6, ఫిబ్రవరి 2021, శనివారం

పూర్ణమిదః

 🙏

ఓం పూర్ణమిదః పూర్ణమదం 

పూర్ణాత్ పూర్ణముదచ్యతే|

పూర్ణస్య పూర్ణ మాదాయా పూర్ణమేవావశిష్యతే||

ఓం శాంతి శాంతి శాంతిః 


తాత్పర్యం: 

భగవంతుడు పూర్ణుడు.... పూర్ణానికి పూర్ణం కలిపినా.. పూర్ణంలోంచి పూర్ణం తీసేసినా....

మిగిలేది పూర్ణమే..


ఇదే శ్రుతి వాక్యం. ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటే..... జీవితమంతా ఇందులోనే దాగుంది. మోక్ష మార్గం ఇందులోనే దాగుంది..... సమస్త సాధనాల సారం ఇందులోనే ఉంది.


0 + 0 = 0....

0 ౼ 0 = 0....


కానీ.....

0+1 = ఎంత అంటే.....

మనం వెంటనే 1 అని సమాధానం ఇస్తాం.....

ఇక్కడ సున్నా ...ఒకటితో కలవగానే అది 1 గా మారిపోయింది.


0+2 = 2.....

సున్నా 2 తో కలవగానే సున్న మాయమై.....

అది రెండుగా మారిపోయింది... అంటే.....

సున్న దేనితో కలిస్తే అదిగా మారిపోతూంది.


గాఢ నిద్రలో మనం పూర్ణమైన భగవంతుడిగా ఉంటాం. మనకప్పుడు ఏ భావోద్వేగాలు ఉండవు. ఎప్పుడైతే సున్న లాంటి మనం నిద్ర లేవగానే ప్రకృతితో కలుస్తామో... మనం ప్రకృతే ఐపోతున్నాం.


మనం దేనితో కలుస్తామో... దానిగా మారిపోతున్నాం


బాగా గమనించు....

నీ ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు...

అతడు గతంలో నీకు ఎంతగానో సహాయం చేసాడు.... ఆ వ్యక్తి ని చూడగానే... నీలో అతని పట్ల ఆత్మీయత కలుగుతుంది... నువ్వూ అతనికి ఎలాగైనా సహాయం చెయ్యాలని ఆలోచిస్తావు. 


ఒక వ్యక్తి నిన్ను ఎంతగానో బాధించాడు... అతను కనబడగానే నువ్వు కూడా అతన్ని ఎలాగైనా బాధించాలని ఆలోచిస్తావ్....


ఎదుటి వ్యక్తి ప్రేమతో వస్తే..... నీకూ అతని పట్ల ప్రేమ కలుగుతోంది.....


ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవిస్తే ..... నీకూ అతని పట్ల గౌరవం కలుగుతుంది.....


అంటే.....

మనం ఎదుటి వ్యక్తిలోని ఏ గుణాన్నయితే గమనిస్తున్నామో..... మనం మనకు తెలీకుండానే ఆ గుణంతో కలిసిపోయి... ఆ గుణం గానే మారిపోతున్నాం.....


"మనం దేనితో కలుస్తున్నామో... అది గా మారిపోతున్నాం."


మనలో సున్న (0) లా ఉన్న పరమాత్మ తత్వం..... 

ఎదుటి వ్యక్తీ లోని కోపం తో కలవగానే అది కోపంగా మారిపోయి మనకు కోపం వస్తుంది.


నువ్వు ప్రేమతో కలిస్తే ప్రేమగా..... 

ద్వేషం తో కలిస్తే ద్వేషంగా..... మారిపోతావ్.

 

ఎదుటివారి లోని అహంకారాన్ని చూస్తే నీలో కూడా అహంకారం మొలుస్తుంది.


అందుకే.....

ప్రతి జీవిలోనూ.....

మనిషిలోనూ.....

పరమాత్మ ఉన్నాడని గ్రహించి......

ఆయనతో అనుసంధానం అవ్వు.


అంటే నీలోని పూర్ణాన్ని.....

ఎదుటి వ్యక్తీ లోని పూర్ణంతో కలుపు.....

వచ్చేది పూర్ణమే.


ఎదుటి మనిషిని చూడగానే అతనిలోని దోషాలను గుర్తిస్తే.....

మనం అతనిలో దేన్ని ముందుగా చూస్తామో.....

మనం అదిగా మారిపోతామన్న 

మహా సత్యాన్ని గమనించాలి.


అందుకే ఎలాంటి వారిలోనైనా.....

భగవంతుణ్ణి చూడగల్గి.....

ఆయనతో కలిస్తే....

మనం కూడా భగవత్ తత్వంగా మారిపోతాము.


సదా ఈ సృష్టిలోని ప్రతి వస్తువులోనూ పరమాణు స్వరూపంతో ఉన్న భగవంతునితో అనుసంధానమవుతూ..... ఉండాలి.


హరిః ఓం తత్సత్.... 

సర్వేజనా సుఖినోభవంతు...!!


సేకరణ

కామెంట్‌లు లేవు: