25, డిసెంబర్ 2022, ఆదివారం

ఆదిత్య హృదయం:


*ఆదిత్య హృదయం:   అర్ధములతో …

              ➖➖➖✍️



ఆదిత్య హృదయాన్ని ప్రతీరోజు ఉదయాన్నే మూడుసార్లు చొప్పున పఠించేవారికి దైర్యం, జ్ఞానం లాంటి దైవగుణాలు పెరుగుతాయి! శత్రువులు కూడా మిత్రులు అవుతారు. కఠిన సమస్యలు తొలగిపోతాయి! చింతలు చికాకులు పోయి,దైవభక్తి పెరుగుతుంది!  ఇతరుల మీద ద్వేషం, అసూయ, గిట్టనితనం, మాత్సర్యం లాంటి అవగుణాలు పోయి, మనస్సు ఎప్పుడూ ఈశ్వరుడిపై లగ్నం అవుతుంది.  అన్నిటికీ మించి సూర్యభగవానుడు ఆరోగ్యప్రదాత! 


అసలు ఆదిత్యహృదయం వల్ల లాభాలు ఇంతా అంతా అని చెప్పడం కానిపని! ఆదిత్యహృదయం అంటేనే అక్షయపాత్ర! 


శ్రీరాముల వారు ఈ ఆదిత్య హృదయం పఠించిన తర్వాతే రావణాసురుడిపై యుద్ధానికి వెళ్ళి విజయం సాధించారని శ్రీమద్రామాయణం చెబుతున్నది.


ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుని ప్రార్థిస్తే ఆయురారోగ్యాలు, తలపెట్టే కార్యక్రమాలలో విజయం సిద్ధిస్తుంది.


ఆదిత్య హృదయాన్ని శ్రద్ధగా పఠిస్తే అనారోగ్యం దూరం అవుతుంది, ముఖవర్చస్సు మెరుగవుతుంది.


ఆదిత్య హృదయం లోని శ్లోకాలు వాటి అర్ధములు.


1. తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం

రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం 


#అర్థము: యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతా క్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యెదుట నిలిచి యుండెను.


2. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం

ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః 


#అర్థము: యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో ఇట్లు పల్కెను.


3. అగస్త్య ఉవాచ:

రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం

యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి 


#అర్థము : ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనము మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు.


4. ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం

జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం 


#అర్థము : ఈ ఆదిత్యహృదయ అను స్తోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్ర జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగ ప్రసాదించునది.


5. సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం

చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం 


#అర్థము : ఇది పరమపావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును ఆధివ్యాధులను తొలగించి ఆయుస్సును వృద్ధిపరుచును. సర్వ జపములలో శ్రేష్ఠమైనది. కావున దీనిని జపించుట ఎంతేని ఆవశ్యము.


6. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం

పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం 


#అర్థము : అనంతమైన బంగారుకిరణములతో శోభిల్లుచు, జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సుగలవాడు, సమస్త భువనములన నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము.


7. సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః

ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః 


#అర్థము : ఇతడు సమస్త దేవతలకు ఆత్మయైనవాడు. తేజో రాశి. తన కిరణములచే లోకమునకు శక్తిని, స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో గూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు.


8. ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః

మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః 


#అర్థము : బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు 



9. పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః

వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః 


#అర్థము : పితృదేవతలు. వసువులు, సాధ్యులు. అశ్వినీదేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగువారి స్వరూపములు అన్నిము ఇతనివే. షడృతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే.


10. ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్

సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః 


#అర్థము : ఆదిత్యుడు జగత్‌సృష్టికి కారకుడు. జనులు తమవిధులు నిర్వర్తించుటకు ప్రేరణయిచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షములద్వారా జగత్తును పోషించి తన కిరణములను ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండములు ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు.


11. హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్

తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండక అంషుమాన్ 


#అర్థము : శ్యామవర్ణముగల రథాశ్వములు గలవాడు. అసం ఖ్యాకములైన కిరణములు గలవాడు. సప్త అను పేరుగల రథాశ్వముగలవాడు. రథమునకు ఏడు గుఱ్ఱములుగలవాడు. తేజో నిధానములైన కిరణములు గలవాడు. సర్వసంహారకుడు. జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరల సృజించుటకై ఆవిర్భవించెడివాడు. నిరంతరము తన కిరణములచే ప్రకాశించుచుండువాడు.


12. హిరణ్యగర్భహ్ శిశిరస్తపనో భాస్కరో రవిః

అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనహ్ 


#అర్థము : బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములతో బాధపడువారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు, తపింపజేయువాడు. దివ్యములైన వెలుగులను గూర్చువాడు. సకల లోకములకు స్తుతిపాత్రుడు. దివాసమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితి దేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు.


13. వ్యోమనాథ స్తమోభెదీ ఋగ్ యజుస్సామ పారగః

ఘన వృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః 


#అర్థము : ఆకాశమునకు అధిపతియైనవాడు. రాహువును ఛేదించు లక్షణముగలవాడు. పూర్వాహ్ణమున ఋగ్వేదరూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేదరూపమును, సాయంసమయమున సామవేదరూపమునను అలరారుచుండెడివాడు. ఘనముగా వర్షములను కురిపించుచుండువాడు. అందువలననే జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు.


14. ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః

కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః 


#అర్థము : వేడిని కలిగియుండువాడు. వృత్తాకారమైన బింబము గలవాడు. విరోధులను రూపుమాపువాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగియుండువాడు. మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తపింపజేయువాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు గలవాడు. సకల ప్రాణులయందును అనురక్తి గలిగి యుండువాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు.


15. నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః

తెజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే 


#అర్థము : నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతియైనవాడు. విశ్వస్థితికి హేతువు. అగ్న్యాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు. పన్నెండు రూపములతో విలసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం.


16. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయె నమః

జ్యోతిర్గణాణాం పతయే దినధిపతయే నమః 


#అర్థము : స్వామీ! నీవు పూర్వగిరియందును, పశ్చిమగిరి యందును విలసిల్లుచుండువాడు. గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.


17. జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః

నమో నమస్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః 


#అర్థము : జయములను, శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణముగల రథాశ్వములుగలవాడవు. వేలకొలది కిరణములు గలవాడవు. అదితిపుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.


18. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః

నమః పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః 


#అర్థము : నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగ ప్రయాణించువాడవు. పద్మములను వికసింపజేయువాడవు. జగత్ప్రళయమునకు పిమ్మట మరల సృజించుటకై ఆవిర్భవించు నట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.


19. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే

భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషె నమః 


#అర్థము : బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సంపన్నుడవు. కాంతికి నిధియైన వాడవు. ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రస్వరూపుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.


20. తమొఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనె

కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః 


#అర్థము : తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును, శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించి నవారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతఘ్నులను నశింపజేయుచు, దివ్యతేజస్సు విరజిమ్ముచు, జ్యోతులకు అధిపతివైన నీకు నమస్కారము.


21. తప్త చామీక రాభాయ హరయే విష్వకర్మణే

నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే 


#అర్థము: బంగారమువంటి వన్నెగలవాడవు. ఆహుతులను గ్రహించువాడవు. సర్వజగత్కర్తవు. తమస్సులను పారద్రోలువాడవు. ప్రకాశస్వరూపుడవు. జగత్తున జరిగెడి సర్వజనుల కర్మలకు సాక్షియైన వాడవు. కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారము.


22. నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః

పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః 


#అర్థము: రఘునందనా! ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమొనర్చును. పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తపింపజేయును. వర్షములను ప్రాసాదించుచుండును.


23. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః

ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం 


#అర్థము: ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును. వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే యుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే. తత్ఫలస్వరూపమూ ఇతడే.


24. వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ

యాని కృత్యాని లోకేషు సర్వేషు రవిః ప్రభుః 


#అర్థము : ఇతడు వేదవేద్యుడు. యజ్ఞఫలస్వరూపుడు. లోకములో జరిగెడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు.


25. ఏనమాపత్సు కృత్ శ్రేషు కాంతారేషు భయేషు చ

కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవః 


#అర్థము : రఘురామా! ఆపదలయందును, కష్టముల యందును, దుర్గమమార్గములయందును, భయస్థితులయందును ఈ స్వామిని కీర్తించినవారికి నాశము ఉండదు.


26. పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం

ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి 


#అర్థము : దేవదేవుడు, జగత్పతియైన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్యహృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహా సంగ్రామము నందు విజయము పొందగలవు.


27. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి

ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం 


#అర్థము : మహాబాహో! రామా! ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలిగి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను.


28. ఏతత్ శృత్వా మహాతెజా నష్టశొకొభవత్తదా

ధారయామాస సుప్రీతొ రాఘవహ్ ప్రయతాత్మవాన్ 


#అర్థము : మహాతేజస్వియైన శ్రీరాముడు అగస్త్యమహాముని ద్వారా ఈ ఆదిత్యహృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఆదిత్యహృదయ మంత్రమును మనస్సు నందు నిలుపుకొనెను.


29. ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్

త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ 


#అర్థము : పిదమ ముమ్మారు ఆచమించి శుచియై సూర్యభగవానుని జూచుచు ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయెను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను.


30. రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్

సర్వ యత్నేన మహతా వధె తస్య ధృతోభవత్ 


#అర్థము : మిక్కిలి సంతుష్టుడైయున్న ఆ రాముడు రావణుని జూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృతనిశ్చయుడయ్యెను.


X. అథ రవి రవదన్నిరీక్ష్య రామం

ముదితమనాః పరమం ప్రహృష్యమాణః

నిశిచరపతి సంక్షయం విదిత్వా

సురగణమధ్యగతో వచస్త్వరేతి


#అర్థము : పిమ్మట దేవతలమధ్యనున్న సూర్యభగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమును పొందినవాడై, పరమ సంతోషముతో శ్రీరాముని జూచి రామా! త్వరపడుము అని పలికేను.


X. సూర్యోపాసనలో అత్యంత గుప్తనామం "హిరణ్యగర్భాయ" ఈ నామం అర్ధం  సృష్టి-స్థితి-లయ కర్తలయిన బ్రహ్మ-విష్ణు-రుద్ర స్వరూపం ఇతడే అని అర్ధం 


భక్తితో " భగవతే హిరణ్యగర్భాయ నమః " అని సూర్యభగవానుణ్ణి స్మరిస్తే విశేషంగా ఆ సూర్యనారాయణస్వామి అనుగ్రహానికి పాత్రులు అవుతారు.✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

  A Collection from

Admin

Brahmana Samaakhya

తప్పకుండ తెలుసుకోవలసినవి🕉️

 తప్పకుండ తెలుసుకోవలసినవి🕉️*


1. లింగాలు : 3

        పుం, స్త్రీ, నపుంసక.


2. వాచకాలు : 3.

      మహద్వా, మహతీ, అమహత్తు.


3. పురుషలు : 3.

    ప్రథమ, మధ్యమ, ఉత్తమ.


4. దిక్కులు : 4.

      తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం.


 5. మూలలు : 4.

         ఆగ్నేయం, నైఋతి, వాయువ్యం, ఈశాన్యం.


6. వేదాలు : 4.

  ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం.


7. ఉపవేదాలు : 4.

   ధనుర్వేదం, ఆయుర్వేదం, గంధర్వ వేదం, శిల్ప


8. పురుషార్ధాలు : 4.

   ధర్మ, అర్థ, కామ, మోక్షాలు.


9. చతురాశ్రమాలు : 4.

     బ్రహ్మ చర్యం, గార్హస్య, వానప్రస్థం, సన్యాసం.


10. పంచభూతాలు : 5.

     గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని.


 11. పంచేంద్రియాలు : 5.

        కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం.


 12. భాషా భాగాలు : 5.

         నామవాచకం, సర్వనామం, విశేషణం,         

         క్రియ, అవ్యయం.


13. ప్రధాన కళలు : 5.

    కవిత్వం, చిత్రలేఖనం, నాట్యం, సంగీతం, శిల్పం.


14. పంచకావ్యాలు : 5.

     ఆముక్తమాల్యద, వసుచరిత్ర, మనుచరిత్ర, పారిజాతాపహరణం, శృంగార నైషధం.


15. పంచగంగలు : 5.

      గంగ, కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర.


16. దేవతావృక్షాలు : 5.

    మందారం, పారిజాతం, కల్పవృక్షం,సంతానం, హరిచందనం.


17. పంచోపచారాలు : 5.

      స్నానం, పూజ, నైవేద్యం, ప్రదక్షిణం, నమస్కారం.


18. పంచాగ్నులు : 5.

        బడబాగ్ని, జఠరాగ్ని, కష్టాగ్ని, వజ్రాగ్ని, సూర్యాగ్ని.


19. పంచామృతాలు : 5.

        ఆవుపాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె.


20. పంచలోహాలు : 5.

       బంగారం, వెండి, రాగి, సీసం, తగరం.


21. పంచారామాలు : 5.

        అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రా(ద)క్షారామం.


22. ధర్మరాజు అడిగిన ఊళ్ళు :

 1. అవిస్థల/కుశస్థల (కన్యాకుబ్జ/Kannauj)

 2. వారణావతం(ఇక్కడే లక్కఇల్లు కట్టించాడు దుర్యోధనుడు. మీరట్ నుండి 19కి.మీ. అనీ, కాదూ, ఋషీకేష్ దగ్గర శివపురి అనీ చరిత్రకారుల ప్రస్తావన)

 3. వృకస్థల(గుర్గావ్ దగ్గర, హర్యానా)

 4. మాకండి(గంగా నది ఒడ్డున ఓ పల్లెటూరు

(మరొక ఊరు కౌరవులకు ఏదనిపిస్తే ఆ ఊరు) 

23. వేదాంగాలు(స్మ్రతులు) : 6.

 శిక్ష , వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం.


24. షడ్రుచులు : 6.

     తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు.


25. అరిషడ్వర్గాలు(షడ్గుణాలు) : 6.

 *కామం* (అంటే కోరిక అని మాత్రమే అర్థం. అంటే మన మనసులో కావాలి అని కలిగే ప్రతిదీ కూడ కోరికే), 


*క్రోధం* (అనగా కోపం లేదా ఆగ్రహం. మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు), 


*లోభం* (అంటే తాను సంపాదించుకున్నది, పొందింది తనకే సొంతమని భావించడం. అందులో నుంచి పూచిక పుల్ల కూడా ఇతరులకు చెందకూడదని దాన, ధర్మాలు చేయకపోవడం), 


*మోహం*(లేని దానిని అనుభవించాలన్న కోరిక), 


*మదం*(అంటే కొవ్వు, పొగరు. మదం 8 రకాలు అంటే అష్టమదములు

అవి - 

1. అన్నమదం, 

2. అర్థమదం, 

3. స్త్రీ మదం

4. విద్యామదం, 

5. కులమదం, 

6. రూపమదం,

7. ఉద్యోగమదం, 

8. యౌవన మదం 


*మాత్సర్యం*(తనకున్న సంపదలు ఇతరులకు ఉండకూడదని, తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి ఉండటం)


26. ఋతువులు : 6.

   వసంత, గ్రీష్మ, వర్ష, శరద్ఋతువు, హేమంత, శిశిర.


27. షట్చక్రాలు : 6.

        మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, 

        అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలు.


28. షట్చక్రవర్తులు : 6.

     హరిశ్చంద్రుడు, నలుడు, సగరుడు, పురుకుత్సుడు, పురూరవుడు,  

కార్తవీర్యార్జునుడు.


29. సప్త ఋషులు : 7.

  కశ్యపుడు, గౌతముడు, అత్రి, విశ్వామిత్రుడు, 

భరద్వాజ, జమదగ్ని, వశిష్ఠుడు.


30. సప్తగిరులు : 7.

       శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి,       

       వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి.


31. కులపర్వతాలు : 7.

      మహేంద్ర, మలయ, సహ్య, శుక్తిమంతం, గంధమాధనం, 

వింధ్య, పారియాత్ర.


32. సప్త సముద్రాలు : 7.

       ఇక్షు, జల, క్షీర, లవణ, దధి, సూర, సర్పి.


33. సప్త వ్యసనాలు : 7.

      జూదం, మద్యం, దొంగతనం, వేట, 

 వ్యభిచారం, దుబార ఖర్చు, కఠినంగా మాట్లాడటం.


34. సప్త నదులు : 7.

     గంగ, యమునా, సరస్వతి, గోదావరి,            

  సింధు, నర్మద, కావేరి.


35. ఊర్ధ్వలోకాలు : 7.

      భూ, భువర్ణో, సువర్ణో, తపో, జనో, మహా, సత్య.


36. అధోః లోకాలు : 7.

      అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ.


37. జన్మలు : 8.

     దేవ, మనుష్య, రాక్షస, పిశాచి, పశు, పక్షి, జలజీవ, కీటక.


38. కర్మలు : 8.

     స్నానం, సంధ్య, జపం, హోమం, స్వాధ్యాయం, దేవపూజ, ఆతిథ్యం, 

 వైశ్వదేవం.


39. అష్టదిగ్గజాలు :

      ఐరావతం, పుండరీకం, కుముదం, సార్వభౌమం, అంజనం, సుప్రతీకం, 

 వామనం, పుష్పదంతం.


40. అష్టదిగ్గజకవులు : 8.

     నంది తిమ్మన, పెద్దన, ధూర్జటి, పింగళి సూరన, తెనాలి రామకృష్ణ, రామరాజభూషణుడు, 

అయ్యలరాజు రామభద్రుడు, 

మాదయగారి మల్లన.


41. శ్రీ కృష్ణుని అష్ట భార్యలు: 

       రుక్మిణి, సత్యభామ, జాంబవతి, నాగ్నజితి, కాళింది, మిత్రవింద, భద్ర, లక్ష్మణ


42. అష్ట భాషలు : 8.

        సంస్కృతం, ప్రాకృత, శౌరసేని, పైశాచి, సూళికోక్తి, అపభ్రంశం, ఆంధ్రము.


43. నవధాన్యాలు : 9.

      గోధుమ, వడ్లు, పెసలు, శనగలు, కందులు, నువ్వులు, మినుములు, 

 ఉలవలు, అలసందలు.


44. నవరత్నాలు : 9.

  ముత్యం, పగడం, గోమేధికం, వజ్రం, కెంపు, నీలం, కనకపుష్యరాగం, 

పచ్చ (మరకతం), ఎరుపు (వైడూర్యం).


45. నవధాతువులు : 9.

         బంగారం, వెండి, ఇత్తడి, రాగి, ఇనుము, కంచు, సీసం, తగరం, కాంత లోహం.


46. నవరసాలు : 9.

     హాస్యం, శృంగార, కరుణ, శాంత, రౌద్ర, భయానక, బీభత్స, అద్భుత, వీర.


47. నవబ్రహ్మలు : 9.

     మరీచి, భరద్వాజ, అంగీరసుడు,  

  పులస్య్తుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, వశిష్ఠుడు, వామదేవుడు.


48. నవ చక్రాలు : 9.

     మూలాధార, స్వాధిష్టాన, నాభి, హృదయ, కంఠ, ఘంటికా, భ్రూవు,      

 గగన, బ్రహ్మ రంధ్రం.


49. నవదుర్గలు : 9.

         శైలపుత్రి, బ్రహ్మ చారిణి, చంద్రఘంట,  

         కూష్మాండ, స్కందమాత, కాత్యాయని,  

          కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి.


50. దశ బలములు : 10.

           విద్య, స్నేహ, బుద్ధి, ధన, పరివార,  

          సత్య, సామర్ధ్య, జ్ఞాన, దైవ, కులినిత.


51. దశ సంస్కారాలు : 10.

           వివాహం, గర్భాదానం, పుంసవనం,  

           సీమంతం, జాతక కర్మ, నామకరణం,  

           అన్నప్రాశనం, చూడాకర్మ(చౌలకర్మ), 

           ఉపనయనం, సమవర్తనం.


52. దశ మహాదానాలు : 10.

       

గో, సువర్ణ, రజతం, ధాన్యం, వస్త్ర, నెయ్యి, తిల, సాలగ్రామం, లవణం, బెల్లం.


53. అర్జునుడికి గల పేర్లు: 10.

 అర్జునుడు, పార్థుడు, కిరీటి,  

 శ్వేతవాహనుడు, బీభత్సుడు, జిష్ణుడు, విజయుడు, సవ్యసాచి,  

 ధనుంజయుడు, ఫల్గుణుడు.


54. దశావతారాలు : 10.

   మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ,  

           బుద్ధ, కల్కి.


55. జ్యోతిర్లింగాలు : 12.     

             హిమలయపర్వతం:

1. కేదారేశ్వరుడు,

2.కాశీ విశ్వేశ్వరుడు,

మధ్యప్రదేశ్: 3.మహాకాళేశ్వరుడు, 4.ఓంకారేశ్వరుడు.

గుజరాత్: 5.సోమనాథుడు,   

6.నాగేశ్వరుడు.

మహారాష్ట్ర :

7. భీమశంకరుడు, 8.త్ర్యంబకేశ్వరుడు,             

9.ఘృష్ణేశ్వరుడు, 

10.వైద్యనాదేశ్వరుడు.

ఆంధ్రప్రదేశ్: 11. మల్లికార్జునుడు (శ్రీశైలం)

తమిళనాడు: 12.రామలింగేశ్వరుడు.


56. షోడశ మహాదానాలు : 16.

 గో, భూ, తిల, రత్న, హిరణ్య, విద్య, దాసి, కన్య, శయ్య, గృహ, అగ్రహార, రథ, గజ, అశ్వ, ఛాగ (మేక), మహిషి (దున్నపోతు).


57. అష్టాదశ వర్ణనలు : 18.

      నగరం, సముద్రం, ఋతువు, చంద్రోదయం, అర్కోదయం,  

 ఉద్యానము, సలిలక్రీడ, మధుపానం,  

            రథోత్సవం, విప్రలంభం, వివాహం, 

            పుత్రోత్పత్తి, మంత్రము, ద్యూతం, 

            ప్రయాణం, నాయకాభ్యుదయం, 

            శైలము, యుద్ధం.


58. అష్టాదశ పురాణాలు : 18.

              మార్కండేయ, మత్స్య, భవిష్య,         

              భాగవత, బ్రహ్మ, బ్రహ్మవైవర్త, 

              బ్రహ్మాండ, విష్ణు, వాయు, వరాహ, 

              వామన, అగ్ని, నారద, పద్మ, లింగ, 

              గరుడ, కూర్మ, స్కాంద.


59. భారతంలో పర్వాలు : 18. ఆది,సభా,అరణ్య,విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్ర్తీ, శాంతి, అనుశాసన, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థాన, స్వర్గారోహణ.


60. సంస్కృత రామాయణంలో 

 కాండలు: 6.

బాల ,అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ.

         

61. శంఖాలు వాటి పేర్లు:

          భీముడు - పౌండ్రము

          విష్ణువు - పాంచజన్యం

          అర్జునుడు - దేవదత్తం.


62. విష్ణుమూర్తి ఆయుధాల పేర్లు:              

           ధనస్సు - శార్ఙ్గగం,

           శంఖం-పాంచజన్యం,

           ఖడ్గం- నందకం,

           చక్రం - సుదర్శనం.


63. విల్లుల పేర్లు:

               అర్జునుడు - - గాండీవం

               శివుడు - - పినాకం

               విష్ణువు - శార్ఙ్గగం


64. వీణలు--పేర్లు:

               కచ్ఛపి---సరస్వతి,

                మహతి---నారదుడు,

                కళావతి---తుంబురుడు.


65. అష్టదిక్కులు-పాలకులు-ఆయుధాలు:


తూర్పు ఇంద్రుడు వజ్రాయుధం 

పడమర వరుణుడు పాశం

ఉత్తర కుబేరుడు ఖడ్గం

దక్షిణం యముడు దండం

ఆగ్నేయం అగ్ని శక్తి 

నైఋతి నిరృతి కుంతం 

వాయువ్యం వాయువు ధ్వజం 

ఈశాన్యం ఈశానుడు త్రిశూలం.


66. మన్వంతరాలు 

విభజించబడినది.

స్వాయంభువ మన్వంతరము

స్వారోచిష మన్వంతరము

ఉత్తమ మన్వంతరము

తామస మన్వంతరము

రైవత మన్వంతరము

చాక్షుష మన్వంతరము

వైవస్వత మన్వంతరము (ప్రస్తుత)

సూర్యసావర్ణి మన్వంతరము

దక్షసావర్ణి మన్వంతరము

బ్రహ్మసావర్ణి మన్వంతరము

ధర్మసావర్ణి మన్వంతరము

భద్రసావర్ణి మన్వంతరము

దేవసావర్ణి మన్వంతరము

ఇంద్రసావర్ణి మన్వంతరము


67. సప్త స్వరాలు :

స - షడ్జమం - (నెమలిక్రేంకారం) 

రి - - రిషభం - - (ఎద్దు రంకె) 

గ - - గాంధర్వం - - (మేక అరుపు) 

మ - - మధ్యమ - - ( క్రౌంచపక్షి కూత) 

ప - - పంచమం - - (కోయిల కూత) 

ద - - దైవతం - (గుర్రం సకిలింత) 

ని - - నిషాదం - (ఏనుగు ఘీంకారం)


68. సప్త ద్వీపాలు:

జంబూద్వీపం - - అగ్నీంద్రుడు 

ప్లక్షద్వీపం - - మేధాతిధి

శాల్మలీద్వీపం - - వప్రష్మంతుడు

కుశద్వీపం - - జ్యోతిష్యంతుడు

క్రౌంచద్వీపం - - ద్యుతిమంతుడు

శాకద్వీపం - - హవ్యుడు

పుష్కరద్వీపం - - సేవకుడు


69. తెలుగు నెలలు: 12

              చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, 

              శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజం, 

              కార్తీకం, మార్గశిరం, పుష్యం, 

              మాఘం, ఫాల్గుణం.


 70. రాశులు :12.

మేషం, వృషభం, మిథునం, కర్కాటకం,

సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం.


71. తిథులు 15.

పాఢ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య /పౌర్ణమి.


72. నక్షత్రాలు 27.

అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాబాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి


🌹🕉️శ్రీ మాత్రే నమః🌹


🙏సర్వేజనా సుఖినోభవంతు🙏

నీతి కధ

 *‼️❓నీతి కధ🌹✔️*


🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂


*ఒక సాధువు నడిచి వెళుతూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు..*


*ఎదురుగా వున్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు.*


*సాధువుకి మంచి భోజనం పెట్టి, చీకటి పడింది కదా ఈ పూటకి ఇక్కడే వుండమని కోరాడు ఆ ఇంటి యజమాని.*


*మాటల్లో తన కష్టసుఖాలు ముచ్చటిస్తూ, యజమాని,*


*" ఏమిటో నండీ ! సంసారంలో సుఖం లేదండీ..మీజీవితమే హాయి !! అన్నాడు*


*వెంటనే ఆ సాధువు " అయితే నా వెంట రా ! నీకు మోక్ష మార్గం చూపిస్తాను " అన్నాడు.*


*యజమాని కంగారుపడుతూ.*


*" అలా ఎలా కుదురుతుంది ??*


*పిల్లలు చిన్నవాళ్ళు.. వాళ్ళను పెంచి పెద్ద చేయాలి కదా !!" అన్నాడు.*


*సాధువు మాట్లాడలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి.*


*ఆ సాధువు మరల అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూ‌సి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని సాదరంగా ఆహ్వానించి, అతిథి మర్యాదలు చేశాడు.మాటలలో సాధువు అన్నాడు, " పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు కదా నా వెంట రా! నీకు మోక్ష మార్గం చూపిస్తాను " యజమాని తడబడుతూ " ఇప్పుడే కాదు స్వామీ ! పిల్లలు స్థిరపడాలి...*


*వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి ....." అన్నాడు.*


*ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధువు మళ్లీ అదే.... యజమాని ఆతిథ్యం... సాధువు అదే మాట ..... యజమాని జవాబు కొంచెం విసుగ్గా.." పిల్లలకి డబ్బు విలువ తెలియదు.. అందుకని నేను దాచినంతా ఆ చెట్టు కింద పాతిపెట్టాను..వీలు చూసుకుని చెబుతాను. ఒక పెద్ద ఇల్లు కట్టాలి.. మీలాగా నాకు ఎలా కుదురుతుంది " అన్నాడు..*


*ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి*


*సాధువు మళ్లీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళి పోతుండగా ఆ యజమాని కొడుకు గమనించి ఆహ్వానించాడు .*


*అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు.. సాధువు కి కొంచెం బాధనిపించింది.*


*ఆతిథ్యం స్వీకరించి బయటికి వచ్చాడు.. చెట్టు కింద ఒక కుక్క కూర్చుని వుంది యజమాని అనుమానంగా దాని వంక చూశాడు..*


*సందేహంలేదు యజమాని కుక్కగా పుట్టాడు.. సాధువు మంత్రజలం దాని మీద జల్లి ,*


*" ఏమిటి నీ పిచ్చి మోహం ??? 🐕 గా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా ?? నా వెంట రా.. నీకు మోక్ష మార్గం చూపిస్తాను "*


*అన్నాడు.. యజమాని " ఆ మాట మాత్రం వినలేను..*


*ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు ఎవరూ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా " అన్నాడు.*


*మళ్ళీ కొన్నాళ్ళకి సాధువు ఆ దారిన వస్తూ ఆ ఇంటి వైపు చూశాడు . కుక్క కనపడలేదు పక్కవారిని అడిగితే అది పోయిందని చెప్పారు.అయినా సాధువు అనుమానంగా చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది.. పరీక్షగా చూసాడు ఖచ్చితంగా ఆ యజమాని మళ్ళీ 🐍 గా...*


*మంత్రజలం చల్లి, " ఇంకా ఈ ఇంటిని వదిలి వెళ్ళవా ???*


*నాతో.............*


*........" అన్నాడు*


*ఆ ఒక్క మాట మాత్రం అనకండి. నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకి దక్కనీయకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా..*


*సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్లి , అతని కొడుకులతో " మీ నాన్న ఆ చెట్టు కింద దాచిపెట్టాడు. కానీ జాగ్రత్త! అక్కడ పాము ఉంది " అన్నాడు.అనగానే కొడుకులు ఎగిరి గంతేసి,,*


*కర్రలు తీసుకుని బయలుదేరారు. తన కొడుకులే తనను కర్రలతో చావగొడుతుంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు*


*కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది*


*నీతి*


*గృహస్థాశ్రమం లో బాధ్యతలు తప్పవు కాని మోహబంధాలు ఎంత గట్టిగా మనం కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం.*


*ఇహమే కాదు పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించాలి .... !!!*

మెల్లగా చంపేస్తున్న మైదా*

 *మెల్లగా చంపేస్తున్న మైదా*    


మైదా పిండి ఆరోగ్యానికి  హానికరం అని అందరికీ తెలుసు. అయినా పిల్లలు పెద్దలు ఎవరూ మైదా పిండి తో తయారయ్యే స్నాక్స్, టిఫిన్, బిస్కెట్లు తినటం మానటం లేదు. రెస్టారెంట్ల లలో పూరిలు, మైసూర్ బొండాలు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లలో పానీపూరీలు, సమోసాలు లాగించేస్తూ ఆరోగ్యాన్ని ఫాస్ట్ గా తగలేసుకుంటున్నాము.అయినా ఆరోగ్య స్పృహ లేదు .. 


ఇటీవల కేరళలోని ప్రజల్లో వచ్చిన మైదా మీద  వ్యతిరేకత తో వచ్చిన alertness తో ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఈ write up ని సేకరించి పోస్టు చేస్తున్నాను.


*మృత్యువు వెంటాడుతుంది.....మైదా రూపంలో!*


 గత నాలుగు నెలల్లో చెన్నైలో మరణించిన వారి వయస్సు 33/31/34/35/37/39/41/43/46

 వీరిలో ఎక్కువ మంది గుండెపోటుతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది..

 

దయచేసి మైదాతో చేసిన పదార్థాలను   తినవద్దు.

 

 పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు అందరూ ఇష్టపడే చవకైన విషపూరితమైన ఆహారం మైదాతో చేసిన పదార్థాలు. 

  

పరోటా దుకాణాలు తమిళనాడు అంతటా విస్తృతంగా కనిపిస్తాయి.

 ఈ పరోటాలలో  ఎన్నిరకాలో?

 అంతులేదు. 

 

  యువతను తనవైపు తిప్పుకునే అసంఖ్యాకమైన పరోటాలు ఉన్నాయి .... దీని అమ్మకాలు రోజురోజుకు దూసుకుపోతున్నాయి.

 అయితే ఈ ప్రొటీన్ శరీరానికి హాని కలిగిస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు.


 మైదా వల్ల కలిగే నష్టాలపై కేరళలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు.  ఐరోపా, బ్రిటన్, చైనా వంటి దేశాలు మైదా ఉత్పత్తులను నిషేధించాయి.  


రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో గోధుమల కొరత కారణంగా, పిండితో చేసిన ఆహారాన్ని పంపిణీ చేయడం ప్రారంభమైంది.  పరోటా కూడా ప్రాచుర్యం పొందింది.పరోటా లో  ఫైబర్ లేదు.  కాబట్టి మన జీర్ణశక్తి తగ్గిపోతుంది.  ముఖ్యంగా (రాత్రిపూట) పరోటా తినడం మానేయండి.  *దీంతోపాటు మైదా పిండితో చేసిన రొట్టెలు, కేకులు,బిస్కెట్లు  తినడం మానేయాలి.* 

 లేకుంటే మనం అనారోగ్యం పీడితులమై  చంపబడతాము. 


 మెత్తగా రుబ్బిన గోధుమ పిండి లేత పసుపు రంగులో ఉంటుంది. కానీ దాన్నుంచి మైదా తయారు చేసేందుకు *బెంజాయిల్ పెరాక్సైడ్* అనే రసాయనాన్ని(Chemical) గోధుమ పిండిలో కలుపుతారు.

 ఈ రసాయనమే మనం జుట్టుకు వేసుకునే రంగులోని రసాయనం.  ఈ విష రసాయనం, మైదాలోని ప్రొటీన్లతో కలిసి క్లోమగ్రంధిని దెబ్బతీసి మధుమేహాన్ని కలిగిస్తుంది.

 అదనంగా, పిండిని మెత్తగా చేయడానికి మరియు సింథటిక్ పిగ్మెంట్‌గా చేయడానికి  *అలోకాన్*  అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు.

 భారతదేశంలో మైదా ఎక్కువగా తింటారు.

 ప్రపంచవ్యాప్తంగా మధుమేహం మన దేశంలోనే ఎక్కువగా ఉండడానికి కారణం ఇదే అంటున్నారు నిపుణులు. 


