17, జూన్ 2024, సోమవారం

కాకర రసం -

 ఇన్సులిన్ కి బదులు కాకర రసం  - 


       రొజూ పరగడుపున కాకరకాయల రసం 10 గ్రాముల మోతాదుగా తాగి పొట్టు గొధుమ పిండితో తయారుచేసిన రొట్టె లో వెన్న కలుపుకుని తింటూ ఉంటే మూడు నాలుగు వారాలలో చక్కర వ్యాధి పూర్తిగా అదుపులోకి వస్తుంది. 


               ఇన్సులిన్ ఎక్కువ ఉపయోగించేవారు తమ శారీరక బలాన్ని బట్టి కాకరాకు రసం 20 గ్రా వరకు తీసుకుంటూ క్రమంగా ఇన్సులిన్ మానివేయవచ్చు . 


   

        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

Panchaag


 

అర్ధాంగి

 రావుగారు రిటైర్ అయ్యారు.


పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ అమౌంట్ వచ్చింది. . రూ.20 లక్షలు, తన మరియు భార్య జాయింట్ అకౌంట్లో ఉంచి, ఆమెకు ఎటిఎం కార్డు పిన్ కూడా చెప్పారు. .


ఒకసారి పనిమీద గంట సేపు బయటకు వెళ్లాక ఫోన్ మర్చిపోయానని గుర్తుకొచ్చింది. వెంటనే ఇంటికి వచ్చారు. . సోఫాలో పడివున్న ఫోన్ చూసి కుదుటపడ్డారు. . సోఫాలో కూర్చొని భార్యను "ఫోన్ వచ్చిందా?" అని అడిగారు. .


"అవునండి. బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది జాయింట్ అకౌంట్ సమాచారాన్ని అప్డేట్ చేయమని "


రావుగారికి చెమటలు పట్టి సోఫాలో కూలబడ్డాడు. భయాందోళనతో "ఒ.టి.పి.. ఇచ్చావా ?" అని అడిగాడు.


భార్య: అవును. బ్యాంకు మేనేజర్ స్వయంగా నాకు ఫోన్ చేయగా నేను అతనికి ఇచ్చాను.


రావుగారు ఇంకా కుప్పకూలిపోయాడు. తల తిరుగుతున్నట్టు అనిపించింది. తన మొబైల్ ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశాడు. ఇందులో రూ.20 లక్షలు అలాగే ఉన్నాయి.


"ఏ ఓటీపీ ఇచ్చావు" అని అడిగారు.


భార్య అమాయకంగా చెప్పింది "ఓటీపీ 4042గా వచ్చింది. జాయింట్ అకౌంట్ కదా. నా వంతు ఓటీపీ 2021 ఇచ్చాను.


రావుగారికి పోయిన ప్రాణం వచ్చినట్లు అనిపించింది.


అందుకనే కదా అర్ధాంగి అంటారు. !.

🤣🤣🤣🤣

పరోపకారం

 *పరోపకారం*

భగవంతనికి ఇన్ని అవతార స్వీకారాలు ఎందుకు చేస్తాడన్నది ప్రశ్న. ఆయనకేమి అవసరం..?అంటే.. ధర్మ స్థాపన మరియు పరోపకారం కోసమే భగవంతుడు అవతారాలు స్వీకరిం చాడు. తాను స్వీకరించిన అన్ని అవతారాలలో దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి, అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని రక్షించాడు. ఇదంతా దేనికి అంటే? లోకానుగ్రహం కోసమే. భగవంతునికి వేరే ఏమీ సాధించవలసిన అవసరంలేదు. భగవంతుడే పరోపకారానికి ఇంత ప్రాధాన్యతనిస్తే మనమెంత ప్రాధాన్యమివ్వాలి? మన పూర్వీకులు దీనిగురించి ఉదాహరణగా చిన్న శ్లోకంలో చెప్పారు.

*परोपकृतिकैवल्ये तोलयित्वा जनार्दनः* |

*गुर्वीं उपकृतिं मत्वा अवतरान् दश अग्रहीत्* ||

పరోపకారం చేయటం ఉత్తమమా? లేక ఊరికే ఉండటం ఉత్తమమా? అని తులనాత్మకంగా పరిశీలించి భగవంతుడు పరోపకారమే ఉత్తమమని భావించి అవతారాలు స్వీకరించాడు. అలా భగవంతుడే పరోపకారానికి ప్రాముఖ్యత నిచ్చాడు. పరోపకారం పరమోత్తమం, పరపీడనం నికృష్ణం. రాక్షసులు పరపీడనంలో గడిపేవారు. అందువలననే వారిని భగవంతుడు సంహరించాడు.

మానవులు రాక్షసుల గుణగణాలను అలవరచకోకూడదు. ఇతరులకు ఎప్పుడూ సహాయపడే లక్షణం కలిగియుండాలి. మనకు వీలైనంత సహాయం చేయాలే తప్ప పరులకు అపకారం తలపెట్టకూడదు. అట్టి పరోపకార స్వభావం ఏర్పడితే మన జీవితం ధర్మబద్దంగా ఉంటుంది. మనం ధర్మానుయాయులం అవుతాం.

జగద్గురు శ్రీ శంకర భగవత్పాదులు కూడ అధర్మాన్ని నాశనంచేసి ధర్మాన్ని రక్షించి లోకోపకారం చేయటానికే అవతరించారు. అందువలన మన పూర్వ జన్మ పుణ్యంగా లభించిన మానవజన్మ సార్ధకతకై ధర్మాచరణ చేద్దాం. ధర్మాచరణ అంటే విచక్షణతో కూడిన పరోపకారమే. ప్రతియొక్కరూ ఈవిషయాన్ని గ్రహించి తమ జీవితాలను పవిత్రవంతం చేసుకోవాలి.


|| हर नमः पार्वती पतये हरहर महादेव ||


--- *జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు*