19, జులై 2021, సోమవారం

మలబద్ధక సమస్య వివరణ - 2 .

 మలబద్ధక సమస్య గురించి వివరణ  - 2 . 


   అంతకు ముందు పోస్టు నందు మలబద్దకం మరియు దాని లక్షణాల గురించి వివరించాను. ఇప్పుడు మీకు మలబద్దకం నివారణ గురించి వివరిస్తాను . 

 

 నివారణా యోగాలు  - 


 *  ఎక్కువుగా పాలిష్ చేయబడిన బియ్యాన్ని 

ఆహారముగా వాడరాదు. వీలులేని పరిస్థితుల్లో పాలిష్ బియ్యాన్ని వాడవలసి వచ్చినపుడు ప్రతిరోజు తవుడు ( Rice bran ) రెండు స్పూనులు చక్కెరతోగాని , తేనెతో గాని కలుపుకుని తినవలెను . లేదా తవుడుకు కొంచం నీరు చేర్చి చారులో కలుపుకుని లోపలికి తీసుకోవాలి . 


 *  బజారు నందు లభ్యం అయ్యే గోధుమపిండి మరియు మైదాపిండి నందు పీచుపదార్థాలు పుష్కలంగా లేవు . కావున బజారులో దొరుకు గోధుమపిండికి బదులుగా గోధుమలు తెచ్చుకుని శుభ్రపరచి మనమే మిల్లులో పట్టించుకుని వాడుకోవడం మంచిది . 


 *  పైన చెప్పిన విధముగా పాలిష్ తవుడు , మిల్లులో పట్టించిన గోధుమపిండి వాడటం వలన మలబద్దకం నివారణ అగుటయే కాకుండా B1 , B2 , నియాసిన్ విటమిన్లు కూడా సమృద్దిగా లభ్యం అగును. 


 *  వరి అన్నం మరియు గోధుమపిండితో చేసిన చపాతీలు , రొట్టెలు వాడునప్పుడు వీలైనంత అధికంగా ఆకుకూరలు , కూరగాయలు వాడాలి . దీనివలన మలబద్దకం తగ్గుటయే కాకుండా ఖనిజ లవణాలు , విటమిన్లు కూడా లభ్యం అగును . 


 *  భోజనము చేసిన అర్థ గంట తరువాత 2 గ్లాసులు , రాత్రి పడుకునే ముందు 2 గ్లాసులు , ఉదయాన్నే పండ్లు తోముకున్న తరువాత 2 గ్లాసుల నీటిని తాగవలెను . ఉదయాన్నే నీటిని తాగి కొంచంసేపు నడవటం లేదా వ్యాయామం చేయుట ద్వారా సుఖవిరేచనం అగును. 


 *  కాఫీ , టీ అలవాటు ఉన్నవారు క్రమముగా అలవాటును తగ్గించుకోవాలి. రోజుకు రెండుసార్ల కన్నా ఎక్కువసార్లు కాఫీ , టీలు సేవించరాదు . 


     మలబద్ధక సమస్యతో బాధపడువారు త్రిఫలా చూర్ణం రెండు స్పూన్లు  మోతాదులో ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో కలిపి రాత్రిపూట పడుకునే ముందు తీసుకొనుచున్న ఉదయాన్నే సుఖవిరేచనం అగును. నేను ఇంతకు ముందు చెప్పిన విధముగా ఔషధాలు వాడుటయే కాక ఆహారం నందు ముఖ్యముగా మార్పులు చేసుకొనవలెను . మలబద్దకం మొదలయింది అంటే మీయొక్క అనారోగ్య సమస్యలు మొదలవుతున్నట్లే  కావున మొదటిలోనే సమస్య నివారించుకోవడం ఉత్తమం . 


      మరింత విలువైన సమాచారం మరియు అనేక రోగాలకు సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


 

    గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

తొలిఏకాదశి

 _*🚩#రేపుతొలిఏకాదశి , #శయనఏకాదశి🚩*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*తొలి ఏకాదశి అంటే ఏమిటి , ఎందుకు చేసుకుంటారు , దీని విశిష్టత ఏంటి ?*


హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది.  తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకోచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం.


తొలి ఏకాదశి అంటే ఏమిటి

ఆషాడ శుద్ధ ఏకాదశిని *“తొలి ఏకాద‌శి”* అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి , శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి.) ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు , ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు. ఈ పదకొండు ఏకోన్ముకంగా పనిచేసే సమయమే ఏకాదశి.


తొలి ఏకాదశి – విశిష్టత

ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే *“శయన ఏకాదశి , ప్రధమ ఏకాదశి”, “హరివాసరం”* అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని *“శయన ఏకాదశి”* అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే , ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు , సూర్య చంద్రులు , గ్రహాలు పరస్పర సంబంధాన్నీ , వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు ( సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు , ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది). అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని , కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి.


*తొలి ఏకాదశి జరుపుకొను విధానం , నియమాలు*


మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత , అశ్వమేధ యాగం చేసినంత , అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది. వ్రతంలోని ప్రధాన నియమాలు.


*ఉపవాస ఫలితాలు:*


ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 


అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు , దుష్ట ఆలోచనలు చేయకూడదు. 


ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. 


అన్నదానం చేయడం చాలా మంచిది. 


*ఏకాదశి వ్రతమాచరించేవారు ఇవి తినరాదు.*


ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి , శుచిగా స్నానమాచరించి , శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు , కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.


ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి , మాంసాహారం , పుచ్చకాయ , గుమ్మడి కాయ , చింతపండు , ఉసిరి , ఉలవలు ,  మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ , ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ , మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు.


ఈరోజు నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు *‘చాతుర్మాస్య వ్రతం’* అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది , ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి , మర్నాడు పారణ చేసి , ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి , అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని , పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని , ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి , అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి , ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. 


*తొలి ఏకాదశి రోజున శేషసాయిని పూజిస్తే..*


ప్ర‌తినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలోనే బోనాలు , పశుపూజ , శకట ఆరాధనలు చేస్తారు.


*ప్రాశస్త్యం*


ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి , శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి , రాత్రికి జాగారం చేసి , మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.

Health Tips:

 Health Tips:


1. The "STOMACH" is injured

    when you do not have

    Breakfast in the morning.


2. The "KIDNEYS" are injured

     when you do not even

     drink 10 glasses of water

     in 24 hours.


3. "GALLBLADDR" is injured

    when you do not even

    sleep until 11. 00 pm and

    do not wake up to the

    sunrise.


4.  The "SMALL INTESTINE"

      is injured when you eat

      cold and stale food.


5.  The "LARGE INTESTINES"

      are injured when you eat

      more Fried & Spicy food.


6.  The "LUNGS" are injured

      when you breathe in

      smoke and stay in

      polluted environment of

      cigarettes.


7. The "LIVER" is injured

     when you eat heavy Fried

     food, Junk, and Fast food.


8. The "HEART" is injured

     when you eat your meal   

  with more Salt & Fried food.


9. The "PANCREAS" is

     injured when you eat

     Sweet things because

     they are tasty and easily

     available.


10. The "Eyes" are injured

       when you work in the

       light of mobile phone

       and computer screen in

       the dark.


11. The "Brain" is injured

       when you start thinking

       Negative Thoughts.


12. The "SOUL" gets injured

       when you don't have

       Family and Friends to

       care and share with you

       in life. Their Love,

       Affection, Happiness,

       Sorrow and Joy. 


 All these body parts are "NOT" available in the market, if so not affordable. 


So, take care of Good Health and keep your Body parts Healthy.


Wish You All

A very Happy & Healthy Life.

C. Bhargava SARMA advocate



కరకరకాకర

 *కరకరకాకర కా కర*

*కరుకుకరకు రకరక కర కారక రాకా*

*కర కిరికిరికిరికిరకక*

*కురరీకర రకకర కర కొరకొర కొరకే* 


 అన్న పద్యాన్ని ఏక బిగిని చదవగలరా! సంక్రమణ భోగి పర్వ శుభంకరుడైన సూర్య భగవానుని కీర్తిస్తూ రాసిన ద్వ్యక్షర కంద పద్యం ఇది.


కా = ఎక్కడ

కరకర= ౘురుకైన

కరుకు= గట్టిదైన

అరకు= పదునైన

రకరక= అనేక విధాలైన

కరకర= కిరణములనిౘ్చుటలో

కిరికిరికి= చిక్కులకు

ఇరుకక = దొరకకుండా

కారక= ముఖ్యుడవైన

ఆకర= ఆధార స్వరూపుడైన

ఇరికి= దొరికి

రాకా = వెన్నెలకకు

కర= కారకుడైన

కొరకొర = వేడియైన

కరకర = వాడియైన

కురరీకర= వేగవంతమైన 

రక= స్వభావము గల 

కర= కిరణములు

కొరకొర= కొంచెము

ఆకర= జీవుల

కొరకే= ఉద్ధరిoచడానికే🙏🙏🙏

సమయం

 *కుళ్ళిపోవడానికి ఎంత సమయం పడుతుంది?*


మానవుడు -- 1 వారం

పేపర్ టవల్ - 2-4 వారాలు

అరటి తొక్క - 3-4 వారాలు

పేపర్ బాగ్ - 1 నెల

వార్తాపత్రిక - 1.5 నెలలు

ఆపిల్ కోర్ - 2 నెలలు

కార్డ్బోర్డ్ - 2 నెలలు

కాటన్ గ్లోవ్ - 3 నెలలు

ఆరెంజ్ పీల్స్ - 6 నెలలు

ప్లైవుడ్ - 1-3 సంవత్సరాలు

ఉన్ని సాక్ - 1-5 

సంవత్సరాలు


మిల్క్ కార్టన్లు - 5 సంవత్సరాలు

సిగరెట్ బుట్టలు - 10-12 సంవత్సరాలు

తోలు బూట్లు - 25-40 సంవత్సరాలు

టిన్డ్ స్టీల్ క్యాన్ - 50 సంవత్సరాలు

ఫోమేడ్ ప్లాస్టిక్ కప్పులు - 50 సంవత్సరాలు

రబ్బరు-బూట్ - 50-80 సంవత్సరాలు

ప్లాస్టిక్ కంటైనర్లు - 50-80 సంవత్సరాలు

అల్యూమినియం కెన్ - 200-500 సంవత్సరాలు

*ప్లాస్టిక్ సీసాలు - 450 సంవత్సరాలు*

*పునర్వినియోగపరచలేని డైపర్స్ - 550 సంవత్సరాలు*

*మోనోఫిలమెంట్ ఫిషింగ్ లైన 600 సంవత్సరాలు*

*ప్లాస్టిక్ సంచులు 200-1000 సంవత్సరాలు.*


మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము,దయచేసి ఈ సమాచారాన్ని మీ నెట్‌వర్క్‌లో మీకు వీలైనంతగా పంచుకోండి.


గ్లోబల్ గ్రీన్ హౌస్ ప్రభావానికి సంబంధించిన ప్రధాన కారణాలలో ప్లాస్టిక్ ఒకటి అని ప్రజలలో అవగాహన ఏర్పడుతుంది.


- దయచేసి హరిత పర్యావరణానికి మద్దతు ఇవ్వండి.

*ప్లాస్టిక్ ను వాడడం మానేద్దాం*                  

               Save Nature

KASHMIRI OF INDIA

 THIS IS THE NEW KASHMIRI OF INDIA . 

The MODIJI government is handing over new consignments of these VEHICLES to the ARMY . 


 The Paramilitary and Specival Forces NSG are currently using the world's best bulletproof vehicle, the Renault Sherpa.


The vehicle can accommodate four armed personnel who can fire from inside. It has a camera installed over it so that security personnel can have a better view of the enemy. Also, it is built using heavy iron so that even a 10 kg RDX blast cannot damage it.


 The vehicle is ideal for tactical missions such as scouting, patrol, convoy escort and command and liaison, and is highly mobile in war zones.


While the increasing oil prices are visible to all, people conveniently forget free vaccines, free grains for 2/3rd population and the modernization of our defence forces.


