2, జులై 2022, శనివారం

“పాపములే రోగములకు కారణం కాగలవు

 పాపేన జాయతే వ్యాధిః పాపేన జాయతే జరా | 

పాపేన జాయతే దైన్యం దుఃఖం గోకో భయంకర!|| 

తస్మాత్ పాసం మహావైరం దోషబీజ మమంగళమ్ |

భారతే సంతతం సన్తో నాచరని థయాతురా! "

 “పాపములే రోగములకు, వృద్ధావస్థకు, నానావిధ విఘ్నములకు బీజ ములు. పాపములవలననే దైన్యము, దుఃఖము, రోగములు, వార్ధక్యము, భయంకుశోకములు నుత్పన్నములు కాగలవు. అందువలననే భారతవర్ష మింకు వివేకవంతు లై నమహాత్ములు భయముతో నెన్నడును బాపముల నాచరింపరు. ఎందువలె ననగా నాపాపములు మహా నైరముల నుత్పశ్నముచేయగలవు. పాపము లేదోషములను బీములై , యమంగళకారకములు కాగలవు.

స్వధర్మాచరణమం.కు సంలగ్నలై యున్న వాహి, భగవంతుని మంత్రపేక్ష వహించినవారు, శ్రీహరిసమారాధనము కంచు పంలగ్ను లై యున్న వారు, తలిదండ్రులను, గురువును, దైవమును, నతిథులను, భక్తితో సేవించు వారు, తపమ నం దాసక్తి కల్గియున్న వారు, వ్రతాపవాసముల నాచరించువారు, సదా తీర్థ సేవన మొనరించువారు నగుమానవులను గాంచి గరుత్మంకు భయము వలవ పలాయనముచి త్తగించునురగములవలె ఆగములు పాతిపోగలవు. కావున బుద్ధిమంతులైన వారు పాప కార్యముల చేయకుండా సద ధర్మాచరణం చేయవలెను.  ధర్మాచరణం చేసెడివారిని ధర్మమే కాపాడుతుంది. 

ధర్మాచరణం అంటే ఏమిటి: 

ధర్మాచరణం అనగా ప్రతి వారు వారికి నిర్దేశించిన ధర్మమును నిష్ఠతో పాటించటమే.  ధర్మం ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఉంటుంది. తన, కులము, వర్ణము, వృత్తిని పట్టి వారి వారికి ధర్మము చెప్పపడినది. ఒక్క మాటలో చెప్పవలెనన్న తాను ఏపనిని చేయుటకు నిర్దేశించ పడినాడో ఆ పనిని శ్రార్ధతో చేయటమే ధర్మము. 

“ధర్మ ఏవ హతో హన్తి ధర్మో రక్షతి రక్షితః

తస్మాద్ధర్మో న హన్తవ్యో మా నో ధర్మో హతోవధీత్”

అనగా ఎవరైతే ధర్మాన్ని పాటించరో వారిని ధర్మము హరిస్తుంది.  అదేవిధంగా ధర్మాన్ని ఎవరు రక్షితారో వారిని ధర్మమురక్షిస్తుంది. కాబట్టి సదా ప్రతివారు ధర్మాచరణ మాత్రమే చేయాలి.




కామెంట్‌లు లేవు: