27, ఆగస్టు 2021, శుక్రవారం

శ్రీమద్భాగవతము

 *27.08.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2243(౨౨౪౩)*


*10.1-1355-*


*సీ. వేణునాళములమై వెలసిన మాధవుం*

  *డధరామృతము లిచ్చి యాదరించుఁ*

*బింఛదామములమై పెరిగిన వెన్నుండు*

  *మస్తకంబునఁ దాల్చి మైత్రి నెఱపుఁ*

*బీతాంబరములమై బెరిసిన గోవిందుఁ*

  *డంసభాగమునఁ బాయక ధరించు*

*వైజయంతికలమై వ్రాలినఁ గమలాక్షుఁ;*

  *డతి కుతూహలమున నఱుతఁ దాల్చుఁ*


*తే. దనరు బృందావనంబునఁ దరులమైనఁ*

*గృష్ణుఁ డానందమునఁ జేరి క్రీడ సల్పు*

*నెట్టి నోముల నైన ము న్నిట్టి విధము*

*లేల కామైతిమో యమ్మ! యింక నెట్లు?* 🌺



*_భావము: ఆ యువతులు శ్రీకృష్ణుని పట్ల వారి ఆత్మీయ భావాన్ని ప్రకటించుకుంటున్నారు: "కనీసము ఇలా వెదురు బొంగులమై పుట్టినా, శ్రీకృష్ణుని మురళిగా మారి ఆ పెదవులపై అమృతాన్ని అందించేవాడు; నెమలిపింఛములమై యున్నా, వెన్నదొంగ తల పైన అలంకరింపబడి మనతో సన్నిహితంగా ఉండేవాడు; పట్టువస్త్రములమై యున్నా, శ్రీకృష్ణుడు వదలకుండా ధరించి యుండేవాడు; విరిసియున్న వైజయంతీ మాలలమై ఉన్నా పద్మనేత్రుడు మనలను వేడుకతో మెడలో వేసుకొని ఉండేవాడు; బృందావనము లో చెట్లై పుట్టినా, చక్కగా ఆనందముతో మనలను చేరి ఆటలాడుతూ ఉండేవాడు; ఇవన్నీ ఏ నోములను నోచాయో, మనము మునుపు ఈ విధముగా ఎందుకు చెయ్యలేకపోయామో? వీటి లాగా ఈ అదృష్టానికి నోచుకోలేకపోయామేమిటో? ఇప్పుడెలాగే తల్లీ?"_* 🙏



*_Meaning: The assembled women were expressing their affection and fondness towards Sri Krishna: "Even if we were born like the hollow bamboo, Sri Krishna would have turned us as His flute and would give us the taste of the nectar flowing from His lips; If we were the feathers of peacock, He would have decorated us in His well made plaited braid and remained close to us; If we were silken vesture, He would have continuously worn us closely attached to His body; If we were Vaijayanti garland, He would have adorned us in His beautiful neck; At least were we born as trees in Brindavan, He would have been merrily playing around with us joyfully. Which great vows, all these items performed in their earlier births, we are not able to comprehend why we could not do the same? What is going to be our fate when we are not blessed with such good fortune of being close to Sri Krishna?"_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

 *27.08.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - రెండవ అధ్యాయము*


*జనకమహారాజునకును - తొమ్మిదిమంది యోగీశ్వరులకును మధ్య జరిగిన సంవాదమును తెలుపుట - నారదుడు వసుదేవునివద్దకు వచ్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*2.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*


*దేహేంద్రియప్రాణమనోధియాం యో జన్మాప్యయక్షుద్భయతర్షకృచ్ఛ్రైః|*


*సంసారధర్మైరవిముహ్యమానః స్మృత్యా హరేర్భాగవతప్రధానః॥12239॥*


దేహమునకు జనన మరణములు, ప్రాణములకు ఆకలిదప్ఫులు, మనస్సునకు భయము, బుద్దికి తృష్ణ, ఇంద్రియములకు శ్రమ - అనునవీ సాంసారిక ధర్మములు. ఉత్తమభక్తుడు భగవంతుని స్మరించుటలో తన్మయుడై పదేపదే సంభవించుచుండెడి ఈ సాంసారిక ధర్మములను సరకుగొనడు.


*2.50 (ఏబదియవ శ్లోకము)*


*న కామకర్మబీజానాం యస్య చేతసి సంభవః|*


*వాసుదేవైకనిలయః స వై భాగవతోత్తమః॥12240॥*


మనస్సునందు విషయభోగేచ్ఛలు, కర్మప్రవృత్తి, వాటికి మూలమైన వాసనలు లేనివాడు, పరమవిశ్వాసముతో పూర్తిగా వాసుదేవునే శరణుజొచ్చినవాడు, భగవద్భక్తులలో ఉత్తముడు (భాగవతోత్తముడు).


*2.51 (ఏబది ఒకటవ శ్లోకము)*


*న యస్య జన్మకర్మభ్యాం న వర్ణాశ్రమజాతిభిః|*


*సజ్జతేఽస్మిన్నహంభావో దేహే వై స హరేః ప్రియః॥12241॥*


దేహమునకు సంబంధించిన ఉత్తమ కులమునందు జన్మ, తపస్సు మొదలగు కర్మలు, బ్రాహ్మణాది వర్ణములు, బ్రహ్మచర్యాది ఆశ్రమములు, దేవమనుష్యత్వాది జాతులు మొదలగు వాటివలన అహంభావము లేనివాడు భగవంతునకు మిక్కిలి ఇష్టుడు అనగా భగవదనుగ్రహమునకు పాత్రుడు.


*2.52 (ఏబది రెండవ శ్లోకము)*


*న యస్య స్వః పర ఇతి విత్తేష్వాత్మని వా భిదా|*


*సర్వభూతసమః శాంతః స వై భాగవతోత్తమః॥12242॥*


దేహమనందును, సంపదలయందును 'ఇది నాది, ఇది పరునిది' అను భేదభావములేకుండా 'సకల పదార్థములును పరమాత్మ స్వరూపమే' అని భావించు సమబద్ధి గలవాడును, ఎట్టి సంఘటనలు తటస్థించినను జితాంతఃకరణుడై ఏ మాత్రమూ చలింపక శాంతచిత్తుడై యుండువాడును, భగవంతునకు ఎంతయు ప్రీతిపాత్రుడును, అహంకార మమకారములు లేనివాడును భాగవతోత్తముడు.


*2.53 (ఏబది మూడవ శ్లోకము)*


*త్రిభువనవిభవహేతవేఽప్యకుంఠస్మృతిరజితాత్మసురాదిభిర్విమృగ్యాత్|*


*న చలతి భగవత్పదారవిందాల్లవనిమిషార్ధమపి యః స వైష్ణవాగ్ర్యః॥12243॥*


చిత్తము వశము చేసికోలేని దేవతలు మొదలగువారందరు శ్రీహరి పాదపద్మములను అన్వేషించెదరు. కాని, వారికి అవి దుర్లభములు. భాగవతోత్తముడు అట్టి దివ్యపాదారవిందములనుండి తన మనస్సును అరక్షణమైనను మఱల్పక సతతము వాటి సేవలలోనే నిరతుడైయుండును. అట్టివానికి త్రిలోకరాజ్యాధికార సంపదను ఇయ్యజూపినను వాటివైపే చూడక అతడు భగవత్స్మరణ యందే నిమగ్నుడై యుండును. అట్టివాడు వైష్ణవాగ్రగణ్యుడు.


*2.54 (ఏబది నాలుగవ శ్లోకము)*


*భగవత ఉరువిక్రమాంఘ్రిశాఖానఖమణిచంద్రికయా నిరస్తతాపే|*


*హృది కథముపసీదతాం పునః స ప్రభవతి చంద్ర ఇవోదితేఽర్కతాపః॥12244॥*


భగవంతుని పరాక్రమము సాటిలేనిది. ఆ స్వామియొక్క పాదాంగుళుల నఖకాంతులనెడి చంద్రికల ప్రసారములచే శరణాగతులైన భక్తులయొక్క తాపత్రయములు పూర్తిగా అంతరించిపోవును. అప్పుడు వారు అనుభవించెడి ఆనందము అపరిమితము. అట్టి శరణాగతుల హృదయములయందు మరల కామక్రోధాది శత్రువులకు తావుండదు. చంద్రోదయ మైనంతనే విరబూసిన పండువెన్నెలల చల్లని కాంతులకు సూర్యకిరణ తాపములు ఉపశమించునుగదా!


*2.55 (ఏబది ఐదవ శ్లోకము)*


*విసృజతి హృదయం న యస్య సాక్షాద్ధరిరవశాభిహితోఽప్యఘౌఘనాశః|*


*ప్రణయరశనయా ధృతాంఘ్రిపద్మః స భవతి భాగవతప్రధాన ఉక్తః॥12245॥*


తుమ్మినా, దగ్గినా, ఆవులింత వచ్చినా, నవ్వినా, ఏడ్చినా, కూర్చున్నా, లేచినా, రోగము-నొప్పి వచ్చినా వెంటనే భగవన్నామమును స్మరించుట కొందరికి పరిపాటి. ఇట్లే ఏ విధంగానైనా పరవశుడై స్వామిని స్మరించువాని పాపరాశులు పటాపంచలైపోవును. భక్తులు శ్రీహరి పాదపద్మములను ప్రేమభక్తి అనెడు త్రాడుతో కట్టివేసి తమ హృదయమునందు నిలుఫుకొందురు. అట్టి ప్రేమభక్తుని హృదయమును ఆ శ్రీహరియే స్వయముగా విడిచిపట్టడుగాక విడిచిపెట్టడు. అట్టివాడే భగవద్భక్తులలో ముఖ్యమైన వాడగును.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే ద్వితీయోఽధ్యాయః (2)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *జనకమహారాజునకును - తొమ్మిదిమంది యోగీశ్వరులకును మధ్య జరిగిన సంవాదమును తెలుపుట - నారదుడు వసుదేవునివద్దకు వచ్చుట* అను

రెండవ అధ్యాయము (2)


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*398వ నామ మంత్రము* 27.8.2021


*ఓం అవ్యక్తాయై నమః*


సృష్టికి ముందున్న స్థితి అయిన అవ్యక్తస్థితిలో ఉన్న జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అవ్యక్తా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం అవ్యక్తాయై నమః* అని స్మరిస్తూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే ఆ అవ్యక్తస్వరూపిణి ఆ భక్తులకు వ్యక్తస్వరూపంగా గోచరించి సకలాభీష్టసిద్ధిని అనుగ్రహిస్తుంది.


బ్రహ్మము అవ్యక్తము. అమ్మవారు అట్టి బ్రహ్మస్వరూపిణి. గనుక అవ్యక్తాయని అనబడినది. అమ్మవారు శక్తిపీఠాలలో వివిధ శక్తిస్వరూపములతో వ్యక్తమౌతున్నది. జ్యోతిర్లింగ స్వరూపుడు అయిన పరమేశ్వరుని వామాంకములో వివిధనామాలతో, వివిధరూపాలతో వ్యక్తమౌతున్నది. గ్రామదేవతగా, కొండదేవతగా వివిధరూపాలలో సమయాచారులకు, వామాచారులకు వారివారి మనోనేత్రాలలో వివిధరూపాలలో వ్యక్తమౌతున్నది. సహస్రనామాలలో శతసహస్ర (అనేక) రూపాలతో ఆ తల్లి వ్యక్తమౌతున్నది. శ్రీచక్రాధిదేవతగా, చతుష్షష్టికోటియోగినీ గణములమధ్య చతుష్షష్టికోటి రూపాలతో అవ్యక్తమౌతున్నది ఆతల్లి. ఈ వ్యక్తస్వరూపాలకు పూర్వము మొట్టమొదటి రూపము అవ్యక్తమే. సృష్టికి ప్రథమసృష్టి మూలప్రకృతియొక్క అవాఙ్మానసగోచరము. మహామాయ. ఇంద్రియములకు గోచరముకాదు. గనుకనే ఆ శ్రీమాత *అవ్యక్తా* యని అనబడినది. పంచకృత్యపరాయణ అయిన ఆ తల్లి ఫ్రళయకాలంలో నామరూపాత్మకమైన జగత్తును తనలో కలుపుకుంటుంది. అన్నీ అస్పష్టమైన పదార్థాలుగా తనలో దాచుకొని *అవ్యక్తా* యని అనబడుచున్నది.