 🇮🇳🛻🚑👌🙏👍🚑🛻🇮🇳

అవధూత శ్రీ రంగన్న బాబు

 📕✍️📕✍️📕✍️📕✍️📕✍️📕శ్రీరామ అ జయ రామ జయ జయ రామ

*అవధూత శ్రీ రంగన్న బాబుగారి లీలా సంపుటి 27 వ భాగం*

_"పరీక్ష లో  📋 స్వామి అనుగ్రహం"_ ✍️

1953 చివరలో బహుశా డిసెంబర్ నెల అనుకుంటాను. బాబు గారికి పరీక్షల 📋 గురించి విన్నవించాను. దయదలిచారు. పరీక్షలలో చదువవలసిన పుస్తకాలలో📚 ఏదో ఒక్కటి 📕 తీసుకుని వారి వెంట మామూలుగానే 🛕 దేవాలయానికి రమ్మన్నారు. అలాగే చీరాలలోని వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళాము. అప్పటికే దేవాలయ అర్చకులు దేవాలయం మూసివేసి వెళ్లిపోయారు. బహుశః అప్పుడు రాత్రి 8:00 అయి ఉంటుంది. దేవాలయ ముఖద్వారం వద్ద నేను తీసుకువెళ్ళిన పుస్తకం ఉంచమన్నారు. తదుపరి కొన్ని నిమిషాల తర్వాత *"స్వామి పుస్తకం 📕 సృజించారని, తీసుకోవలసినది"* గా చెప్పారు. అలాగే చేతిలోకి తీసుకున్నాను. "స్వామి పుస్తకం సృజించినట్లు ఎలా తెలుస్తుంది?" అని బాబు గారిని అమాయకంగా ప్రశ్నించాను. పుస్తకం తెరిచి చూడమన్నారు. పుస్తకం పేజీల మధ్య భాగంలో 📖కొంత పసుపు 🟡 ఉన్నది. అదే గుర్తు అన్నారు. పరీక్షకు 📋 వెళ్లేటప్పుడు నొసట ధరించమన్నారు. అలాగే చేశాను. అత్యధిక మార్కులతో పాసయ్యాను. అదే సంవత్సరం చివరిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు కూడా పాసయ్యాను.

*అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త*

_"జయ జయ సాయి రామ్."_

🟡✍️🟡✍️🟡✍️🟡✍️🟡✍️🟡

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*అమ్మ చెప్పిన మాట!*


శ్రీ స్వామివారి మందిర ప్రాంగణంలో భక్తులు ప్రదక్షిణ చేయడానికి ఓ ఐదారు అడుగుల వెడల్పుతో కాలిబాట లాగా ఉండేది..మిగిలిన స్థలమంతా గడ్డి మొలచి..అందులో పల్లేరు కాయల ముళ్ళతో నిండిపోయి ఉండేది..ఈ పరిస్థితి 2004 సంవత్సరం నాటిది..అప్పటికి నేను ధర్మకర్త గా బాధ్యతలు తీసుకొని నాలుగు రోజులు కూడా కాలేదు..ఆ ప్రక్క ఆదివారం రోజున..గాలిచేష్ట లతో బాధపడుతున్న భక్తులు..ఆ ముళ్ల మీదే కేకలు వేసుకుంటూ పరిగెడుతున్నారు..వారున్న మానసిక స్థితిలో..వారికి ముళ్ళు గ్రుచ్చుకున్నా పెద్దగా బాధ పడటం లేదు కానీ..చూస్తున్న మా కందరికీ చాలా కష్టంగా అనిపించింది..


ఆ ప్రక్కరోజే మనుషుల ను మాట్లాడి..ఆ స్థలమంతా శుభ్రంగా చేయించాను..మొత్తం ప్రాంగణం మంతా నాపరాయి పరిపించాలని సంకల్పించాను..సుమారు యాభైవేల రూపాయలు అవుతుందని ఒక అంచనాకు వచ్చాము..ఈ మొత్తం ఎక్కడి నుంచి తీసుకు రావాలి?..భక్తుల నుంచి చందాల రూపంలో తీసుకుందామని మా సిబ్బంది సలహా ఇచ్చారు..సలహా బాగుంది కానీ..నాకున్న ఇబ్బంది ఏమిటంటే..నేను గబుక్కున ఎవ్వరినీ ఏదీ అడగలేను..


మొగలిచెర్ల లోని మా ఇంటికి వచ్చి..మా అమ్మగారైన ప్రభావతి గారితో సమస్య చెప్పాను.."అమ్మా..భక్తుల బాధ చూడలేకుండా వున్నాను..దెయ్యం పట్టిన వాళ్ళు..గాలి చేష్ట తో బాధపడేవాళ్లు..ఇతర మానసిక జబ్బులున్న వాళ్లు..అందరూ ఆ ముళ్ల లోనే పొర్లాడుతున్నారు..చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉన్నది..అందుకనే ఈరోజు మొత్తం శుభ్రం చేయించాను..ఇక నాపరాయి పరిపిస్తే..బాగుంటుందని ఆలోచిస్తున్నాను..దేవస్థానం వద్ద అంత డబ్బు లేదు..నేనేమో ఎవ్వరినీ చందాలు కావాలని అడగలేను..నా మొహమాటం నాది..ఏం చెయ్యాలో పాలుపోవటం లేదమ్మా.." అన్నాను..


అమ్మ నన్ను తన దగ్గరగా కూర్చోమని చెప్పి.."నువ్వు ఒక మంచి పని చేద్దామని సంకల్పించావు..అది అందరు భక్తులకూ ఉపయోగకరంగా ఉంటుంది..నువ్వు ఎవ్వరినీ ఏమీ అడగవద్దు..ఒక ముఖ్య సూత్రం చెపుతున్నా విను..నేరుగా ఆ స్వామి సమాధి వద్దకు వెళ్ళు.. నిన్ను నువ్వు ఆయనకు శరణాగతి చేసుకో..ఇప్పుడే కాదు..ఎప్పుడు నీకు సమస్య వచ్చినా..ఆ సమాధి ముందు మోకరిల్లు.. అంతా స్వామివారు చూసుకుంటారు..కాకుంటే ఇందులో ఇంకొక అభ్యంతరం ఉంది..ఏ కోరికా నీ స్వార్ధానికి కోరుకోకు!!.. అలా కోరుకున్నావో..అది జరగదు..నువ్వు మరికాస్త బాధపడటం తప్ప మరేమీ రాదు..రేపుదయాన్నే శుచిగా..నువ్వూ..నీ భార్యా..ఇద్దరూ మందిరానికి వెళ్ళండి..ఆ సమాధి వద్ద మనస్ఫూర్తిగా మీలోని వేదనను చెప్పుకోండి..ఆ తరువాత అంతా ఆ స్వామివారే చూసుకుంటారు.." అన్నది..


ఆ మాటలు తారకమంత్రం లా నా మీద పనిచేసాయి..ప్రక్కరోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా నేనూ మా ఆవిడా ఇద్దరం శ్రీ స్వామివారి మందిరానికి వెళ్ళాము..ఆరోజు మంగళవారం..మందిరం లోని బావి వద్దకు వెళ్లి..ఆ బావిలోని నీళ్లను కొద్దిగా నెత్తిమీద చల్లుకుని..ప్రధాన మంటపం లోకి వచ్చాము..ఇంతలో..

"అయ్యా!..మీకోసం ఉదయం ఆరు గంటల నుంచీ ఒకాయన ఎదురు చూస్తున్నాడు..ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడి వెళ్ళండి.." అని మా సిబ్బందిలో ఒకరు చెప్పారు..


సరే అన్నాను..ముందు మంటపంలో అతను కూర్చుని ఉన్నాడు..రమ్మని పిలవగానే గబ గబా వచ్చాడు..ఒక ఐదు నిమిషాల పాటు పరిచయాలయ్యాక.."అయ్యా..ఈ మొత్తం ప్రాంగణం అంతా రాళ్లు పరిపించాలని అనుకున్నాను..మా వాళ్ళు ఒంగోలు లో వున్నారు..భూములు కొని..అమ్మే వ్యాపారం చేస్తున్నారు..ఇళ్ల స్థలాల వ్యాపారమూ చేస్తున్నారు..మీరొప్పుకుంటే..వాళ్ళతో మాట్లాడి పని మొదలు పెట్టిస్తాను.."అన్నాడు..


ఒక్కక్షణం నోట మాట రాలేదు..మేము ఇంకా శ్రీ స్వామివారి సమాధి వద్దకు కూడా పోలేదు..మా మనసులోని కోరిక అక్కడ చెప్పుకోనూ లేదు..మా అమ్మగారు చెప్పినట్టు శరణాగతి చెందనూ లేదు..కానీ..మా ఆలోచన ఆ స్వామివారు పసిగట్టేశారు..పిలువకముందే స్వామివారు పలుకుతున్నారనిపించింది..


అమ్మ చెప్పిన మాట అక్షర సత్యమై కూర్చుంది.."ఏ కోరికా స్వార్ధానికి కోరుకోకు!!" అని ఆమె హెచ్చరించింది..ఇప్పటి కోరిక భక్తులకు సంబంధించింది..


వచ్చినతను నా అనుమతి కోసం చూస్తున్నట్టు వున్నాడు..నిజానికి మధ్యలో నేను ఎవరిని?..నిమిత్తమాత్రం గా వున్నాను..అంతే!..మా దంపతులము శ్రీ స్వామివారి సమాధికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాము..


"సరే !.. మీరు అనుకున్న విధంగా చేయండి!.." అన్నాను..ఆమాట చెప్పిన వెంటనే..ఆయన సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు..ఆరోజు జరిగిన విషయమంతా అమ్మకు చెప్పాను..ఆవిడ నవ్వింది..మరో మూడు నెలలకు..ప్రాంగణం అంతా నాలుగు లక్షలు ఖర్చుపెట్టి పాలరాయి పరిపించారు..ఎక్కడి యాభై వేలు?..ఎక్కడి నాలుగు లక్షలు?..పల్లేరు కాయల ముళ్ళతో ఉన్న మందిరప్రాంగణం.. పాలరాయి తో నిండిపోయింది..


ఆరోజు నుంచీ ఈనాటిదాకా అమ్మ చెప్పిన ఆ మాటలు మా హృదయాల్లో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).