17, మార్చి 2025, సోమవారం

Panchaag


 

శ్రీ కంఠేశ్వర ఆలయం

  

శ్రీ కంఠేశ్వర  ఆలయం,  నంజనగూడు, మైసూరు, కర్ణాటక.


కన్నడలో నంజు అంటే విషం. నంజుండేశ్వర అనే పేరుకు విషం తాగిన దేవుడు అని అర్థం.


కర్ణాటక రాష్ట్రంలో ఇది అతి పెద్ద దేవాలయం. ఈ దేవస్థానం ఈ పట్టణంలో ముఖ్య దేవాలయం. ఇక్కడి శివలింగాన్ని గౌతమ మహర్షి ప్రతిష్ఠించాడని అంటారు. 


ఈ దేవుడిని నంజుండేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ నంజుండేశ్వరుని పేరునుండే నంజనగూడు ఏర్పడింది.

నంజున్‌గూడును శివపురాణంలో శ్రీ గారాలపురిగా పేర్కొనబడింది.


సాగర మథనంలో అమృతాని కన్నా ముందుగా హాలాహలం ఉద్భవిస్తుంది.

ఆ కాలకూట విషం లోకమంతా విస్తరించకుండా ఈశ్వరుడు దానిని మ్రింగివేస్తాడు.

అయితే పార్వతీ దేవి కోరికపై శివుడు ఆ హాలాహలాన్ని తన గొంతు లోనే నిలుపుకుంటాడు. ఆ విషం శివుని కంఠం లోనే నిలిచిపోయి ఆ కంఠం నీలంగా మారిపోతుంది.

అప్పటి నుండి ఈశ్వరుడు నీలకంఠుడుగ పిలువబడుతున్నాడు. 

కన్నడ భాషలో నంజనగూడు అంటే నంజుడి యొక్క నివాసస్థానం అని అర్థం. 

నంజుండ అంటే విషము మ్రింగినవాడు అని అర్ధం.


త్రివేణీ సంగమం:


నంజనగూడు సమీపంలో కపిలానది, కౌండిన్యనది, చూర్ణవతి నదుల త్రివేణీ సంగమం ఉంది. దీనికి పరశురామ క్షేత్రం అని పేరు. పరశురాముడు తన తల్లిని సంహరించిన తరువాత ఈ ప్రాంతానికి వచ్చి నదీస్నానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడని అంటారు.


ఈ స్థల పురాణం ప్రకారం ఆ సమయంలో అక్కడ ఆదికేశవుని దేవాలయం (ప్రస్తుతం ప్రధాన దేవాలయం ప్రక్కన ఉంది) మాత్రమే ఉండేది. 

పరశురాముడు తన ఆయుధం గొడ్డలిని నదీ జలంలో శుభ్రం చేసుకొనే సందర్భంలో అతని గొడ్డలి నది లోపలి శివలింగానికి తాకి శివుడి తల నుండి నెత్తురు ప్రవహిస్తుంది

అది చూసి పరశురాముడు భీతి చెంది శివుడిని క్షమించమని వేడుకుంటాడు. 

శివుడు ప్రత్యక్షమై పరశురాముడిని ఆశీర్వదించాడు మరియు శివలింగంపై తడి మట్టిని పూయమని చెప్పాడు (శ్రీ నంజన్‌గూడ్ మట్టికి అపారమైన వైద్యం చేసే శక్తి ఉంది). శివలింగానికి రక్తస్రావం ఆగింది.

శివుడు పరశురాముడిని మంటపాన్ని నిర్మించి తపస్సు కొనసాగించమని సలహా ఇచ్చాడు. ఇచ్చటి మృత్తిక ఔషధంతో సమానమంటారు. అనేక చర్మ రోగాలకు

ఈ మృత్తికను ఉపయోగిస్తారు.


శివుడు సంతోషించి తన దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు పరశురామ దేవాలయాన్ని సందర్శించాలని వరాన్ని ప్రసాదిస్తాడు. నంజనగూడు దేవస్థానాలకే కాక అక్కడ పండే ప్రత్యేక రకం అరటి పళ్లకు ప్రసిద్ధి. 

ఈ రకం అరటి పళ్లను స్థానికులు నంజనగూడు రసబాళె అని పిలుస్తారు.


ఒకసారి పార్వతీ దేవి  ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించాలని కోరుకుంది. అందువలన అతను ఆమెను (గారాలపురి) నంజన్‌గూడ్‌కు తీసుకువచ్చాడు. ఆమె కబినీ నదికి వెళ్లి నీటిని తాకడానికి వంగి ఉన్నప్పుడు, ఆమె కిరీటం నుండి ఒక రత్నపు పూస (మణి) నీటిలో పడిపోయింది. 


శివుడు సంతోషించి, "దేవీ, ఇప్పటి వరకు, ఈ ప్రదేశం నా దివ్య ఆశీర్వాదం మరియు ఉనికిని కలిగి ఉంది. ఈ క్షణం నుండి ఇది మీ ఉనికిని, దయ మరియు ఆశీర్వాదాలను కలిగి ఉంటుంది. దీనిని దక్షిణ మణికర్ణికా ఘాట్ అని కూడా పిలుస్తారు" అని ప్రకటించాడు.


ప్రాకారం చుట్టూ శైవభక్తులు 63 నాయనారుల విగ్రహాలు ఉంటాయి.


నంజన్ గూడికి దగ్గరగా పరశురామ దేవాలయాన్ని దర్శిస్తే గానీ తీర్థయాత్ర పూర్తికాదు. ఈ పరశురామ దేవాలయం కౌండిన్య నది గట్టు పైన ఉంది.


హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ లకు ఈ దేవస్థానంతో సన్నిహిత సంబంధాలున్నాయి. తన పట్టపుటేనుగు కంటిచూపును కోల్పోతే టిప్పు సుల్తాన్ ఇక్కడి నంజుండేశ్వరుని ప్రార్థించాడని, దానితో పట్టపుటేనుగుకు చూపు మరలా వచ్చిందని అప్పటి నుండి టిప్పు సుల్తాన్ ఈ దేవుడిని హకీమ్‌ నంజుండేశ్వర అని కొలిచేవాడని ఒక కథనం.


ఈ ఆలయంలో నెలకొని ఉన్న శివుడు ముఖ్యంగా దృష్టి ప్రదాత. నేత్ర సంబంధమయిన వ్యాధులు కలవారు ఇక్కడికి వచ్చి స్వామిని పూజించి ఫలితం పొందారని జనవాక్యం. 


ఈ దేవాలయ ప్రహరీ గోడలపై వివిధ గణపతి రూపాలు ప్రతిష్టించబడ్డాయి. 

ఈ క్షేత్రం గురించి మరొక ఆనంద కరమయిన విషయం ఏమిటంటే తురుష్కురుడైన హైదరాలీ బహుకరించిన పచ్చల నెక్లెస్ ను స్వామి ధరించటం. 

ఇక్కడి శివుని మహిమకు ముగ్ధుడై హైదరాలీ స్వామికి ఈ నజరానా యిచ్చాడట. 

శ్శ్రీకంఠేశ్వరుడిని ప్రతిరోజూ శైవాగమం ప్రకారం అభిషేకం మరియు పూజల ద్వారా పూజిస్తారు.  సోమవారాలు, అమావాస్య రోజులు మరియు పౌర్ణమి రోజులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.  మిథున మాసంలో (జూలై) జరిగే గిరిజా కళ్యాణం గొప్ప వేడుక.

నంజనగూడు  రథోత్సవానికి చాలా పేరు పొందింది. మూడురోజుల పాటు జరిగే బ్రహ్మాండమైన ఈ రథోత్సవానికి వేలకొలది భక్తులు దక్షిణదేశం అనేక మూలలనుండి వస్తారు.

పెద్దజాతర సందర్భంలో రథోత్సవం ఘనంగా జరుగుతుంది. శ్రీకంఠేశ్వరుడిని, పార్వతీదేవిని, గణపతిని, సుబ్రహ్మణ్యస్వామిని, చండికేశ్వరుడిని ఐదు ప్రత్యేక రథాలలో ఉంచి వేలాది భక్తులు ఈ రథాలను పురవీధులలో లాగి ఊరేగిస్తారు.


ఇది మైసూరు నుండి 23 కి.మీ.ల దూరం ఉంటుంది.

ఈటెల వడిగల మాటల

 *2044*

*కం*

ఈటెల వడిగల మాటల

మోటుగ వినియోగమొనరి ముదమొందక నా

మాటలు బీటలు జేసెడి

మేటగు బంధముల విలువ మీరకు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఈటెల వంటి పదునుగల మాటలను విచక్షణ మరచి ప్రయోగించి సంతోషించకుండా ఆ మాటలు చీల్చే బంధాల విలువలు మరువవద్దు.

*సందేశం*:-- ధీటుగా మాటకు మాట సమాధానం చెప్పి సంతోషించే ముందు ఆ మాటల ప్రభావం ఎంత విలువైన బంధాలను నాశనం చేస్తోందో ఎంత గొప్ప వారికి తగిలి గాయాలు చేస్తోందో గ్రహించడానికి ప్రయత్నాలు చేస్తే మంచిది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

వివాహ* *సాంప్రదాయాలు..!!*

 *మారిపోతున్న వివాహ* 

                        *సాంప్రదాయాలు..!!*


*పెళ్ళికి వెళ్ళామా ? కాబోయే దంపతులకు మొహం చూపించామా ? క్యూలో నుంచానమ్మా ? ఇవ్వాలనుకున్న Gift  ఇచ్చామా? ఆసమయములో పెళ్ళి వారికి దయ కలిగి ఓ ఫోటో అంటే ? ఆ సమయములో ఫోటో గ్రాఫర్ ఉంటే ఫోటో తీయించుకున్నామా ?అవకాశం దొరికితే ప్లేట్లు పట్టుకుని ఒకళ్ళ నొకళ్ళు తోసుకుని బఫే భోజనము చేసామా ? తిరిగి మన ఇంటికి చేరుకున్నామా  ?*


*అంతే.*


*వివాహ కార్యక్రమమా ?  జీలకర్ర బెల్లమా ? మాంగల్యధారణా ?  తలంబ్రాలా  ?*


*అంటే ఏమిటి ?*


*అవన్నీ మనకెందుకు  ?*


*వివాహ ముహూర్తం రాత్రి  పది తర్వాత అయితే, స్నేహితులు, బంధువులు భోజనాలు అవ్వగానే  ముహూర్తానికి ఉండకుండా మాయమవుతున్నారు. భోజనాలు చేసేవారు వెయ్యి మంది ఉంటే, ముహూర్తానికి వందమంది కూడా ఉండటం లేదు .*


*Function  Hall లు వివాహ సమయానికి జనాలు లేక వెల వెల బోతున్నాయి. అర కొర  ముఖ్యమైన బంధువులు తప్పదురా భగవంతుడా  అన్నట్లు నిద్రతో జోగుతూ  తూలుతూ  ఉంటున్నారు.*


*కొందరు పెళ్ళికి పిలిచేటప్పుడే ముఖ్యమైన వారికి ఇవ్వవలసిన రిటర్న్ గిఫ్ట్ లు వారి ఇంటి దగ్గరే ముందే ఇచ్చేస్తున్నారు.*


*వివాహానికి వచ్చిన వారు కూడా పెళ్ళికి ముందే ఏర్పాటు చేస్తున్న రిసెష్షన్ టైములో వారివ్వదల్చుకున్నది వారి చేతిలో పెట్టేసి, ఆ భోజనము కానిచ్చేసి కంటికి కనపడకుండా మాయమవుతున్నారు.*


*మారుతున్న కాలంతో పాటు అందరూ మారాలేమో ?*


*వివాహం నూతన వధూవరులను ఆశీర్వదించడం ఈ రోజుల్లో ముఖ్యం కాదు.*


*వెళ్ళామా లేదా ?*


*సమర్పించుకున్నామా లేదా ?*


*ఫోటోలో ఒక్కసారి క్లిక్ అయి హాజరు అయినట్లు నిరూపించుకుంటే చాలు.*


*ఈ మధ్యనే ఒక వివాహానికి వెళ్ళాను.*


*వివాహం పూర్తి కాకుండానే జీలకర్ర బెల్లం తంతు పూర్తికాగానే మాంగల్యధారణ కూడా జరగకుండానే ఎవరో తరుముకొస్తున్నట్లుగా కనీసం ఎవరూ పిలవకుండానే అందరూ భోజనాలకి పరిగెత్తుతున్నారు.*


*తాపీగా కూర్చుని పెళ్ళి చూస్తున్న నా దగ్గరకి నా స్నేహితుడు వచ్చి " పద పద ఏమిటి అలాగే కూర్చున్నావు ? కాసేపు ఆగితే ఆకులే తినటానికి మిగిలేది " అంటూ నన్ను కూడా లాక్కెళ్ళాడు.*


*భోజనాలు బఫేలు. వెళ్ళగానే స్టార్ హొటల్స్ లో ఇచ్చినట్లు మెనూ కార్డు చేతిలో పెట్టారు.*


*తీరా మెనూకార్డు చూసాక కళ్ళు బైర్లు కమ్మాయి. 58 ఐటమ్స్ .అందులో 8 రకాల స్వీట్స్. 3 ఫ్రై కూరలు. 3 మామూలు కూరలు. ఇంకా ఎన్నెన్నో రకరకాలు. విపరీతమైన వృథా జరిగింది. గబా గబా వడ్డించేసుకుని అలా పారేస్తుంటే తిండి కూడా సయించలేదు.*


*వివాహాల్లో ఇంత విపరీతమైన దుబారాలు అవసరమా ?*

⚜ శ్రీ లోకనార్కవు భగవతి ఆలయం

 🕉 మన గుడి : నెం 1052


⚜ కేరళ  : వడకర - కోజికోడ్ 


⚜ శ్రీ లోకనార్కవు భగవతి ఆలయం



💠 లోకనార్కవు దేవాలయం లేదా లోకనార్కవు భగవతి దేవాలయం కేరళలోని కోజికోడ్ జిల్లాలోని వడకర (లేదా బడగర) నుండి 5 కిలోమీటర్ల దూరంలో మేముండ వద్ద ఉంది. 


💠 లోకమలయార్ కవు ఆలయం అని కూడా పిలుస్తారు, లోకనార్కవు మలయాళ పదం లోకమలయార్కవు నుండి ఉద్భవించింది, దీని అర్థం లోకం (ప్రపంచం) మల (పర్వతం), ఆరు (నది) మరియు కావు (తోపు).  

లోకనార్కవు భగవతి ఆలయ ప్రధాన దేవత దుర్గాదేవి, ఆమె లోకనార్కావిలమ్మ (లోకనార్కావిల్ అమ్మ) అని పిలువబడుతుంది.  

ఈ 1500 సంవత్సరాల పురాతన దుర్గాదేవి ఆలయంలో విష్ణువు మరియు శివునికి అంకితం చేయబడిన రెండు మందిరాలు ఉన్నాయి.  


💠 ఈ ఆలయానీకి సంబంధించి అనేక కథనాలు ఉన్నాయి.

వాటిలో ఒకటి ఈ ప్రాంతానికి వలస వచ్చిన 500 మంది ఆర్యన్ బ్రాహ్మణుల సమూహం ద్వారా కనుగొనబడింది .