అమ్మవారి సూక్ష్మరూపము బీజాక్షరస్వరూపము. కేవలం భావనామాత్రమై కంటికి గోచరముకాని స్థితిలో ఉండి *అవ్యక్తా* అని అనబడుచున్నది. అమ్మవారు *మూలమంత్రాత్మికా*, *మూలకూటత్రయ కళేబరా* అని అంటున్నాము. అంటే అవ్యక్తమైన సూక్ష్మస్వరూపిణి. ఆ అవ్యక్తమైన సూక్ష్మస్వరూపంలో అమ్మవారి ముఖపంకజము *వాగ్భవకూటము* - *(శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా)*, కంఠమునుండి కటి పర్యంతము *కామరాజకూటము* - *(కంఠాదః కటి పర్యంత మధ్యకూటస్వరూపిణి)*, కటిభాగము క్రింద నుండి పాదములవరకూ *శక్తికూటము* - *(శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణి)*. సూక్ష్మరూపమంతయూ అవ్యక్తమే. కాబట్టి అమ్మవారు *అవ్యక్తా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం అవ్యక్తాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹



మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*981వ నామ మంత్రము* 27.8.2021


*ఓం జ్ఞానజ్ఞేయ స్వరూపిణ్యై నమః*


ఇక్కడ జ్ఞానము అంటే బ్రహ్మజ్ఞానము. పరమేశ్వరి బ్రహ్మజ్ఞాన స్వరూపిణి. అలాగే జ్ఞేయ అనగా జ్ఞానముచే (ఆ తల్లి అనుగ్రహము) పొందదగినది. గనుక అమ్మ వారు జ్ఞానము మరియు ఆ జ్ఞానముచే పొందదగినది. గనుకనే ఆ అమ్మ *జ్ఞానజ్ఞేయ స్వరూపిణీ* యని అనబడినది. ఆ తల్లియొక్క స్థూలరూపాన్ని మనోనేత్రాలతో తిలకించితే ఆ సుందరదరహాస వదనంలో ఆ అమ్మవారి జ్ఞానస్వరూపం కనిపిస్తుంది. అలా మనోనేత్రాలతో చూడాలంటే మనంకూడా జ్ఞానము కలిగినవారిగా, శ్రీవిద్యా తత్త్వమును తెలిసినవారిగా ఉంటే ఆ సుందరదరహాస వదనం మనను అనుగ్రహిస్తున్నట్లు కనబడుతుంది. అందుకనే అమ్మవారు జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. అమ్మవారిని అంతర్ముఖంగా స్మరిస్తూ, పరిశుద్ధమైన మనసుతో ఉన్న భక్తులకు ఆ తల్లి జ్ఞానజ్ఞేయస్వరూపిణిగానే గోచరిస్తుంది. అమ్మవారు *అంతర్ముఖ సమారాధ్య* అంతేగాని బహిర్ముఖ సమారాధ్యకాదు. 


