6, ఫిబ్రవరి 2021, శనివారం

పూజగదిలో

 ⚱️🙏🏻⚱️🙏🏻⚱️🙏🏻⚱️

🙏🏻⚱️🙏🏻⚱️🙏🏻⚱️🙏🏻




*⚱️పూజగదిలో చెంబు పాత్రలో నీటిని ఎందుకు వుంచాలి..??⚱️*




⚱️పూజగదిలో చెంబు పాత్రలో తీర్థం వుంచడం చేస్తుంటాం. సాధారణంగా పూజగదిలో చెంబు లేదా మట్టి పాత్రలో నీటిని వుంచడం చేయొచ్చు. ఇలా నీటిని వుంచి ప్రార్థించడం ద్వారా సర్వ దేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం. మహా నైవేద్యం కంటే నీటిని వుంచి పూజించడం ద్వారా దేవతలు సంతృప్తి చెందడంతో పాటు కోరిన వరాలను ఇస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.


⚱️రాగి చెంబులో మంచినీటిని వుంచి మంత్ర పఠనం చేశాక ఆ నీటిని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలుండవు. ప్రతిరోజు పూజ సమయంలో నీటిని వుంచి.. తీర్థంగా సేవిస్తే సమస్త దోషాలుండవు. ఈ నీటిని రోజు మార్చి రోజు చెట్లకు పోయడం చేస్తుండాలి.


⚱️ఇలా చేస్తే ఆ ఇంట వున్న నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. అలాగే పూజ చేసేటప్పుడు గంటను మోగించడం కూడా దుష్ట శక్తులను, ప్రతికూల శక్తులను పారద్రోలేందుకేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అలాగే పూజ సమయంలో ప్రకృతిని, పంచభూతాలను ఆరాధించడం ద్వారా ప్రతికూల శక్తులతో ఇబ్బందులుండవు.🌸

కామెంట్‌లు లేవు: