమును సృష్టించును. విష్ణువు పాలించును. రుద్రుడు సంహరించును. ఈశ్వరుడు వారిని తనలో లయము చేసుకొనుచూ తాను కూడా లయమవుచున్నాడు. సదా అన్న శబ్దము మొదలుగా కలిగిన శివుడు సర్వమును మరల అనుగ్రహించుచున్నాడు.


రెండవశ్లోకంలోనే ఆచార్యులవారు బ్రహ్మవిష్ణు రుద్రుల విధుల గురించి ప్రస్తావించారు. ఇక్కడ కూడా ఆ విషయాన్ని పునః ప్రస్తావిస్తున్నారు. “జగత్సూతే విధాతా బ్రహ్మ ఈ లోకములను పుట్టిస్తున్నాడు". “హరిరవతి” విష్ణుమూర్తి రక్షిస్తున్నాడు. “రుద్రః నీ క్షపయతి” రుద్రుడు సంహారం చేస్తున్నాడు. ఆచార్యుల నీ వారీ శ్లోకంలో పంచక్రియలలో మిగతా రెండు కార్యములను, చేసే దేవతలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకడు ఈశ్వరుడు. 'ఈశస్తిరయతి' ఈశ అన్న ఈశ్వరుడన్న ఒకటే - ఈయన తిరోధాన కార్యము అంటే త్రిమూర్తులతో సహా ఈ సర్వాన్నీ మాయలో ముంచెత్తుతాడు. 'తిరయతి' అంటే కప్పి ఉంచటం మాయతో కప్పిఉంచడమన్న అర్థం. ఈశ్వరుడు పాలించే వాడని ఈతడు అంబిక పంచాక్రియల నిర్వహణకు నియమించిన అధికారులలో ఒకడు మాత్రమే! నిజమైన యజమాని అంబిక, పరాశక్తి. ఆమె అయిదుగురు అధికారులను నియమించి, వారిచేత పని చేయించుతున్నది.


పనిచేయిస్తున్నదంటే మెమోలు, సర్క్యులర్లు పంపుతున్నదా లేక మౌఖికమైన ఉత్తర్వులు జారీచేస్తున్నదా? మహారాజ్ఞి అయిన ఆ తల్లి ఇంతటి చిన్న చిన్న విషయాలకై అంత శ్రమ తీసుకోనవసరం లేదు. ఆమె వద్దనుండి చిన్న సూచన లభిస్తే చాలు ఈ అధికారులు మెరుపువేగంతో పనిచేస్తారు. ఆమె తన లతలవంటి కనులతలను క్షణకాలం కదపడం వంటి చిన్న సంజ్ఞ చేస్తేచాలు. “క్షణ చలితయో గ్ర్భూలతికయోః" - ఆ సంజ్ఞనే ఆమె ఆజ్ఞగా గ్రహించి “ఆజ్ఞామాలభ్య” ఈ పంచక్రియలు నిర్వహించడానికి ఆమెచే ఏర్పాటు చేయబడిన దేవతలు వారి వారి విధులు చేయడానికి శీఘ్రగతిని సాగిపోతారట.


మొదటి శ్లోకంలో అంబిక సర్వోన్నతమైన స్థితిలో అభివర్ణించబడింది. అక్కడ త్రిమూర్తులు ఆమె భక్తులు - ఆమె వారి ఆరాధ్యదైవం. ఇక్కడ రాచరికపు మర్యాదలు, హంగులు చూపబడినా వారితో ఆమె సంబంధం ఒక యజమాని, సేవకుల మధ్యనుండే సంబంధం వంటిదే! మరి ఆరాధ్యదైవం కంటే యజమాని స్థితి కొంచెం నిమ్నమైనదే కదా?


సరి! ఆమె పరిజనులలో తిరోధాన కార్యం నిర్వహించే ఈశ్వరుడొకడు. సమస్త విశ్వాన్ని, త్రిమూర్తులను మాయా బద్దులను చేసి ఉంచేది నేనేకదా అని ఆయన అనుకుంటూ ఉండవచ్చు. అందుకే ఆయన మహోన్నతుడైన దైవతమని సూచించే ఈశ్వర నామము వచ్చింది. “తిరస్కుర్వన్నేతత్" త్రిమూర్తులను కూడా మాయా బద్దులను చేస్తాడని చెప్పబడింది. “స్వమపి వపుః ఈశస్థిరయతి”. అంతేకాదు, తానేమి చేస్తున్నాడో తెలియక తనుకూడా మాయాబద్దుడై కప్పబడతాడట. అతని శక్తి నైపుణ్యములు అంబిక అనుగ్రహం. తన మాయచేతనే తాను కప్పబడేవాడు ఈశ్వరునిగా పిలవ బడటంలో హేతువులేదు. అంబికే నిజమైన ఈశ్వరి. ఆయనను ఆ పేరు ధరించనీయడం అంబికయొక్క పెద్దమనసు.

**దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఇరవైనాల్గవ శ్లోక భాష్యం - రెండవ భాగం


అయిదుగురు అధికారులలో నలుగురిని చూశాము, ఇక అయిదో అధికారి అనుగ్రహం చేస్తూ ఉంటాడు. అంబిక - ఈశ్వరుని ఉదాహరణ చూసిన తరువాత ఈయన ఇంకొక మెట్టు పెద్దదైన పేరుపెట్టు కొంటాడోమో! నాకంటే ఉన్నతుడునని సూచించే పేరుపెట్టుకోవచ్చు. అయితే నాకంటే ఉన్నతు లేవరూ లేరే? సములు ఎవరైనా ఉన్నారా అంటే అది నాపతి అయిన శివుడు మాత్రమే! మేమిద్దరమే ఈ పంచకృత్యాలు నిర్వహించే అధికారుల కంటే ఉన్నతులము. ఇప్పుడు ఈ అయిదవ అధికారి ఏమిపేరు పెట్టుకొంటాడో - అని ఆలోచించి నట్లుంది. ఆ అయిదో అధికారిని పిలిచి “నీ పేరు నీవే ఎన్నుకోవచ్చు. అయితే, శివుడనే పేరుమాత్రం పెట్టుకోవద్దు” అని శాసించినట్లుంది.


పెరుమాళ్ళు కింద ఎంతో భక్తిగల ఒక వైష్ణవ భూస్వామి వద్ద ఒక సేవకుడు ఉన్నాడు. ఒక రోజు ఆ యజమాని అతనిని “నీపేరేమిటి” అని అడిగినాడు. ఆతడు “పెరుమాళ్ళు” అని సమాధానం చెప్పాడు. "ఆ! ఒక సేవకుడు స్వామి నామంతో పిలవబడటమా? ఎంతటి అపచారం” అనుకొని ఆ భూస్వామి సేవకుని పెరుమార్చుకుని గాని పనిలోకి రాకూడదని చెప్పాడు. మరి దానికి చాలా ఖర్చు అవుతుంది. గ్రామపెద్ద కార్యాలయానికి వెళ్ళాలి. మేకనో కోడిపుంజునో బలి ఇవ్వాలి. చాలా ఖర్చవుతుంది. యజమాని ఆ ఖర్చు భరించడానికి ఒప్పుకుని బదులిచ్చాడు. ఆయనకు కావలసింది తాను సేవకుని తన ఆరాధ్యదైవమైన పేరుమాళ్ళు పేరుతో పిలవరాదనిమాత్రమే! పేరు మార్చుకొని వచ్చిన తరువాత యజమాని ఇప్పుడు “నీపేరేమిటి?” అని అడిగాడు. ఆ సేవకుడు “పెద్ద పెరుమాళ్ళు” అని చెప్పాడు. తమిళంలో “పెరుమాళ్ళు తరువాత పెద్ద పెరుమాళ్ళు” అన్న సామెత ఉన్నది.


తమిళంలో “పెరుమాళ్ కోయిల్” అంటే కాంచీపురం. ఒట్టిగా “కోయిల్” అంటే అది శ్రీరంగం. వైష్ణవులు రంగనాథుని ‘పెరియ పెరుమాళ్” అంటారు. “పెద్ద పెరుమాళ్ళు” అన్నా మరి ఇదే! తమిళదేశం చాలాకాలం తెనుగుల పాలనలో ఉన్నది. అందువల్లనే తమిళంలో చాలా తెలుగు పదాలుంటాయి. వాటిలో ఈ “పెద్ద” అన్న పదం ఒకటి. ఆచార్యులవారు ఆ అధికారి తన నామం సదా అన్నపదం ముందు చేర్చబడ్డ శివునిగా అంటే సదాశివునిగా పెట్టుకొన్నదని చెబుతున్నారు. “సదాపూర్వశివ”. కానీ ఆచార్యులవారు సదాశివుడని చెప్పక ఈ రకంగా చెప్పడం ఎందుకు? కొంటెతనం. చమత్కారం కోసం. అంబిక అమ్మ. ఏదో సందర్భంలో ఆమెను ఎగతాళి పట్టించడంలో ఒక ఆనందం ఉంది. ఆవిడ ఆ అధికారితో శివుని పేరుతప్ప ఏదైనా పేరు పెట్టుకోమందనుకోండి. ఆతడు సదా - నిత్యము, ఎల్లప్పుడూ అనే శబ్దంతో చేర్చిన శివుని పేరు పెట్టుకొన్నాడు. ఒకడు ఎల్లపుడూ శివుడయితే ఇక పేరు మార్చేదెలా? అంబిక విస్తు పోవడాన్ని ఆచార్యులవారు ఒక చమత్కారమైన మలుపుతో చెబుతామనుకొన్నారు. ఎంతో సున్నితంగా “సదాపూర్వశివు” డని చెప్పి పాఠకులలో ఒక ఉత్సుకతను రేకెత్తించి సమాధానం వెతుక్కొనేలా చేశారు. ఇలా చేయడం వల్ల పాఠకుల మనసుల్లో కథపైన లోతయిన ముద్ర ఉంటుంది. సదాశివుడని చెపితే ఇంత ఆలోచించాల్సిన అవసరమే ఉండదుకదా! ఈ రకంగా అమ్మవారిని పల్టీకొట్టించి 'సదాశివుడు' పేరు పెట్టుకొన్న అధికారి తన అనుగ్రహకార్యాన్ని అంబిక కనుసన్నల మేరకు జరుపుతూఉంటాడు. 


ఈ శ్లోకంలో అంబిక యజమానిగానూ, శివుడు తన రుద్ర, ఈశ్వర, సదాశివ రూపంలో సేవకులుగానూ అభివర్ణించ బడినాడు.


(సశేషం)


కృతజ్ఞతలతో 🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

(సశేషం)


కృతజ్ఞతలతో 🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

శ్రీమన్నారాయణీయం

 **దశిక రాము**


**శ్రీమన్నారాయణీయం**


**1-2-6-శ్లో.**


ఏవంభూతమనోజ్ఞతా నవసుధానిష్యందసందోహనం

త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతామ్।

సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమాంచ యత్యంగకం

వ్యాసించత్యపి. శీతబాష్పవిసరైరానందమూర్ఛోద్భవైః||


భావము: సౌందర్యామృత మయమైన నీ రూపము బహు మనోజ్ఞమైనది. నిత్య నూతనమైనది. అట్టి నీ స్వరూప ఆకర్షణతో ప్రేరేపింపబడిన భక్తుల చిత్తములు పరతత్వ జ్ఞానానందము పొందుతాయి. వారి శరీరములకు గగుర్పాటు కలిగి, ఆనందభాష్పములతో పులకితులవుతారు.


వ్యాఖ్య - మనలను ఈ లోకానికి బంధించేది మనస్సు. మనస్సు వామనాడియైన ఇడానాడి అధీనములో ఉన్నది. దానిని ఆధారముగా చేసుకుని కూడా పైకి వెళ్ళవచ్చును. లోకములో అనేక వస్తువులపై పెంచుకునే మోహమును పరమేశ్వరునియందే పెంచుకొనవచ్చును. అన్నికోరికలు తీరుటకు ఆయననే ఆరాధింపవచ్చును. మధురమైన పాయసమును త్రాగితే కలిగే సంతృప్తిని ఆయనే ఈయగలడు. ఆయన చూపించేది ముక్తి మార్గమే అవుతుంది. 


అటువంటి స్థితికి చేర్చే భక్తి ఎలా ఉండాలో భాగవతంలో వచ్చే ప్రహ్లాదుడి మాటల్లో చూద్దాం.


 "దేవతలూ, సిద్ధులూ, మునీశ్వరులూ, బ్రహ్మదేవుడు మున్నగువారు ప్రగాఢమైన కాంక్షతో నిన్ను నిత్యం అనేక విధాలుగా ఆరాధిస్తారు; నీ గుణాలను గానం చేస్తారు; కాని సంపూర్ణంగా నిన్ను తెలుసుకుని సమగ్రంగా నిన్ను అభివర్ణించలేరట! నేనేమో దైత్యునికి పుట్టినవాడిని; గర్వ మద స్వభావిని; చిన్నపిల్లాడిని; మూర్ఖుడిని; మరి నిన్ను కీర్తించటం నాకెలా సాధ్యం అవుతుంది?


ఓ నారసింహా! గొప్ప గొప్ప జపతపాలు, సద్వంశమూ, తేజస్సూ, వేద నైపుణ్యాలూ, సౌందర్యాలు, గట్టి నిష్ఠలూ, సత్కార్యాలు చేసే నైపుణ్యాలు, పరాక్రమాలూ, పౌరుషాలు, నైష్ఠికాలూ, శక్తిసామర్థ్యాలూ, హోమాలూ యజ్ఞాలూ మొదలైని ఏవీ కూడ నిన్ను సంతోషపెట్టటానికి సరిపోవు. 


పూర్వం గజేంద్రుడు భక్తితో నిన్ను మెప్పించి మె

మోక్షం సాధించాడు కదా. నిన్ను మెప్పించటానికి అలాంటి భక్తి తాత్పర్యాలు అలవరుచుకోవాలి.


దానం, నీతి, సత్యం, క్షాంతి, ఈర్ష్య లేకపోవుట, యజ్ఞాలు, తపశ్శక్తి, అసూయ లేమి వంటివి ఎన్ని ఉన్నా గర్విష్ఠి అయిన బ్రాహ్మణుని కంటె త్రికరణసుద్ధిగా సమబుద్ధితో నిన్ను సేవించే చండాలుడు ఉత్తముడు. అట్టివాడు నీ సాన్నిధ్యాన్ని పొంది తన వంశం మొత్తానికి శోభ కలిగిస్తాడు.


భగవానుడు అజ్ఞానులు చేసిన భక్తిని స్వీకరించడు. కాని ఆయన దయాసముద్రుడు కనుక కొందరు అజ్ఞానులు చేసిన ఆరాధనలను కూడా స్వీకరిస్తాడు. ఆయన పరిపూర్ణుడు కనుక భక్తులు చేసే భక్తివలన భగవంతునికి ఏ ప్రయోజనమూ లేదు. అయినా సర్వ కార్యాలు భగవదర్పణంగా చేయవలెను, అలా చేస్తే అద్దంలో నుదుటి బొట్టు కనబడినంత స్వచ్ఛంగా, సర్వ కార్యాలు ప్రయోజనాలు చేకూరుతాయి. 


భగవంతుడు హరి దయామయుడు, భక్తుల ఎడ బందువాత్సల్యం గలవాడు. ఆయన భక్తిని తప్ప మరి దేనిని మెచ్చడు అందుచేత విష్ణుభక్తి విడువక చేయవలెను.


శ్రీహరీ! మానవుడు కేవలం నీ గుణాలను కీర్తించటం ద్వారా అవిద్యను జయించి కైవల్యాన్ని అందుకుంటాడు.


భగవంతుడా! ప్రతీ జన్మలోనూ సుఖానికి వియోగం, దుఃఖానికి సంయోగం కలుగుతూనే ఉంది. దానితో నా కెప్పుడూ శోకమే ప్రాప్తిస్తూ ఉంది. ఈ శోకాగ్ని నన్నెప్పుడూ నిలువునా కాల్చివేస్తూ ఉంది. సుఖం ఇవ్వదని తెలిసినా, ఈ దేహం మీద అభిమానం వదలటంలేదు. అలా ఆ మోహంతో తిరుగుతున్నాను. అటువంటి నాకు ప్రియుడవు, సఖుడవు, పరదేవతవు సర్వం నీవే. నీ లీలావతారాలే బ్రహ్మగీతాలు. వాటినే నిత్యం పఠిస్తూ కోరికలనుండి విముక్తి పొంది, దుఃఖాలను అధిగమించి నీ పాదపద్మాలను సేవించే భక్తులతో కలిసి ఉంటాను.


చంటిపిల్లాడిని తల్లిదండ్రులూ, రోగిని వైద్యుడు ఇచ్చే ఔషధమూ, సముద్రంలో మునిగిపోతున్న వాడిని నావ ఎలాగైతే రక్షిస్తారో, అలాగే ఈ సంసార తాపత్రయాలతో తప్తులైన వారిని నీవే తప్ప మరెవరు రక్షించలేరు. నీచేత ఉపేక్షింపడిన వానిని, నువ్వు తప్ప మరెవ్వరూ ఉద్ధరించలేరు. 


లోకంలో ఎవడు, ఏ కార్యం, ఎవరి ప్రేరణతో, ఏ ఇంద్రియాల వలన, దేని కోసం, ఎవరికి సంబంధించి, ఏ స్థలంలో, ఏ సమయంలో, ఏ రూపంలో, ఏ గుణం వలన నెరవేరుస్తాడో; ఇహలోకంలో జనకభావానికీ, పరలోకంలో బ్రహ్మభావానికీ రూపాంతరం పొందించే ఆ వివిధ ప్రకారాలూ నీవే. సమస్తమూ నీవే, నీవు నిత్యముక్తుడవు. సత్యరక్షకుడవు.

నీ అంశయైన పురుషునిలో నీ అనుగ్రహం వలననే కాలప్రేరితమూ, కర్మమయమూ, బలయుతమూ, ప్రధానలింగమూ అయిన మనస్సును, నీ మాయ సృష్టిస్తుంది. 


ఈ మనస్సు అవిద్యాజనకమైన వికారమూ, వేదోక్తకర్మ ప్రధానమూ, సంసారచక్రాత్మకం అయినది. ఇలాంటి మనస్సుతో నిన్ను సేవించకుండా తరించగల సమర్ధుడు ఎవడూ లేడు. 


నువ్వు విజ్ఞానం చేత బుద్ధిగుణమును జయించిన వాడవు. కార్యకారణ శక్తినీ కాలం నీ వలననే వశం చేసుకుంటుంది, ఈ కాలం మాయతో కూడి పదహారు విధాలైన వికారాలతో కూడిన సంసార చక్రమును నిర్మించి, త్రిప్పుతూ ఉంటుంది, నేను ఈ సంసార దావానలంలో పడిమాడిపోతున్నాను లోకరక్షామణీ! రక్షించు!


ప్రజలు సిరి సంపదలూ, ఆయురారోగ్యాలు, వైభవమూ వంటి వాటినే దివ్యమైనవి అనుకుంటారు, వాటిని ఆశించి దిక్పాలకాదులను కొలుస్తారు. మా తండ్రి హిరణ్యకశిపుడు కోపంతో చూసే కడగంటి చూపుతో చెలరేగే భృకుటి ముడి మాత్రం చేతనే, ఆ దిక్ప


ాలురు వణికిపోతారు. అంతటి మహాశూరుడు ఒక్క నిమిషంలో నీ చేతిలో ఇవాళ మరణించాడు. కనుక బ్రహ్మాది రూపధారుల వైభవాలు, సిరిసంపదలు, జీవితాలు ఏవీ శాశ్వతాలు కావు. ఇవన్నీ కాలరూపంలో మెదులుతుండే విష్ణుమూర్తీ! నీ చేతిలో నశించిపోతాయి. ఇవేమీ నాకు వద్దు. నీ మీద కొద్దిగా భక్తి, జ్ఞానం కుదిరాయి. కాబట్టి, నేను నిత్యం సేవకుడిగా నిన్ను సేవిస్తాను.


ఎండమావుల వంటివి ఈ సుఖాలూ, భోగాలూ. మనిషి ఇవే జీవిత పరమావధి అనుకుంటాడు. తన దేహం దుఃఖ భూయిష్ఠం, రోగగ్రస్తం అయినా సరే, విరక్తి పొందడు. ప్రజ్వలించే కామాగ్నిలో పడి తపించిపోతూ ఉంటాడు. అట్టివాడు ఈ దుష్టసౌఖ్య పరంపరలకు లోబడిపోయి ఎన్నటికీ తీరం చేరలేడు.


ప్రభూ! లక్ష్మీ పతి! నరసింహా! పద్మంలో పుట్టిన ఆ బ్రహ్మదేవుడికి అయినా సరే నీ చెయ్యెత్తి తలమీద పెట్టి అభయం ఇవ్వలేదు. నేనేమో చిన్న పిల్లాడిని; తామసగుణంతో కూడిన రాక్షసవంశంలో పుట్టిన వాడిని; దైత్యుడిని; ఉగ్ర మైన రజోగుణం కలవాడను; అలాంటి నా తల మీద, అవ్యాజ్యమైన కృపతో నీ ది వ్య భవ్య హస్తాన్ని ఉంచి దీవించావు. ఇది నాకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. స్వస్తి.


🙏🙏🙏

శ్రీ శివ మహా పురాణం

 **దశిక రాము**


**శ్రీ శివ మహా పురాణం**


24  by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


మార్కండేయ చరిత్ర


పూర్వకాలంలో మృకండుడు అనబడే ఒక మహర్షి ఉండేవాడు. గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణయందు ఆయన, ఆయన భార్యయైన మరుద్వతి ఇద్దరూ కూడా బహుశ్రద్ధ పూనిక ఉన్నవారు. వీళ్ళిద్దరూ హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక ఆశ్రమమును నిర్మితం చేసుకుని తల్లిదండ్రులతో, శిష్యులతో అక్కడ నివసిస్తున్నారు. ఆవులనన్నిటినీ చేరదీసి కాపాడుతూ ఆ ఆవుపాలతో శివార్చన చేస్తూ ఆయన ఈలోకమునందు ప్రకాశిస్తున్నాడు. మరుద్వతి ఎంతో సంతోషంతో అత్తమామలకు సేవ చేసేది. భర్తను సేవించేది. శిష్యులను తల్లిలా కాపాడేది. వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో తమ జీవితమును పండించుకుని అందరికీ కామధేనువై కల్పవృక్షమై తమ జీవితమును నడుపుతున్నా వారికి బిడ్డలు కలుగలేదు. ఆ సాకుతో వారు శివార్చన మాత్రం మానలేదు. ఈశ్వరుడిస్తాడని పూనికతో వారు శివార్చన చేస్తున్నారు.

ఇలా ఉండగా ఒకరోజు మృకండుడు బ్రహ్మ ఉండే అంతఃపురప్రదేశమునకు వెళ్ళి బ్రహ్మగారి సభలోనికి ప్రవేశించడం కోసం మిగిలిన ఋషులతో పాటుగా లోపలికి వెడుతున్నాడు. అపుడు ఆయనను అక్కడ ఉండే ద్వారపాలకులు మీరు వెళ్ళకూడదు అని అడ్డుపెట్టారు. ఆయన ఆశ్చర్యపోయి ‘నేను ఎందుకు వెళ్ళకూడదు?” అని ప్రశ్నించారు. ‘మీకు సంతానం లేదు. అందువల్ల మీకు బ్రహ్మ సభా ప్రవేశార్హత లేదు’ అన్నారు. మృకండుని అవమానించడం వారి ఉద్దేశం కాదు. శాస్త్రవాక్కు ఒకటి ఉన్నది. సంతానం లేకపోతే పితృ ఋణం తీరదు. ఎవరయినా వివాహం చేసుకోక బ్రహ్మచర్యంలోనే ఉండిపోతే ఇలాంటి బిడ్డలను కన్నారు కాబట్టి ఆ బిడ్డల తల్లిదండ్రులను తిరగేసి చెట్లకు కట్టేస్తారు. దేవీ భాగవతంలో దీనికి సంబంధించి ఒక కథ ఉంది. అందుకే నేను పెళ్లి చేసుకోను అనరాదు. చేసుకుని తీరాలి. ఇక్కడ మృకండునికి పితృ ఋణం తీరలేదు. అది దోషం. మృకండు మహర్షి ధర్మ సూక్ష్మం తెలిసిన ఉన్నవాడు. ‘నాకు అనపత్య దోషం ఉంది’ అని మనస్సులో కొంచెం బాధపడుతూ ‘అయ్యో నన్ను ఎందుకు ఈశ్వరుడు పితృ ఋణం నుంచి విముక్తుడిని చేయలేదు’ అని బెంగ పెట్టుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. అదే సమయంలో వేరొక ప్రదేశంలో ఉండే మహర్షుల భార్యలు అక్కడి ప్రదేశంలో ఉండే తపోవనములను దర్శించడం కోసమని వచ్చారు. వారు మరుద్వతిని చూసి చాలా సంతసించి ‘అమ్మా మేము చాలా దూర ప్రాంతం నుంచి ఇక్కడ ప్రదేశములను చూడడానికి వచ్చాము. మాకు కొంచెం దేవతార్చనకు అవకాశం ఇవ్వగలవా’ అని అడిగారు. అపుడు ఆవిడ మీరందరూ తప్పకుండా రండి’ అని వారందరినీ పిలిచి పంచభక్ష్య పరమాన్నాలతో చక్కటి భోజనం తయారుచేసి వాళ్ళకి భోజనం వడ్డించింది. అపుడు వాళ్ళు ‘అమ్మా, అలా మేము ఒక్కళ్ళం భోజనం చేయము మేమూ తల్లులమే కదా! నీ బిడ్డలను పిలు. నీ బిడ్డలు కూడా ఇక్కడ కూర్చుంటే మేము నివేదన చేసుకుని స్వీకరిస్తూ తత్ప్రసాదమును వారి చేతిలో కూడా ఉంచుతాము. ఆ పిల్లలతో కలిసి తినాలని మాకు కోరికగా ఉంది. నీ బిడ్డలను పిలువవలసినది’ అన్నారు. అపుడు మరుద్వతి ‘అమ్మా నేను తక్కువ నోములు నోచాను. నా నోములు ఫలించలేదు. నాకు బిడ్డలు లేరు. మీవంటి తపస్వినులు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో అన్నం తిన్న పుణ్యం చేత నాకడుపు పండుతుందని అనుకుంటున్నాను. దయచేసి స్వీకరించండి’ అంది. అపుడు వాళ్ళు ‘అమ్మా, ఏమీ అనుకోవద్దు. పురుషుడు పితృ ఋణం తీరడం కోసమే సంతానమును అపేక్షించే క్షేత్రముగా భార్యను స్వీకరిస్తున్నాడు. మీరు గృహస్థాశ్రమంలో ఎందుకు ప్రవేశించారో తత్ఫలాన్ని ఇప్పటికీ పొందలేక పోయారు. కాబట్టి అలా బిడ్డలు లేని ఇంట మేము భోజనం చేయము’ అని చెప్పి వారు వెళ్ళిపోయారు. అపుడు మరుద్వతి ఎంతో బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంది.ఆసమయంలో మృకండు మహర్షి కూడా బాధపడుతూ ఇంటికి వచ్చాడు. ఆయన భార్యను నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగారు. జరిగిన విషయం చెప్పింది ఆవిడ. అపుడు ఆయన కన్నుల కూడా నీరు కారింది. సంతానం కలుగకుండా గల దోషం పరిహరింప బడడం ఈశ్వరానుగ్రహంగా ఉంటుంది. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యుని అనుగ్రహం మీదనే వంశవృద్ధి ఆధారపడి ఉంటుందని శాస్త్రవాక్కు. అందుకే సుబ్రహ్మణ్యారాదన అంత గొప్పది. ఆయన పూజ తద్దోషమును పరిహరిస్తుంది. అపుడు మృకండుడు అన్నాడు “అయ్యయ్యో మరుద్వతీ, ఏక కారణమునకు ఇద్దరమూ గురయ్యాము. దేవీ, నువ్వు బాధపడకు. ఈశ్వరుడు ఉన్నాడు. నేను ఆయన గూర్చి తపస్సు చేస్తాను, బయలుదేరుతున్నాను” అని నీ తపస్సు చేసుకోవడం కోసమని బయలుదేరి ఒక మారేడు వనమునందు శివలింగమును ప్రతిష్ఠించి దానికి రోజూ అర్చన చేస్తూ తపస్సు చేస్తున్నాడు. మరుద్వతి తపస్సు చేస్తున్న భర్త గారికి అన్నీ అందిస్తూ ఆయన క్షేమమును విచారిస్తూ తాను కూడా ఖాళీ సమయంలో పరమేశ్వరారాధన చేస్తోంది. వీరిద్దరూ ఇలా తపస్సు చేస్తున్నా శంకరుడు ప్రత్యక్షం అవలేదు.

నారదమహర్షి కైలాసమునకు వెళ్ళి శంకరుని చూసి ‘తండ్రీ, నిన్ను నమ్మి ఆ దంపతులిద్దరూ తపస్సు చేస్తున్నారు. ఇలా పిలిస్తే పలికేవాడివి.వారినింకా ఎన్నాళ్ళు పరీక్షిస్తారు’ అన్నాడు. శంకరుడు మహర్షికి ప్రత్యక్షమై నీకు పదహారేళ్ళ వయసు ఉండే కుమారుడు జన్మిస్తాడని వరమిచ్చాడు. కుమారుడు పుట్టాడు. మార్కండేయుడని పేరు. ఆ దంపతులు, కుమారుడు కూడా పరమేశ్వర భక్తితో కాలం గడుపుతున్నారు. ఇలా గడిపేస్తుండగా ఒకరోజు నారదమహర్షి అక్కడికి వచ్చారు. మృకండు దంపతులు మహర్షికి అర్ఘ్యపాద్యాదులు సమర్పించారు. నారదుడు మృకండునితో ‘మృకండా, నీకు ఒక్క విషయం జ్ఞాపకం ఉందా? ఈ పిల్లవానికి పదిహేనవ సంవత్సరం వెళ్లి పదహారవ సంవత్సరం వచ్చింది. అది కూడా కొద్ది రోజులలో అయిపోబోతోంది. ఆనాడే ఉపద్రవం కూడా వచ్చేస్తుంది. ఇలాంటి పిల్లవాడికి ఏదయినా జరగరానిది జరిగితే మీరు తట్టుకోగలరా! ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతోంది కదా’ అన్నాడు. నారదుడు ఈమాటలు చెప్పగానే మరుద్వతి ఏడుస్తోంది. ఇంత తపో నిష్ఠా గరిష్టుడయిన మృకండుడు కూడా దుఃఖమును ఓర్చుకోలేక క్రిందపడి దొర్లి ఏడుస్తున్నాడు. ఇంతలో మార్కండేయుడు గబగబా లోపలికి వచ్ఛి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు. వాళ్ళు ఉన్న సత్యమును ఎరుకలో పెట్టారు. పిల్లవాడు మాత్రం ఏ విచారమూ లేకుండా నవ్వుతూ నిలబడి ఉన్నాడు. అపుడు నారదుడు వాడి భక్తి, వాడి విశ్వాసం వాడి ధృతి వాడి ధైర్యం చూశారా! మీరు ఏ తపస్సు చేస్తే వాడు పుట్టాడో ఇప్పుడు వాడే తపించగల శక్తితో ఉన్నాడు. వాడే శివుడున్నాడు, రక్షించి తీరుతాడనే పూనికతో ఉన్నాడు. కాబట్టి మీరు కూడా శివార్చనను పెంచండి. తపస్సు మొదలుపెట్టండి. మొట్టమొదట వీనిని హిమాలయ పర్వత ప్రాంతములకు పంపించి వీనిని అక్కడ కూర్చోపెట్టి తపస్సు చేయమని చెప్పండి. ఎ శంకరుడు వీనిని ఇచ్చాడో ఆ శంకరుడు వేడిని రక్షిస్తాడో రక్షించడో తేలిపోతుంది. పిల్లాడిని పంపండి’ అన్నాడు. అపుడు మార్కండేయుడు “నన్ను అనుమతించండి. నేను దీర్ఘాయుష్మంతుడనవ్వాలని ఆశీర్వచనం చేయండి. శంకరుని గూర్చి తపస్సు చేస్తాను. నాకు ఆ మహానుభావుడు సిద్ధిని ఇస్తాడు. మీరేమీ బెంగ పెట్టుకోకండి’ అని చెప్పి పిల్లవాడు వెళ్ళిపోయాడు. అలా వెళ్లి హిమాలయ ప్రాంతమందు ఒక శివలింగమును తయారు చేసి దానికి చిన్న దేవాలయం లాంటిది నిర్మించి అక్కడ కూర్చుని తపస్సు మొదలు పెట్టాడు.

సమయం ఆసన్నమయింది. అక్కడ యమలోకంలో యమ ధర్మరాజు దూతలను పిలిచి మార్కండేయుడిని పాశములచేత బంధించి ఈ లోకమును చేరండి’ అని చెప్పాడు. యమదూతలు వెళ్లి పాశం వెయ్యడానికి భయం వేసి యమలోకానికి తిరిగి వెళ్ళిపోయారు. అపుడు యమధర్మరాజుకు ఎక్కడలేని కోపం వచ్చి నేను బయలుదేరి వెడతాను. నాకు ఏమగాడు అడ్డు వస్తాడో చూస్తాను’ అని బయలుదేరుతుండగా నారదుడు ఎదురు వచ్చాడు. మహర్షిని నమస్కారం చేశాడు యమధర్మరాజు. అపుడు నారదుడు ‘ఎందుకయ్యా పంతాలు పట్టింపులు. వాళ్లకి ఉన్నది ఒక్క పిల్లాడు. మహర్షి కదా. పుత్రభిక్ష పెట్టిన వాడవు అవుతావు కదా’ అన్నాడు. నారదుడు ఇలా అనేసరికి యమధర్మరాజుకి కోపం వచ్చేసింది. ప్రాణములు తీసి తీరతాను అని దేవాలయం దగ్గరకు వెళ్ళాడు. అతనిని బహిర్ముఖుని చేస్తే సరిపోతుంది అనుకోని బయటకు రా నేను యమధర్మరాజుని నీ ప్రాణములు తీయడానికి వచ్చాను. అదే నీకు మోక్షము. బయటకు రా’ అన్నాడు. అపుడు మార్కండేయుడు ‘ఓరి పిచ్చివాడా! నీకుకూడా ప్రభువెవడో వానిని నేను ఆరాధన చేస్తున్నాను. నేను ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు. నా తల్లిదండ్రుల కోర్కె తీర్చడానికి ఈ శరీరంలో ఉండాలనుకుంటున్నాను. అలా ఉండేటట్లు చేయమని పరమశివుని ప్రార్థిస్తున్నాను. నేను ఆయనను ఆరాధన చేస్తుండగా ఫలితం ఆయన ఇవ్వాలి తప్ప ఇవ్వడానికి నువ్వెవరు? నీకు చేతనయితే ప్రాణాలు తియ్యి’ అన్నాడు. యమధర్మరాజు గారికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. చేతిలో మెరిసిపోతున్న యమపాశమును విసిరి లాగుతున్నాడు. పిల్లవాడు భయపడకుండా శివలింగమును కౌగలించుకుని చంద్రశేఖరునిపై అష్టకం చదువుతున్నాడు. అలా కౌగలించుకోవడంలో కంఠమునకు పడిన పాశం శివలింగమునకు తగిలింది. అంతే ఒక్కసారి శివలింగం ఫెటిల్లున పేలిపోయింది. వామార్ధ భాగమునందు పార్వతీ దేవితో శంకరుడు ఆవిర్భవించి తన ఎడమకాలి పాదంతో యమధర్మరాజు వక్షస్థలం పై ఒక్క తన్ను తన్నేటప్పటికి యమధర్మరాజు నీలపై విరుచుకు పడిపోయాడు. అపుడు శివుడు తన చేతిలోని త్రిశూలంతో ఒక పోటు పొడిస్తే యముడు మరణించాడు. పిమ్మట మార్కండేయుని వంక ప్రసన్నుడై చూశాడు. ఒక్కవరం కోరుకో. అన్నాడు.

మార్కండేయుడు ఇరువురికీ నమస్కరించి నేను ఏ కోరిక కోరను? పాపం యముడు తెలియక పొరపాటు చేశాడు. ఆయనను బ్రతికించండి’ అన్నాడు. అపుడు శంకరుడు ప్రసన్నుడై చూడగా యమధర్మరాజు మళ్ళీ లేచి నమస్కరించి “స్వామీ, నువ్వు వరం ఇచ్చినప్పుడు ఈ బాలుడికి పదహారు సంవత్సరములు ఆయుర్దాయం మాత్రమె ఉంటుందని చెప్పావు. నేను చేసిన దోషం ఏమిటి? చెప్పవలసింది’ అన్నాడు. శివుడు మందహాసం చేసి నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీ దోషం. ఎప్పుడూ పదహారేళ్ళు వయస్సు ఉండే పిల్లవాడిని నేను వాళ్లకి ఇచ్చాను. నువ్వు పదహారేళ్ళే అర్థం చేసుకున్నావు. అందుకని ఇలా జరిగింది ఏమీ బెంగలేదు. వెళ్ళు’ అన్నాడు. మార్కండేయుడిని చూసి పార్వతీదేవి పొంగిపోయింది. వీడికి మంచి వరమును ఇవ్వవలసింది అని చెప్పింది భర్తకి. అప్పుడు పరమేశ్వరుడు ‘ఈ లోకములు అన్నీ ఎప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయో, ఎప్పుడు వటపత్రశాయి తన బొటనవేలిని నోటిలో పెటుకుని చీకుతూ ఒక మర్రి ఆకుమీద పడుకున్తాడో అప్పటి వరకు చిరంజీవివై ఉంది మార్కండేయాయుష్షు అనే కొత్త ఆయుష్షును సృష్టించి నీకు ఇస్తున్నాను అన్నాడు. అందుకే మనవాళ్ళు పూర్వం పిల్లలకు నీళ్ళు పోస్తే నాన్నా నీకు మార్కండేయ ఆయుష్షురా’ అనేవారు. అలా రోజూ అంటూ నీళ్ళు పోస్తే ఆ ఆశీర్వచనం నిజమౌతుంది అని వారి ఉద్దేశం.

ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చుని ఒంట్లో బాగుండని వారు చంద్రశేఖర అష్టకమును నామీద నమ్మకంతో చదివితే వాళ్లకి అపమృత్యుదోషం రాకుండా నేను పరిహరిస్తాను. వారిని నేను రక్షించి తీరుతాను అంటాడు పరమేశ్వరుడు. కాబట్టి చంద్రశేఖరాష్టకం అంత గొప్పది. ఎవరయితే ఈ చంద్రశేఖరాష్టకమును నమ్ముకుని ప్రతిరోజూ ఇంట్లో చాడువుకుంటారో అలాంటి వాళ్ళ ఇళ్ళలోంచి అకారణంగా సమయం కాకుండా అపమృత్యు దోషం వలన బయటికి శరీరములు వెళ్ళవలసిన అవసరం లేకుండా నేను వాళ్ళని వాళ్ళ వంశములను కాపాడతాను. ఇది చదివిన వారికి దీనిని వినిన వారికి అపారమయిన కీర్తిని తేజస్సుని ఆయుర్దాయం నేను కృప చేస్తున్నాను అన్నాడు. ఈ అష్టకం ఎక్కడ చదువుతున్నారో అక్కడ అంతా శుభం జరుగుతుంది అన్నాడు. ఎవరు నమ్మకంతో రోజూ శివుని సన్నిధానమునందు మృత్యు భీతితో ఈ అష్టకమును పూనికతో చదువుతున్నారో అటువంటి వారికి మృత్యు భయం ఉండదు. ఆపదలు రాకుండా పూర్ణమయిన ఆయుర్దాయం వాళ్ళు పొందుతారు. దానితో బాటుగా అఖిలమయిన అర్థములు యశస్సు సంపత్తి అన్నీ చేకూరుతాయి. వీరి ప్రయత్నం లేకుండా చిట్టచివరి రోజున చంద్రశేఖరాష్టకం చదివిన ఫలితం చేత ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుని నామం జ్ఞాపకమునకు వచ్చి చంద్రశేఖరా అంటూ ప్రాణం విడిచి ఆయన చేతనే మోక్షం ఇవ్వబడి ఆయనలోనే కలిసిపోతాడు. అంత గొప్ప అష్టకంతో కూడిన ఈ మార్కండేయ మహర్షి జీవితమును ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు చదువుతున్నారో/వింటున్నారో వారికి పరిపూర్ణమయిన శివకటాక్షం కలుగుతుందని శివపురాణామ్తర్గతమయిన వాక్కు.


🙏🙏🙏

మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము**


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


భీష్మపర్వం.153


శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత ఉపదేశిస్తున్నాడు, కురుక్షేత్రంలో, మహాసంగ్రామం మొదలయ్యే ముందు.


తృతీయాధ్యాయం  కర్మయోగం 


శ్రీ భగవానువాచ :

లోకే>స్మిన్ ద్వివిధా నిష్టా పురాప్రోక్తా మయా>నఘ    

జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. //  ( 3  .3  )

శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు : 

ఓ పాపరహితుడవైనా పార్ధా !  అనాదినుండీ, జనుల అర్హతలను బట్టి రెండురకములైన నియమాలు చెప్పబడి వున్నవి.    ఆత్మానాత్మ వివేకము కలిగిన ఆత్మజ్ఞాన వాసనలున్న వారికి, వివేకవంతులైన తత్వవేత్తలకు, జ్ఞానయోగము,   మిగిలిన యోగాచారణ చేసే కర్మిష్ఠులకు కర్మయోగము చెప్పబడినది. 


' కృష్ణా !  కర్మకంటే జ్ఞానముత్తమమైనదని  చెప్పి, నన్నెలా ఘోరమగు యీ కర్మలు చేయమందువు  ?  పరస్పర విరుద్ధములైన యీ రెండింటిలో నామార్గమేదో,  నాకేది శ్రేయస్కరమో నీవే నిర్ణయించి చెప్పు. ' అని అడిగాడు అర్జునుడు. 


నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయోహ్య కర్మణః  

శరీర యాత్రాపిచ తే న ప్రసిద్ధ్యే ద కర్మణః  //  ( 3 . 8  )


ఓ అర్జునా ! నీవు ఫలాపేక్షరహితుడవై, కర్మల నాచరింపుము.   అట్టికర్మలు బంధ   హేతువులుకాదు.    శరీరయాత్ర గడపడానికి స్వధర్మ కర్మాచరణ   ఉత్కృ ష్టమైనది. 


ఇష్టాన్ భోగాన్ హి వో దేవా ఛాస్యంతే యజ్ఞభావితా : /

తైర్దత్తా న ప్రదాయై  భ్యో  యో భు0క్తే స్తే న ఏ వస :  .// ( 3 . 12  )

యజ్ఞములతో దేవతలను సంతోషపెట్టినచో, దేవతలు మీకు కావలసిన కోరికలు తీర్చెదరు.   వారిచ్చిన సంపదలనే, యజ్ఞరూపమున మరల వారికిచ్చి సంతృప్తి పరచనిచో, అట్టి మానవులు దొంగలుగా పరిగణింప బడతారు.  


నమే పార్దాస్తి   కర్తవ్యమ్ త్రిషు లోకేషు కించన 

నా నవాప్త మవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. //  ( 3 . 22  )

పార్ధా ! నాకు మూడులోకములందు, చేయవలసిన, చేయదగిన కార్యమేదియును లేదు.  నేను పొందవలసిన కర్మఫలములు కూడా యేమియూ లేవు.  అయిననూ, నేను కర్మల నాచరించుచునే  వున్నాను.  అనగా, జ్ఞాని అయినవాడు కర్మలనాచరించినా  దోషమేదీ అంటదని భావము.  


ప్రకృతే: క్రియమాణాని గుణై : కర్మాణి సర్వశ : 

అహంకార విమూఢాత్మా కర్తా హమితి మన్యతే // ( 3 . 27 )

సత్వ, రజ స్తమో గుణములచేతనే, సర్వ కర్మలు చేయబడుతున్నవి.   అట్టి గుణములు కర్మ చేయుటకు హేతువులు కాగా, ఆత్మజ్ఞానము లేనివాడు, ఆ కర్మలన్నీ, తానే కర్తగా చేశానని అహంకరిస్తూ వుంటాడు. 


తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో : 

గుణా గుణేషు వర్తన్త ఇతి మత్వా న సజ్జతే //  (3 . 28  )

దీర్ఘ బాహువులు గల ఓ అర్జునా !  జ్ఞాని తాను చేసే కర్మలు గుణ త్రయముల ద్వారా జరుగుతున్నవని తెలుసుకుని, తనకు ఆపాదించుకోకుండా,  కర్త్రుత్వాభిమాన వర్జితుడై తన వ్యాపకములు జరుపుతూ వుంటాడు.   


చతుర్దాధ్యాయము    జ్ఞాన కర్మ స0న్యాస యోగము.


శ్రీ భగవానువాచ : 

యదా యదాహి  ధర్మశ్య గ్లానిర్భభవతి భారత 

అభ్యుద్దాన మధర్మశ్య తదాత్మానం సృజామ్యహమ్. //  (  4 . 7  )

ఓ భరతవంశ శ్రేష్టా !  ఎప్పుడెప్పుడు  ధర్మానికి సంకటం కలుగుతుందో, అప్పుడు   నాకు నేనే అవతరించి ధర్మ సంస్తాపన చేస్తాను.  


పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం

ధర్మ సంస్తాపనార్ధాయ సంభవామి యుగే యుగే //  ( 4  . 8  )

సాధు పుంగవులను, అనగా తమను తాము రక్షించుకోలేని వారి రక్షణకొరకు, వినాశకులను  దునుమాడి, ధర్మాన్ని తిరిగి ప్రతిష్టించడానికి, ప్రతి యుగంలో నేను అవతరిస్తాను.    గోబ్రాహ్మణేభ్యశ్చ శుభం భవతు.  లోకా స్సమస్తా   సుఖినో భవంతు. 


చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ : 

తస్య కర్తారమపి మాం విద్ధ్య కర్తారమవ్యయం.  //   ( 4  .13  )

త్రిగుణాల ప్రేరితులై, వారు వారు చేసే కర్మలను బట్టి, జీవులందరనూ నేనే నాలుగు వర్ణములకు చెందిన వారిగా సృష్టించితిని.   వారి సృష్టికి నేను కారణమైనంత మాత్రాన, వారు చేసే కర్మలకు నేను కారణం కాదు.  నాకు ఏ కర్త్రుత్వమూ అంటదు.  ' జన్మనా జాయతే శూద్ర : కర్మణా జాయతే ద్విజ : వేదపారాయణే విప్ర : బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ :   అనగా చేయు కర్మలను బట్టే, వర్ణ విభాగముండును.  


బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నవ్ బ్రహ్మణా హుతం 

బ్రహ్మయివ తేన గన్తవ్యం బ్రహ్మకర్మ సమాధినా  //    ( 4 . 24  )

యజ్ణపాత్రలూ బ్రహ్మమే. హోమద్రవ్యమూ బ్రహ్మమే.  సమిధల ద్వారా వచ్చిన అగ్నియు బ్రహ్మమే.   హోమము చేయువాడూ బ్రహ్మమే.  హోమమునకు ఏర్పాట్లు చేసినవాడూ బ్రహ్మమే.  అట్టి బ్రహ్మ కర్మల ద్వారా వచ్చు ఫలం కూడా బ్రహ్మమే అని జ్ఞాని సమాధి స్థితిలో ఆనందముననుభవించును. 


పంచమాధ్యాయము  స0న్యాస యోగము. 


సంన్యాసస్తు మహాబాహో  దుఃఖమాప్తు మయోగత :

యోగ ముక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధి గచ్ఛతి //   ( 5 . 6 )  

అర్హత రాకుండా కర్మ సన్యాసం చేసిన వాడు అటు సన్యాస జీవితమూ గడపలేక, యిటు సంసార జీవితమూ లోనికి రాలేక దుఃఖితుడవుతాడు.  అలాకాక, యుక్తమైన యోగాభ్యాసము చేసి,  కర్మలను  సన్యసించినవాడు, త్వరలోనే, ఆత్మజ్ఞానం పొందినవాడై, బ్రహ్మపదము పొందుతాడు. 

సమ్యక్ న్యాస : - సంన్యాస :  అనగా బుద్ధిని ఆత్మయందు స్థిరముగా నుంచుట.  రజోగుణము వున్నవాడు, సన్యాసమునకు అర్హుడు కాదు.  సన్యాసి, ముక్కుమూసుకుని కూర్చోకూడదు, సమాజానికి వుపయోగపడే కార్యాలు చెయ్యాలి అనేమాటలు, లౌకికమైనవి.  రజోగుణం ఉన్నవాళ్లే, సమాజసేవ చేయగలరు. రజోగుణ నాశమే మనస్సును ఆత్మలో నిశ్చలంగా ఉంచుతుంది.  రజోగుణమునకు, సన్యాసమునకు వైరి భావము. 


నకర్త్రుత్వం   నకర్మాణి  లోకశ్య సృజతి ప్రభు :

న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే //  ( 5  . 14  )

లోకాలను సృష్టించిన భగవానునికి ఏ కర్త్రుత్వము, కర్మ ఫలాపేక్ష యేమీలేవు.  కర్మఫలం కారణమగు కర్మ పరమాత్మ చే చేయబడుటలేదు.  ఈ లోక వ్యవహారమంతా ప్రకృతి అనే మాయవలన జరుగుతున్నది. 


కర్త్రుత్వాభిమానం కర్మఫలానుభవమునకు హేతువగును.  రజోగుణము వలననే కర్త్రుత్వాభిమానము కలుగును.  అందువలన సన్యాసి అవవలెనని కోరిక వున్నవాడు, యోగము ద్వారా రజోగుణ నాశమునకు మొదటగా ప్రయత్నించవలెను   .


విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని

శుని చైవ శ్వపాకే చ పండితా : సమదర్శిన  :   //  ( 5 .18  )

విద్యా వినయములు కలిగిన బ్రాహ్మణుని, గోవును, ఏనుగును, కుక్కను, కుక్క మాంసము తిను చండాలుని పండితులు,  అనగా ఆత్మజ్ఞానంలో  రమించుచూ, సమాధి స్థితికి చేరువలో వుండేవారు,  ఉపాధి లక్షణములను చూసి కాకుండా, జీవుని దృష్టితో సమభావంతో వుందురు.   జీవమున్న శివము, జీవం లేకున్న శవము.  జీవం వున్నదంటే, ఆ జీవిలో పరమాత్మ వున్నట్లే.  ఆజీవి లక్షణం యేమైనాగానీ, 


కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసామ్

అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్. //   ( 5  . 26  )

కామక్రోధ రహితులు,  అరిషడ్వార్గాలను జయించినవారు, యతులు, యెల్లప్పుడూ సంయక్దర్శనంతో, బ్రహ్మానందాన్ని పొందుతూ వుంటారు.   వారే జీవన్ముక్తులు.  

కాషాయము  ఓర్పుకూ, త్యాగానికి ప్రతీక.  కాషాయాంబరధారి  ఆత్మజ్ఞాన సముపార్జనలో వున్నవాడు, ఆత్మజ్ఞానం పొందినవాడు అయివుంటాడు.  అట్టివానిని బలహీనుడుగా భావించి, వారిని అన్యులు హింసించకుండా, సమాజము వారిని కాపాడవలె.  గోవు, సన్యాసి, వారినివారు కాపాడుకునే దశలో వుండరు గనుక,  వారిని కాపాడుట సమాజ బాధ్యత.


 స్వస.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు


🙏🙏🙏

సౌందర్య లహరి

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఇరవైమూడవ శ్లోక భాష్యం - ఐదవ భాగం


ఇక చౌర్యమంటారా? శివుడే అనేక చౌర్యాలు చేశాడని కవులంటారు. ఆవిడ ఆయనలో సగభాగం అవునా? కాదా? మరి కామదహనం మూడవకన్నుతో చేసినపుడు ఆమె పాత్ర సగపాలు ఉన్నదా? లేదా? శివుడు మాత్రమె కామసంహార మూర్తి అన్న కీర్తిని వహించడం న్యాయమా? శివుడు కాలుని తన్ని నాశనం చేసింది ఏ కాలితో? ఎడమ కాలితో. అది ఆయనదా? ఆయనకు సంబంధమే లేదే! మరి పేరు మాత్రం ఆయన తీసుకోవడం ఏమి న్యాయం. ఆయనకు కాలసంహార మూర్తి అన్న పేరున్నది. నిజానికి దొంగతనం వలన బాధింప బడింది అంబిక-వేదమే ఆయనను “తస్కరాణాం పతిః”  దొంగల నాయకుడని చెప్పుతోంది. దొంగతనం ఆరంభిం చిందే భార్య దగ్గర. ఆమె తన శరీరమే కాక, కీర్తి; ఒక్క కీర్తీ  ఏమిటి సర్వస్వాత్మనివేదనం చేసుకొని మహా పతివ్రతగా  మిగిలిపోయింది.


అంబిక శివుని యెడ పరమమైన ప్రేమతో తనలో  ఉంచుకొన్నదని ఆచార్యులవారి ఉద్దేశం. ఆయన ఆమెతో ఉన్నాడు కనుక కామాక్షీదేవిని దర్శించినపుడు మనం శివుని కూడా దర్శించిన వారమవుతున్నాము. తల్లిదండ్రులను  పూజించడంలో ఉన్న ఆనందం తల్లిలోనే తండ్రి కలసిఉన్న ఆమెను అర్చించడంలో లభిస్తుందికదా! శివుని తల్లి కూడా తానే అయిన మూర్తిగా మనం ప్రార్థిస్తున్నాము. అదే విధంగా తో  తండ్రికూడా తానే అయిన మూర్తిగా అంబికను ప్రార్థించడం లో ఆనందమున్నది. బ్రహ్మ, బ్రహ్మశక్తి రెండూ రెండు  రూపాలుగా ఉండనక్కరలేదు. అంబిక శివశక్తులు కలిసి  ఉన్నరూపం. ఈ అద్వైత సత్యమే ఈ శ్లోకపు అంతరార్థం.  


అంబిక దేహమంతా అరుణ కాంతిమయం, ఆమె అంబిక ఒక్కతేనని ఆ కాంతిలో ఆమె ప్రతి అవయవము దర్శించ డానికి ప్రయత్నిస్తాము. ఆమె నుదిటి కంటినీ, చంద్రవంకనీ చూసినపుడు మా ఆరాధ్య దైవమైన చంద్రమౌళీశ్వరుడు స్కృతికి మెదులుతాడు. నేను చంద్రమౌళీశ్వరుని చూశానా  అని పరికించి చూసినపుడు ఆ రెండూ తప్ప శివుని శరీరము నకు సంబంధించిన మరే అవయవమూ కన్పించదు. ఇటు వంటి ఒక అనుభూతితో ఆచార్యులవారు “ఓ సగభాగం  ఆక్రమించి కూడా తృప్తిపొందక మిగతా భాగాన్ని కూడా -  దొంగిలించావా” అని అడుగుతున్నారు.

శివుడనే అమృతాన్ని పంచుకోవడానికి సాధ్యం కాదు. మొత్తంగా ఆస్వాదించవలసిందే- అంబిక సరిగ్గా అదే చేసింది.


(సశేషం)


కృతజ్ఞతలతో 🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

*శ్రీ శివ మహా పురాణం

 **దశిక రాము**


**శ్రీ శివ మహా పురాణం**


23 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


గౌరీపూజ


ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులిరువురూ మందరగిరి పర్వతం మీద కూర్చుని ఉన్నారు. వారిని ఆ పర్వతం ఒక జీవ స్వరూపమును పొంది సేవిస్తోంది. పార్వతీదేవి నలుపు రంగులో ఉంటుంది. పరమశివుని చెల్లెలుగా సరస్వతీ దేవి సంభావించబడుతుంది. శంకరుడు తెల్లగా ఉంటాడు. ఆయన వాహనమైన వృషభం తెల్లగా ఉంటుంది. ఆయన ఉండే పర్వతం తెల్లగా ఉంటుంది. వేసుకునే పుర్రెల మాల తెలుపు. ఒంటికి రాసుకునే విభూతి తెలుపు. తెల్లటి శంకరుడు జ్ఞానప్రదాతయై ఉంటాడు. ఇంత తెల్లటి శంకరుడి ప్రక్కన నల్లగా ఉన్న అమ్మవారు కూర్చుంది. కానీ యథార్థమునకు శివ పార్వతులిరువురిలో కూడా వారి రూపురేఖలకు సంబంధించిన భావములేవీ లేవు. ఆయన పార్వతీదేవి వంక చూసి ‘కాళీ’ అని పిలిచారు. ఆ పిలుపు పూర్వం పిలిచినట్లు లేదు. కొద్దిగా ఏదో ఎత్తిపొడిచినట్లుగా ఉంది. ‘ఓ నల్లపిల్లా’ అని పిలిచినట్లు అనిపించింది. వెంటనే ఆవిడ ముఖం ఎర్రగా అయిప్యి కన్నుల వెంట భాష్పధారలు కారుతుండగా అమ్మవారు క్రిందికి దిగి ‘లోకమునందు ఎన్ని సుఖములైనా ఉండవచ్చు, ఎన్ని భోగాములైనా ఉండవచ్చు. కానీ భర్తకు ప్రీతి చేయలేని సౌందర్యం ఈ శరీరమునందు లేనప్పుడు ఒక కాంత అటువంటి శరీరమును పొంది ఉండడంలో ఎంతో బాధపడుతుంది. ఇప్పుడు నేను కైలాసంలో ఉన్నా, మణిద్వీపంలో ఉన్నా, నన్ను ఎంతమంది సేవిస్తున్నా, మా వారు మాత్రం నన్ను కాళీ అని పిలుస్తారు. ఇటువంటి భావన నాకు కలగగానే ఈ శరీరం మీద ఎక్కసం కలుగుతోంది’ అంది. అన్ని కారణముల చేత ఆవిడ భర్త ప్రీతిని కోరుకుంటుంది. తాను ఏది చేసినా భర్త ప్రీతి కొరకే చేస్తుంది. ఇది మహా పతివ్రత లక్షణము. అందుకే శంకరాచార్యులంతటి వారు సౌందర్యలహరి ప్రారంభం చేస్తే ‘శివశ్శక్త్యా యుక్తో’ అని ప్రారంభించారు. ఆయన పేరు ఎత్తకుండా మొదలెడితే అమ్మవారు ముఖం చిట్లించుకుంటుందని ప్రాజ్ఞులు మహానుభావులు అయిన శంకరులకు తెలుసు కనుక భర్త పేరుతోనే మొదలుపెట్టారు. ఆయన పేరు చెప్తే ఆవిడకు సంతోషం. ‘నీవు ఈ శరీరమును చూసి ప్రీతిని పొందడం లేదు. అటువంటప్పుడు ఈ శరీరంతో నేను ఉండాలని అనుకోవడం లేదు. ఈ నల్లటి శరీరమును వదిలిపెట్టేస్తాను. నీకు ప్రీతిని కలిగించే శరీరముతో వస్తాను. దేవా నన్ను అనుగ్రహించండి’ అంది. ఈ మాటకు శంకరుడు కూడా ఒక్కసారి ఉలిక్కిపడి ‘అయ్యో పార్వతీ, నా మనస్సు నీకు తెలియదా. నీయందు నాకెప్పుడూ అటువంటి భావన లేదు. ఒకవేళ నేను పరాచికానికి అన్నమాట నీకు అంత కష్టపెట్టి ఉన్నట్లయితే ఇంతటి నిర్ణయం తీసుకునేటట్లయితే నేను నీ పాదములమీద వ్రాలి నీ సేవ చేస్తాను. నువ్వు ఇంత తొందర నిర్ణయమును తీసుకోవద్దు’ అన్నాడు. ఈ సంఘటన అంతఃపురంలో జరిగింది. ఎవ్వరికీ తెలియని విషయం. ఇప్పుడు ఈ విషయం లోకానికంతటికీ తెలుస్తోంది.

పరమశివుని మాటలను విన్న ఆవిడ ‘లేదు లేదు. నేను మీ మనస్సును చూరగొనలేక పోయినప్పుడు నేను అలా ఉండడాన్ని ఇష్టపడను. నేను ఇంక ఈ శరీరంతో ఉండను’ అని శరీరమును వదిలిపెట్టేసింది. మరల ఆవిడ హిమవంతుని కుమార్తెగా పుట్టి గొప్ప తపస్సు చేసి పరమశివుడికి ఇల్లాలయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆవిడ తపస్సుకు బయలుదేరింది. ఆకాశగంగలో స్నానం చేసి తపస్సుకు అనుకూలమయిన వస్త్రములను ధరించింది. ఎవరు ఈమాట అన్నాడో ఆయనకు ప్రీతి కలిగిన రంగును నేను పొందుతాను అని నియతమయిన సంకల్పం చేసి తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమెను తిందామని ఒక పులి వచ్చింది. ఆమెను చూడగానే దుష్ట గుణము కలిగిన పులి సాత్త్విక ప్రవృత్తిని పొంది అలా నిలిచిపోయింది. తిందామన్న కోరికతో వచ్చి నిలబడిన వస్తువుకు కూడా మూడు రకములయిన మలములు ఆవిడను చూసేసరికి ఎగిరిపోయాయి. అమ్మవారి పాదములకు ఉండే బొటనవేలి గోటి నుండి వస్తున్నా కాంతిని చూస్తే పాపములు ఎగిరిపోతాయని వ్యాసమహర్షి అంటారు. అగ్నిహోత్రమును ముట్టుకుంటే కాల్చడం దాని ధర్మం. ఈశ్వర దర్శనం ఎలా చేసినా అది ఏ దృష్టితో చేసినా తేరిపారి అమ్మవారి వంక అలా చూసినంత మాత్రం చేత ఆవిడ దానిలో ఉన్న మూడు రకములయిన మలములను తీసివేసింది. అది అదేపనిగా అమ్మవారు తపస్సు చేసుకుంటున్న ప్రదేశం చుట్టూ తిరుగుతూ అమ్మవారి తపస్సును భంగం చేయడానికి ఏ ప్రాణిని లోపలికి రాకుండా కాపాడుతోంది. పిమ్మట శుంభనిశుంభులను సంహరించదానికి ఒక రూపమును ఇవ్వమని బ్రహ్మ అడిగాడు. ఆ తల్లి ఇపుడు రూపమును స్వీకరించాలి బంగారు రంగులో ఉండే మొగలి పువ్వు ఎలా ఉంటుందో అలాంటి రంగుతో తెలుపు ఎరుపు పసుపు రంగులతో కూడిన రంగులోకి అమ్మవారు మారిపోయింది. గౌరవర్ణమును పొందింది కాబట్టి గౌరీ అని పిలిచారు. తన నల్లని శరీరమును పాము కుబుసము విడిచినట్లు అమ్మవారు లీలా మాత్రంగా శరీరమును విడిచింది. ఈ విధంగా విడిచిన నల్లని శరీరమునకు కౌశికి అనే పేరు వస్తుంది.

ఇక్కడ మీకొక విషయం అవగతం కావాలి. పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగినది కాముని బాణముల వలన జరిగిన సృష్టి కాదు. అది లీలా మాత్రంగా వీళ్ళిద్దరూ కలిసి కామేశ్వరుడై, ఆ తల్లి లోపల మనస్సు నందు కదిలితే, ఆ సృష్టిగా పరిణమించింది. కనుక ఇప్పుడు కౌశికి అనే పేరుతొ నల్లటి శరీరమును ఇచ్చి ఈవిడ వచ్చి శుంభ నిశుంభులను సంహారం చేస్తుందని బ్రహ్మ కోర్కెను తీర్చింది. ఇపుడు ఈ కౌశికి వెళ్లి శుంభనిశుంభుల సంహారం పూర్తిచేసింది. ఆ తర్వాత అమ్మవారు వింధ్యవాసినియై వింధ్య పర్వతం మీద కూర్చుని ఉంది. ఆ సమయంలో బ్రహ్మ అమ్మవారికి కైమోడ్చి నమస్కరించి స్తోత్రం చేసి ఒక సింహమును ఆవిడకి వాహనంగా బహూకరించాడు. సింహవాహన అనే పేరుతో వింధ్యవాసిని అనే పేరుతో ఆ కౌశికి మనలనందరిని రక్షించడం కోసమని ఆ వింధ్యపర్వతం మీద వేంచేసి ఉన్నది.

ఇపుడు ఈ గౌరీ వ్యాఘ్రమును కూడా వెంటపెట్టుకుని పరమశివుడు ఉన్న మందరపర్వతం మీదకు వెళ్ళింది. ఆమెను చూసి పరమశివుడు ఎంతో సంతోషించాడు. ‘పార్వతీ, నేను ఆనాడు ఈమాట ఎందుకన్నానో దానిలో గల రహస్యం ఈనాడు నీకు అర్థం అయింది. ఈ శరీరమును విడిచిపెట్టి దీనితో రాక్షస సంహారం జరగాలి. ఇప్పుడు నువ్వు నాకు ప్రీతి కలగడం కోసమని అటువంటి శరీరంతో వచ్చి పక్కన కూర్చోవడం చేత లోకమునకు ఒక కొత్త మర్యాద ఏర్పడాలి. నీవు వాక్యము, నీవు విద్య. నేను ఆ విద్యచేత ప్రతిపాదింపబడే జ్ఞానమును. విద్య జ్ఞానము ఈ రెండూ ఎలా విడివడి ఉండవో అలా నీవు నేనూ ఎల్లప్పుడూ కలిసే ఉంటాము. నీవు సోమాత్మకంగా ఉంటావు. నేను అగ్నిస్వరూపంగా ఉంటాను. ఊర్ధ్వముఖ ప్రయాణం నాది. నీవు క్రిందికి వెడతావు.నేనే ఈ సృష్టినంతటినీ లయకారకుడనై కేవలము బూదిగా మార్చి ఉంచినపుడు నీ అనుగ్రహ ప్రవేశం చేత మరల సృష్టి పునఃసృష్టి జరుగుతోంది. కాబట్టి ఈ సమస్తము మనమిరువురమై ఉన్నాము. ఇక మనం విడివడినది ఎప్పుడు! అటువంటిది నీవు నామీద కోపపది దూరంగా వెళ్ళినట్లుగా కనపడడం ఒక అద్భుతం. లోకరక్షణ కోసమని ఇద్దరం ఇలా ఆకృతులను స్వీకరించాము. మనం చేసిన ఈ లీల వృథాగా పోదు. రాబోవు కాలంలో లోకమునకు రక్షణ హేతువు అవుతుంది’ అన్నాడు. ఇక్కడ మనం ఆ లోక రక్షణ హేతువైన విషయమును గూర్చి తెలుసుకోవాలి. ఆంద్రదేశమునందు, తమిళ దేశమునందు ఒక అలవాటు ఉంది. మనం పెళ్ళిచేస్తే ఆడపిల్ల ముందుగా గౌరీపూజ చెయ్యాలి. గౌరీపూజ చెయ్యడం వెనకాల ఒక రహస్యం ఉంది. అన్నీ అమ్మవారి స్వరూపములే. పరమేశ్వరునికి ఇల్లాలిగా ఉండడం చాలా కష్టం. ఎప్పుడూ ఆయన మనస్సుకి ప్రీతిగా ప్రవర్తించాలి. ఏ చెరుకువిల్లు పట్టుకుని బాణాలు వేస్తే కాముడు సాధించలేకపోయాడో ఆ చెరుకు విల్లు తాను పట్టుకుని ఏమీ మాట్లాడకుండా కూర్చున్న వాడిని మనకోసమని సంసారంలోకి తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టింది. ఇటు బిడ్డలకి తండ్రిని కూర్చోబెట్టింది. అటు ఈ సృష్టి నంతటినీ చేసి మరల ఆవిడ అనుగ్రహంతో లోకమంతటినీ ఆయనలో కలుపుతోంది. ఏకకాలంలో ఈ పనులన్నింటినీ అమ్మవారు చేస్తోంది. నూతన వధువు కూడా ఒకరికి ఇల్లాలు అవడం కోసమని పీటల మీదికి వెడుతున్నపుడు ఆమెకు కూడా సర్వకాలములయందు కష్టం వచ్చినా సుఖం వచ్చినా భార్య భర్తకు విశ్రాంతి స్థానము కనుక ఆమెయందు అటువంటి బలం రావాలని ఆమెచేత సన్నికల్లు తోక్కిస్తారు. పెళ్ళి పీటలమీద కూర్చునేముందు పెళ్ళి కూతురుచేత గౌరీపూజ చేయిస్తారు. ఆ సందర్భంలోనే తల్లిదండ్రులు తమ కుమార్తెకు ‘సన్నికల్లు ఎలా ఉందొ అలా నువ్వు కూడా అన్నిటినీ గట్టి మనస్సుతో పెట్టుకోవాలి. అత్తవారింటికి వెళ్ళగానే అత్తమీద మామమీద మరిది మీద ఆడపడుచుల మీద భర్తకు వేరొక రకమయిన మాటలను భర్తకి చెప్పి కష్టం కలిగించి ఇంటిని రెండు చేయకు అని బోధ చేస్తారు. వధువు ‘నా భర్తను అనుగమించి నా భర్త శుశ్రూష చేసి నా భర్త పొంది పోయేటట్లుగా ఆయన మనస్సు నేను గెలుచుకోవాలి. ఏది చేస్తున్నా, అయ్యో దానికి తెలియకుండా చెయ్యడమా నన్ను అంత అనుగమించే మనిషి కదా అని దానికి చెప్పి చేద్దామని చేసేటట్లుగా భర్త మనస్సు గెలుచుకోగల స్థితిని నాకు కల్పించు. నేను కూడా నా భర్త చేత అంతటి అనురాగమును పొందెదను గాక. నువ్వు ఎలా పెద్దింటమ్మవై వుండి పసుపు కుంకుమలతో గౌరివి అయ్యావో మమ్మల్ని కూడా అలా కాపాడు’ అని పెళ్ళికూతురు గౌరీ తపస్సు చేస్తుంది. మన ఆర్షధర్మం అంత గొప్పది. మనజాతి దంపతులు అలా ఉండాలని కోరుకుంది. అలా ఉండాలి లోహితాస్యుని వంటి బిడ్డలు పుట్టాలంటే మహాతల్లి ఆ గౌరీదేవిని ఉపాసన చెయ్యండి. ఆడపిల్ల ఒక ఇంటి కోడలిగా వెడితే అంతటి ధృతిని పొంది ఉండాలని, అంతటి ధర్మాచరణమును పొంది ఉండాలని మనం గౌరీపూజ చేస్తాము.

అక్కడ వ్యాఘ్రమునకు ఒక విచిత్రం జరిగింది. అక్కడ అమ్మవారు పులిని కూడా మందర పర్వతము దగ్గరకు తీసుకువెళ్ళింది. దానిని పరమశివునకు చూపించి – ‘అయ్యో పాపం ఇది నాతో పాటు వచ్చింది. తన స్వభావమును మార్చుకుంది. కాబట్టి దీనికి కూడా నందీశ్వరునితో సమానంగా నా అంతఃపురమునందు రక్షణ భారము వహించే అదృష్టమును ఇవ్వండి’ అంది. అపుడు శంకరుడు తప్పకుండా పార్వతీ అని వెండి బెత్తమును ఒక మంచి ఖడ్గమును ఇచ్చి ఒక బంగారు కవచం కట్టి అమ్మవారి ఇంటిముందు నందీశ్వరుని కన్న కొద్ది స్థాయిలో సోమనంది అనే పేరుతో నిలబడే అనుగ్రహాన్ని ప్రమథగణములలో ఒకడిగా ఇచ్చాడు. అమ్మవారిని అలా చూసినందుకు అది సోమనంది అయింది. సోమనంది మనకి నవనందులలో ఒకటిగా కనపడుతుంది. ఈ సోమనంది వృత్తాంతం ఈ గౌరీ వృత్తాంతం కౌశికీ వృత్తాంతం రాక్షససంహారం ఎవరు చదువుతున్నారో వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం చేత చక్కటి అనుకూల్యముతో కూడిన దాంపత్యము సిద్ధించి ఏ ఇబ్బందులు రాకుండా స్త్రీలు పసుపుకుంకుమలతో పదికాలాలపాటు ఉండి లోకమంతా సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా ఉంటుందని పెద్దలు విశ్వసించి పలికిన పలుకు. కనుక అమ్మవారి అనుగ్రహంతో అటువంటి స్థితిని మనం పొందెదముగాక!


🙏🙏🙏

మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము**


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


భీష్మపర్వం.152


శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత ఉపదేశిస్తున్నాడు, కురుక్షేత్రంలో, మహాసంగ్రామం మొదలయ్యే ముందు. 


(  భగవద్గీత 18  అధ్యాయాలలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పాడు.  మనం విహంగ వీక్షణంగా,  ఆ అమృత భాండాగారంలో నుంచి కొన్ని బిందువులు గ్రోలే ప్రయత్నం చేద్దాం.  మూలకథకు యెక్కువ ఆటంకం లేకుండా, కొద్దిశ్లోకాలు అక్కడక్కడా స్మరించుకుంటూ,  ప్రతి అధ్యాయం లో రెండు మూడు శ్లోకాలు మననం చేసుకుందాం.   

ప్రతి శ్లోకమూ ముఖ్యమైనదే. అందులో యెట్టి సందేహం లేదు.  ఇంతకుముందు భగవద్గీతను అవపోశన పట్టిన మహానుభావులకు ఇది కేవలం ఒక స్పర్శామాత్రము .  అసలు భగవద్గీత మనకు సంబంధించినది  కాదు, వృద్ధులకు మాత్రమే అనుకునే యువకులకు, చిన్న పరిచయ ప్రయత్నం.  


ఇంకొక ముఖ్య విషయము.  భగవద్గీత అంటే, నిత్యపారాయణ గ్రంధము.  యేవో కొన్ని నిర్దిష్టమైన సందర్భాలకు పరిమితము అనుకోవడం అవివేకమే అవుతుంది.  


పై పెచ్చు,  భగవద్గీత పాఠశాలలకు వెళ్లే, కళాశాలకు వెళ్లే, విద్యార్థినీ విద్యార్థులు,  కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, పిల్లల పెంపకంలో సతమతమయ్యే గృహిణులు,  విశ్రాంత జీవితం గడుపుతున్నవారు, అందరూ చదువవలసినది.  కనీసం  వారికి సంబంధించిన   అధ్యాయాలు, గురువుల సలహాతో చదువుకుంటే బాగుంటుంది.


మా చిన్నప్పుడు, మా ఆరక్లాసులోనే గుంటూరు, మాజేటి గురవయ్య గారి పాఠశాలలో చదువుతున్నప్పుడు,  మా తెలుగు ఉపాధ్యాయులు,  అశ్వద్ధనారాయణ గారు,  మాకు ప్రతి రోజూ సాయంత్రం బ్రాడీపేట ఓంకారక్షేత్రంలో భగవద్గీత తరగతులు తీసుకుని, అధ్యాయాల వారీగా కంఠస్థం చేయించి, బయటనుండి పృచ్ఛకులను పిలిపించి, ఉత్తీర్ణులైనవారికి, ప్రశంశాపత్రాలు, బహుమతులు ఇచ్చేవారు.   ఆనాడు అక్కడ  భగవద్గీత నేర్చుకున్నవారు, యిప్పుడు యెంతో గొప్ప గొప్ప పదవులు నిర్వహించి, విశ్రాంత జీవితం గడుపుతూ వున్నారు.  మాకు అది ఆ వయసులో, పూర్తిగా అర్ధం కాకపోయినా, ఒక పవిత్రత ఆపాదించుకుని చదువుకున్నాం.


ఇది అప్రస్తుత ప్రసంగంగా భావించరని  అనుకుంటూ, నమస్కారములతో. )


1 అర్జున విషాదయోగం. :

    న కాంక్షే విజయం కృష్ణ  న చ రాజ్యం సుఖాని చ /

    కిమ్ నో రాజ్యేన గోవింద కిమ్ భోగైర్జీవితేన వా //   ( 1 . 31 )


    కృష్ణా ! యుద్ధములో నాస్వజనులను చంపుటలో నాకు యేవిధమైన శ్రేయస్సు కనబడకున్నది.  నాకు విజయం మీద, రాజ్యం మీద, సుఖాల మీదా కోరికలేకున్నది.    .   గురుదేవులు,పితృ, భ్రాతృ సమానులు, బంధువులు, స్నేహితులు  మొదలైనవారిని చంపవలసిన యుద్ధభూమిలో వున్నప్పుడు, ఆతరువాత, మనం పొందే రాజ్యము, సంపద, భోగము వలన యేమి ప్రయోజనము ? 


.   కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా: సనాతనా: /

    ధర్మే నష్టే కులం కృత్స్నామధర్మో>భిభవత్యుత.//  ( 1 . 40  )

కులం ( వంశము ) క్షీణిస్తే, ఆకులములో అనాది నుండి ఆచరిస్తున్న సనాతన ధర్మములు నశించును.   అప్పుడు ఆ కులమే నిర్వీర్యమైపోవును.  


   సంకరో నరకాయయైవ కులఘ్నానాం కులశ్య చ /

   పతన్తి పితరో  హ్యేషామ్ లుప్త పిండోదక క్రియా : //      ( 1  . 42 )

వర్ణసంకరము జరిగిన కులము నశించి అల్లర్లాములోని  వారు నరక లోకమునకు పోవుట తధ్యము.  అందువలన, వారి పితృదేవతలు కూడా  పితృ సంబంధమైన కార్యములలో వారి తర్పణములు గ్రహించలేక,   ఆకలి దప్పులతో తపించి నరకమునకు త్రోసివేయ  బడుదురు.


2 . సాంఖ్య యోగము.  


శ్రీ భగవానువాచ :

     అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ  భాషసే  /

     గతాసూనాగతా సూ౦శ్చ నానుశోచన్తి పండితా:: //  ( 2  . 11  )

 భగవానుడు చెప్పుచున్నాడు :

    శోకించదగని వారి గురించి నీవు శోకిస్తున్నావు.  అయితే, ప్రాజ్ఞుని వలే మాట్లాడు తున్నావు.   పండితుడైనవాడు, వెళ్ళిపోయినవారి గురించిగానీ, వున్నవారి గురించిగానీ వేరు విధాలుగా ఆలోచించడు.


   నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా   భవితా వా న భూయ: /

   అజో నిత్య : శాశ్వతో >యమ్ పురాణో  న హన్యతే హన్యమానే శరీరే //    ( 2  20 ) 

ఆత్మ యెన్నడును పుట్టదు, గిట్టదు. ఒకప్పుడు లేనిది, తర్వాత వచ్చినది, మరల పోవునదీ కాదు.  శరీరానికే మరణం గానీ ఆత్మకు కాదు. 


    నైనం చ్ఛిన్దన్తి  శస్త్రాణి  నైనం దహతి పావక : /

    న చైనం  కలే దయంత్యాపో న  శోషయతి మారుత : //  ( 2 . 23 )

ఆత్మను యే అస్త్రశస్త్రములు ఖండింపజాలవు.  ఏ జ్వాలాగ్ని మండింపజాలదు  నీరు దీనిని తడుపలేదు, గాలి దానిని నిర్వీర్యము చేయజాలదు.  


    త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగునో భవార్జునా /

     నిర్ద్వన్దో నిత్యసత్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్ //   ( 2 . 45  ) .  

వేదములు త్రిగుణములను ( సత్వ, రజ : తమో గుణములు ) ప్రతిపాదించినవి. నీవు వాటికి అతీతుడవై, అద్వైతుడవై,  సమబుద్ధితో, యోగ క్షేమాల యందు అనురక్తుడవు కాక, ఆత్మయందే తాదాత్మ్యతతో వుండుము.  

     

స్వస.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

భాగవతం

 **దశిక రాము**


**భాగవతం 6వ స్కందము ఖండము-8**


హంసగుహ్య స్తవరాజము 


ముందుగా పరమేశ్వరునికి విశేషించి నమస్కరిస్తున్నాను. అనుభూతియే ఆకారమైన వానికి మ్రొక్కుతున్నాను. గుణవంతుడై విరాజిల్లుతూ నిమిత్తమాత్రంగా బంధురూపంలో ఉన్నవానికి ప్రణామాలు చేస్తున్నాను. సుగుణవంతులకు కాని, తత్త్వవేత్తలకు కాని తెలియరాని ఉనికి కలవాడు, మొదటినుండి ఉన్నవాడు, మోక్షానికి పరమావధి అయిన రూపం కలవాడు అయిన ఆ భగవంతుని ఆశ్రయిస్తున్నాను. సమస్త జీవుల దేహాలలో నివసిస్తున్నా జీవులు ఆ అంతర్యామిని గుర్తించడం లేదు. వారు తమలో తాము స్నేహం చేస్తున్నారే కాని పరమాత్మతో పొందు చేయడం లేదు. గుణాలలో చిక్కుకున్న జీవులు గుణాలకు అధీశ్వరుని దర్శింపలేకున్నారు. అటువంటి గుణవంతుడైన భగవంతుణ్ణి స్తుతిస్తున్నాను. మనస్సు, దేహం, పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచప్రాణాలు కలిగి ఉన్న జీవులు ఈ దేహమే తాము అనుకుంటున్నారు. ఆ భావంతోనే అంతర్యామిని గుర్తింపలేక ఉన్నారు. వారికి వివేకబుద్ధి ప్రాప్తించినపుడు ఇంద్రియాదులు వేరని, జీవుడు వేరని తెలుసుకుంటున్నారు. ఈ సృష్టి నంతటినీ పరికించేవాడు, సమస్తానికి మూలమైనవాడు విశ్వహితుడు అయిన ఆదిపురుషుని ఆశ్రయిస్తున్నాను.

నానావిధాలైన నామ రూపాలను నిరూపించే మనస్సుచేత గమనింపబడినవి, స్మరింపబడినవి అయిన విషయాలు తొలగినప్పుడు కలిగే సమాధి స్థితిలో కేవలం జ్ఞానస్వరూపంగా గోచరించి, అటువంటి సమాధి స్థితికి ఆశ్రయభూతుడైన హంసస్వరూపునకు నమస్కరిస్తాను. ఎండుకట్టెలో దాగి ఉన్న అగ్నిని తమ బుద్ధితో ప్రకాశింపజేసినట్లు బుద్ధిమంతులు తమ హృదయాంతరాలలో ఉన్న పరమపురుషుని తమలోని శక్తిత్రయం చేత ప్రకాశింపజేస్తారు. అటువంటి భగవంతుడు సమస్త విధాలైన మాయలకు అతీతమైన మోక్షసంబంధమైన ఆనందానుభూతితో విలసిల్లుతుంటాడు. మాటలకు అందని మహత్తర శక్తితో కూడి ఉన్న ఆ విశ్వరూపుడు నాకు ప్రసన్నుడు అగును గాక! వాక్కు, బుద్ధి, ఇంద్రియాలు, మనస్సు మొదలైనవి ఆ పరమాత్ముని స్వరూపాన్ని వెల్లడించలేవు. అది ఇటువంటిదని నిరూపింపలేవు. ఇంద్రియాలకు అతీతాలైన గుణరూపాలతో వర్తిస్తూ ఉన్న ఆ నిర్గుణ స్వరూపానికి నమస్కరిస్తున్నాను. ఈ సమస్త విశ్వం ఏ మహాశక్తి వలన సృష్టింప బడుతున్నదో, ఏ మహాశక్తి వలన రక్షింపబడుతున్నదో, ఏ మహాశక్తి వలన లయం పొందుతున్నదో అటువంటి పరమాత్మ స్వరూపం పరాపరాల కంటే ఉత్తమమైనది. అనన్యమైనది, అనాది కాలం నుండి ప్రసిద్ధమైనది, అంతటా వ్యాపించి ఉన్నది, అన్నిటికీ మూలమైనది అయిన ఆ పరబ్రహ్మను ఆశ్రయిస్తున్నాను. ఆ పరమాత్మ ప్రభావం వల్లనే ప్రాణులు మాట్లాడుతున్నారు. వాదోపవాదాలు చేస్తున్నారు. వివాదాలు పెడుతున్నారు. అన్నింటికీ కారణం ఆ పరమాత్మ అనంత గుణాలే. జీవులను ఎప్పటి కప్పుడు మోహంలో ముంచి తేల్చే ఆ భగవంతునికి ప్రణామం చేస్తున్నాను. ఉన్నది, లేదు అనే వస్తు ద్వయానికి ఆలవాలాలై పైకి విరుద్ధ ధర్మాలుగా కనబడుతున్న యోగసాంఖ్య దర్శనాలను రెంటికీ సమత్వం సమకూర్చే పరమాత్మ నన్ను అనుగ్రహించు గాక! ఏ దేవుడు మానవుల పురాకృత పుణ్య విశేషాల చేత సుగంధాన్ని ఆశ్రయించిన వాయువు వలె అంతర్యామియై ఈ భూమిమీద ఉద్భవిస్తుంటాడో ఆ పరమేశ్వరుడు నా మనోరథాన్ని సఫలం చేయు గాక!” అంటూ భక్తిపరవశుడై తన భక్తి విశేషాలతో స్తుతిస్తున్న దక్షునికి భక్తవత్సలుడైన శ్రీహరి సాక్షాత్కరించాడు. అప్పుడు....శ్రీమహావిష్ణువు గరుత్మంతుని మీద ఆసీనుడై ఉన్నాడు. గరుడుని రెండు భుజాల మీద చాచిన ఆ స్వామి పాదాలు మేరు పర్వతం చరియకు రెండు ప్రక్కలా ప్రకాశించే ఇంద్రనీలమణుల గనులవలె ఉన్నాయి. అతని అష్టబాహువులు అందంగా పైకి చాచిన అష్టదిగ్గజాల తొండాలవలె ప్రకాశిస్తున్నాయి. ఎనిమిది చేతులలో చక్రం, ధనుస్సు, పద్మం, శంఖం, ఖడ్గం, పాశం, డాలు, గదాదండం విరాజిల్లుతున్నాయి. నల్లని దేహంతో, నగుమొగంతో, సాధుజనులను సంరక్షించే చల్లని చూపులతో, బంగారు రంగు పట్టు పీతాంబరంతో, మణిమయ కిరీటంతో, నలుమూలలా కాంతులు విరజిమ్మే భూషణాలతో, మకర కుండలాలతో (ప్రత్యక్షమైనాడు).శ్రీమన్నారాయణుని కర్ణకుండలాల కాంతులు ప్రసరించి చెక్కిళ్ళు చంద్రబింబాలవలె తళతళ లాడుతున్నాయి. తలమీద ధరించిన కిరీటం తన దివ్యదీప్తులతో గగనలక్ష్మికి కుంకుమరంగు చీరను అలంకరిస్తున్నది. అతని వక్షఃస్థలంమీద విరాజిల్లే వనమాలిక శోభలు శ్రీవత్సంతోను, కౌస్తుభంతోను పోటీ పడుతున్నాయి. బాహువులకు చుట్టుకొని ఉన్న భుజకీర్తులు నీలగిరికి చుట్టుకొన్న మెరుపు తీగలవలె మెరుస్తున్నాయి. ఆ స్వామి సౌందర్యం సమస్తలోకాలను మోహంలో ముంచి తేలుస్తున్నది. నారదాది మహర్షులు చుట్టూ చేరి సేవిస్తున్నారు. దేవతా బృందాలు కైవారాలు సలుపుతున్నారు. గంధర్వులు, కిన్నరులు, సిద్ధులు వీనుల విందుగా గానం చేస్తున్నారు.

