12, ఆగస్టు 2021, గురువారం

భారవి

 అనగనగా....


[2. నన్ను పొగడని నాన్నని చంపేస్తాను !


8


అనగనగా 'భారవి' అనే విద్యార్థి ఉండేవాడు. అతను చిన్నప్పటినుండీ మంచి కవిత్వాన్ని చెప్తూండే వాడు. అతని కవిత్వాన్ని విన్నవాళ్లంతా అతణ్ణి మెచ్చుకోవడమే కాక అతని తండ్రితో కూడ ఆ విషయాన్ని ముచ్చటిస్తూండేవారు. భారవి తండ్రి మాత్రం వారి ప్రశంసని వింటూనే ఏదో మా వెజినాగన్న తోచీతోచనిది చెప్తే, దాన్ని కవిత్వమంటూ మీరు కూడా పొగిడితే ఎలా ? వాడూ - వాడికో కవిత్వమూనా ?' అంటూ తేలికగా అంటూండేవాడు.


తన పుత్రుణ్ణి తాను పొగడకూడదనీ, అలా పొగడడం పుత్రునికి ఆయుఃక్షీణతని కలుగజేస్తుందని ఆయన అభిప్రాయం తప్ప, భారవి చెప్పే కవిత్వంలో గొప్పదనం లేదనేది కాదు. తన పుత్రుని కవిత్వాన్ని ఇతరులు చెప్పగా పూర్తిగా విని, భారవి కవిత్వం కొత్త పుంతలు తొక్కుతోందని మనసులో ఆనందపడుతూ, ఆ విషయాన్ని తన భార్యతో అనేక పర్యాయాలు చెప్పాడు కూడా అయితే రహస్యంగానూ, ఎవరూ వినకుండానూ మాత్రమే.


తనని ఊరంతా మెచ్చుకోవడం, తన తండ్రి మాత్రమే తనని తన ఊరివారిముందే తీసిపారేసినట్టు మాట్లాడ్డం భారవికి చాల కష్టంగా అన్పించింది. ఒకనాడది తారస్థాయికి చేరింది. తండ్రి పీడని శాశ్వతంగా వదిలించుకోవాలనుకున్నాడు భారవి.


అంతే ! ఫలితంగా ఒక బండజాతిని అటక మీదికి చేర్చుకుని కూచున్నాడు. తన తండ్రి భోజనం చేస్తున్నవేళ, ఆ బండజాతిని ఆయన నెత్తిపై పడేలా వేయాలనేది భారవి పథకం. ఈ విషయాన్ని గమనించిన భారవితల్లి మాత్రం ఏమీ ఎజగనట్టుగానే ఉండిపోయింది.


భారవితండ్రి భోజనానికి విస్తరిముందు కూచోగానే పైనున్న భారవిక్కూడా వినిపించేలాగా ఆమె 'ఏమండీ భారవి ఇంట్లో లేడు! కాబట్టి అడుగుతున్నాను. నిజాన్ని సూటిగా నాకు చెప్పండి. ఊళ్లో వాళ్లంతా వాడి కవిత్వాన్ని మెచ్చుకుంటూంటే ఎందుకని వారు వాణ్ణి-వాడి కవిత్వాన్నీ వాళ్ల ఎదురుగుండానే -చులకన చేస్తూ తీసిపడేస్తున్నారు ? వాడి పసిమనసు ఎంతో గాయపడుతోందని నాకు అన్పిస్తోంది' అని అంది.

అనగనగా....


CO


అటక మీద బండజాతిని పట్టుకుని ఉన్న భారవి, తన తండ్రి సమాధానాన్ని విన్న మీదట ఏంచేయాలో నిర్ణయించుకుందామనుకున్నాడు.


భారవి తండ్రి తన భార్యవంక చూస్తూ 'ఏమే ! మనింటి చెట్టుకి పండిన పండు చాల రుచిగా ఉందని అంతా అంటూంటే 'కాదు చేదుగా ఉం'దని నేనెందుకంటున్నానో నీకు మాత్రం తెలియదా ? ఎప్పుడూ నువ్వు ఈశ్లోకాన్నే వినలేదా ?”


'ప్రత్యక్షే గురవః స్తుత్యాః పరోక్షే మిత్ర బాంధవాః | కొ ర్యాంతే దాసభృ త్యాద్యా: న తు పుత్రా: కదాచన I'


'గురువుగారి పాండిత్యానికి సంతోషపడిన శిష్యుడు ఎవరైనా ఆయనని ఆయన సమక్షంలోనే పొగడాలిట. ఇక మిత్రుల ఔదార్యాన్నీ, బంధువుల ఆదరణనీ వారి పరోక్షంలోనే చెప్పుకోవాలిట. అంటే, మనం మనమిత్రుల బంధువుల పరోక్షంలో వాళ్లగూర్చి ఏది అనుకుంటామో, అది వారిమీద మనకున్న నిజమైన అభిప్రాయ మౌతుందట. చెప్పిన పనిని పూర్తి చేసుకుని వచ్చాక మాత్రమే దాసులనీ, నెలసరి జీతంమీద పనిచేసే భృత్యులనీ పొగడాలిట.


ఇలా ఎప్పుడో ఒకప్పుడు పై వారినందఱినీ ఎలాగో ఒకలాగ పొగడవచ్చుటగానీ, తాము కన్న సంతానాన్ని మాత్రం ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పొగడనే పొగడరాదట. ఇదిగో ఇలా మనసులోనే పరమానంద పడుతూ ఉండాలిట. నా ఆనందాన్ని నీకు మాత్రం అప్పుడప్పుడు చెప్పలేదా ? ఈ రోజు ఎందుకో వింతగా అడుగుతున్నావుగానీ' అన్నాడు.


ఈ మాటలు వింటూ ఆమె ఉబ్బితబ్బిబ్బవుతూంటే మళ్లీ ఆయనే 'పిల్లవాడి బాగుకోరిన ఏ తండ్రీ కూడా, వాళ్లి వాడి ఎదురుగా పొగడడుపొగడ కూడదు కూడ.


ఈ వయసులో వాడికి మహాపండితుణ్ణనే అహంకారం వస్తే వాడికిక విద్యాగంధం అబ్బక భ్రష్టుడై పోతాడు. 'పుత్ర శ్శత్రు రపండిత!' లోకంలో ఏ తండ్రికైనా నిజమైన శత్రువెవరంటే చదువురాని పుత్రుడేనటే' అంటూ భోజనాన్ని ముగించాడు.


ఈ మాటలని వింటూనే భారవి చెప్పలేని బాధతో అటకదిగి తండ్రికి సాష్టాంగపడి, ఆయన పాదాలని కన్నీటితో కడిగేసాడు. తాను చేయదలచిందంతా సవివరంగా చెప్పి తన తప్పుకి శిక్షని విధించవలసిందిగా తండ్రిని ప్రార్థించాడు.

10


అనగనగా....


భారవిలో పశ్చాత్తాపబుద్ధి కలిగినందుకెంతో సంతోషపడిన తండ్రి ' ఈ సంఘటనని దృష్టిలో పెట్టుకుని ఒక శ్లోకాన్ని చెప్పవలసిం దన్నాడు. అంతే! క్షణంలో ఆశువుగా భారవి ఈ శ్లోకాన్ని చెప్పాడు.


సహసా విదధీత న క్రియామ్ అవివేక: పరమాపదాం పదమ్|


వృణుతే హి విమృశ్యకారిణం గుణలబా: స్వయమేవ సంపద:|


“ఏ పనినీ తొందర పాటు నిర్ణయంతో చేయకూడదు. 'తొందర' క్షణికావేశాన్ని కలిగిస్తుంది. ఆ క్షణికావేశం కారణంగా వ్యక్తి అవివేకి అవుతాడు. ఆ అవివేకం అనేక ఆపదలకి నిలయం. బాగా ఆలోచించి పనిచేసేవాల్లే సర్వశుభాలూ సంపదలూ వరిస్తాయి " అనే అర్థం కల ఈ శ్లోకాన్ని విని, భారవి తండ్రి మఠంత ఆనందపడి శిక్ష ముగిసిందన్నాడు భారవితో.


అయినా భారవి వినకుండా తన తప్పుకి ఏమైనా శిక్షని విధించ వలసిందేనని తండ్రిని పట్టుబట్టాడు. అయితే అత్తవారింటిలో ఆర్నెలలుండి రావలసిం'దని అన్నాడు తండ్రి. భారవికి అదొక శిక్ష అనిపించకపోయినా తండ్రిమాట ప్రకారం మర్నాడే భార్యతో అత్తవారింటికి వెళ్లాడు.


పండితుడూ-మంచికవిగా పేరొందినవాడూ-అందునా కొత్తల్లుడూను-అంటూ అత్తింటి వారు మొదట వారంరోజులూ భారవిని కాలు కింద పెట్టనీయలేదు.


రెండోవారం చూసీ చూడనట్టు వ్యవహరించారు.


మూడోవారం పనీపాటా లేక ఊరికే తినిపోదామని వచ్చినవాడు' గా తనని గూర్చి గుసగుసలాడారు.


నాలుగో వారానికి ఆమాట అననే అన్నారు.


ఐదోవారానికి ఇంటిపనీ, పొలంపనీ, ఇంటికి వచ్చి పోయే చుట్టాలపక్కాల మర్యాదలూ ..... ఇలా అప్పగించడం మొదలెట్టారు.


భర్తకి జరుగుతున్న ఈ అవమానం తనకేమాత్రమూ పట్టినట్టనిపించలేదు భారవి భార్యకి. అత్తారింటిలో ఆర్నెలలుండడంలో 'శిక్ష' ఎంత దాగుందో రోజు రోజుకీ తెలియ సాగింది భారవికీ.


మొదటివారంలోని మీగడ పెరుగూ పిండివంటల భోజనం క్రమంగా మూడోవారానికి మజ్జిగా ఆవకాయగా మాటి, ఆటో నెల ప్రారంభానికి

అనగనగా....


గంజి నీళ్ల స్థాయికి చేరింది. ఈ తిండికి తోడు అసమర్థుడూ, మేసేపోతూ, తిమ్మరాజూ వంటి బిరుదులని కూడ భారవి ఓర్పుతో భరించి ఆర్నెలలు నిండిన మజురోజే బయలు దేరుతూ తన రాకకి కారణాన్ని అత్తగారితో చెప్పి తండ్రి వద్దకి వచ్చి సాష్టాంగపడ్డాడు.


కన్నీటితోనే తల్లిదండ్రులిద్దటూ భారవిని దీవించారు. మహాకవి కాలిదాసు రచించిన రఘువంశం, మేఘసందేశం, కుమారసంభవం అనే మూడు కావ్యాలు-మాఘమహాకవి రాసిన శిశుపాలవధాకావ్యం, ఈ భారవి రాసిన కిరాతార్జునీయం అనే కావ్యంతో కలిపి మొత్తం ఈ ఐదింటినీ సంస్కృతంలో పంచకావ్యాలు అంటారు.


అలా సంస్కృతంలో ఏ అయిదు కావ్యాలని చదివితే భాష కరతలామలకమౌతుందో, ఆ పంచకావ్యాల్లో ఒకటైన కిరాతార్జునీయాన్ని రచించి, భారవి శాశ్వతుడయ్యాడు.


3. ఆ శ్లోకం నన్ను రక్షించింది.


11


అత్తారింటిలో ఉంటున్న కాలంలో, తనకంటూ ఓ సంపాదన లేని కారణంగా భారవిచేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోయింది. అదే సమయంలో పండక్కి తన భార్యకి చీర తేవలసి వచ్చింది కూడ. దిక్కుతోచక, తానురాసిన 'సహసా విదధీత న క్రియామ్ ..... ' అనే శ్లోకాన్నే ఒక తాటాకు మీద రాసి ఆ శ్లోకాన్ని ఆ ఊళ్లోనే ఒక వ్యాపారి వద్ద కుదువ పెట్టాడు భారవి.


ఆ సొమ్ముతో అప్పటికి పరువు నిల్చింది. ఆ తాకట్టు (కుదువ)ని విడిపించుకునేంతవరకూ శ్లోకాన్ని ఏ గ్రంథంలోనూ ఏ సభలోనూ భారవి చెప్పకూడదు సరికదా, ఆ శ్లోకాన్ని ఇంతకుముందు విన్న ఎవరైనా చదివినా అది తన శ్లోకమేనని అనకూడదు కూడా. అదీ నియమం.


ఆ శ్లోకాన్ని కుదువ పెట్టుకున్న బేహారి ఆ రాత్రే వ్యాపార నిమిత్తం పొరుగు దేశానికి బయలుదేరుతూ ఆ శ్లోకం ఇంటి చూరులో ఉందనీ, భారవి సొమ్మిచ్చినప్పుడు ఆ తాటాకుని ఆయనకిచ్చి వేయవచ్చు'ననీ భార్యకి చెప్పి వెళ్లాడు. ఆ వ్యాపారి బయలుదేరేనాటికి అతని భార్య రెండవ నెల గర్భవతి. .


వ్యాపారం నిమిత్తం వెళ్లిన బేహారి పన్నెండు సంవత్సరాలకి తిరిగి వచ్చాడు. ఉత్తర ప్రత్యుత్తరాలు రాసుకునే వీలు ఏమాత్రమూ లేని ఆ కాలంలో,

అనగనగా....


12)


వెళ్లిన వ్యక్తి తిరిగి వస్తేనే అతడు జీవించి ఉన్నట్టు లెక్క. పన్నెండేళ్లయిన కారణంగానూ, తాను వెళ్లేనాటికి 'తన భార్య గర్భవతి' అనే మాటని మఱచిన కారణంగానూ, తన ఇంట్లో ఒంటరిగా ఉండే భార్యకి తాను తెచ్చిన నగలని వెంటనే చూపించి ఆనందపరచాలనే ఉద్దేశ్యంతో ఆ అర్ధరాత్రివేళలోనే ఓడదిగి ఇంటికి తిన్నగా చరచరా వచ్చాడు వ్యాపారి.


ఆరు బయట పంచలో తన భార్య పక్కలో వేవొకడు పడుకొని ఉండడాన్ని చూసిన వ్యాపారికి కోపం, ద్వేషం-ఒక్కసారి మిన్నుముట్టాయి. ' తాను దూరంగా ఉన్న కారణంగా ఈమె ఇంతటి నీచానికి దిగజాటీం'దని అర్థమైన వ్యాపారి, తన ఒరలోని కత్తిని దూసి ఆమె తలమీద వేయడానికి పైకేత్తగానే, ఆ కత్తి మొన ఇంటిచూరుకి తగిలి, అక్కడ దాచి ఉంచిన భారవి శ్లోకం రాసి ఉన్న తాటాకు నేలన పడింది.


చూరునుండి పడింది ఒకతాటాకని అర్థమయింది వ్యాపారికి. దీపం వెలుగులో దానిలో ఏముందో చదివాడు.


'సహసా విదధీత న క్రియామ్....” 'తొందరపాటు నిర్ణయంతో ఏ పనినీ చేయకు. ఆలోచించి చేసిన పని ద్వారా సకలశుభాలూ సంపదలూ చేకూరుతాయి' అనే అర్థం ఉన్న ఆశ్లోకం కనిపించింది.


అంతే ! అప్పట్లో తను పెట్టుకున్న కుదువా...... తస విదేశీ ప్రయాణం.... అమె అప్పటికి గర్భవతిగా ఉండడం.... అన్నీ గుర్తుకి రావడమేకాక, తాను బయలుదేరేప్పుడు గర్భవతిగా ఉన్న తన భార్య, ఈ పిల్లవాణ్ణి ప్రసవించి ఉండి ఉంటుందని కూడా క్షణాల్లో అర్థమైపోయింది.


కత్తిమొనకి ఈ తాటాకే తగిలి నేలన పడి ఉండకపోతే, ఎంత దారుణం జరిగి ఉండేది! కన్నీళ్లు ధారగా కారుతుంటే భార్యాపుత్రుల్ని లేపి జరిగింది చెప్పి తన తప్పుని మన్నించవలసిందన్నాడు వ్యాపారి.


మఱునాడే సకుటుంబంగా భారవి ఉన్న గ్రామానికి వెళ్లిన వ్యాపారి, భారవిని విశేషంగా సత్కరించి "తనకుటుంబాన్ని నిలపడానికి 'శ్రీరామ రక్ష' అయిన ఆ శ్లోకం ఎందఱినో తొందరపాటు నుండి రక్షించగల"దని పలికి భారవి ఆశీస్సులని పొందాడు.


దీనితో భారవీ ఆయన శ్లోకమూ కూడ చిరస్థాయి అయినట్లే కదా !

అనగనగా....


13


ఎన్నో ఔషధాలలో ఏదో ఒక ఔషధం, ఎందతో రోగులలో ఎవరో ఒకరోగి మీద, ఎప్పుడో ఒకప్పుడైనా వికటించ వచ్చునేమో కానీ, ఇలాటి శ్లోకాలు ఎప్పుడూ ఎవరికీ హానిని కల్గించనే కల్గించవు. అందుకే ఆ కవుల చరిత్ర శాశ్వతం. వారి ప్రతి అక్షరం నిత్యసత్యం.



సర్వాంతర్యామికై

 . *🌻సర్వాంతర్యామికై సాధన🌻*


      సర్వం ఖల్విదం బ్రహ్మ.. 3-14-1ఉన్నదంతా బ్రహ్మమే.. అంటే నామ రూపాత్మకమైన ప్రపంచమంతా బ్రహ్మమే అని ఛాందోగ్యోపనిషత్తు ఘోషిస్తున్నది.

(ఉపనిషద్రత్నాకరము 46 పు.)

    మరి అంతటా వున్న పరబ్రహ్మమును అనుభూతిలోకి తెచ్చుకోవాలంటే ఏ రకమైన సాధన చేయాలి?

    యోగ తత్వోపనిషత్తులో సులభోపాయంగా ఈవిధంగా చెప్పబడింది.

     యద్యత్ పశ్యతి చక్షుర్భ్యాం 

     తత్తదాత్మేతి భావయేత్ 69

         మనుష్యుడు కండ్లతో దేనిని దేనిని చూస్తాడో అదంతా ఆత్మయే అని భావించాలి.