చేరవలసిన గమ్యము అమ్మవారే. అనుసరించ వలసిన మార్గముకూడా అమ్మవారే. గనుక ఆ తల్లిని *ఓం జ్ఞానజ్ఞేయ స్వరూపిణ్యై నమః* అని స్మరిస్తూ నమస్కరించవలయును.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

ముకుందమాల స్తోత్రమ్ శ్లోకం : 31

 ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                    శ్లోకం : 31       

                           SLOKAM : 31 

                                                

इदं शरीरं परिणामपेशलं

पतत्यवश्यं श्लथसन्धि जर्जरम् ।

किमौषधैः क्लिश्यसि मूढ दुर्मते

निरामयं कृष्णरसायनं पिब ॥ ३१ ॥


ఇదం శరీరం పరిణామపేశలం

పతత్యవశ్యం శ్లధసంధిజర్జరం I    

కిమౌషధై: క్లిశ్యసి మూఢ దుర్మతే

నిరామయం కృష్ణరసాయనం పిబ ॥ 31


ఓ మూఢుడా! దుర్మతీ! 

    ఈ శరీరము అనేక సంధులు కలిగి స్వాభావికంగా దుర్భలమైంది.    

    వయస్సు మళ్ళినప్పుడు మరింత దుర్భలమౌతుంది.    

    వృద్ధావస్థలో కీళ్ళనొప్పుల లాంటి ఎన్నో రోగాలతో కృశించి నశించక తప్పదు. 

    దీని చికిత్స కోసం ఎన్ని ఔషధాలు సేవించినా రోగమరణాలు లేకపోతాయా?    

    అందువల్ల ఇలాంటి ఉపద్రవాలు లేకుండటానికి ‘శ్రీకృష్ణనామ’ మనే ఉత్తమ ఔషధాన్ని పానం చేయి.


    This body’s beauty is fleeting, and 

    at last the body must succumb to death after its hundreds of joints have stiffened with old age. 

    So why, bewildered fool, are you asking for medication? 

    Just take the Kṛishṇa elixir, the one cure that never fails.   


https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*పెద్దిశెట్టి గారు...పాలరాతి విగ్రహం..*


"శ్రీధరరావు గారూ..స్వామివారి సమాధి వద్ద స్వామివారిది పాలరాతి విగ్రహం ప్రతిష్ట చేస్తే ఎలావుంటుందీ?..మా ఇద్దరికీ ఆలోచన కలిగింది..మిమ్మల్ని సలహా అడిగి ఆపైన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాము.." అన్నారు శ్రీ చక్కా కేశవులు గారు, శ్రీ మీరాశెట్టిగారు..నాన్నగారు కొంచెం సేపు ఆలోచించారు.."స్వామివారి సమాధి మందిరం చాలా చిన్నది కదా..అందులో విగ్రహం ఎలా పెట్టాలి?.."అన్నారు..


"పడమర వైపు గోడ ను కొద్దిగా తొలగించి ఆ ప్రదేశం స్వామివారి విగ్రహాన్ని పెడదాము..సమాధి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది..మంటపం లో ఉన్న భక్తులకు కూడా శ్రీ స్వామివారి విగ్రహం చక్కగా కనబడుతుంది..ఏమంటారు?.." అన్నారు కేశవులు గారు..


ఈ ఆలోచన అందరికీ నచ్చింది..కానీ ఎంత పరిమాణం లో విగ్రహం చేయించాలో ఎవరికీ తోచలేదు..శ్రీ స్వామివారి సమాధి గది చాలా చిన్నది..అందులో ఎటుచూసినా మూడు అడుగుల వెడల్పుతో సమాధి నిర్మాణం జరిగింది..సమాధికి, గది గోడకు మధ్య రెండు అడుగుల ఖాళీ స్థలమే ఉన్నది..మంటపం లో ఉన్న భక్తులకు కూడా స్పష్టంగా కనబడేలా..సమాధి వద్ద ప్రదక్షిణాలకు ఇబ్బంది లేకుండా ఉండేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి..ఇది కొంచెం కష్టం తో కూడుకున్న పని..రెండు మూడు రోజుల పాటు ఈ విషయమై ఆలోచన చేశారు..


ఆ సమయం లోనే గోనుగుంట పెద్దిశెట్టి గారు తాను శ్రీ స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని..అందుకు అయ్యే మొత్తం ఖర్చు తానే భరిస్తాననీ తెలిపారు..శ్రీ కేశవులు గారు, మీరాశెట్టి గారు ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్నారు..శ్రీధరరావు గారితో చెప్పారు..వారూ సరే నన్నారు..రెండు మూడు రోజుల పాటు తర్జన భర్జన చేసిన తరువాత కూడా..విగ్రహం ఎత్తు ఎంతవుండాలో ఒక నిర్ణయానికి రాలేకపోయారు..మరో రోజు గడిచింది..అందరూ కూడా ఇక స్వామివారే ఈ సమస్య ను తీర్చాలి అని ఒక నిశ్చయానికి వచ్చారు..ఎప్పుడైతే వీళ్ళందరూ శ్రీ స్వామివారిని శరణు వేడారో.. ఆరోజే పెద్దిశెట్టి గారికి విగ్రహం ఎత్తు ఎంత ఉండాలో మనసులో తట్టింది..తనకు వచ్చిన ఆలోచనను అందరికీ చెప్పారు పెద్దిశెట్టి గారు..అదే ఖరారు చేశారు..


శ్రీ స్వామివారి విగ్రహాన్ని పాలరాతి తో చేయించారు..ముందు అనుకున్న విధంగానే..శ్రీ స్వామివారి సమాధి గది లో పడమర వైపు ఉన్న గోడలో..విగ్రహం పట్టే విధంగా కొంతమేర తొలగించి..శాస్త్రోక్తంగా విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు..ప్రతిష్ట కార్యక్రమం మాత్రం పెద్దిశెట్టి గారి కుమారుడు సుబ్బారావు దంపతుల చేతుల మీదుగా జరిగింది..మళ్లీ కొన్నాళ్ల తరువాత..శ్రీ స్వామివారి విగ్రహానికి వెండితో కవచం చేయించాలని ఒక ప్రతిపాదన చేశారు గానీ..కార్యరూపం దాల్చలేదు..శ్రీ స్వామివారు దిగంబరి గానే వుండేవారు కనుక..కవచం తో విగ్రహాన్ని కప్పివేయడం సరికాదు అనే భావన తో ఆ ఆలోచనను విరమించుకున్నారు..


శ్రీ స్వామివారి విగ్రహం ప్రతిష్ట జరిగిన సంవత్సరం నుండీ..శ్రీ స్వామివారి ఆరాధన ఉత్సవం లో భాగంగా..శ్రీ స్వామివారి విగ్రహానికి, మరియు శ్రీ స్వామివారి సమాధి కి గంధాన్ని అద్ది..తరువాత ఆ గంధాన్ని దత్తదీక్షాపరులకు పంచడం జరుగుతున్నది..ప్రతిరోజూ శ్రీ స్వామివారి సమాధిని దర్శించే భక్తులు..ఈ పాలరాతి విగ్రహానికి మ్రొక్కుకుంటూ వుంటారు..అదొక ఆనవాయితీగా మారిపోయింది..


ఆనాడు శ్రీ పెద్దిశెట్టి గారికి మనసులో తట్టిన ఆలోచన కార్యరూపం దాల్చి..ఈనాడు ఎందరో భక్తుల ఆరాధ్య హేతువుగా మారిపోయింది.."నాదేముంది..? స్వామివారే తన విగ్రహం ఎంత పరిమాణం లో ఉండాలో నిర్ణయించి..నా ద్వారా పలికించారు.." అనేవారు వినయంగా పెద్దిశెట్టి గారు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).