సర్వేశ్వరుడు, సర్వాత్ముడు, సర్వాంతర్యామి, సర్వమయుడు, అచ్యుతుడు అయిన భగవంతుడు అందరూ తనను చేరి సేవిస్తుండగా కోరినవన్నీ ఇచ్చేవాడై దక్షునకు ప్రసన్నుడైనాడు. ఈ విధంగా ప్రత్యక్షమైన సర్వేశ్వరుని దివ్యరూపం అన్ని దిక్కులనూ ప్రాకాశింపజేస్తూ మహాశ్చర్యాన్ని కలిగించింది. దానిని చూచిన దక్షుని హృదయంలో భయం, ఆనందం, ఆశ్చర్యం ముప్పిరి గొన్నాయి. ఎలాగో ఆ తన్మయత్వం నుంచి తెప్పరిల్లి రెప్పపాటు కాలంలో స్వామికి సాష్టాంగ దండప్రణామం చేసాడు. చేతులు జోడించి నమస్కరించాడు. సెలయేళ్ళ కలయికతో దరులొరసి పొంగి మిన్నంటి సముద్రాన్ని దరిసిన మహానదీ ప్రవాహం వలె దక్షప్రజాపతి పులకించిన దేహంతో భగవంతుని ముందు నిలిచాడు. పరవశించిన తన హృదయాన్ని ఎలాగో స్వాధీనం చేసుకొని పొంగిపొరలే ఆనందంతో ఆ పరమేశ్వరునితో ఏమేమో మాట్లాడా లనుకున్నాడు. పరమ మంగళదాయకాలైన ఆయన పవిత్ర నామాలను ఉచ్చరించా లనుకున్నాడు. పరమ పవిత్రాలైన ఆయన లీలలను అభివర్ణించా లనుకున్నాడు. విబుధులకు సంతోషాన్ని కలిగించే ఆయన పరాక్రమాన్ని ప్రస్తుతించా లనుకున్నాడు. తన మనస్సులోని కోరికను వెల్లడించా లనుకున్నాడు. కాని ఏమీ చేయలేక పోయాడు. ఆ ప్రజాకాముడైన దక్షప్రజాపతిని చూచి సర్వజ్ఞుడు, సర్వప్రాణి హృదయాంతర్యామి అయిన ఆ స్వామి అతని అభిప్రాయాన్ని గ్రహించి ఆర్తజన పరిపోషకాలైన మాటలతో ఇలా అన్నాడు. దక్షప్రజాపతీ! నిన్ను మెచ్చుకొన్నాను. నీ తపస్సు ఫలించింది. అచంచలమైన భక్తితో నన్ను సేవించి నా నుంచి వైభవోపేతమైన వరాలను అందుకొనడానికి నీకంటె అర్హుడు ఈ లోకంలో ఎవరున్నారు?ఇక నీ తపస్సు చాలించు. సకల ప్రాణికోటికి సమస్త శుభాలు చక్కగా సమకూరు గాక! నా మనస్సులోని సంకల్పం కూడా ఇదే. అది నీ వల్ల నెరవేరింది. విను. బ్రహ్మ, శివుడు, ప్రజాపతులు, మనువులు, ఇంద్రులు మొదలైనవారు సమస్త ప్రాణుల వైభవాలకు కారణమైనవారు. వీరంతా నా మహాశక్తి వలన జన్మించినవారే. ఇంద్రియ నిగ్రహం, నియమం, సంధ్యావందనం మొదలైన వానితో కూడిన తపస్సే నా హృదయం. అంగోపాంగ సహితమై ధ్యానరూపమైన విద్యయే నా దేహం. ధ్యానం మొదలైన విషయాలలో ప్రవర్తించే భావనాది క్రియయే నా ఆకారం. యజ్ఞాలే నా అవయవాలు. ధర్మమే నా ఆత్మ. దేవతలే నా ప్రాణాలు. వేదాలే నా స్వరూపం. ఈ జగత్తు ఉద్భవించడానికి పూర్వం నేను ఒక్కడినే ఉన్నాను. వెలుపల గానీ, లోపల గానీ వేరొక పదార్థం లేదు. అప్పుడు ఈ సమస్త విశ్వం సుషుప్తి అవస్థలో ఉండగా నేనొక్కడనే సంజ్ఞామాత్రంగా అవ్యక్తంగా ఉన్నాను. నేను అనంతుడనే. అనంత గుణాలతో కూడిన నా మాయవల్ల గుణశరీరమైన ఈ బ్రహ్మాండాన్ని, అయోనిజుడైన బ్రహ్మను సృష్టించాను. నా తేజస్సుతో నిండిన ఆ చతుర్ముఖ బ్రహ్మ సృష్టికార్యాన్ని చేపట్టి కూడా తనను కృతార్థుడైన వానిగా తలచుకోలేదు. అసమర్థతతో ఈ సృష్టి తనవల్ల కాదని భావించాడు. అప్పుడు తపస్సు చేయమని బ్రహ్మను నేను ప్రబోధించాను. చతుర్ముఖుడు నాచేత ప్రబోధితుడై ఘోరమైన తపస్సు చేసి మొట్టమొదటి సారిగా సృష్టికర్తలైన మిమ్మల్ని ప్రజాపతులుగా సృష్టించాడు. దక్షప్రజాపతీ! ఇప్పుడు పంచజన ప్రజాపతి పుత్రిక అయిన అసిక్ని అనే పేరు గల ఈ కన్యను నీకు ఇస్తున్నాను. నీవు ఈమెను భార్యగా పరిగ్రహించు. ఈమె యందు దాంపత్యధర్మంతో ప్రవర్తించి విస్తారంగా ప్రజలను సృష్టించు. అనంతరం ప్రజలందరూ నా మాయచే మోహితులై దాంపత్యధర్మాన్ని అవలంబించి ప్రజాభివృద్ధి కావించి నన్ను సేవించగలరు” అని దక్షప్రజాపతితో పలికి శ్రీమన్నారాయణుడు కలలో కనిపించిన పదార్థం వలె అంతర్ధానమైనాడు. అనంతరం దక్షప్రజాపతి విష్ణుదేవుని మాయచేత విమోహితుడై పంచజనుని పుత్రిక అయిన అసిక్ని అనే పత్ని యందు హర్యశ్వులు అనే పేరుగల వారిని పదివేలమంది కుమారులను కన్నాడు. ధర్మస్వభవులైన ఆ దక్షుని కుమారులు పదివేలమంది తమ తండ్రి ఆజ్ఞానుసారం ప్రజలను సృష్టించే నిమిత్తం తపస్సు చేయాలని నిశ్చయించారు. ఆ హర్యశ్వులు పడమటి దిక్కుకు ప్రయాణం చేశారు. అక్కడ సింధునది నముద్రంలో సంగమించే ప్రదేశంలో నారాయణ సరస్సు అనే తీర్థరాజాన్ని చూశారు. ఆ పుణ్యతీర్థం సమస్త దేవతలచేత, మునీశ్వరులచేత, సిద్ధపురుషులచేత సేవింపబడుతూ ఉంటుంది. ఆ తీర్థాన్ని దర్శించినవారు సమస్త పాపాల నుండి విముక్తులై నిర్మల హృదయులౌతారు. అటువంటి పవిత్ర తీర్థంలో ఆ హర్యశ్వులు స్నానం చేశారు. పరిశుద్ధమైన మనస్సులు కలవారై ప్రజాసర్గం నిమిత్తం పరమాత్మను ఉద్దేశించి భయంకరమైన తపస్సును ప్రారంభించారు. ఒకనాడు నారదుడు అక్కడికి వచ్చి వారితో ఇలా అన్నాడు.నాయనలారా! మీరు మిక్కిలి మూఢులుగా ఉన్నారు. భవిష్యత్తును చూడలేకున్నారు. మీరు పసిబిడ్డలు. ఈ భూమి పరిమాణం ఎంతో తెలియనివారు. ఇక జీవులను ఎలా సృష్టించగలరు? మహాత్ముడైన పురుషుడు ఒక డున్నాడు. స్త్రీరూపిణియై అనేక రూపాలు ధరించిన ప్రకృతి ఒకటున్నది. మాయలమారి అయిన ఆ ప్రకృతి పురుషుణ్ణి లోబరచుకుంటుంది. ప్రకృతి, పురుషుడు కలిసి సంసార ప్రవాహాన్ని సాగిస్తారు. ఈ సంసారమనే నది రెండు వైపులనుండి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహాన్ని అనుసరించి ఒక హంస విహరిస్తూ ఉంటుంది. ఆ హంసకు ఇరవై అయిదు మహిమ లుంటాయి. అయినా ఆ హంస సరియైన మార్గం కానరాక వజ్రకాంతులతో మెరుస్తున్న జలప్రవాహం పడే గోతి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హర్యశ్వులారా! వినండి. ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోకుండా కేవలం మీ త్రండి ఆజ్ఞలను పాటించడానికి పూనుకొన్నారు. అటువంటి మిమ్ములను తెలివి తక్కువవాళ్ళు అని కాకుండా ఇంకేమనాలి?”అని నారదుడు బోధించగా హర్యశ్వులు తమ బుద్ధితో విమర్శించుకొని తమలో తాము ఇలా తర్కించుకొన్నారు.

ముందుగా మనం సూక్ష్మబుద్ధితో క్షేత్రజ్ఞుడంటే ఎవరో తెలుసుకోవాలి. తర్వాత అజ్ఞానబంధన రూపమైన లింగదేహమంటే ఏమిటో గ్రహించాలి. ఆత్మ, దేహం ఈ రెండింటి స్వరూపాలను తెలుసుకోకుండా కేవలం నిరుపయోగాలైన కర్మలు ఆచరించిన మాత్రాన మోక్షం లభించదు. ఈ సమస్త లోకాలకు మూలకారకుడైన భగవంతుడు ఒక డున్నాడు. ఆయన సర్వేశ్వరుడు, పుట్టుక లేనివాడు, ఆత్మాశ్రయుడు, పురుషోత్తముడు. అటువంటి అంతర్యామి అయిన స్వామిని దర్శింపలేకుంటే బ్రహ్మకైనా మోక్షం లభిస్తుందా? పురుషుడు సంసారమనే పాతాళ కూపంలో కూరుకొనిపోయి బయట పడకుండా ఉంటే పరబ్రహ్మ స్వరూపాన్ని ఎట్లా గుర్తించగలుగుతాడు? కర్మలు ఆచరించటం వల్ల స్వర్గఫలాలు ప్రాప్తిస్తాయి. కాని కైవల్యం చేకూరదు.భగవన్నిష్ఠ లేకుండా దుష్కర్మలు చేసేవారికి ఏమీ ప్రయోజనం ఉండదు. చంచలమైన బుద్ధి చెడు గుణాల వ్యామోహానికి లొంగి రంగులు పులుముకొని వింత వింత వేషాలు వేస్తూ ఉంటుంది. అటువంటి దుర్గుణాల వలయంలో చిక్కుకొని దిక్కుతోచని వానికి మోక్షం అందనే అందదు.

 

మానవుడు అవకాశాన్ని కల్పించుకొని ఎడతెగకుండా సంతతిని సృష్టిస్తూ ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు. మాయ వల్ల అతిశయించిన ప్రవాహ వేగాన్ని తట్టుకోలేక సతమతమౌతూ ఉంటాడు. అహంకారం అతణ్ణి వివశుణ్ణి చేసి జ్ఞానమార్గానికి దూరం చేస్తుంది. బలవంతంగా వానిచేత దుష్కర్మలు చేయిస్తుంది. ఈ విధంగా పుట్టుక, చావు, రోగం అనే దురవస్థలలో మునిగి తేలే జీవుడు ఆ బంధలనుండి బయటపడి సకల సౌఖ్యాలకు ఆకరం, పరమ సుందరం అయిన మోక్షమార్గాన్ని ఎలా అందుకోగలడు?

దుర్బుద్ధి కల పురుషుడు వక్రబుద్ధి కల స్త్రీని పెండ్లాడితే ఆ సంసారం సరసంగా ఉండదు. అటువంటి సుఖదుఃఖ మయమైన సంసారంలో పడిన జీవుడు తిరిగి స్వస్వరూపాన్ని తెలుసుకోలేడు. అతనికి మోక్షం లభించదు.పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, పురుషుడు అనే ఇరవైయైదు తత్త్వాలను ప్రతిబింబించే అద్దం వంటిది పరతత్త్వం. అటువంటి పరతత్త్వాన్ని పట్టుకొనే ఉపాయం తెలుసుకోకుండా జీవుడు పనికిమాలిన పనులు చేస్తుంటే వానికి ఉత్తమమైన ముక్తిమార్గం ఎందుకు అందుతుంది?

 సంసారబంధంలో చిక్కుకొని మోక్షాన్ని అనుసంధానం చేసే ఆధ్యాత్మిక విద్యను పరిత్యజించి కర్మ కలాపంలో పడిన అజ్ఞానాంధుడైన అభాగ్యునికి శుభాలు ఎలా కలుగుతాయి? శక్తిమంతమైన ఈ కాలచక్రానికి సమస్త జగత్తును చుట్టచుట్టి పట్టుకొని సున్న చుట్టి మటుమాయం చేసే కిటుకులు తెలుసు. అటువంటి కాలస్వరూపాన్ని తెలుసుకోకుండా ఊరకే కర్మలు చేసేవానికి అక్షయమైన మోక్షపదం ఎలా దక్కుతుంది?

ఈ సృష్టి కార్యాన్ని మనతండ్రి అయిన దక్షప్రజాపతికి అతని తండ్రి బ్రహ్మదేవుడు అప్పగించాడు. అతి భయంకరమైన ప్రవృత్తి మార్గం పై ఆసక్తి లేనివాడై మనతండ్రి ఆ కార్యాన్ని పూర్తి చేయలేకపోయాడు.” అని ఆ దక్షుని కుమారులు తమలో తాము తర్కించుకొని...

రాజా! విను. ఆ హర్యశ్వులు నారద మునీంద్రుని హితోపదేశాన్ని శిరసావహించి భక్తితో అతనికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తత్క్షణమే మోక్షమార్గాన్ని అవలంబించి కృతార్థులయ్యారు. సహజ మధురమైన శ్రీమన్నారాయణుని పాదకమల మకరందాన్ని పానం చేస్తూ, తన మానసమనే మధుకరం పరవశిస్తుండగా, గుణవిశారదుడైన నారదుడు శ్రీహరి లీలలను తన మహతీవీణపై మ్రోగిస్తూ, యథేచ్ఛగా వెళ్ళిపోయాడు.

అప్పుడు దక్షుడు తన కుమారులు ప్రవృత్తి మార్గాన్ని పరిత్యజించి నివృత్తి మార్గాన్ని స్వీకరించి మోక్షప్రవృత్తులైనారని నారదుడు చెప్పగా విన్నాడు. అతనికి దుఃఖం పొంగి వచ్చింది. హృదయం వ్యాకుల మయింది. దక్షుడు దుఃఖిస్తూ ఉండగా బ్రహ్మదేవుడు వచ్చి ఓదార్చి “పూర్వంలాగా అపార గుణవంతులైన కొడుకులను పుట్టించు” అని ప్రోత్సహించాడు. దక్షుడు తండ్రి ఆజ్ఞను పాటించి అసిక్ని యందు శబలాశ్వులు అను చక్కనివారు, పుణ్యాత్ములు అయిన వేలకొలది కుమారులను కన్నాడు.తమను పుట్టించిన తండ్రి అంతరంగాన్ని తెలుసుకొన్న ఆ కుమారులు ప్రజలను సృష్టించడానికి దీక్ష వహించి, తపస్సు చేయటానికి వెళ్ళారు.ఆ శబలాశ్వులు తండ్రి ఆజ్ఞానుసారం ప్రజాసృష్టి కొరకు తపస్సు చేయాలనే కోరికతో తీర్థాలలో ఉత్తమమైన నారాయణ తీర్థాన్ని చేరుకున్నారు. ఆ పుణ్యతీర్థం దర్శనమాత్రం చేతనే సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలాన్ని అనుగ్రహిస్తుంది. సకల పాపాలను హరిస్తుంది. అటువంటి తీర్థరాజాన్ని స్పర్శించి తమ దోషాలను పోగొట్టుకొని పవిత్రులైనారు.

శబలాశ్వులు బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా అందుకోలేని పరబ్రహ్మాన్ని బ్రహ్మానందంతో ధ్యానం చేశారు. ఆ బాలకులు తమ నాలుకలతో పరమాత్మకు సంబంధించిన మంత్రాలను ఉచ్చరిస్తూ భగవంతుణ్ణి దర్శించాలనే కుతూహలంతో సమస్తమూ ఆ పరబ్రహ్మ స్వరూపంగా భావించి ఆనందమయుడైన ఆ దేవదేవుని గురించి తపస్సు చేశారు. ఆ శబలాశ్వులు ఒంటికాలి బొటనవ్రేలు నేలమీద మోపి నిక్కి నిశ్చలదేహులై నిలుచున్నారు. రెండు చేతులను జోడించి పైకెత్తి ఆకాశంలోకి చూశారు. సూటిగా ప్రసరించే చురుకైన చూపులతో సూర్యుణ్ణి చూస్తూ కొంతకాలం వాయు భక్షణం చేస్తూ మరికొంత కాలం నిరాహారులై లోకాలు కంపించగా, దేవతలు భయపడగా తపస్సు కొనసాగించారు.


🙏🙏🙏

సౌందర్య లహరి**

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఇరవైమూడవ శ్లోక భాష్యం - నాల్గవ భాగం


ధ్యానంలో అంబిక ఆచార్యులవారికి సౌందర్యలహరీ దైవతమైన కామేశ్వరీ రూపంలో కన్పించింది. లలితా సహస్ర నామ ధ్యాన శ్లోకం “సింధూరారుణ విగ్రహామ్, త్రినయనామ్” అని చెబుతోంది. ఆచార్యులవారు అదే చెబుతున్నారు. “సకల మరుణాభమ్, త్రినయనం” అదే శ్లోకంలో అంబికను

“తారానాయక శేఖరాం స్మితముఖీమ్ ఆపీన - వక్షోరుహాం” అని కూడా చెబుతోంది. తారానాయకుడు చంద్రుడు. ఆమె చంద్రశేఖరి. ఈ వాక్యంలో చెప్పబడిన రెండు లక్షణాలు ఆచార్యులవారు “కుచాభ్యా మానమం, కుటిలశశి చూడాల మకుటమ్” అని చెప్పారు. ఈ నాలుగు లక్షణాలు అంబికవే అయినా రెంటిని మాత్రమే ఆమెవిగా ఒప్పుకొని మరో రెంటి విషయంలో అమ్మవారిపై అభియోగం తీసుకొని వస్తున్నారు.


అంబిక మీద చౌర్య నేరారోపణ చేసిన ఆచార్యులవారు నిజానికి అంబిక నాలుగు లక్షణాలలో రెండు లక్షణాలను చౌర్యం చేశారు. కొందరు ఆచార్యులవారి కాలానికి అంబికకు ఈ త్రినయనములు, చంద్రశేఖరిత్వము ఉండి ఉండక పోవచ్చునని చెప్పవచ్చు. ఒక్క ప్రార్థనాశ్లోకంలోనే కాదు. సహస్ర నామాలలోకూడా త్రినయనా, చారు చంద్రకళాధరా అన్న నామములున్నాయి. శ్యామలాదండకం అంబికను చతుర్భుజే చంద్రకళావతంసే అని ప్రార్ధిస్తుంది. సర్వజ్ఞులైన ఆచార్యుల వారు సామాన్య ప్రజల దృష్టిపరంగా చమత్కరిస్తున్నారు - అని మనం గ్రహించాలి. 


దొంగిలించిన శివుని శరీరాన్ని అంబిక ఎక్కడ దాచిపెట్టింది. తనలోనే దాచిపెట్టుకొంది. శివునిలో శక్తి ఉన్నట్లు ఇక్కడ శక్తిలో శివుడు. శివునిలో సగం శరీరాన్ని అంబిక తినబట్టికదా అర్ధనారీశ్వరావతారం వచ్చింది. గోపాలకృష్ణ భారతి "పార్వతీ యెన్రోరు సీమాట్టి - ఆదిల్ పతియై తిన్రదుండు” “పార్వతియనే ఒక శ్రీమతి ఆదిలో పతిని తిన్నదున్నది” - తల్లులు తమ పుత్రుల యెడ విపరీతమైన వాత్సల్యంతో “నిన్ను తినేస్తా నమిలేస్తా” నంటూ ముద్దులు పెట్టుకోవడం చూస్తాం కదా! ప్రేమావేశంలో ఒక చౌర్యాభియోగమేమిటి హత్యాభియోగం వరకూ పోవచ్చు.


శివానందలహరిలో ఆచార్యులవారు ఇటువంటి హత్యాభియోగాలు ఎన్నో చేశారు. శివుడు ఒక ఏనుగును చంపి “కరీంద్ర భంగః” అయ్యాడు. పులిచర్మాన్ని కట్టుకోవడానికో హత్య, అడవిపందిని చంపడమో హత్య. పులిచర్మమేమో కౌపీనం - గజచర్మము ఉత్తరీయం. ఆచార్యుల వారికి చేతిలో లేడిని ధరించిన శివుడు పులివలెనూ, గజచర్మం ధరించి సింహంవలెనూ కన్పిస్తాడు. పులిచర్మం ధరించి పులిలా కన్పించడం సహజమే- సింహమెలాగ?.


శివుడు మన హృదయగుహలో వసిస్తాడు. సింహం గుహలలో నివసిస్తుంది. శివునికి అయిదు ముఖాలున్నాయి కనుక పంచముఖుడు. సింహం వెడల్పయిన ముఖంతో “పంచముఖి”. శివుడనే సింహము ఏనుగును, పులిని తిని వాటి చర్మాలను ధరించిందంటారు ఆచార్యులవారు. అదేరకంగా శివుని మింగివేసిన అంబిక ఆయన చిహ్నాలను మాత్రం తాను ధరించింది. సింహం ఏనుగు పులుల చర్మాలను నమలక వదిలివేసి ఉండవచ్చు. శివుని దేహం అంబికలోనికి వెళ్లిపోయిన తరువాత మిగతాదంతా కలిసిపోయినా మూడవకన్ను పొడుచుకువచ్చి ఉండవచ్చు. శివుని శరీరంలో భాగం కాని చంద్రకళ కూడా బహిర్గతంగా కన్పిస్తోంది. అయినా ఈ చౌర్యమూ, మింగి వేయడమూ రెండూ మిథ్యాభియోగాలే. మృత్యుంజయుడు అంబిక తాటంక మహిమ వలన మహా ప్రళయంలోనే నాశానమవడుకదా! 


(సశేషం)


కృతజ్ఞతలతో 🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

*శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం 18**

 **దశిక రాము**


**శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం 18**


నాగ కన్య చరిత్ర


 కింపురుష ఖండం లో తార్శ్ని వేనుడు అనే వాడి తమ్ముడు సుషేణుడు అనే గంధర్వ రాజు వున్నాడు .పావనుడు ,జ్ఞాని ,సుశీలుడు ,సత్య వ్రతి .దయా దాక్షిణ్యం వున్న వాడు .హనుమ పద సేవకుడు .నిత్యమూ హనుమను జలం తోనూ ,పంచామృతాలతోను సేవిస్తాడు .త్రికాల పూజా దురంధరుడు .దానాలు చేస్తూ ,హనుమ కు ప్రీతి గా హోమాలు చేస్తాడు .షడ్రసోపేత భక్ష్య భోజ్య,ములను నైవేద్యం పెట్టె వాడు .ఆ కాలమ్ లోనే ”నాగ కన్య ”అనే పతివ్రతా వుండేది .సుశీల ,సుగుణ మని ,సత్య వ్రాతు రాలు .సర్వ సద్గుణ సంపన్న .ఆమె రక్త రోముడు అనే క్రూర రాక్షసునికి భయ పడి గంధర్వ రాజైన సుషేనుడిని శరణు వేడింది .

ఆయనతో ”గాంధర్వ రాజా !కామాంధుడు ,క్రూరుడు అయిన రక్త రాముడు అనే రాక్షసుడు నాగ లోకం వచ్చి నన్ను బలాత్కారింప ప్రయత్నించాడు .నన్ను రక్షించే వారు లేక నీ శరణు వేడు కొంటున్నాను” అని వినయం గా మనవి చేసింది .సుషేణుడు నాగ కన్య తో ”భయం వద్దు అమ్మాయీ !నీ భయం పోగొట్టే ,నీ మనసుకు సంతృప్తి కలిగించే ఒక మాట చెబుతాను విను .వజ్ర దేహుడు అరమ పావనుడు పావని నీకు అండ గా నిలుస్తాడు .అతడు యజ్న భోక్త .ఆపన్న రక్షకుడు .ఆర్తి ని పోగొట్టే వాడు అలాంటి హనుమ మూల మంత్రాన్ని నీకు ఉప దేశిస్తాను .ఆచరించి ,మనోభీస్తాన్ని పొందు నేను కూఒడా ఆ జపం వల్లే సౌఖ్యం గా వున్నాను .”అని చెప్పి హనుమంమంత్రాన్ని ఉప దేశించాడు

ణాఆఆ కన్య హనుమంమంత్రాన్ని ”శ్రీ మన్నిరంతర కరుణామృత సాగర వర్షినీం ,పింగాక్షం ,అమోఘ మహేంద్రా యుధ క్షతాన్చిత మహా హనుమ ,అరుణాధర బింబ భూషిత ముఖ చంద్ర మండలం ,ఆతప్త కార్తస్వర భాస్వర ,కాన్తిచ్చతా కాంతి కలిత ,చూడా విరాజితం ,అప్రతిమ దివ్య మాణిక్య మండిత గండ భాగం ,అసమాన మాన నీయ ,రామా కాంత ,కర కమల కలిత పంచ జన్య బందుకంబుధారం ,ఇరావత నాసాదండ సుమత్త దీర్ఘ భుజార్గలం ,అనన్య సాధారణ సంకల్ప సంభావాస్తాన పీథ ,పరినాహి బాహ్వంతరం ,అమూల్య పీతాంబరాలంక్రుత కటి ప్రదేశం ,అనవరత వినత జన మనోరధ సాధన పాద యుగళం ,ఉష్ట్ర వాహనం ,అమర గంగా నదీ పరి వేష్టిత ,హాట కాచల ,వద్దీర్ఘ లాంగూల రంగ ఉత్తుంగ ,మంగ లాంగాకం ,అన్జనానంద వర్ధనం ,అమల ఊర్ధ్వ పుండ్రం ,తదు పరి కర్పూర సమ్మిశ్రిత శుభ్ర విభూతి ధారణం ,యజ్ఞోప వీత తులసీ పద్మాక్ష రుద్రాక్ష మాలాభి రామం ,శ్రీ రామ చంద్ర చరణార వింద ,సంధిత హృదయార విందం ,అఖిల కళ్యాణ గుణ వంతం ,హనుమంత ముపాస్మహే ”అని తీవ్రం గా తపస్సు చేసింది .ఆమె తపస్సు ఫలించి హనుమ దివ్య రూపం తో ప్రత్యక్ష మయాడు .

హనుమ నాగాకంయను ఉద్దేశించి ”కన్యా మణీ !ఎందుకు ఇంత ఘోర తపస్సు చేస్తున్నావు ?నీ కోరిక తెలియ జేస్తే నేను నీ కార్యాన్ని సాను కూల పరుస్తాను ”అన్నాడు .దానికి ఆమె తన కదా నతా వివరం గా విన్న వించు కొన్నది .స్వామి దర్శనం తో తాను ధన్యత చెందానని చెప్పింది .హనుమ ప్రీత మానసుడై అభయమిచ్చాడు .తనతో ఆమెను నాగ లోకానికి తీసుకొని వెళ్ళాడు .అక్కడ అతి భయంకరు డైన ,అతి బలవంతు డైన రక్త రోమ రాక్షసుని చూశాడు .వాడు ఆంజనేయుని మీదకు యుద్ధానికి వస్తుండటం గమనించి ”దుష్టుడా !నా ప్రతాపం తెలియక విర్ర వీగు తున్నావు .బ్రహ్మాదులకు కూడా నేను అసాధ్యుడిని ”అని తీవ్రం గా హుంకరించి తన తోక తో రక్త రామున్ని బంధించి నెల మీద విసిరి కొట్టాడు .ఆ దెబ్బకు వాడు తీవ్రం గా రోదిస్తూ ,రక్తం కక్కు కొని చచ్చాడు .దేవ యక్ష గాంధర్వ కింపురుషులు పూల వర్షం కురిపించి హనుమను కీర్తించారు .నాగ కన్యకు దీవేనలిచ్చి అనేక వరాలు అంద జేసి ఇక నుంచి భయం లేకుండా నాగ లోకం లో హాయిగా స్వేచ్చ గా ఉండమని చెప్పాడు .అక్కడి నుండి పావని అదృశ్యమై పంపా తీరం చేరి అక్కడ కొత్త కాలం వుండి ,మళ్ళీ గంధ మాదన పర్వతం చేరు కొన్నాడు .

నాగ కన్య చేసిన స్తోత్ర గద్యను నిండు మనసుతో భక్తీ తో ఎవరు పథి స్తారో వారికి అన్ని కార్యాలను దగ్గర వుండి తీరుస్తాడు హనుమ .ఈ సారి ఇంకో కధ


🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://t.me/SANAATANA


**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏

https://t.me/Dharmamu

మనిషి సంపాదన

 *"మనిషి సంపాదన కాలి చెప్పు అంత ఉండాలట!!*     

                *ఎందుకని?*

...

..కాలి చెప్పు పాదము యొక్క పరిమాణమునకు ఎలా సరిపోతుందో, అలా ధనము కూడా నీకు కావలిసినంత ఉంటే చాలు అని "వేదాంత" వాక్య. 


....లోకం లోని 84 లక్షల జీవరాసులలో తరువాతి తరానికి కూడబెట్టడం అన్న లక్షణం ఉన్న ఏకైక ప్రాణి మనిషి ఒక్కడే. మిగిలిన ఏ ప్రాణి అయినా తమ బిడ్డలకు స్వయంగా ఆహారం సంపాదించుకునే శక్తి వచ్చే వరకే వాటిని పోషిస్తాయి. 


....ప్రకృతి పరమైన ఇబ్బందులు దృష్ట్యా కేవలం ఒక్క చీమ మాత్రం ఆహారాన్ని నిలువ చేసుకుంటుంది.


....".లోకంలో అజ్ఞానం ఎప్పుడు మొదలు అయ్యింది అంటే ప్రింటింగ్ ప్రెస్సువచ్చిన తరువాత. లోకంలో దరిద్రం ఎపుడు వచ్చింది అంటే డబ్బు వచ్చినపుడు ".


.....పేపర్ కరెన్సీ రానంత వరకు ఎవరికి అవసరానికిసరిపడేదివారు వస్తువినిమయంతో సంపాదించుకొనితినేవారు. ఆరోజుల్లో దరిద్రం అంతగాలేదు. ఎంత తిండికి అవసరమో అంత సంపాదించుకునే వారు. మహా దాచుకున్న రెండు ధాన్యం బస్తాలు ఎక్కువగా ఉంటే సంవత్సరానికి సరిపోయేవి. 


... ఎపుడు కరెన్సీ వచ్చి దాచుకోవడం మొదలు అయిందో. ఒకడి కన్నా వేరొకరు పోటీ పడి రంగు కాగితాలు కట్టలు కట్టి దాచుకోవడం మొదలెట్టారు. ఫలితంగా వాడి కన్నా వీడికి, వీడి కన్నా వాడికి దరిద్రం వచ్చి పడింది.


....ప్రింటిగ్ ప్రెస్ వచ్చి ఎవరికి తోచిన విధంగా వారు పుస్తకాలు వ్రాసి లోకం మీదకు వదిలేశారు. వారి భావాలన్ని జనాలకు అంటుకున్నాయి. తెలిసి తెలియని వాడు ఆ పుస్తకాలు చదివి అసలు విషయం తెలుసుకోలేక అజ్ఞానంలోకి వెళ్ళి పోయాడు. 


.....వస్తు మార్పిడి ఉన్న రోజుల్లో జనాల్లో ఇంత దరిద్రం లేదు. ముందు తరాల వారికి దాచాలన్న వెర్రి కోరిక మనిషిని అజ్ఞానంలోకి నెట్టి వేస్తుంది.


  (బ్రహ్మశ్రీ చాగంటి.కోటేశ్వరరావు గారి ప్రవచనములు నుండి సేకరణ)