      యద్యచ్చృణోతి కర్ణాభ్యాం

      తత్తదాత్మేతి భావయేత్ 70

            చెవులతో ఏదేది వినిపిస్తుందో అదంతా ఆత్మయే అని భావించాలి.

       అంటే కనిపించేదీ, వినిపించేదీ అంతా బ్రహ్మమే అని భావిస్తే సరి! (ఉపనిషద్రత్నాకరము 176 పు)

      దీనినే మరో రకంగా శ్రీ కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు ఒకచోట ఇలా అంటారు.

     "శరీరముతోను, హృదయముతోను, సంభాషణతోను ఎవ రెవరిని చూచి వ్యవహరింతుమో వా రందరును అంతర్యామి స్వరూపములే కాని మన మనుకొనుచున్న సంబంధముల వారు కారు."

(శ్రీ మద్భాగవత ప్రకాశము.. స.స్కం. 79 పు.)

       ఇక్కడ ఒకింత వివరణ అవసర మనుకుంటాను.

       కనిపించే దంతా వినిపించే దంతా నామ రూపాత్మకమే కదా బ్రహ్మ మెలా ఔతుంది? అన్న సందేహం అక్కరలేదు.

      నామ రూపాత్మక మయింది ప్రపంచ మని, బ్రహ్మము కాదని కొందరి అభిప్రాయం. నామ రూపాత్మకమైనంతమాత్రాన బ్రహ్మము కాకుండాపోతుందా! ప్రపంచమూ బ్రహ్మమే! అలా భావించటం అలవాటు కావటానికే కనిపించేదంతా వినిపించేదంతా బ్రహ్మమే అని భావించవలె నని ఉపనిషద్వాక్యం.

     కనిపించేదంతా అన్నప్పుడు ఇక్కడ చర్మ చక్షువులే అని వేరే చెప్పబనిలేదు. వినిపించేదంతా అంటే భౌతికములైన చెవులే అని వేరే చెప్పబనిలేదు. కండ్లు మూసుకొని చూడండి. చెవులు మూసుకొని వినండి అనడం లేదు. ఇక్కడ స్థూల సూక్ష్మముల ప్రసక్తి లేదు. ఇది అర్థం చేసుకోవటానికి గొప్ప విద్యావంతుడు కా నక్కరలేదు. అతి సామాన్యుని కర్థమయ్యే విధంగానే చెప్పబడింది.

      ఉదాహరణకు ఒక నైష్ఠికుడు నిత్యానుష్ఠానం చేసుకుంటున్నా డనుకొనండి. ఈలోపల ఎవడో వచ్చి భంగపరచినా డనుకొనండి. వెంటనే అతనికి కోపం ముంచుకొస్తుంది. ఎడాపెడా తిట్టేస్తాడు వచ్చినవాణ్ణి పట్టుకొని. ఈలోపల ప్రశాంతంగా చేసుకుంటున్న అనుష్ఠానం కాస్త భంగమౌతుంది. తర్వాత మళ్ళీ ఎంతో సేపటికి గాని మనస్సు నిశ్చలం కాదు. ఒక్కొకసారి ఆ రోజంతా.. 

     కాని అప్పుడే కొంచెం తమాయించుకొని దేవుడే పంపకపోతే ఇత డెలా వస్తాడు? అని.. వచ్చిన వానిలోపల కూడా దేవుడే వున్నాడు కదా అని.. వాడు మధ్యలో రావడానికి నేను కారణం కాదు కదా! నేను కారణం కాకపోతే దేవుడే అవుతాడు కదా!.. అసలు మనుష్యుల మధ్య కూర్చున్నది నేనే కదా! ఎవరూ లేని ఏకాంతంలోనో ఏ అరణ్యంలోనో కూర్చోలేకపోయాను గదా!.. అని దృష్టి నిలిపి ఒక్కసారి ఆలోచించ గలిగితే ఎంతో ప్రమాదం తప్పిపోతుంది. అంటే ఎంతో సులభమైనదానిని క్లిష్టతరంగా మనమే మార్చుకుంటున్నా మన్నమాట!

    దీని కంతకూ కారణం నాయంత నైష్ఠికుడు లే డనే అహం కావచ్చు. లేదా వచ్చినవాడు వేరే బ్రహ్మమూ వేరే అనే భేదభావమూ కావచ్చు. 

      కనిపించేది, వినిపించే దంతా బ్రహ్మమే.. అని భావిస్తే సరిపోయేది కదా! అంతా సర్దుకునేది కదా!

      బ్రహ్మ మెక్కడో వున్న దని భావించేకంటె ఎదురుగా కనిపిస్తున్నది వినిపిస్తున్నది బ్రహ్మమే అని భావించడం ఎంతో తేలిక కాదా! మనం భావించటం కాదు. యథార్థమే అది. ఈ విషయం ఏ స్వామీజీ చెప్పటమే లేదు.

     మరో ఉదాహరణం. మన మొక పార్కులో నడుస్తూ వున్నా మనుకోండి. "మన పక్కన నడిచే వాళ్ళంతా పరమాత్మ స్వరూపులు" అన్న విషయం గుర్తుకు తెచ్చుకొని ఆ దృష్టితో ఒక నిమిషమైనా చూడాలి. అట్లే సిమెంటు బెంచీలమీద కూర్చొని మాట్లాడుకుంటున్న వాళ్ళంతా పరమాత్మ స్వరూపులుగా భావించాలి. పార్కులో వున్న చెట్లు పూలు పరబ్రహ్మమయములుగా ఒక్కసారైనా భావించాలి.

    ఎప్పుడైనా డాబా మీద తీరిగ్గా కూర్చునే అవకాశం వస్తే రోడ్డుమీద వచ్చే పోయే వాహనాలను పరికించి చూస్తూ అవన్నీ పరబ్రహ్మ మయములుగా భావించాలి. వాహనాలపైననూ నడిచీ వెళ్ళే వాళ్ళను పరిశీలనగా చూస్తూ పరబ్రహ్మ స్వరూపాలుగా ఒకింతసేపు భావించాలి. అట్లే భూమిని, ఆకాశాన్ని, పారే సెలయేళ్ళను, పశు పక్ష్యాదులను క్రిమి కీటకాదులను పరబ్రహ్మ స్వరూపాలుగా భావించాలి.

     కనిపించేదీ, వినిపించేదీ అనే దాని పరిధిలోనిదే కుటుంబం కూడాను. అంటే భార్యా పుత్రులూ భగవత్ స్వరూపాలే అన్నది స్ఫురణకు రావాలి. వాళ్ళలో పరబ్రహ్మమును చూడడం అభ్యసించాలి. ఇక అప్పుడు సంసారం వదలిపెట్టి సన్యాసం పుచ్చుకుంటా ననే మాట తలయెత్తదు. ఆ సన్యాస మేదో భగవత్స్వరూపాన్ని కనుగొనేటందుకే గదా! అది ఇక్కడే కనిపిస్తూ వుంది కదా!

    అంతటా వున్నది పరబ్రహ్మమే కాబట్టి నీ కెదురుగా వున్నది ఏ వస్తువైనా సరే అది కుర్చీ కావచ్చు, మంచం కావచ్చు, బొమ్మ కావచ్చు, పెన్ను కావచ్చు, పుస్తకం కావచ్చు, టీ కావచ్చు, టీ కప్పు కావచ్చు, నీళ్ళు కావచ్చు, నీళ్ళు నిండిన బకెట్టు కావచ్చు, ఒక్క క్షణం తదేకంగా చూపు నిలిపి దాని పేరు ఉచ్చరిస్తూ "యిందులో పరబ్రహ్మం అంతర్లీనంగా వెలిగిపోతూ వుంది. అది నాకు అనుభవంలోకి వస్తూ వున్నది." అని భావించాలి. ఈ భావన మనస్సులోనే కొనసాగించవచ్చు. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని సంకోచించే పని లేదు. ఇంతసేపని నియమం లేదు కాబట్టి మనకు వీలైనంత సేపే భావించవచ్చు. 

     పైవన్నీ అచరములైన వస్తువులు. అట్లే చరములైన పశుపక్ష్యాదులను, మనుష్యులను కూడ చూస్తూ ఎప్పుడు వీలుంటే అప్పుడు పై విధంగా భావించవచ్చు. ఉదాహరణకు కోడి, కుక్క, పిల్లి, బల్లి మొదలైనవి. పాలవాడు, పనిమనిషి , అతిథులు, మిత్రులు మొదలైనవారు. 

    ఎందుకంటే అన్నిటిలో, అందరిలో పరబ్రహ్మమే వుంది. కాదనలేము. కాని అది ప్రయోజనకారిగా తయారుకావాలి కదా! ఎందుకు కావటం లే దంటే అది నిద్రాణమై వున్నది. మనం పదే పదే భావిస్తే అది ఆక్టివేట్ అవుతుంది. అప్పుడు ప్రయోజన కరంగా తయారౌతుంది. 

    పొయ్యిలో నిప్పువుం దనుకొనండి. వున్నంతమాత్రాన మనం వాడుకోలేము. కాస్త ఒకటి,రెండు నిమిషాలు ఊదామా! అది రాజుకొని మంట వస్తుంది. అప్పుడు వంట చేసుకోవచ్చు. ఇదీ అలాంటిదే!