 మైదా కిడ్నీ, గుండె జబ్బులకు కూడా కారణమవుతుందని చెబుతున్నారు.


 కృష్ణకుమార్ అనే స్వచ్ఛంద సేవకుడు నేతృత్వంలోని *మైదా విసర్జన సమితి* కేరళలో ఈ విషయంపై అవగాహన కల్పించడంలో ఈ  స్వచ్ఛంద సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.

 మైదా దుష్ప్రవర్తనపై పాలక్కాడ్ జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు.  పలు జిల్లాల్లో ప్రచారం కొనసాగుతోంది.  "ఇక నుండి మన సంప్రదాయ ఆహారాలు జీడిపప్పు, రైస్, మొక్కజొన్నతో _విదేశీ ఆహారమైన మైదా అనే ప్రోటా మిక్స్‌డ్ కెమికల్‌ని ఏరి పారేయ్యాలని మా కేరళ వాసులం  డిసైడ్ అయ్యాము. అందుకై కృషి చేస్తున్నాము." అంటున్నారు కేరళ ప్రజలు. 

మరి మన సంగతేమిటి? 


సేకరణ. మానస సరోవరం 


ఆరోగ్యం కూడా ముఖ్యం


మైదా తయారీ కి వాడే వస్తువుల పైన. మైదా పైనా GST పెంచి ఆ వచ్చిన ఆదాయంతో ప్రకృతి వ్యవసాయం చేసే వారికి సహాయం చేస్తే ప్రజలు  ఆరోగ్యంగా ఉంటారు


మైదా వస్తువు ధర పెరిగినప్పుడు వినియోగదారులు మైదా వాడకానికి తగ్గించే ప్రయత్నం చేస్తారు మరియు ప్రత్యామనాయంగా వాడే వస్తువుల మీద దృష్టి మీద పెడతారు


నాకూ likes అవసరం లేదు క్లియర్ గా మేసేజ్ చదవండి నేను ఎం అన్న తప్పు చెపితే సరిచేయండి నచ్చితే షేర్ చేయండి

బ్రాహ్మణ ఫుడ్ కొరకు రైళ్లల్లో ప్రయాణించే వాళ్లకోసం

 బ్రాహ్మణ ఫుడ్ కొరకు రైళ్లల్లో ప్రయాణించే వాళ్లకోసం ఆయా ఊర్ల మొబైల్ నెంబర్లు మీకు ఇవ్వడం జరిగింది


అనంతపురం 

సరళ 8374392377


వారణాసి లక్ష్మి 8985667737.


బాపట్ల హరిప్రియ 9000120344.


షిర్డీ అనిల్. 9511111585


తిరుపతి విజయలక్ష్మి 9959859227


వైజాగ్ భువనేశ్వరి  8008390978.


రాజమండ్రి ప్రసన్న 6304049434.


గుంటూరు సుందరి 7386709737.


హైదరాబాద్ ప్రసన్న 9346747694.


వరంగల్ హేమ 9703100005.


అరుణాచలం 

లక్ష్మికాంత్

+91 88702 18670

కె శ్రీనివాస్,  తుని( వైజాగ్)

7674023603,

8686126646


విజయవాడ లాస్య క్యాటరింగ్ 9248487878


శ్రీ(బ్రాహ్మణ) కర్రీస్ పాయింట్ తిరుపతి 9959859227

తలరాత మార్చే గీత*

 *మన తలరాత మార్చే గీత* 

                 ➖➖➖

*మన లోపల ఒకడు ఉన్నాడు.... అసలైన వాడు.*


*కానీ వాడిదగ్గరికి వెళ్ళాలి అంటే          6 గురు  దొంగలు అడ్డుగా ఉన్నారు..*


*కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనే 6 గురు  దొంగలు..!*


*ఈ 6 గురిలో 4 గురు దొంగల నుండి సులభంగా తప్పించు కోవచ్చు, కానీ ఇద్దరు దొంగలనుండి తప్పించు కోవడం చాలా కష్టం..*


*ఆ ఇద్దరూ పెద్ద రౌడీలు. వాళ్ళే కామం, క్రోధం....ఈ ఇద్దరు రౌడీలు ఎక్కడ దాక్కొని ఉంటారు అంటే రజో గుణం అనే ఇంట్లో..*


*" కామ ఏష క్రోధ ఏష రజో*

  *గుణ సముద్భవహ "* 


*ఈ కామం, క్రోధం అనేవి రజో గుణం నుండి వస్తున్నాయి అని గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు..*


*కాబట్టి రజో గుణం అనే ఇంట్లో                          ఈ ఇద్దరు దొంగలు ఉంటారు*.


*ఈ దొంగలను పట్టుకోవాలి అంటే రజో గుణం అనే ఇంటికి తాళం వేయాలి. అంతే, ఇంక వాళ్ళు బయటికి రాలేరు..అయితే ఈ రజో గుణం అనేది First floor....ఇంకా మనం First floor కు రాలేదు.....మనం Ground floor లో ఉన్నాం.*


*మనలో ఉండే తమో గుణమే ఆ Ground floor.*


*అంటే మనం తమో గుణంలో ఉన్నాం.*


*బద్దకం, అతి నిద్ర, ఆలస్యం, నిర్లక్ష్యం ఇవే తమో గుణం..... ఇలాంటి తమో గుణంలో మనం ఉన్నాం..... ఇంకా Ground floor లోనే ఉన్నాం.*


*ఈ Ground floor నుండి పైకి రావాలంటే చాలా కష్టం. అలాటి ఈ Ground floor నుండి పైకి వచ్చి, First floor కు వెళ్లి అక్కడ ఉండే 6 గురు  దొంగలను తప్పించుకొని ఇంకా పైకి వెళ్తే అప్పుడు Second floor వస్తుంది.*


*ఆ floor పేరు  ‘సత్వ గుణం..’*


*ఈ floor చాలా పెద్దగా ఉంటుంది....హాయిగా ఉంటుంది......*


*ఎక్కడ చూసినా వెలుగే ఉంటుంది..*


*అయితే చిన్న సమస్య....... ఇక్కడ ఒకే ఒక దొంగుంటాడు. భయపడకండి*...... 


*వాడు...*

*మంచి దొంగ.....వాడు మీకు మంచి మాటలే చెబుతూ  ఉంటాడు   మీకు Third floor కు దారి చూపిస్తాడు...     ఆ floor పేరు శుద్ధ సాత్వికం.... ఇదే చివరిది..... ఇక్కడే మీకు  అఖండమైన వెలుగులో కలిసిపోయింది.... ఆ అఖండమైన వెలుగే పరమాత్మ..*


*అది వెలుగులకు వెలుగు, మహావెలుగు.*


*చివరిగా ఒక good news ఏమిటంటే మనం Ground floor నుండి third floor వరకు వెళ్ళడానికి ఒక  Lift*   ఉంది.


*ఆ Lift పేరే "భగవద్గీత".*


*గీతను చదువుతూ ఉంటే తమో గుణం నుండి రజో గుణానికి, రజో గుణం నుండి సత్వ గుణానికి, సత్వ గుణం నుండి శుద్ధ సత్వం వరకు మనం ప్రయాణం చేసి, చివరికి శాశ్వతమైన స్థానాన్ని చేరుకోవచ్చు.*


*పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు..*. 


*కృష్ణం వందే జగద్గురుం*!

          🌹సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🌹

 సనాతనధర్మానికి శత్రువు హిందువే.


దైవం మాట ఎత్తితే చాలు టైం లేదు అంటాడు. 

అన్యమతస్థులకు ఎక్కడి నుండి వస్తుంది టైం?

నీకంటే కూడా గొడ్డు చాకిరి చేస్తారు. కానీ పిల్లలకి చిన్ననాటి నుండే మతబోధ చేస్తారు. మనం చేయం. 


పోనీ చేసేవారిని సపోర్ట్ చేస్తారా అంటే అదీ ఉండదు. నీకెందుకు అంటారు. పిల్లలు ఈ విషయం మీద ఏదన్నా మాట్లాడితే ఈ వయస్సులో దేనికి నీకు అంటారు. టైం ఉండదు. చిన్నప్పుడు నేర్పక, వయస్సు లో చేయక ఎప్పుడు చేస్తారు?


అందుకే హిందువులలో ఉన్నవారు కన్వర్ట్ అవుతారు కానీ అన్యమతస్థులలో కన్వర్షన్ చాలా తక్కువ. మనవాళ్ళు 1000 మంది వెళితే అవతలివారిలో మహా అయితే ఓ 10మంది ఉంటారు..


ధర్మాన్ని ఎవరో వచ్చి నిలబెడతారు. ఎవరో వచ్చి కాపాడతారు అని యువతని సనాతనాధర్మానికి దూరం చేసేశారు. దేవుడంటే కోరికలు తీర్చేవాడుగా చేశారు. దేవాలయాలు ఈ బలహీనతలని పూజలు, అష్టోత్తరాలు, అభిషేకాలు, దర్శనాలు అంటూ సొమ్ము చేసుకుంటున్నాయి. పిల్లలకి గాని, యువతకి కానీ ధర్మం చెప్పేవారు లేరు. బోధించేవారు అసలే లేరు. ఒకరిద్దరు ఏదన్నా బోధిద్దామని ప్రయత్నిస్తే భాషాజ్ఞానం లేకపోవడం వల్ల తప్పులు పట్టి వారిని అవమానిస్తున్నారు. 


మనం మాత్రం సంపాదించాలి. మేడలు కట్టాలి. ధర్మం మాత్రం బోధించకూడదు. అదేమంటే వీటికే సమయం లేదు.

అడుక్కుతినే అన్యమతస్థులు కూడా వాళ్ళ ధర్మాన్ని పిల్లలకి నేర్పుతున్నారు. మనకి ఎందుకు సమయం ఉండదో మరి..

 ఆత్మ విద్య మీ జన్మ రహస్యం- / ఆత్మ-మీ సొంత ఇల్లు, మీ శరీరం అద్దె ఇల్లు. ఆత్మ విద్య:

రాత్రి పడుకునే ముందు రెండు వెల్లులి రెబ్బలను కాల్చితే ఆ పొగాకు దోమలు పోతాయి .


2 . అరటి ,ఆరెంజెశ్ తొక్కలను ఎండబెట్టి వాటిని కాల్చుతే ఆ పొగాకు దోమలు పారిపోతాయి .


3 . వేప ఆకును కాల్చుతే కూడా దోమలను నివారించొచ్చు .


ఇంటి పెరట్లో లేదా కుండీలో బంతి మొక్కలను పెంచాలి .


5 . వేపాకు పసరు ను అల్ అవుట్ లో పోసి ఆన్ చేస్తే ఇంట్లో దోమలు రావు


రావి చెట్టు ఆకుల రసాన్ని పంటి నొప్పికి వాడితే కేవలం 1 రోజులో నొప్పి తగ్గుతుంది .


2 . మన శరీరము పై ఏర్పడిన గాయాలను తాగించడానికి రావి చెట్టు బెరడును ఉపయోగిస్తారు .


మన ముఖం పై ఏర్పడే నల్ల మచ్చలు ,మంగు మచ్చలు రావి చెట్టు పసరు రాస్తే వారం రోజులో మాయం అవుతాయి .


4 . నోట్లో ఏర్పడిన పుండ్లు కూడా ఆకుల రసాలతో తాగించుకోవచ్చు .


5 . రావి చెట్టు ఆయుర్వేదంలో చాలా రకాలుగా ఉపయోగపడుతాయి మన శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలను నశింపజేస్తుంది .

వీడి పోతే

 *👌👌👌👌 నేను ద్రాక్ష పండ్లను కొంటానికి మార్కెట్లోకి  వెళ్ళాను.*


నేను   :    బాబు కిలో ఎంత...?

అతను :  *"కిలో 80 సర్।"*

పక్కనే విడి విడిగా ఉన్న ద్రాక్ష పండ్లను చూసాను.... ।

నేను అడిగాను :  *" మరి వీటి ఖరీదెంత?"*

పండ్లతను : *"30 రూపాయలకు కిలో సర్"*

*నేను అడిగా : "ఇంత తక్కువనా..?* 

*పండ్లతను   :    "సర్,* *అవి కూడా మంచివే..!!* 

*కాని...*కాని అవి గుత్తి నుండి విడి పోయాయి ...అందుకే అంత తక్కువ రేటు।"*


*అప్పుడు నాకు అర్థమైంది...* *సమాజము,సంఘము మరియు* *కుటుంబము* *నుండి వీడి పోతే .....మన జీవితము కూడా సగానికన్న తక్కువకు పడిపోతుంది।*


*దయ చేసి మీ *కుటుంబము లో ఉండండి.....*

  *ఈ జన్మకే....*

*ఈ జన్మకే వాళ్ళు మన అమ్మా నాన్నలు...*

*ఈ జన్మకే వాళ్ళు మన కొడుకూ కూతుళ్ళు...*

*ఈ జన్మకే వాళ్ళు మన జీవిత భాగస్వాములు...*ఈ జన్మకే వారు మన అత్త మామలు

*ఈ జన్మకే వాళ్ళు మన అక్కా చెల్లెల్లు,* *అన్నా తమ్ముళ్ళు...*

*ఈ జన్మకే వాళ్ళు మన స్నేహితులు,* *సన్నిహితులు...*

*ఈ జన్మకే, కేవలం ఈ జన్మకే!*


*మహా అయితే ఇంకో పదీ..పదిహేను, ఇరవై ..........సంవత్సరాలు !*


*కుటుంబము లో ఎవరు     తప్పు చేసినా  క్షమిద్దాం ,అనందంగా భరిద్దాం, ప్రేమిద్దాం!*

*పోయాక ఫోటోను ప్రేమించే కన్నా,*

*ఉన్నప్పుడు మనిషిని ప్రేమించడం మిన్న*

*బంధుత్వాలు*  *తెంచుకోవడం  నిముషం.*


*అదే  నిలుపుకోవాలంటే  ?*


*తము గడిపిన  భయంకర  అవస్థలు తమ*

*పిల్లలకు  రాకూడదని* *తమ పిల్లలు  కూడా  నలుగురిలో* *ఉన్నతంగా  బ్రతకాలనే  తాపత్రయంతో*

*కన్నవాళ్ళు  తను  సామాన్య జీవితాన్ని  గడుపుతూ*

*ఆస్థులు  కూడ బెట్టి  తమ పిల్లలకు  ఇస్తే ,*


*తమ  తల్లిదండ్రులు  బతికి  ఉండగానే  కొందరు*

*తమ  తల్లిదండ్రులు  కాలం  చేసాక  కొందరు*


 *వివిధ  రకాల  కారణాలతో   రక్త సంబంధీకులందరూ  శాశ్వతంగా*  *దూరమవుతూ ,*

*బ్రతికి   ఉండగా  మాట్లాడు కోకుండా,*  *మొహాలు  కూడా*

*చూసుకోకుండా  తమ  జీవితాంతం  వరకు  ఒకరి నొకరు*

*ద్వేషించుకుంటూ , ఆ ద్వేషాలు  తమ  వారసత్వంగా తమ  పిల్లలకు  కూడా  బదిలి చేస్తూ  ,  తన* *అశాంతితో*

*జీవిస్తూ  తన  వారిని  కూడా  అశాంతి పాలు  చేస్తున్నారు*.


*ఎవరి  కోసం  ? ఎందు  కోసం ?*


*దాని  వల్ల  ఒరిగే  ప్రయోజనము  ఏమిటి ?*

*జీవితాంతం   ఒక  రక్తం  పంచుకున్న  అన్న దమ్ములు ,*

*అక్క చెల్లెళ్ళు  .  అన్నా  చెల్లెళ్ళు* *పరస్పరం*

 *అశాంతితో*  *ద్వేషించుకుంటూ ఒకరి నొకరు*  *చూడకుండా* 

*జీవిస్తూ  శాశ్వతంగా*  *దూరమయి , ఇంటి* *లోని ఆనందాన్ని* *పంచుకోకుండా,* *వివాహాలకు*

*కూడా*  *పిల్చుకోకుండా ,*  *హాజరుకాకుండా ,* 

*చివరకు  ఎవరో   ఒకరు  కాలం  చేసాక   తట్టుకోలేని*

*శోకతప్తులై  గుండెలు  బాదుకుని  కుమిలి  కుమిలి*

*విలపిస్తే  ఆ   చనిపోయిన  వారిని  తిరిగి  పొందగలమా?*

*ఆ   ఖాళీ  అయిన   స్థానాన్ని  ఎవరూ  భర్తీ  చేయలేరు.*


*కొంతమంది  తమ  తల్లిదండ్రులను  కూడా ఈ  ఆస్థిపంపకాల* *అసంతృప్తితో  దూరం  చేసుకుంటున్నారు.*

*ఆ  వయసులో * కన్నవారు  పడే  వేదన వర్ణనాతీతం.*


*మరి  ఈ  సమస్య కు  పరిష్కారము  ?*


  *పంతాలు*  *పౌరుషాలు  ప్రక్కన  పెట్టి  అందరూ*

*కూర్చుని*  *సామరస్యంగా*    *ఆవేశాలకు  పోకుండా*

*మాట్లాడుకుని*   *పరిష్కరించుకుంటే  అభిమానాలు*

*కలకాలం  పరిమళిస్తూ   అనుబంధాలు  పెంపొందే*

*అవకాశం  ఉంటుందేమో  నని  నా  నమ్మకం*.

*దీనికి  కావల్సింది  సహనంగా  ఆలోచించడం*

*విచక్షణ తో పట్టుదలలు  సడలించు కోవడం*

*ఈ విషయములో పెద్దవారు చొరవ తీసుకోవాలి ..*.

*ఓడిన వాడు  కోర్టులోనే  ఏడుస్తాడు*

*గెలిచిన వాడు  ఇంటికి  వెళ్ళి  ఏడుస్తాడు*

*రెండిటికీ  తేడా  ఏమీ  ఉండదు.


             🌻🌻🌻🌻🌻🌻🌻🌻*

          *ఈ జ్ఞాపకాలు ఈ ఒక్క జన్మకే*

          👏👏👏👏👏👏👏👏👏   

                       

(సేకరణ)

 ఆలోచనా విధానాలు 

 ఆలోచనా విధానాలు 

ఒక సమస్య వచ్చినప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కోవిధంగా పరిష్కారం కోసం ఆలోచిస్తారు.  కానీ అందరి ఆలోచనలు ఒక్కొక్క రీతిలో ఉంటాయి. కొందరి ఆలోచనలతో పరిష్కారం సులభంగా దొరుకుతుంది. ఇంకొందరి ఆలోచనలతో పరిష్కారం కష్టతరంగా ఉంటుంది.  ఇంకా కొంతమంది ఆలోచనలతో పరిష్కారం దొరకకపోగా ఇంకొక కొత్త సమస్య ఉద్బవించవచ్చు కూడా. ఒకమనిషి ఆలోచనా విధానం అతని మేధస్సుమీద ఆధారపడి ఉంటుంది. సమస్యను కూలంకుషంగా సత్వరం అర్ధం చేసుకొని వెనువెంటనే సరైన పరిష్కారం చెప్పటం అనేదానినికి సూక్ష్మగ్రాహ్యత  సమయస్పూర్తి కావాలని పెద్దవారు చెపుతారు. ఒకే విధమైన నెలజీతం పొందుతున్న ఇద్దరు ఉద్యోగస్తుల జీవన విధానం ఒకే విధంగా వుండాలని లేదు ఒకరు అనేక అప్పులు చేస్తూ అనవసరమైన డాంబికాలు పోయి అనేక ఇక్కట్లు పడవచ్చు ఇంకొకరు తనకు వున్న వనరులను ఒక ప్రణాళికా బద్దంగా ఉపయోగించుకొని జీవితంలో ఎలాంటి లోపం లేకుండా జీవించవచ్చు. ప్రస్తుత సమాజం బాహ్య డాంబికాలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో తనకు మించిన ఖర్చులు చేస్తూ తగిన ఆదాయంలేక అప్పులు చేస్తూ ఆ అప్పులు తీర్చలేక కస్టాలు పడుతూ చివరకు ఆత్మహత్యలు చేసుకున్న వారి గూర్చి నిత్యం మనం వార్తల్లో చదువుతున్నాము, చూస్తూన్నాము . వాటన్నిటికీ కారణం ఆలోచనా విధానం మాత్రమే. 

సరయిన నిర్ణయం తీసుకోవటం ఒకని మేధాశక్తికి నిదర్శనం. అంతే కాదు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం చాలా ముఖ్యం.  కొన్ని సందర్భాలలో నిర్ణయం సరైనది అయినా కూడా సరైన సమయంలో తీసుకోక పోవటం అనేక కష్టాలను కొని తెస్తుంది. వ్యాపారస్తులు కొన్ని సరుకులు  అనేక కారణాలవల్ల పేరుకొని ఉంటే తాను  కొన్న ధరకాన్న తక్కువ ధరకు అమ్ముతారు,  దానికి కారణం ఒకటి ఆ వస్తువు ఎక్కువ ధరకు అమ్మచూస్తే అది అమ్మటానికి చాలాసమయం పట్టవచ్చు, రేండు ఎక్కువ సమయం వేచి చుస్తే ఆ సరకు చెడిపోయి ఏమాత్రం ద్రవ్యం రాకపోవచ్చు.  అదే ముందుగా తక్కువ ధరకు అమ్మి వచ్చిన ద్రవ్యాన్ని ఇంకొక జనప్రదాన్యత వున్న సరకు మీద వెచ్చిస్తే దానిమీద ఎక్కువ లాభం రావచ్చు.  ఇటువంటి నిర్ణయాలు సత్వరం తీసుకోవాలి అప్పుడే వ్యాపారస్తుడు లాభిస్తాడు. స్వల్ప నష్టాన్ని గూర్చి ఆలోచిస్తే ముందు వచ్చే అధిక  లాభాన్ని కోల్పోతాడు. 

ఒక కంపెనీలో అందుకే మేనేజర్లకు ఎక్కువ జీతం ఇచ్చి నియమించుకుంటారు.  మేనేజరులు తీసుకునే నిర్ణయం పైనే ఆ కంపెనీ లాభాలు ఆధారపడి ఉంటాయి. 

సమయస్పూర్తి: సీతాపహరణ తరువాత సుగ్రీవుని రాజ్యంలోని వానరులను  సీతాదేవిని వెతకటానికి నియమించారు ఆ వరువడిలోనే హనుమంతులవారిని కూడా నియమించారు.  హనుమంతులవారు లంకకు చేరారు, సీతామాతను తెలుసుకున్నారు.  నిజానికి ఆయనకు కేటాయించిన పని పరిసమాప్తం అయ్యింది.  వెంటనే వచ్చి సీతాదేవి జాడని శ్రీ రామచంద్రులకు తెలిపితే తన నియమిత కార్యం అయిపోయినట్లే కానీ సీతజాడతోటి హనుమంతులవారు ఊరుకోలేదు సీతాదేవిని రావణుడినుండి విడిపించుటకు శ్రీరాముడు యుద్ధం చేయవలసి  ఉంటుంది. కాబాట్టి రావణాసురుని బలం అతని రాజ్య విషయాలను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.  అందుకు రావణుని దర్శనం చేసుకోవాలి అది యెట్లా సాధ్యం తాను రాజప్రాసాదానికి వెళ్ళితే అక్కడి భటులు రావణాసురుని చూడనీయరు.  అందుకే ఆయన అశోకవనాన్ని ధ్వంసం  చేశారు. నిరోధించటానికి వచ్చిన వీరులను ఓడించారు.  అప్పుడు తప్పనిసరై హనుమంతులవారిపై బ్రహ్మస్త్రాన్ని ఇంద్రజిత్ ప్రయోగించి రావణుని సభకు తీసుకొని వెళతారు.  ఇక మిగిలిన కధ మనందరికీ తెలిసిందే.  ఇక్కడ మనం గమనించాలసింది హనుమంతులవారి ఆలోచనా విధానం సమయ స్ఫూర్తి.  సమయ స్ఫూర్తి ఉంటే ఎటువంటి ఆపద నయినా సులభంగా దాట వచ్చు. 

జ్యోతిష్య శాస్త్రంలో ప్రావిణ్యం వున్న ఒక జ్యోతిష్కులవారు ఒక రాజుగారి వద్దకు వెళ్లారట అయన రాజుగారి జాతకాన్ని పరిశీలించి అది చాలా బాగుందని ఇలా చెప్పారట " మీ వాళ్ళందరూ మీ ముందే చనిపోతారు" అది విన్న ఆ రాజుగారు కోపోద్రేకుడై అతనికి బహుమానాలు  ఇవ్వటం అటుంచి మరణ శిక్ష విధించారట. ఒకటి రెండు రోజులలో శిక్ష అమలు అనగా ఈ విషయం తెలుసుకున్న ఇంకొక జ్యోతిష్య పండితులు రాజుగారి దర్శనం చేసుకున్నారు.  రాజు జ్యోతిష్యం అంటేనే కోపంగా  వున్నారు ఆ విషయం మన జ్యోతిస్యులవారికి తెలుసు ఆయన అత్యంత లౌక్యము చూపించి అనేక పొగడ్తలతో రాజుగారిని ప్రశంసించి ఆయన జాతకాన్ని చూసి "మహారాజా మీరు అత్యంత మహార్జాతకులు మీరు ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు  పరిపాలిస్తారు. నిజానికి మీ వారి అందరికన్నా ఎక్కువ కాలం మీరు  జీవిస్తారు. ఏ కొద్దీ మందికో మీలాగా జాతకం ఉండదు" అని తెలిపారు. దానికి ప్రసన్నులైన మహారాజు నీవు చాలా మంచిగా నా జాతకాన్ని తెలిపావు నీకు ఏమి కావాలో కోరుకో అని  అన్నారు. మహారాజా నా శిష్యుడు తెలిసి తెలియని జ్ఞానంతో మీ వద్దకు వచ్చి మీ ఆగ్రహానికి గురి అయి మరణ శిక్ష విధింపబడ్డాడు.  దయచేసి అతనిని క్షమించి విడిపించవలసిందిగా ప్రార్ధించారు. అతని మాటలకు రాజుగారు మొదటి జ్యోతిస్యుల శిక్షను రద్దుచేశారట.  మన రెండవ జ్యోతిషేలవారు మొదటివారిని కలుసుకొని నీవెందుకు అలా చెప్పావు అని అడిగితె నేను చెప్పింది నిజంకాదా అని ప్రశ్నించారట.  నీవు చెప్పింది నిజం నేను అదే చెప్పాను కానీ చెప్పే విధానం బట్టి మనము అనుగ్రహ, ఆగ్రహాలకు పాత్త్రులము అవుతాము అని అన్నారట. 

జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః!
జిహ్వాగ్రే మిత్రబాంధవాః!
జిహ్వాగ్రే బంధనప్రాప్తిః!
జిహ్వాగ్రే మరణం ధృవం!!

అని అన్నారు కాబాట్టి మనం నోటిని జాగ్రత్తగా అంటే మాటలను సమయానుకూలంగా వాడాలని హితవు చెప్పి పంపారట. బుద్ది కర్మానుసారినే  అనే నానుడి ఊరికే రాలేదేమో అనిపిస్తుంది. 

ఒక కేసువిషయంలో చాలా తీవ్రంగా ఒక లాయరుగారు వాదిస్తున్నారట ఆయన వాదనకు జడ్జిగారు కూడా ముగ్దులు అయ్యారట. ఇక వాదనను ముగించపోవగా ప్రక్కనే వున్నా జ్యునీయరు లాయరుగారు మన లాయరుగారి చెవిలో ఏదో చెప్పారట వెంటనే మన లాయరు గారు దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని నేను చెప్పింది బహుశా డిఫెన్సు లాయరుగారు చెప్పవచ్చు కానీ అది ఎంతమాత్రమూ సబబుకాదు ఇప్పుడు నా వాదనను వినండి అని తానూ ముందు చెప్పిన వాదనకు వ్యతిరేకంగా చెప్పి జడ్జిగారిని మెప్పించి కేసు గెలిపించారట.  ఇంతకూ ఆ జూనియరు లాయరు గారు చెవిలో  చెప్పింది ఏమిటి అంటే అయ్యా మీరు మన క్లయెంటు గూర్చి కాకుండా అవతలి పార్టీకి సపోర్టుగా వాదిస్తున్నారు అని.  ఆక్షణంలోనే సర్దుకొని తన వాదనను పూర్తిగా మార్చుకున్నారు సీనియర్ లాయరు గారు అదే సమయ స్ఫూర్తి అంటే. ఇవ్వన్నీ మనం తెలుసుకున్నవి, నిత్యం చూస్తూవున్నవి.  ఇక అసలు విషయానికి వస్తే మానవుడు తన జీవిత లక్ష్యం అయిన మోక్ష సాధన చేయటానికి చక్కటి ఆలోచనా విధానం వుండాలి అంతేకాదు తనకు దైనందిక జీవితంలో ఎదురుపడే అనేక ఒడిదుడుకులను ఎదుర్కునే సమయస్ఫూర్తి కావలి.  సాధకుని చూసి సామాన్యులు అనేక విధములుగా మాట్లాడవచ్చు అటువంటి మాటలకు, విమర్శలకు ఏమాత్రం చలించకుండా నిత్యం తన లక్ష సాధనవైపు ద్రుష్టి సాగించి లక్ష్యాన్ని ఈ జన్మలోనే సాదించాలి. 

నాకు ఈ జన్మలోనే మోక్షం వస్తుందా అది ఎంతో దుర్లభం ఏదో దైవ జాసలో, నామ స్మరణతో కాలం గడుపుదాం అని చెప్పే అనేకులు మనకు  తారసపడతారు. అంతే కాకుండా అయన సద్గురువు, ఈయన సద్గురువు అని చెప్పి మీ వద్ద వలసినంత ద్రవ్యాన్ని వసూలు చేసేవారు కూడా వుంటారు. కాబట్టి ఎవ్వరిని అనుసరించకుండా నీ సాధన నీవు కొనసాగించు. వారి మాటలను పరిగణలోకి తీసుకొన్నామంటే మన సాధనకు  పూర్తిగా అవరోధం కలుగుతుంది. కాబట్టి మిత్రమా మోక్షం అంటే సామాన్యమైన విషయం కాదు అత్యంత కృషి, సాధన, అకుంఠిత దీక్ష ఉంటేనే సాధించగలం. ఈ మానవ జన్మ ఎంతో దుర్లభమైనది దీనిని  ఇక్కడే,ఇప్పుడే సార్ధకట్చేసుకోవాలి. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః  

మీ భార్గవ శర్మ

ఇంకా వుంది

విభూతి - అహంకారం

 విభూతి - అహంకారం


పరమాచార్య స్వామి వారు మహారాష్ట్రలోని సతారాలో మకాం చేస్తున్నారు. చాలామంది భక్తులు వారి దర్శనార్థమై వేచియున్నారు. మహాస్వామి వారి భక్తులలో వీణావాదన విద్వాంసుడొకడు ఉన్నారు. మహాస్వామి వారి సతారా ఆగమనం గురించి విని అతను కూడా వారిని దర్శించుకోవడానికి వచ్చాడు. మహాస్వామి వారిముందు తన వీణా ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలని అతని కోరిక. 


కొద్దిసేపటి తరువాత ఎలాగో మహాస్వామి వారిని దర్శించుకున్నాడు. దర్శనానంతరం తన వీణ పైన ఒక కృతిని వినిపిస్తానని మహాస్వామి వారిని వేడుకున్నాడు. స్వామి వారి అనుమతితో వాయించడం మొదలుపెట్టాడు. పరమాచార్య స్వామి వారు సకల కళల్లోను సర్వ శాస్త్రాల్లోను నిష్ణాతులన్నది జగమెరిగిన సత్యం. ఆ విద్వాంసుని వీణావాదనం చాలా అద్భుతంగా ఉంది అక్కడున్నవారందరికి బాగా నచ్చింది. 


కొద్దిసేపు అక్కడ అంతా నిశ్శబ్ధంగా ఉంది. తరువాత మహాస్వామి వారు ఆ వీణను తీసుకుని ఒక కృతిని వాయించారు. ఆ విధ్వాంసునికంటే మహాస్వామి వారిది పరమాద్భుతంగా ఉంది. మహాస్వామి వారు ముగించిన వెంటనే ఆ విధ్వాంసుడి కళ్ళు అపరాధ భావనతో వర్షించాయి. వెంటనే స్వామి వారి పాదములపై పడి సాష్టాంగం చేసాడు. పదే పదే అలా చేస్తూనే ఉన్నాడు. పరమాచాస్వామి అతనివైపు చూసారు కాని ఏమి మాట్లాడలేదు. కొద్దిసేపటి తరువాత స్వామి వారు లోపలికి వెళ్ళారు. 


జరుగుతున్న విషయం అందరూ చూస్తున్నారు కాని ఎవ్వరికి ఏమి అర్థం కావటం లేదు. ఆ విద్వాంసుడు బయటకు వెళ్ళిపోయిన తరువాత కొంతమంది స్వామి వారి భక్తులు ఏమి జరిగిందని అడిగారు. ఆ విధ్వాంసుడు వారితో, ”నేను అహంకారంతో పెద్ద పొరపాటు చేసాను. మహాస్వామి వారు నా అహంకారాన్ని తుడిచేసారు” అని అన్నాడు. కాని వారికేం అర్థం అసలు ఏమి జరిగిందో చెప్పమన్నారు. 


“నా పాండితీ ప్రకర్ష చూపించుకోవాలని చాలా క్లిష్టమైన కృతిని ఒకదాన్ని వీణ పైన పాడాను. మధ్యలో కొన్ని స్వరాలు మరచిపోయాను. చుట్టూ చూస్తే ఇక్కడ వీణ ఎవరికి రాదు తెలిసి కొన్ని తప్పు స్వరాలి కలిపి పూర్తిచేసాను. సంగీతంలో స్వరదోషం చాలా పెద్ద తప్పు. నేణు ముగించిన తరువాత పరమాచార్య స్వామి వారు ఆ వీణనందుకొని నేను తప్పుగా నుడివిన స్వరాలని సరిగ్గా వాయించి చూపించారు” అని అన్నాడు. 


ఇంకా అతను ఇలా చెప్పాడు, “పరమాచార్య స్వామి వారు చాలా చాలా క్లిష్టమైన కృతిని ఒకదానిని వాయించారు. ఆ కైలాసనాథుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి రావణుడు స్తుతించిన కృతి అది. రావణ గర్వాన్ని శివుడు భంగపరచినట్టు నా అహంకారాన్ని మహాస్వామి వారు తొలగించారు”.


మన పూర్వ జన్మ పుణ్యఫలంగా ఈశ్వరుడు మనకు వివిధ విభూతులను ఇస్తాడు. వాటిని ఆ భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా భావించాలి కాని, అవి ఉన్నందువల్ల నాఅంతవాణ్ణి అని అహంకరించకూడదు. అది మనిషి వినాశన హేతువు.


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం