2, జులై 2022, శనివారం

కొవ్వు తగ్గుట కొరకు

 శరీరంలోని అతిగా ఉన్న కొవ్వు తగ్గుట కొరకు సులభమైన యోగం  - 


     తిప్పతీగ పొడి , త్రిఫలాల పొడి సమంగా కలిపి నిలువ ఉంచుకోవాలి . రోజు ఒక గ్లాస్ నీటిలో ఒక చెంచా పొడి వేసి ఒక కప్పు కషాయం మిగిలేవరకు మరిగించి వడపోసి గోరువెచ్చగా ఒక చెంచా తెనే కలిపి ఉదయం పూట తాగాలి. ఒక గంట వరకు మరేమి తినకూడదు . తాగకూడదు . దీనివల్ల క్రమంగా శరీరంలో అతికొవ్వు కరిగిపోతుంది . 

అమ్మవారి_వైభవం

 #అమ్మవారి_వైభవం


మనకు #శ్రీ_విద్యా_సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి.

వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క #రధ , #గజ , #తురగ , #సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి.  అందుకే ఆవిడను #దండనాథ అన్నారు.

#లలితా_పరమేశ్వరి_యొక్క_ఐదు_పుష్పబాణాల_నుంచి_ఉద్భవించిన_శక్తులు_వరాహ_ముఖంతో_ఆవిర్భవించిన_శక్తి_శ్రీ_మహా_వారాహీ_దేవి.  లలితా దేవి సైన్యానికి ఆమె #సర్వ_సైన్యాధ్యక్షురాలు.

ఆమెకు ప్రత్యేక రథం ఉంది  దానిపేరు #కిరి చక్రం.  ఆ రథాన్ని #1000_వరాహాలు లాగుతాయి , #రథసారథి_పేరు_స్థంభిని_దేవి.  ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ , మరియు దేవవైధ్యులైన అశ్విని దేవతలు.


కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |

జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 ||

భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |

నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా || 28 ||

భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |

మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా || 29 ||

విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |


అంటూ లలితా సహస్రనామాల్లో హయగ్రీవ , అగస్త్యులు ఈ అమ్మవారి గురించే చెప్పుకున్నారు.  విశుక్రుడిని ఈ తల్లి హతమార్చింది.  #ఈ_అమ్మవారిని_ఆజ్ఞా_చక్రంలో_ధ్యానిస్తారు.

వారాహీ అమ్మవారు అంటే #భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు , శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో అవతరించి , వాడిని సంహరించి , భూదేవిని రక్షిస్తాడు.

స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు #వారాహీ_రూపం_తీసుకుందని, అందువలన ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యానశ్లోకాల్లో కనిపిస్తుంది.


అంటే వారాహీ అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మీ అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరహాస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. భూతగాదాలను నివారిస్తుంది , లేదా పరిష్కరిస్తుంది.


అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో , అష్ట భుజాలతో , శంఖ , చక్ర , హల(నాగలి), ముసల(రోకలి), పాశ , అంకుశ , వరద , అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది.

 ఇది #మహావారాహి (#బృహద్వారాహి) యొక్క స్వరూపం.  ఇంకా #లఘువారాహి , #స్వప్నవారాహి , #ధూమ్రవారాహి , #కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.


అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే , ఆవిడ హలము (నాగలి), ముసలము (రోకలి) ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే , రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిబట్టి అమ్మవారు #సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత.  అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు.


నిజానికి రైతు గోఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి , సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది. ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు #సాక్షాత్తు_భూమాత.

పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే , ఉగ్రం వారాహి.   శ్రీ విద్యా గద్యంలో #అహంకార_స్వరూప_దండనాథా_సంసేవితే, #బుద్ధి_స్వరూప_మంత్రిణ్యుపసేవితే”  అని లలితను కీర్తిస్తారు.

 

దేవీ కవచంలో #ఆయూ_రక్షతు_వారాహి” అన్నట్టు.   ఈ తల్లి ప్రాణ సంరక్షిణి.  #ఆజ్ఞాచక్రం_ఆవిడ_నివాసం_ప్రకృతి_పరంగా_చూసినట్లైతే_ఈ_సమయంలో_వర్షం_కురుస్తుంది    రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు.  దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది.

వారాహీ అమ్మవారిని చూసి ఉగ్రదేవతగా భ్రమపడతారు కొందరు.  కానీ #వారాహీ_చాలా_శాంతస్వరూపిణి.  వెంటనే అనుగ్రహిస్తుంది , కరుణారస మూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.


వారాహీ అమ్మవారిని స్మరిస్తే #శత్రు_నాశనం_జరుగుతుంది , అంటే వ్యక్తిలో ఉన్న అంతఃశ్శత్రువులైన #కామం , #క్రోధం , #లోభం , #మోహం , #మదం , #మాత్సర్యం , #అహంకారం , #అజ్ఞానం నశిస్తాయి.


అంతఃశ్శత్రువులను జయించినవాడికి బయట శత్రువులు ఉండరు లేదా కనిపించరు , అంత విశాలమైన దృష్టి అతడికి కలుగుతుంది. అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహీ మాత.


1.#ఓం_శ్రీం_హ్రీం_క్లీం_వరాహై_మమ_వాక్మే_ప్రవేశయా_వాకు_పాలితాయ ||

మమ మాతా వరాహి మమ దారిద్ర్యం నాశాయ నాశాయ హుం భట ||

2.#ఓం_శత్రు_శంకరి_సంకటహరణీ_మమ_మాత్రే_హ్రీం_దుం_వం_సర్వారిష్టం_నివారాయ_నివారాయ_హుం_భట్ ||

3.#ఓం_క్లీం_వారాహి_హ్రీం_సిద్ధి_స్వరూపిణి_శ్రీం_సిద్ధి_స్వరూపిణి_శ్రీం_ధనవశంకరి_ధనం_వర్షాయా_వర్షాయా_స్వాహా ||

4.#ఓం_శ్రీం_పంచమి_సర్వసిద్ధి_మాతా_మమ_గృహామి_ధనం_ధన్యాం_సమృద్ధిం_దేహి_దేహి_నమః ||

5. #ఓం_హ్రీం_భయానకరీ_అతి_భయంకరి_ఆశ్చర్యా_భయంకరీ_సర్వ జన_భయంకరీ ||

6.#సర్వ_భూత_ప్రేత_పిశాచ_భయంకరీ_సర్వ_భయం_నివారాయ_శాంతిర్_పావతు_మే_సదా ||

7.#సర్వ_భూత_ప్రేత_పిశాచ_భయంకరీ_సర్వ_భయం_నివారాయ_శాంతిర్_పాదుమే_సదా ||


అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికి బిడ్డలను_కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి. ముఖ్య ప్రాణ రక్షిణి.


హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి చెప్పిన వారాహి నామములు

 #పంచమి

 #దండనాథా

 #సంకేతా

 #సమయేశ్వరి

 #సమయ సంకేతా

 #వారాహి

 #పోత్రిణి

 #వార్తాళి

 #శివా

 #ఆజ్ఞా చక్రేశ్వరి

 #అరిఘ్ని


దేశం సుభిక్షంగా ఉండాలని…మనమంతా చల్లగా ఉండాలని…ధర్మం వైపు మనం నడవాలని…అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్దనచేద్దాం


#ధూర్తానామతి_దూరా_వార్తాశేషావలగ్న_కమనీయా

#ఆర్తాళీ_శుభదాత్రీ_వార్తాళీ_భవతు_వాంఛితార్థాయ


అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే, 


#జై వారాహీ,

 

అజ్ఞ్యానం-జ్ఞ్యానం 

తరచుగా మనం ఈ రెండు పదాలను వింటూవుంటాం.  వాడు ఉట్టి అజ్ఞ్యాని అని అనటం కూడా కద్దు అంటే వానికి ఏమాత్రం జ్ఞ్యానం లేదని కావచ్చు. ముందుగా అజ్ఞ్యానం అంటే ఏమిటో తెలుసుకుందాం తరువాత జ్ఞ్యానం ఏమిటో తెలుసుకోవచ్చు. బాల్యావస్థలో వున్న శిశువుకు ఏమితెలియదు అంటే అతనికి ఈ ప్రపంచంగుర్చి అజ్ఞ్యానం వున్నది అన్నమాట ఎక్కడ అజ్ఞ్యానం ఉంటుందో అక్కడ జ్ఞ్యానం ఉండదు అన్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రెండు వెలుతురూ, చీకటి లాంటివి అన్నమాట. వెలుతురు ఉంటే చీకటి ఉండదు అలానే చీకటి ఉన్నదంటే వెలుతురు లేదని అర్ధం.

అందుకే జ్ఞనాన్ని వెలుతురుతో అజ్ఞ్యానాన్ని చీకటితో పోల్చి చెప్పారు. మీరు ఒక చీకటి గదిలోకి ప్రవేసించారనుకోండి అప్పుడు మీకు ఆ గదిలోని వస్తువులు ఏవి కనపడవు పూర్తిగా నల్లగా ఉంటుంది.  కారణం అక్కడి వస్తువులను ప్రకాశింపచేసే కాంతి అక్కడ  లేకపోవటమే. అదే మీ చేతిలో చిన్న టార్చి లైటు వున్నదనుకోండి ఆ లైటు కాంతిలో కొద్దీ కొద్దిగా మీరు అక్కడి వస్తువులు చూడగలరు. ఒక కుర్చీ, ఒక బల్ల ఇలా అక్కడ వున్న వస్తువులు లీలగా కనపడతాయి ఎందుకంటె మీ చేతి లైటు వెలుతురూ చాలా స్వల్పమైనది కాబట్టి.  కుర్చీ కనపడుతుంది కానీ దాని రంగు దానిమీద వ్రాసిన అక్షరాలు ఏమైనా ఉంటే అవి తెలుసుకోలేరు. అదే ఆ గదిలో మీరు ఎక్కువ కాంతినిచ్చే విద్యుతు లైటుని వెలిగిస్తే స్పష్టంగా అక్కడి వస్తువుల పూర్తి వివరాలు కనపడతాయి. అన్ని వివరంగా చూడగలరు.  అంటే దీని అర్ధం ఏమిటంటే ప్రకాశం ఎక్కువ అయినా కొద్ది స్పష్టత పెరుగుతున్నది.  ఇదే నియమము మనం జ్ఞ్యానవిషయంలో కూడా అన్వయించవచ్చు. మీకు ఒక విషయానిక సంబందించిన పరిజ్ఞనం పెరుగుతున్న కొద్దీ ఆ విషయం కులంకుశంగా తెలుసుకోగలుగుతారు.  మనకు విషయ జ్ఞనాన్ని రెండు విధాలుగా పొందగలము. 1) గురువుల ద్వారా 2) గ్రంధాల ద్వారా. మనకు తెలియని విషయాలు గురువులు వారి అనుభవంతో వారి పరిజ్ఞనంతో మనకు తెలియ చేస్తారు.  అలానే గ్రంధాలు కూడా మనకు తెలియని ఎన్నో విషయాలను తెలుపుతాయి. 

జ్ఞ్యానంఅంటే ఒక్క మాటలో చెప్పాలంటే విషయపరిజ్ఞ్యానం అంటే ఒక వస్తువు లేక శాస్త్రానికి సంబందించిన విషయాన్ని తెలుసుకోవటం. అంటే తెలియనితనం అజ్ఞ్యానం తెలుసుకోవటం జ్ఞ్యానం.

 

ఇంకా వుంది

  


 

“పాపములే రోగములకు కారణం కాగలవు

 పాపేన జాయతే వ్యాధిః పాపేన జాయతే జరా | 

పాపేన జాయతే దైన్యం దుఃఖం గోకో భయంకర!|| 

తస్మాత్ పాసం మహావైరం దోషబీజ మమంగళమ్ |

భారతే సంతతం సన్తో నాచరని థయాతురా! "

 “పాపములే రోగములకు, వృద్ధావస్థకు, నానావిధ విఘ్నములకు బీజ ములు. పాపములవలననే దైన్యము, దుఃఖము, రోగములు, వార్ధక్యము, భయంకుశోకములు నుత్పన్నములు కాగలవు. అందువలననే భారతవర్ష మింకు వివేకవంతు లై నమహాత్ములు భయముతో నెన్నడును బాపముల నాచరింపరు. ఎందువలె ననగా నాపాపములు మహా నైరముల నుత్పశ్నముచేయగలవు. పాపము లేదోషములను బీములై , యమంగళకారకములు కాగలవు.

స్వధర్మాచరణమం.కు సంలగ్నలై యున్న వాహి, భగవంతుని మంత్రపేక్ష వహించినవారు, శ్రీహరిసమారాధనము కంచు పంలగ్ను లై యున్న వారు, తలిదండ్రులను, గురువును, దైవమును, నతిథులను, భక్తితో సేవించు వారు, తపమ నం దాసక్తి కల్గియున్న వారు, వ్రతాపవాసముల నాచరించువారు, సదా తీర్థ సేవన మొనరించువారు నగుమానవులను గాంచి గరుత్మంకు భయము వలవ పలాయనముచి త్తగించునురగములవలె ఆగములు పాతిపోగలవు. కావున బుద్ధిమంతులైన వారు పాప కార్యముల చేయకుండా సద ధర్మాచరణం చేయవలెను.  ధర్మాచరణం చేసెడివారిని ధర్మమే కాపాడుతుంది. 

ధర్మాచరణం అంటే ఏమిటి: 

ధర్మాచరణం అనగా ప్రతి వారు వారికి నిర్దేశించిన ధర్మమును నిష్ఠతో పాటించటమే.  ధర్మం ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఉంటుంది. తన, కులము, వర్ణము, వృత్తిని పట్టి వారి వారికి ధర్మము చెప్పపడినది. ఒక్క మాటలో చెప్పవలెనన్న తాను ఏపనిని చేయుటకు నిర్దేశించ పడినాడో ఆ పనిని శ్రార్ధతో చేయటమే ధర్మము. 

“ధర్మ ఏవ హతో హన్తి ధర్మో రక్షతి రక్షితః

తస్మాద్ధర్మో న హన్తవ్యో మా నో ధర్మో హతోవధీత్”

అనగా ఎవరైతే ధర్మాన్ని పాటించరో వారిని ధర్మము హరిస్తుంది.  అదేవిధంగా ధర్మాన్ని ఎవరు రక్షితారో వారిని ధర్మమురక్షిస్తుంది. కాబట్టి సదా ప్రతివారు ధర్మాచరణ మాత్రమే చేయాలి.