     పైన పేర్కొనబడిన ఉపనిషత్తులలోని సారభూతమైన అంశ మేమంటే చూస్తున్నవాటినే కాదు, వింటున్నవాటినీ పైవిధంగానే భావన చేయాలి. ఇదే పెద్ద ధ్యానం. ఆధ్యాత్మిక సాధన. ఎంతసేపైనా చేయవచ్చు. ఇందులో అర్థం కాని, నోరు తిరుగని ఏ సంస్కృత మంత్రాలూ లేవు. ఉపదేశాలూ లేవు.

    ఈవిధంగా సాధన చేస్తే కలిగే ప్రయోజన మే మంటే....

   యో మాం పశ్యతి సర్వత్ర

   సర్వం చ మయి పశ్యతి

   తస్యాహం న ప్రణశ్యామి

   స చ మే న ప్రణశ్యతి 6-30

       (శ్రీ మద్భగవద్గీత)

   అతడు అందరిలో నన్ను చూస్తాడు. అట్లే అందరినీ నాలో చూస్తాడు. కాబట్టి అతని ముందు నేను అదృశ్యుణ్ణి కాను. (అతనికి ఎప్పుడూ ప్రత్యక్షంగానే వుంటాను.) ఆతడూ నా ముందు అదృశ్యుడు కానేరడు. (నా దృష్టి నుంచి తప్పించుకోలేడు.)

    అంటే నిత్యమూ అలాంటి వ్యక్తి భగవత్ సన్నిధానంలోనే వుంటాడు. అతనికీ భగవంతునికీ ఎడము అనేది వుండదు... ఇదే కదా ఎవరైనా కోరుకునేది! తరువాతి శ్లోకంలోను ఈ భావాన్నే దృఢతరం చేయటం జరిగింది.

     ఇటువంటి బ్రహ్మ భావన సూక్ష్మతర మయ్యేకొద్దీ మన చుట్టూ నిద్రాణమై వున్న పరబ్రహ్మం జాగృతం కాగా బ్రహ్మతత్వం ప్రయోజనాత్మకమై నిత్యజీవితంలో అనుభూత మౌతుంది. యద్భావం తద్భవతి.. అని కదా!

           

                    ....స్వస్తి...


      రచన: డా.వెలుదండ సత్యనారాయణ

                             పరమార్థకవి

                                1.5.21

మనుమసిద్ధి - కాటమరాజుల ప్రక్షానా పోరాడిన యోధులపేర్లివిగో.

 మనుమసిద్ధి - కాటమరాజుల ప్రక్షానా పోరాడిన యోధులపేర్లివిగో.

........................................................


కాటమరాజు తండ్రిపేరు పెద్దిరాజు, తాతపేరు వల్లురాజు. కాటమరాజు నెల్లూరు మండలంలోని కనిగిరిసీమలోని అలవలపాడుకు అధిపతి. ఆత్రేయగోత్రానికి చెందిన యాదవుడు.అలవలపాడు సీమలో మూడు సంవత్సరాలపాటు వర్షాలు కురవలేదు. తీవ్రమైన అనావృష్టితో ప్రజలు పశువులతోపాటుగా ఇబ్బందుల పాలైనారు. అలవలపాడు యాదవుల వద్ద లక్షగోవులకుపైగానే గోసంపదవుంది.


కాటమరాజు అనుమతితో గొల్లలు మనుమసిద్ధిరాజ్యంలోని అడవులలోనికి ఆలమందను మేతకై తోలుకువెళ్ళారు. మేతబయలులో పశువులను మేపుకొన్నందుకు పుల్లరి ( పన్ను) చెల్లిస్తానని కాటమరాజు మనుమసిద్ధికి కబురు పెట్టాడు. మనుమసిద్ధి సరేనన్నాడు.


యాదవులు ఆలమందలను తోలిన అడవులలో ఆటవికులున్నారు. యాదవులు తినటానికై అడవిలో మృగాలను పక్షులను వేటాడంతోపాటు ఫలవృక్షసంపదలను హరించసాగారు. ఆటవికుల జీవనోపాధికి తీవ్రమైన ఆటంకము కల్గింది. ఆటవీకులకు పశుకాపరులకు మధ్య ఈ విషయమై తీవ్రఘర్షణ జరిగింది.


ఆటవీకులు పశువులపైబడి అనేక గోవులను సంహరించారు.దీంతో గోపాలురు పుల్లరి చెల్లించకుండా అర్ధరాత్రిపూట పశువులమందలను అలవలపాడుకు వెళ్ళిపోయారు.


విషయంతెలిసి మనుమసిద్ధి పుల్లరి చెల్లించాల్సిందిగా కాటమరాజుకు కబురు పెట్టాడు. మీ రాజ్యంలోని ప్రజలు మా ఆవులమందలోని అనేక మూగ జీవాలను చంపేశారు. మీకు చెల్లించాల్సిన పుల్లరికన్నా చనిపోయిన గోవుల విలువే ఎక్కువగావుంది. కనుక మీరాజ్యమే మాకు నష్టపరిహరం చెల్లించాలని కాటముడు తిరుగుబాబు పంపాడు.


ఆగ్రహించిన మనుమసిద్ధి ఓ ప్రయత్నంగా అన్నంభట్టును అలవలపాడుకు రాయభారం పంపాడు. రాయభారం విఫలమైంది.ఇరుపక్షాలు యుద్ధానికి సిద్ధమైనాయి.


మనుమసిద్ధికి సేనాని ఖడ్గతిక్కననే బ్రాహ్మణుడు. ఖడ్గతిక్కన ఎవరోకాదు తిక్కనసోమయాజికి స్వయాన పెదనాన్న కొడుకు. భాస్కర మంత్రికి నలుగురు కొడుకులు.మూడవకొడుకు పేరు సిద్ధానామాత్యుడు. నాలుగవవాడి పేరు కొమ్మనామాత్యుడు. సిద్ధానామాత్యుడి కొడుకుపేరు తిక్కన, ఇతనే ఖడ్గతిక్కనగా ప్రసిద్ధి. కొమ్మనామాత్యుడి తనయుడిపేరు కూడా తిక్కనే. ఇతనే సింహవిక్రమపురి (నెల్లూరు) కి రాజైన మనుమసిద్ధి దగ్గర ప్రధానామాత్యుడు. ఇతనే నిర్వచనోత్తర రామాయణకర్త, ఉభయకవిమిత్రుడు, కవిబ్రహ్మ అంతకుమించి మహాభారతాన్ని తెనిగించిన కవిత్రయంలో ఒక్కడు. మనుమసిద్ధికడ ఒకతిక్కన సేనానిగా, మరోతిక్కన అమాత్యుడుగా వున్నారు.


నెల్లూరు, అలవలపాడు ఇరుపక్షాలకు యుద్ధం తప్పనిసరైంది. సేనను సేనానులను ఇరురాజ్యాలు సమకూర్చుకొన్నాయి.


 మనుమసిద్ధిపక్షంలో తిరునామాల తిప్పరాజు, శ్రీకంఠరాజు, పెదవేగి బొక్కరాజు, పెదవరదరాజు, గయికొండ గంగరాజు, ఉర్లకొండ సోమన్న, ఉదయాద్రి ఉమ్మయ్య, అర్లుకొండ అచ్చిరాజు, చెన్నపట్నం చంద్రశేఖరుడు, దేవముని వెంగళయ్య, పట్టుకోట బసవరాజు, కాళహస్తి పాప తిమ్మరాజు, వెలుగంచి వెంగళరాజు, ప్రభగిరి పట్టణ పద్మశేఖరుడు మొదలైన యోధులు కాటమరాజును శిక్షించడానికి సిద్ధమైనారు.


యాదవులపక్షానికి బ్రహ్మరుద్రయ్య మహసేనాని. ఇంకా కాటమరాజు పక్షంలో పలనాటి పద్మనాయుడు, పల్లెకొండ ప్రభువు చల్ల పిన్నమనాయుడు, దొనకొండ అయితమరాజు,ఎఱ్ఱయ్య, భట్టావుల రాజు, వల్లభన్న, నాచకూళ్ళనాయుడు,ముమ్మయ్యనాయుడు, ఉత్తమరాజు మొదలైన యోధులు పాల్గొన్నారు. మొదటగా యాదవుల సైన్యానికి చల్లపిన్నమనాయుడు నాయకత్వం వహించాడు.


ఉభయసైన్యాలు పాలేటి దగ్గరలోని పంచలింగాల కడ ఢీ కొన్నాయి. ఈ యుద్ధంలో తిక్కన బాగా గాయపడి వెనుతిరిగాడు. స్వగ్రామంలో వీధులలో ప్రజలు నిలబడి పేడ పిడుకలు తిక్కనపై విసిరి పిరికివాడని గేలిచేశారు. ఇంట్లో తండ్రి సిద్ధనామాత్యుడు, భార్య చానమ్మ, చివరికి తల్లి కూడా ఖడ్గతిక్కన పిరికివాడని కదనరంగంనుండి పారిపోయి వచ్చాడని నిందించారు.


తిక్కన రోషంతో మరల రణరంగంలో దూకి కాటమరాజు సైన్యాన్ని అల్లకల్లోలం చేశాడు. యాదవసేనలో పెక్కుమంది ఖడ్గతిక్కన ఖడ్గానికి బలైనారు. కాటమరాజు సేనాని బ్రహ్మరుద్రయ్య తిక్కనను ఎదుర్కొన్నాడు. ఇరువురి మధ్య జరిగిన బాహాబాహియుద్ధంలో బ్రహ్మరుద్రయ్య కత్తివేటుకు తిక్కన తలతెగిపడింది. అప్పటికే తిక్కన విసిరిన కత్తివేటుకు రుద్రయ్య కూడా నేలకు కూలబడ్డాడు. ఇద్దరి ప్రాణాలు అనంతవాయువులలో కలిశాయి.


ఇరుపక్షాల వినాశానాన్ని నివారించటానికి కవిబ్రహ్మ, ఉభయకవి బిరుదాంకితుడు, మనుమసిద్ధికి అమాత్యుడైన తిక్కన సోమయాజి రాజీ కుదిర్చి శాంతిని నెలకొల్పాడు.

................................................................................................................జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

*శ్రీ సూక్తము.. (మొదటి భాగము.)*

 *శ్రీ సూక్తము.. (మొదటి భాగము.)*


 హిందూ మతం లో వేదానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. వేదం లో కూడా కొన్ని భాగాలు భావంలోనూ భాషలోనూ చాలా బాగా కుదిరాయి అని మహర్షులు భావించి ఆ భాగాలకు సూక్తాలు అని పేరు పెట్టారు. సూక్తము అంటే (సు+ఉక్తం) చక్కగా / బాగా, చెప్పబడినది అని అర్థము. వేదంలోని సూక్తాలన్నింటి లోకీ పురుష సూక్తము శ్రీ సూక్తము చాలా ప్రాచుర్యంలో ఉన్న సూక్తాలు. 

 

పురుష సూక్తం ఉపనిషత్తులలోని అద్వైత భావాన్ని వివరిస్తుంది. ఆత్మ పరమాత్మ ల ఏకత్వాన్ని నిరూపిస్తుంది. పరబ్రహ్మాన్ని వివరిస్తుంది. అందరు దేవతలు పరబ్రహ్మ రూపాలే అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. 


"శ్రేయతే సర్వైః ఇతి శ్రీ" సర్వ ప్రాణుల కు ఆశ్రయమైనది అని శ్రీ పదానికి అర్థము. శ కారము పర బ్రహ్మ కు సంబంధించిన సత్ లేదా అస్తి అనే శక్తికి ప్రతీక. అందువల్ల శ కారము ఈశ్వరుని సూచిస్తుంది అని చెప్తారు. ర కారం అగ్ని బీజము. ఈ అనేది శక్తి బీజము. ఈశ్వరుడు అగ్ని శక్తి ఈ మూడింటి యొక్క కలయిక శ్రీ. ఈ అక్షారము లక్ష్మీ కి పర్యాయపదము. శ్రీదేవి అంటే ఐశ్వర్య స్వరూపిణి. శ్రీ బీజం శుభాలను ఇస్తుంది అశుభాలను అమంగళాలను దోషాలను తొలగిస్తుంది. అందుకనే కావ్య లన్నిటికీ మొదటి పద్యంలో మొదటి అక్షరాన్ని శ్రీ అని ఉంచుతారు. కావ్యంలో ఏ దోషం ఉన్నా ఈ ఒక్క అక్షరం ఆ దోషాలు నన్నింటిని తీసి వేస్తుంది. శ్రీ, శ్రీ మత్ అనే పదాలు శ్రేష్ట వాచకాలు. ఉదాహరణకు శ్రీవిద్య శ్రీదేవి శ్రీవారు మొదలైన పదాలు. గౌరవాన్ని సూచించడం కోసము శ్రీ ని పేర్లకు ముందు వాడతారు. శ్రీ అంటే బిల్వ చెట్టు. మారేడు కాయను శ్రీ ఫలము అంటారు. శ్రీ అంటే సాలెపురుగు అనే అర్థం కూడా ఉంది. 


ఓంకారం సచ్చిదానంద రూపుడైన పరబ్రహ్మ ను తెలియజేస్తే, శ్రీ బీజం ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాతను తెలియజేస్తుంది. ఓంకారం ఆధ్యాత్మికమైన ఉన్నతికి దారి చూపితే శ్రీకారం లౌకికమైన సంపదలనూ కోరికలనూ అనుగ్రహిస్తుంది. 


శ్రీ సూక్తం ఋగ్వేదంలో భాగము. శ్రీ సూక్తము లో ప్రధానంగా 15 ఋక్కులున్నాయి. వేదభాగాలను ఎలా వాడాలి అనే విషయాన్ని తెలియజేసే శాస్త్రాన్ని కల్పము అంటారు. కల్ప సూత్రాల ప్రకారము, శ్రీ సూక్తము ప్రధానంగా హవనము (యజనము) లో వాడుకోవాలి. అంగన్యాస కరన్యాసాల తో జపానికి వాడుకోవడం రెండో పద్ధతి. ఇందులో కూడా మొత్తం సూక్తాన్ని అంగన్యాస కరన్యాసాల తో జపం చేయడం ఒక పద్ధతి. ఒక్కొక్క ఋక్కును ప్రత్యేకంగా అంగన్యాస కరన్యాసాల తో జపం చేయడం వేరొక పద్ధతి. 


శ్రీ సూక్తము తాత్పర్యం చూస్తే అది మహాలక్ష్మి ప్రార్థన అని అనిపిస్తుంది. కానీ నిజానికి శ్రీ సూక్తము లక్ష్మీ సరస్వతి పార్వతి ముగ్గురు కలిసి ఉన్న (అంటే దుర్గా సప్తశతి లో వర్ణించిన) దుర్గా స్వరూపాన్ని, ప్రకృతి రూపిణి మూల శక్తి రూపిణి అయిన లలితా అమ్మవారికి ప్రార్ధనా రూపంలో ఉంటుంది. శ్రీ సూక్తం మొత్తంగా కానీ లేదా అందులో ఉన్న ఋక్కులను విడిగా గాని జపం చేయడానికి అంగన్యాస కరన్యాసాలు చేసేటప్పుడు వాడే బీజాలు సంకల్పం శ్రీ సూక్తం పరాశక్తి కి సంబంధించినది అని నిరూపిస్తాయి. అందుకనే శ్రీ సూక్తాన్ని శైవులు శాక్తేయులు కూడా వారి పూజలలో ఉపయోగిస్తుంటారు.


వేదం లో భాగం కాబట్టి శ్రీ సూక్తాన్ని వేదం చదివినట్లు స్వరయుక్తంగా చదవాలి. కానీ, రుగ్వేదంలోని ఖిల భాగంలో ఉన్నది కాబట్టి స్వరం లేకుండానే ఈ సూక్తాన్ని స్తోత్రం లాగా చదువుకునే వెసులుబాటు ఉన్నది. అందువల్ల ప్రస్తుతం అందరూ శ్రీ సూక్తాన్ని స్వరం లేకుండా స్తోత్రం గానే చదువుతున్నారు. ఆడవాళ్ళు ఇంటి పనులు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ కూడా ఈ సూక్తాన్ని చదువుతుంటారు. అది కూడా మంచిదే. 


వేదమంత్రాలు అర్థం తెలియకుండా చదివినా ఫలితాన్నిస్తాయి. కానీ ఎవరిని పూజిస్తున్నాము మనం చేసే ప్రార్థన ఏమిటి అందులో మనం ఏమి కోరుకుంటున్నాము తెలుసుకొని చదివితే అప్పుడు ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది. 


శ్రీ సూక్తాన్ని గురించిన పరిచయం కొంత వరకూ పూర్తయింది కాబట్టి ఇక ఋక్కులలోకి వెళ్దాము.


ఇంకా ఉంది.....


*పవని నాగ ప్రదీప్.*

సంస్కృత మహాభాగవతం

*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది ఏడవ అధ్యాయము*


*శ్రుతిగీతలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*87.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*స్థిరచరజాతయః స్యురజయోత్థనిమిత్తయుజో విహర ఉదీక్షయా యది పరస్య విముక్త తతః|*


*న హి పరమస్య కశ్చిదపరో న పరశ్చ భవేత్ వియత ఇవాపదస్య తవ శూన్యతులాం దధతః॥11989॥*


ప్రభూ! నీవు నిత్యముక్తుడవు, మాయాతీతుడవు. అయితే నీ ఈక్షణమాత్రమున (సంకల్పమాత్రమున) మాయాశక్తిచే నీవు విహరించినప్పుడు స్థావర - జంగమాత్మకములైన ప్రాణులు తమ తమ కర్మ - సంస్కారములతో ఉత్పన్నములగును. ఆకాశమునుండి వాయువు మున్నగు భూతములు ఉత్పన్నములగును. కాని, ఆకాశము దేనికీ అంటకుండా, తనకుతాను శూన్యముగనే ఉండిపోవును. అట్లే నీనుండి చరాచరప్రాణులు ఉత్పన్నమగును. కాని, సర్వవ్యాపకుడవు ఐన నీవు ఆకాశమునకువలె అనంగుడవై ఉందువు. అనగా పరమాత్మవగు నీకు తనవాడుగానీ, పరాయివాడుగానీ ఎవడునూ లేడు.


*87.30 (ముప్పదియవ శ్లోకము)*


*అపరిమితా ధ్రువాస్తనుభృతో యది సర్వగతాః తర్హి న శాస్యతేతి నియమో ధ్రువ నేతరథా|*


*అజని చ యన్మయం తదవిముచ్య నియంతృ భవేత్ సమమనుజానతాం యదమతం మతదుష్టతయా॥11990॥*


స్వామీ! నీవు నిత్యుడవు. అఖండస్వరూపుడవు. అసంఖ్యాకులైన జీవులు అందరును నిత్యులు, సర్వవ్యాపకులు ఐనచో వారు నీతో సమానులగుదురు. అట్లైనచో నీవు శాసించువాడవుగావు, వారు శాసింపబడువారును కారు. అప్పుడు నీవు వారిని నియంత్రింపజాలవు. వారు నీనుండి ఉత్పన్నులై, నీ కంటెను తక్కువస్థితిలో ఉన్నచో అప్పుడు మాత్రమే నీవు వారిని నియంత్రించుట సంభవమగును. జీవులెల్లరును, అట్లే వారి ఏకత్వ భిన్నత్వములను నీనుండియే ఉత్పన్నమగుట నిస్సందేహము (ప్రాణులన్నియును ఇంద్రియాదులను కల్గియుండుట ఏకత్వసూచకము. వాటి ఆకారములు, స్వభావాదులు వేర్వేరుగా నుండుట భిన్నత్వ సూచకము). అందువలన నీవు వారికి కారణభూతుడవు అయ్యును వారి నియామకుడవే. వాస్తవముగా నీవు వారిలో సమరూపుడవై ఉన్నావు. కాని నీ స్వరూపము *ఇతమిత్థము* అని ఎవ్వరును తెలిసికొనజాలరు. 'మేము భగవత్స్వరూపములను తెలిసికొన్నాము' అని పలికెడివారు నిజముగా నీ వాస్తవ స్వరూపమును ఎరుగనివారే. వారు కేవలము తమ బుద్ధికి తోచిన విషయమునే తెలుపుచున్నట్లు అనుకొనవలెను. నీవు అట్టి బుద్ధికిని గోచరుడవు కావు. అభిప్రాయముల వలన నిన్ను ఎరుగలేరు. ఏలయన మతములన్నియును పరస్పరవిరుద్ధములు. నీ స్వరూపము ఈ మతములన్నింటికిని (అభిప్రాయములన్నింటికిని) అతీతమైనది.


*87.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*న ఘటత ఉద్భవః ప్రకృతిపూరుషయోరజయోః ఉభయయుజా భవంత్యసుభృతో జలబుద్బుదవత్|*


*త్వయి త ఇమే తతో వివిధనామగుణైః పరమే సరిత ఇవార్ణవే మధుని లిల్యురశేషరసాః॥11991॥*


ప్రకృతి మరియు పురుషుడు పుట్టుకలేనివారు. కనుక వారియందు పుట్టుక-జన్మము అనేది సంభవింపదు. జలము వాయువుతో కలిసి బుడగలు పుట్టినట్లుగా ప్రకృతి పురుషుల సంయోగముచే ప్రాణులు ఉత్పన్నమగుచున్నవి. సృష్టిలోగల నానావిధములైన నామములతో, గుణములతో పుట్టిన స్థావర-జంగమాత్మకమగు ప్రాణులన్నియునూ చివరకు పరమకారణుడవగు నీలో విలీనమగును. వేరు-వేరు నదులన్నియును సముద్రమందు కలిసినట్లుగా, సకల పుష్పముల రసములు తేనెయందు కలగలిసినట్లుగా, ఈ ప్రపంచమంతయును నీ నుండి ఉద్భవించును. నీలోనే లయము చెందును.


*87.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*నృషు తవ మాయయా భ్రమమమీష్వవగత్య భృశం త్వయి సుధియోఽభవే దధతి భావమనుప్రభవమ్|*


*కథమనువర్తతాం భవభయం తవ యద్భ్రుకుటిః సృజతి ముహుస్త్రిణేమిరభవచ్ఛరణేషు భయమ్॥11992॥*


పరమాత్మా! జీవులు నీ మాయలోబడి భ్రమించుచు తమను నీనుండి వేరుగా భావించుచుందురు. అందువలన వారు జననమరణ చక్రములో తిరుగుచుందురు. కానీ వివేకవంతులు ఇట్టి భ్రమకు లోనుగాక, అనన్యభక్తితో నిన్ను శరణువేడుదురు. ఏలయన, జననమరణ చక్రమునుండి విముక్తులను గావించువాడవు నీవే. శీతకాలము, వేసవికాలము, వర్షాకాలము అను మూడు విభాగములుగాగల కాలచక్రము నీ భ్రూవిలాసమలలో (కనుసన్నలలో) మెలగుచుండును. అది అందరిని భయపెట్టుచుండును. కాని, ఈ కాలచక్రము నిన్ను శరణువేడనివారికి మాత్రమే భయానకము. నీ శరణాగతులైన భక్తులకు జన్మమృత్యురూపమైన ఈ సంసారభయము ఏమాత్రమూ ఉండదు. అట్టివారికి ఈ కాలచక్రమువలన ఎట్టిభీతియు ఉండదు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఎనబది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

రామాయణం -4 వ భాగం [RAMAYANAM - BALA KANDA]*

 *రామాయణం -4 వ భాగం [RAMAYANAM - BALA KANDA]*

*బాలకాండ :*


అలా కొంత కాలం గడిచాక, ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దెగ్గరికి వచ్చి ఇలా అన్నాడు.......అయ్యా! నేను సంతానహీనుడిని, నాకు చాలా దిగులుగా ఉంది, నాకు సంతానం కలగకుండ ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతోందొ, ఆ పాపాన్ని పరిహరించుకోడానికి వేదము చేత నిర్ణయింపబడిన అశ్వమేథ యాగాన్ని మీరు నాతొ చేయించాలి అని కాళ్ళు పట్టి ప్రార్ధించాడు. అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు......యాగం చెయ్యాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందొ ఆనాడే నీకు మంచి జెరగడం మొదలయ్యింది. కావున నీకు శూరులు, లోకముచేత కీర్తింపబడే నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు.

చైత్ర మాసంలొ చిత్రా నక్షత్రంతొ వచ్చే పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టి, దానికి ప్రోక్షణ, స్నాపన, విమోచన చేశారు. ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టారు. అది అలా ఒక 12 నెలలు తిరుగుతుంది, దాని వెనకాల మహా శూరులైన వాళ్ళు వెళతారు. ఆ అశ్వం తిరిగొచ్చేలోపు అంటె ఫాల్గుణ మాసంలొ వచ్చె అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చెయ్యాలి. కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుడిని, వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించాల్సిందిగా కోరాడు. ఆ యాగానికి ఇతర దేశాల నుండి రాజులను, ప్రజలను, జానపదులను, వేద బ్రాహ్మణులను, విద్వాంసులను ఆహ్వానించాడు. వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెట్టారు. పల్లెటూర్లనుంచి వచ్చిన వాళ్ళని అశ్రద్ధగా చూడకండి, భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు.


సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః |

న చ అవజ్ఞా ప్రయోక్తవ్యా కామ క్రోధ వశాత్ అపి ||


పది మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధాలకిలోనై అనరాని మాటలు మాట్లాడితే, మీరు నవ్వి వచ్చెయ్యండి, పట్టించుకోమాకండి. భోజనం చెయ్యడానికి పంక్తిలొ కూర్చున్నవాడు అతిధి రూపంలొ ఉన్న సాక్షాత్తు భగవంతుడు, కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రాకూడదు అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు. అలాగే జనక మహారాజు, కాశి రాజు, రోమపాద రాజు, కైకేయ రాజుని పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్ళమని చెప్పి, అందరికి విడిది ఏర్పాటుచెయ్యండి అని ఆదేశించాడు. అలా వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెడుతున్నారు....


వృద్ధాః చ వ్యాధితాః చ ఏవ స్త్రీ బాలాః తథా ఏవ చ |

అనిశం భుంజమానానాం న తృప్తిః ఉపలభ్యతే ||


అక్కడికి వచ్చినవాళ్ళల్లో వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, స్త్రీలు, చిన్ని చిన్ని పిల్లలు ఉన్నారు. భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళంతా, ఆహ! భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అని అంటున్నారు. ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళి ఎప్పుడు తింటామో అని అనుకుంటున్నారు. దశరథ మహారాజు వాళ్ళందరిని చూసి, ఇంకా తినండి, ఇంకా తినండి అంటున్నాడు. వచ్చిన వాళ్ళందరికి ధనము, వస్త్రములు దానం చేశాడు దశరథుడు. వచ్చినవాళ్ళందరూ "ఆహ! ఎంతచక్కని భోజనం పెట్టావు రాజ, ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్య, నీ కోరిక తీరి, నీకు సుపుత్రులు కలిగి, నీ వంశము ఆచంద్ర తారార్కంగా వర్ధిల్లుతుందని ఆశీర్వదించి వెళ్లారు.


ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు, ఆ యాగశాలలొ 21 యూప స్తంభాలని పాతారు, మారేడు కర్రలతొ చేసినవి 6, మోదుగు కర్రలతొ చేసినవి 6, ఛండ్ర కర్రలతొ చేసినవి 6, దేవదారు కర్రలతొ చేసినవి 2 మరియు శ్లేష్మాతక కర్రతొ చేసినది ఒకటి ఉంటుంది. దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందిన వాడు కనుక, దానికి అనుగుణంగా ఆ యాగశాలని నిర్మించారు. ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగం జెరుగుతుంది. చివర్లో ఆ యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఆ యూప స్తంభానికి కట్టారు. పట్టమహిషి అయిన కౌసల్య మూడు కత్తులతొ ఆ యాగాశ్వాన్ని వధించింది. ఆ రోజు రాత్రి ఓ శాలలొ కౌసల్య ఆ గుర్రం పక్కన పడుకొని ఉండాలి.

మరుసటి రోజున ఈ యాగం చేయించిన ఋత్విక్కులకి, రాజు 4 భార్యలని దానం చెయ్యాల్సి ఉంటుంది. మొదట పట్టమహిషిని, ఉపేక్షిత భార్యని, ఉంపుడుగత్తెని, చివరిగా ఫాలాకలిని దానం చేస్తాడు. ఆ ఋత్విక్కులు ఆ నలుగురు భార్యలని తిరిగి రాజుకి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకొని ఆ ఋత్విక్కులకి ద్రవ్యాన్ని(ధనం) దానం ఇస్తాడు. ఇప్పుడు ఆ గుర్రం శరీరంలోనుంచి వప(జంతువుల కడుపులొ బొడ్డు కింద వుండే ఉల్లిపొర వంటి కొవ్వు) ని తీసి ఆ అగ్నిలొ వేశారు. ఆ వప అగ్నిలొ కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి, దీనినె అశ్వమేథయాగం అంటారు. అలా పీలిస్తే, తనకి సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందొ, ఆ పాపం పోతుంది. చివరగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలని ఆ హోమంలొ హవిస్సుగా సమర్పిస్తారు.

దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేథయాగం చేయించిన ఋత్విక్కులకి దానం చేశాడు, అప్పుడు వాళ్ళు మేము ఈ భూభారాన్ని వహించాలేము, నువ్వు రాజువి, నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు. దక్షిణలేని యాగం జెరగకూడదు కనుక, దశరథ మహారాజు ఆ ఋత్విక్కులకి 10 లక్షల గోవుల్ని, 100 కోట్ల బంగారు నాణాలని, 400 కోట్ల వెండి నాణాలని దానం చేశాడు. అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ ఒక కోటి బంగారు నాణాలని దానం చేశాడు. ఋష్యశృంగ మహర్షి లేచి....ఓ రాజా! నీకు సంతానం కలగడం కోసం, నేను అధర్వ వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన యిష్టిని చేయిస్తాను. అదే పుత్రకామేష్టి యాగం అని చెప్పి ఆ యిష్టి చెయ్యడం ప్రారంభించారు.......


తతో దేవాః స గంధర్వాః సిద్ధాః చ పరమ ఋషయః | 

భాగ ప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి ||


ఆ యిష్టి జెరుతున్నప్పుడు, అందులో తమ తమ భాగాలని పుచ్చుకోడానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైనవారు అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఆయన దెగ్గరికి వెళ్లి, " పితామహ! మీరు ఆ రావణుడి తపస్సుకి మెచ్చి ఆయనకి అనేక వరములు ఇచ్చారు, మీరు ఇచ్చిన వరముల వలన గర్వంపొంది వాడు ఈనాడు.....


నైనం సూర్యః ప్రతపతి పార్శ్వే వాతి న మారుతః |

చలోర్మిమాలీ తం దృష్ట్వా సముద్రోపి న కంపతే ||


రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు, సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది, వాయువు రావణుడి దెగ్గర అవసరంలేకపోయినా మెల్లగా వీస్తుంది, ఈ రకంగా వాడు దిక్పాలకులని బాధపెడుతున్నాడు, ఎక్కడా యజ్ఞములు జెరగనివ్వడంలేదు, ఋషులని హింసిస్తున్నాడు, పర భార్యలని తన వారిగా అనుభవిస్తున్నాడు. ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించె మార్గం చెప్పవలసింది" అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు. అప్పుడు బ్రహ్మగారు " నేనూ వాడి అకృత్యాలు వింటున్నాను, వాడు తపస్సుతో నన్ను మెప్పించి, రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు, కాని వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలని అడగలేదు" అని అన్నారు. అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు.

ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా, అంతా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయాముర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలొ తనంతట తానుగా వచ్చారు....


ఏతస్మిన్ అనంతరే విష్ణుః ఉపయాతో మహాద్యుతిః |

శఙ్ఖ చక్ర గదా పాణిః పీత వాసా జగత్పతిః ||


ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందొ, అందమైన రూపంతొ, మెడలొ వైజయంతి మాలతొ, శంఖ చక్ర గధ పద్మాలని పట్టుకొని శ్రీమహా విష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు......


హత్వా క్రూరం దురాధర్షం దేవ ఋషీణాం భయావహం |

దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ ||

వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృధ్వీం ఇమాం |

ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణుః ఆత్మవాన్ ||


మీరెవరు కంగారు పడొద్దు, రావణుడు చేసే అక్రుత్యాలన్ని నాకు తెలుసు, వాడిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకున్న దేవతలని, ఋషులని క్రూరంగా బాధపెడుతున్నాడు, అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద పదకొండు వేల సంవత్సరాలు ఉండి ఈ పృథ్వి మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు.


తతః పద్మ పలాశాక్షః కృత్వా ఆత్మానం చతుర్విధం |

పితరం రోచయామాస తదా దశరథం నృపం ||


నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు.

అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తవబోతుంది. ఇంతలో ఆ యోగాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి, చేతిలొ వెండి మూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకొని, సింహంలా నడుస్తూ బయటకి వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు. దశరథుడు ఆయనకి నమస్కరించి నేను మీకు ఏమిచెయ్యగలను అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు " నాయనా దశరథా! నన్నుప్రాజాపత్ర్య పురుషుడు అంటారు, నన్ను ప్రజాపతి పంపించారు, ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల నీ రాజ్యంలోని వాళ్ళు ధన ధాన్యాలతో తులతూగుతారు, ఆరోగ్యంతొ ఉంటారు" అని చెప్పి వెళ్ళిపోయాడు.


వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. ముగ్గురినీ పిలిచి, ఆ పాయసంలొ సగభాగం కౌసల్యకి ఇచ్చాడు, మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు, ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి, ఒక భాగాన్ని కైకేయకి మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు.

యాగం పూర్తయ్యాక, అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. రుష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి, ఆయనని సత్కరించి శాంతా రుష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వాళ్ళందరిని తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు.

కొంత కాలానికి దశరథ మహారజులోని తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించి వాళ్ళు గర్భవతులయ్యారు.

ముకుందమాల స్తోత్రమ్ శ్లోకం : 16

 ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                    శ్లోకం : 16      

                           SLOKAM : 16

                                                

जिह्वे कीर्तय केशवं, मुररिपुं 

                           चेतो भज श्रीधरं                   

पाणिद्वन्द्व समर्चयाच्युतकथाः 

                          श्रोत्रद्वय त्वं शृणु I  

कृष्णं लोकय लोचनद्वय 

                   हरेर्गच्छाङ्घ्रि युग्मालयं

जिघ्र घ्राण मुकुन्दपादतुलसीं मूर्धन् 

                                नमाधोक्षजम् ॥ १६ ॥


జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం            

                           చేతో భజ శ్రీధరం

పాణిద్వంద్వ సమర్చయాచ్యుతకథా: 

                 శ్రోత్రద్వయ త్వం శృణు 

కృష్ణం లోకయ లోచనద్వయ 

       హరేర్గచ్చాంఘ్రియు గ్మాలయం  

జిఘ్రఘ్రాణ ముకుంద పాదతులసీం 

                  మూర్ధన్న మాధోక్షజంll



    ఇంద్రియ నిగ్రహం రెండు రకాలు. చేయకూడని వాని నుండి మరలించుట, చేయ వలసిన వానిని చేయుట. 

    ఈ శ్లోకమందు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనస్సులచే చేయదగిన వానిని చెప్పుచున్నారు.


ఓ పాద ద్వంద్వమా! 

    నీవు హరిమందిరమునకు నడుచుచుండుము. 

ఓ హస్త ద్వంద్వమా! 

    నీవు శ్రీధరుని అర్చన చేయుచుండుము. 

ఓ వాగింద్రియమా! 

    నీవు కేశవుని కీర్తింపుచుండుము. 

ఓ శిరమా! 

     నీవు అథోక్షజునికి నమస్కరించు చుండుము. 

(ఇట్లు కర్మేంద్రి యములను నిగ్రహింప వలెను.)   


ఓ నేత్రద్వంద్వమా! 

    శ్రీకృష్ణభగవానునే చూడుము. 

ఓ శ్రోత్రద్వంద్వమా! 

    ఆ అచ్యుతుని లీలలనే ఆకర్ణింపుము.

ఓ నాసికా! 

    ముకుందుని పాదపద్మాలను అలంకరించి ఉన్న తులసిని ఆఘ్రాణించు

(ఇట్లు జ్ఞానేంద్రియములను నిగ్రహింపవలెను.) 


ఓ మనసా! 

    ఆ మురారినే ధ్యానింపుము.(ఈవిధంగా మనస్సును నిగ్రహింపవలెను)


O tongue! 

    praise the glories of Lord Keśava. 

O mind! 

    worship the enemy of Mura (Murari).    

O hands! 

    serve the Lord of Śrī (Sridhara).    

O ears! 

    hear the topics of Lord Achyuta. 

O eyes! 

    gaze upon Śrī Kṛisṇa. 

O feet! 

    go to the temple of Lord Hari. 

O nose! 

    smell the tulasī buds on Lord Mukunda’s feet. 

O head! 

     bow down to Lord Adhokṣaja.  


https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*చల్లటి స్పర్శ..*


"గత సంవత్సరం నుండీ నాకు కష్టకాలం దాపురించినట్లుగా అనిపిస్తున్నది..ఏ పని చేద్దామని అనుకున్నా..ఏదో ఒక సమస్య తో ఆ పని ఆగిపోవడమో..లేదా..నాకు దక్కకుండా పోవడమో జరుగుతున్నది..జాతకం లో ఏదైనా దోషం ఉన్నదేమో నని..ఇద్దరు ముగ్గురు జ్యోతిష్కుల వద్ద జాతకం చూపించుకున్నాను..వాళ్ళు చెప్పిన పరిహారాలూ చేయించాను..ఈ పరిహారాలకే దాదాపు యాభైవేల రూపాయలు పైగా ఖర్చు చేసాను..అదొక అదనపు భారం పడింది నా మీద..దిక్కుతోచని పరిస్థితి నాది.." అన్నాడు నారాయణ తన మిత్రుడి తో..


నిజమే..నారాయణ రావు సంవత్సరం క్రిందటి దాకా..బెంగుళూరు లో ఇళ్లు కట్టి అమ్మే వ్యాపారం లో బాగా సంపాదించాడు..కానీ ఉన్నట్టుండి అతని వ్యాపారం దెబ్బతిన్నది..కట్టిన ఇళ్లు అమ్ముడు పోలేదు..వాటి మీద పెట్టిన పెట్టుబడి ఇరుక్కుని పోయింది..తన స్వంత డబ్బులు కాకుండా..బైట నుంచి అప్పు తీసుకొచ్చి మరీ పెట్టుబడి పెట్టాడు..ఆ అప్పుకు వడ్డీ పెరిగి పోతున్నది..అప్పు ఇచ్చిన వాళ్లలో ఒకరిద్దరు తాము ఇచ్చిన డబ్బు వెనక్కు ఇచ్చేయమని వత్తిడి చేయ సాగారు..ఈ సమస్య లతో నారాయణ రావు మనోశాంతి కోల్పోయి బాధపడసాగాడు..


నారాయణ రావు చెప్పిందంతా విన్న మిత్రుడు..ధైర్యం వహించమని ఓదార్చాడు కానీ..అతని ఆర్ధిక బాధలు తీరడానికి ఎటువంటి మార్గము చూపలేకపోయాడు..నారాయణ రావు నిరాశలో కూరుకుపోసాగాడు..


సరిగ్గా ఆ సమయం లో నెల్లూరు లో ఉంటున్న తన బంధువు ఒకరు బెంగుళూరుకు వచ్చారు..అతనితో తన కష్టాన్ని చెప్పుకొని బాధపడ్డాడు..అతను నారాయణరావును నెల్లూరు రమ్మని చెప్పాడు..మూడురోజుల తరువాత నారాయణ రావు నెల్లూరు లోని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు..ఆ సమయం లో ఆ బంధువు పూజ చేసుకుంటున్నాడు..నారాయణ రావు ఓపికగా ఎదురు చూసాడు..

పూజ ముగించుకొని..ఆ బంధువు..నారాయణ రావు ను పలకరించి.."నారాయణా..నీ కొచ్చిన ఇబ్బందుల నుంచి బయట పడాలంటే..ఒక్కసారి మొగలిచెర్ల వెళ్లి, అక్కడ సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి సమాధిని దర్శించు..ఆ స్వామి దయ వుంటే..ఈ కష్టాలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి..నేను స్వయంగా అనుభవించాను..చాలా మహిమగల అవధూత మందిరం అది..ఈ మాట చెప్పి, నిన్ను అక్కడికి తీసుకెళ్లాడానికే నెల్లూరు రమ్మని చెప్పాను..ఇప్పుడే ఇద్దరమూ బయలుదేరి వెళదాము..నా మాట విశ్వసించు.." అన్నాడు..నారాయణ రావు తాను జ్యోతిష్కుల ను నమ్మి..ఎలా ఇబ్బంది పడిందీ వివరించి..ఇప్పుడు తనకు ఏ దేవీ దేవతలను..సిద్ధులను..గురువునూ.. కొలిచే ఓపిక లేదని..తనను బలవంత పెట్టొద్దనీ..చెప్పాడు..కానీ ఆ వ్యక్తి వినలేదు సరికదా..నారాయణ రావు చెవిలో పోరు పెట్టి..ఎట్టకేలకు ఒప్పించాడు..


ఇద్దరూ కలిసి..కారులో మొగలిచెర్ల కు చేరుకొని..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం చేరారు..శ్రీ స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకున్నారు..నారాయణ రావు..శ్రీ స్వామివారి సమాధి ముందు సాగిలపడి..తన కష్టాలు చెప్పుకున్నాడు..ముందున్న మంటపం లో కొద్దిసేపు ఇద్దరూ కూర్చున్నారు..ఒక ఐదు నిమిషాలు గడిచే సరికి..నారాయణ రావు కు తనకు తెలీకుండానే..నిద్ర ముంచుకొచ్చింది..అలానే వాలిపోయి..నిద్ర పోయాడు..నిద్రలో ఎవరో తన వీపుమీద అనునయంగా తడుముతున్నట్టు..చల్లని చేయి తన వళ్ళంతా నిమురుతున్నట్టు తోచింది..నారాయణ రావు లేచి సమయం చూసుకుంటే...తాను సుమారు మూడు గంటల పాటు నిద్రలో ఉన్నట్టు తెలిసింది..తన బంధువు కూడా నిద్ర పోతున్నాడు..అతని మనసంతా తేలికగా ఉంది..తన బంధువు కూడా నిద్ర లేచిన తరువాత..ఇద్దరూ కలిసి..మరొక్కసారి శ్రీ స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని నెల్లూరు వచ్చేసారు.. 


ఆరోజు రాత్రికే నారాయణ రావు బెంగుళూరుకు తిరిగి వచ్చేశాడు..మరో రెండు మూడు రోజుల్లోనే..నారాయణ రావు కట్టిన ఇళ్లకు బేరం వచ్చింది..అదికూడా అతను అనుకున్న దానికన్నా ఎక్కువ రేటుకు..ఈ పరిణామం అతను ఊహించలేదు..ప్రక్కరోజే కొంత నగదు ఇచ్చి అగ్రిమెంట్ వ్రాసుకున్నారు..నారాయణ రావు తన బంధువుకు ఫోన్ చేసి..విషయం చెప్పి..మొగలిచెర్ల స్వామివారి వద్ద తాను పొందిన చల్లటి స్పర్శ ఆ స్వామి వారిదే అనీ..తనను గట్టెక్కించిన ఆ మహానుభావుడి మందిరాన్ని మళ్లీ మళ్లీ దర్శించుకోవాలనీ.. ఉద్వేగంతో చెప్పాడు..


రెండు నెలలు తిరిగే సరికి నారాయణ రావు మామూలు స్థితికి వచ్చేశాడు..అప్పటి నుంచీ అతని మనసంతా శ్రీ స్వామివారే నిండిపోయారు..తన జీవితాన్ని కాపాడిన స్వామివారి మందిరాన్ని పదే పదే దర్శించుకుంటూ ఉంటాడు..


స్వప్నంలో శ్రీ స్వామివారి చేతి స్పర్శ పొందిన అదృష్టవంతుడు నారాయణరావు..


సర్వం..

శ్రీ దత్త కృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా.. పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

శ్రీమద్భాగవతము

 *11.08.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2227(౨౨౨౭)*


*10.1-1330-*


*క. వసుదేవు నివాసంబున*

*వసుధన్ రక్షింప వీరు వైష్ణవతేజో*

*ల్లసనమునఁ బుట్టినారఁట*

*పసిబిడ్డ లనంగఁ జనదు పరదేవతలన్.* 🌺



*_భావము: "ఈ బలరామకృష్ణులు శ్రీమహావిష్ణు అంశంలో ఈ భూలోకాన్ని రక్షించటానికి వాసుదేవుని ఇంట పుట్టారుట. పరమపురుషులైన ఈ దేవతామూర్తులను పసిపిల్లలు అనకూడదు."_* 🙏



*_Meaning: In secret hushed tones, the spectators were speaking to each other: ”Balarama and Sri Krishna are incarnations of Sri Maha Vishnu and took birth in the household of Vasudeva to protect the pious people on this earth. We should not address these Divine Characters as kids any more.”_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*