ఈ బ్రాహ్మణులు వ్యాపారులు మరియు నెమ్మదిగా ఇక్కడి నాయర్ల ఆచారాలను స్వీకరించారు.  దేవత మునుపటి బస నుండి ఈ ఆర్యులను అనుసరించిందని నమ్ముతారు.  మెల్లమెల్లగా ఈ సంఘం స్థానిక నాయర్లతో వైవాహిక సంబంధాలను ఏర్పరచుకుని వారిలో ఒకరిగా మారింది.


💠 మరో కథ ఏమిటంటే, సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం జామోరిన్ రాజ కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది మరియు కుటుంబంలోని ఒక భాగం నదిని దాటి బడగరా (ఉత్తర తీరం)లో స్థిరపడింది.  

వారు తమ వెంట అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఆమెకు ఆలయాన్ని ఏర్పాటు చేశారు.  

వారు ఇప్పటికే ఉన్న శివ మరియు విష్ణు దేవాలయాలకు సమీపంలో ఉన్న స్థలాన్ని ఎంచుకున్నారు.


💠 ఇంకొక కథ ఏమిటంటే, రావరి నాయర్ల కులానికి చెందిన కొల్లం వ్యాపారుల బృందం మలబార్‌కు వలస వచ్చి వారితో ఈ అమ్మవారి విగ్రహాన్ని తీసుకువచ్చారు.  

ప్రజలు నిజాయితీగా ఉండే ప్రదేశంలో స్థిరపడాలని వారు కోరుకున్నట్లు తెలుస్తోంది.  ఎక్కడికెళ్లినా ఇంట్లో భద్రంగా ఉంచేందుకు పంచదార కుండ ఇచ్చారు.  చక్కెర లోపల, వారు బంగారు కడ్డీని దాచారు.  వారు దీన్ని ఎక్కడ ఇచ్చినా, ప్రజలు బంగారు కడ్డీని దొంగిలించి, పాత్రను వారికి తిరిగి ఇచ్చారు.  

కానీ బదగరాలో, "పుతు పనాథు" అనే కుటుంబం, చక్కెరతో పాటు బంగారాన్ని తిరిగి ఇచ్చింది.  

ఈ రావరీ నాయర్లు ఆ ప్రదేశంలో స్థిరపడి లోకనార్ కోవిల్‌లో తమ దేవత కోసం ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. 

 ఆ తర్వాత ఈ వర్గం స్థానికులతో గొడవపడి నాద పురం అనే ప్రాంతానికి మారినట్లు తెలుస్తోంది.  టిప్పు సుల్తాన్ ఆక్రమణ తర్వాత ఈ మొత్తం సమాజం ఇస్లాంలోకి మార్చబడిందని కూడా నమ్ముతారు.


💠 లోకనార్కవు ఆలయ ప్రధాన దేవత దుర్గా అవతారం అయిన భగవతి. ఆమెను లోకనార్కవు అమ్మ అని కూడా అంటారు. ఈ ఆలయంలో శివుడు మరియు విష్ణువులకు అంకితం చేయబడిన రెండు మందిరాలు ఉన్నాయి.


💠 లోకనార్కవు ఆలయంలో మూడు దేవతలు ప్రత్యేక దేవాలయాలలో ప్రతిష్టించబడి ఉండటంతో ప్రత్యేకత సంతరించుకుంది. మూడు దేవతలకు వేర్వేరు గర్భాలయాలు, ఆచారాలు, పండుగలు మొదలైనవి ఉన్నాయి. విష్ణువు, భగవతి మరియు శివాలయాలు వారి ఆరాధన వయస్సు వరుస క్రమంలో ఉన్నాయి.

 విష్ణు దేవాలయం 2000 సంవత్సరాల పురాతనమైనది మరియు ఉత్తరాన ఉంది, భగవతి ప్రధాన ఆలయం 1500 సంవత్సరాల పురాతనమైనది. శివాలయం సాపేక్షంగా కొత్తది - 400 సంవత్సరాల పురాతనమైనది - మరియు మధ్యలో ఉంది.


💠 భగవతి, లేదా లోకాంబిక, విశ్వవ్యాప్తంగా నాలుగు అంబికలలో ఒకరిగా ప్రసిద్ధి చెందింది. 

లోకనార్కవు ఆలయంలో, భగవతిని మూడు వేర్వేరు రూపాల్లో పూజిస్తారు: ఉదయం సరస్వతిగా, మధ్యాహ్నం లక్ష్మీదేవిగా మరియు సాయంత్రం భద్రకాళిగా.


  🔆 పండుగలు:


💠 మలయాళ నెలల వృశ్చికం (నవంబర్ - డిసెంబర్) మరియు మీనం (మార్చి - ఏప్రిల్)లో ఇక్కడ రెండు వార్షిక పండుగలు జరుపుకుంటారు.


🔆 లోకనార్కవు ఉత్సవం


💠 41 రోజుల పాటు జరిగే ఈ ఆలయ ప్రధాన ఉత్సవం మలయాళ నెల వృశ్చికంలో (నవంబర్ మధ్య నుండి డిసెంబర్ మధ్య వరకు) జరుగుతుంది.  దీనిని స్థానికంగా మండలవిళక్కు పండుగ లేదా మండల ఉత్సవం అని పిలుస్తారు.  

ఈ ఉత్సవం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఆలయ ఉత్సవంలో ఇక్కడ మాత్రమే తాచోలికలి అనే జానపద నృత్యం చేస్తారు.  తచోళికలి అనేది కలరిప్పయట్టు అనే సాంప్రదాయక యుద్ధ కళను పోలి ఉంటుంది.


💠 ఈ పండుగను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారు.  

ఈ సందర్భంగా లోకనార్కవు భగవతీ దేవాలయం గోడలపై దీపాలు వెలిగించడం మరో విశేషం.


🔆 మీనం పండుగ


💠 లోకనార్కవు ఆలయంలో మీనం పండుగ రోహిణి రోజున కొడియెట్టం (జెండా ఎగురవేయడం) మరియు పూరం రోజున ఆరాట్టు (పవిత్ర స్నానం)తో ఎనిమిది రోజుల పాటు జరుపుకుంటారు.  

ఐదు, ఆరో రోజుల్లో తెయ్యంబాడి కురుపు సంప్రదాయ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  

ఏడవ రోజు నాడు వాలం వెక్క మరియు పల్లివెట్ట (పవిత్ర వేట).  పూరం రోజున పూరప్పట్టు మరియు పూరక్కళి (పురుషులు చేసే సంప్రదాయ నృత్య ఆచారం).



💠 ఈ ప్రదేశం కోజికోడ్‌కు ఉత్తరాన 48 కిమీ దూరంలో ఉంది. 


రచన

©️ Santosh Kumar

14-27-గీతా మకరందము

 14-27-గీతా మకరందము

        గుణత్రయవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - తాను సాక్షాత్ పరబ్రహ్మమేయని శ్రీకృష్ణమూర్తి తెలుపుచున్నారు - 


బ్రహ్మణో హి  ప్రతిష్ఠాఽహం అమృతస్యావ్యయస్య చ | 

శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాన్తికస్య చ || 


తాత్పర్యము:- ఏలయనగా, నేను నాశరహితమును, నిర్వికారమును, శాశ్వత ధర్మస్వరూపమును, (దుఃఖమిశ్రితముకాని) నిరతిశయ (అచంచల) ఆనందస్వరూపమును అగుబ్రహ్మమునకు ఆశ్రయమును (అనగా బ్రహ్మముయొక్క స్వరూపమును) అయియున్నాను.


వ్యాఖ్య:- 'అచంచల భక్తితో నన్ను సేవించువాడు త్రిగుణములను దాటి బ్రహ్మమును బొందు’నని పైశ్లోకమునందు శ్రీకృష్ణమూర్తి తెలియజేసి, తాను వాస్తవముగ నెవరో తన యథార్థస్వరూపమెట్టిదో ఈశ్లోకమున వెనువెంటనే విశదీకరించుచున్నారు. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాడు. సాక్షాత్ పరమాత్మయే, పరబ్రహ్మమే. ఆ సత్యమే యిచట తెలియజేయబడినది. ఆతడు యశోదాతనయుడు మాత్రమేకాదు; నాశరహితమై, శాశ్వతధర్మస్వరూపమై, నిరతిశయ ఆనందరూపమైనట్టి బ్రహ్మమే తానని శ్రీకృష్ణమూర్తి తెలియజేసిరి. ఇక్కారణమున వారిని అచంచలభక్తితో ధ్యానించువారు భ్రమరకీటకన్యాయము ననుసరించి వారియందే అనగా బ్రహ్మమునందే లయించి బ్రహ్మస్వరూపులే యగుదురు. ధ్యాత ధ్యేయాకారముగనే పరిణమించును. ఆ పరబ్రహ్మముయొక్క స్వరూపమెట్టిదో ఇచట విశదముగ తెలుపబడినది. అది (1) అమృతము, అవ్యయము - అనగా మరణరహితమైనది, వికారవర్జితమైనది - ఈ పదములద్వారా బ్రహ్మముయొక్క 'సత్' అంశము నిరూపితమైనది. మఱియు అది (2) శాశ్వత ధర్మస్వరూపము - ఈ పదముద్వారా బ్రహ్మముయొక్క ‘చిత్' అంశము నిరూపింపబడినది. (3) నిరతిశయానందరూపము - ఈ పదముద్వారా ‘ఆనంద’ అంశము నిరూపితమైనది. ఈ ప్రకారముగ సత్, చిత్, ఆనందమగు పరబ్రహ్మమే తానని శ్రీకృష్ణభగవానుడు తెలియజేసిరి. ఉపాసనాసౌలభ్యముకొఱకు ప్రారంభమున శ్రీకృష్ణుని యశోదాతనయుని రూపమునను, శ్రీరాముని కౌసల్యాతనయుని రూపమునను ధ్యానించినను, వాస్తవముగ వారిరువురును, నిర్గుణ, నిరాకార, సచ్చిదానంద పరబ్రహ్మరూపులేయని ఎప్పటికైనను తెలిసికొనవలసి యుండును. ఈ శ్లోకముచే ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతముల మూడిటియొక్క లక్ష్యము యథార్థముగ ఒకటేయగుచున్నదని స్పష్టమగుచున్నది. ఏలయనిన ద్వైత, విశిష్టాద్వైతులు ఏ భగవద్రూపమును అర్చించుచున్నారో ఆ రూపము వాస్తవముగ సచ్చిదానందమే అయియున్నదని ఇట తేలిపోయినది. భక్తియోగము, జ్ఞానయోగము ఈ శ్లోకమున పరస్పరము కౌగిలించుకొనుచున్నవి. కావున ఇక ఆయా సంప్రదాయములవారు పరస్పరము విమర్శించుకొనక అందఱు ధ్యానించునది ఒకే పరబ్రహ్మమనియే నిశ్చయించి వారి వారి సంస్కారమున కనుగుణ్యమైన ఉపాసనాపద్ధతిని, ధ్యేయాకారమును ఏర్పాటుచేసికొని కట్టకడకు అందఱును ఆ పరబ్రహ్మమునే చేరవచ్చును.

ప్రశ్న:- శ్రీకృష్ణమూర్తి వాస్తవముగ నెట్టివారు?

ఉత్తరము:- పరబ్రహ్మస్వరూపుడు. 

ప్రశ్న:- పరబ్రహ్మమెట్టిది?

ఉత్తరము:- (1) నాశరహితమైనది, నిర్వికారమైనది (సత్) (2) శాశ్వతధర్మస్వరూపమైనది (చిత్) (3) నిరతిశయ ఆనందరూపమైనది (ఆనందము).

 

ఓమ్ 

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే 

శ్రీకృష్ణార్జునసంవాదే గుణత్రయవిభాగయోగోనామ 

చతుర్దశోఽధ్యాయః

ఇది ఉపనిషత్ప్రతిపాదకమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును,

శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు  గుణత్రయ విభాగయోగమను 

పదునాల్గవ అధ్యాయము 

ఓమ్ తత్ సత్

తిరుమల సర్వస్వం -180*

 *తిరుమల సర్వస్వం -180*

మహంతుల నిర్వహణలో తిరుమల ఆలయం-5*




2 దాంతో పాటుగా భక్తుల రద్దీ కూడా పెరగడంతో మహంతులు తమ విశేషాధికారాన్ని, ఆలయవర్గాలలో తమకున్న పలుకుబడిని ఉపయోగించి; ప్రముఖులకు శీఘ్రంగా దర్శనం కలిగించటం మొదలుపెట్టారు. రాను రానూ ఆలయం యొక్క సాధన సంపత్తులన్నింటికీ తాము తిరుగులేని పెత్తందార్లమన్న మితిమీరిన విశ్వాసం మహంతులలో నెలకొంది. నిధుల దుర్వినియోగం ఆరోపణలు కూడా వచ్చాయి. ఆలయనిధులను తన సొంతానికి మళ్లించుకున్న ఆరోపణపై అప్పటి న్యాయస్థానం మహంతుకు జరిమానా కూడా విధించింది. అంతే గాకుండా, వారు ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ జరిపే సమయంలో; పాత ధ్వజస్తంభం యొక్క పాదపీఠం క్రింద ఉన్న నిధులను అపహరించారన్న అపవాదును మూటగట్టుకున్నారు. వీరి హయాంలోనే, మహంతుల నివాసం ఇప్పుడు ప్రధానాలయానికి ఆగ్నేయమూలలో ఉన్న, హంగు ఆర్భాటాలతో యాదవ రాజులు కట్టించిన మహంతుమఠానికి మారింది. అప్పటివరకు వైరాగ్యజీవితాన్ని గడిపిన మహంతులకు భిన్నంగా తరువాతి వారు మహంతుమఠంలో సర్వసౌఖ్యాలు అనుభవించారు. సర్వసంగపరిత్యాగులకు సౌధాలెందుకన్న ప్రశ్న భక్తుల మదిలో మెదిలింది. అప్పటి మహంతుల అతిశయం ఎంతగా వెర్రితలలు వేసిందంటే తిరుమల యాత్రికులు ముందుగా మహంతును దర్శించుకుని, కట్నకానుకలు సమర్పించుకున్న తర్వాతనే స్వామివారిని దర్శించుకునే సాంప్రదాయానికి నాంది పలికారు. అప్పటివరకు ఏ విధమైన తరతమ భేదాలకు తావులేని ఆలయంలో జమీందారులకు, ధనికులకు, రాచకుటుంబీకులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. పరపతి గలవారికి త్వరితగతిన దర్శనాలు జరిగేవి. ఇవన్నీ ఒక ఎత్తయితే, అన్యమతస్తుల విషయంలో మహంతు అవలంబించిన వైఖరి మరో ఎత్తు. అప్పటికి దాదాపు వంద సంవత్సరాల క్రితమే, ఆంగ్లేయులు, తిరుమల క్షేత్రం మరియు మీదకి హైందవేతరుల రాకపోకలపై కఠినమైన ఆంక్షలు విధించారు. దానికి భిన్నంగా ప్రస్తుత మహంతులు, యూరోపియన్ అధికారుల ప్రాపకం సంపాదించుకోవడం కోసం వారికి కొండపై ప్రత్యేకంగా వసతి సౌకర్యాలు కల్పించారు. సాంప్రదాయానికి విరుద్ధంగా దేవాలయ నిధులను, భూముల పూచీకత్తుపై కొంతమంది జమీందార్లకు రుణంగా ఇచ్చారు. అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు గానీ వాటన్నింటిలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అపవాదును మూటగట్టుకున్నారు. కొన్ని మహమ్మదీయ సంస్థలకు విరాళాలిచ్చారు.


 తరువాతి కాలంలో అధికారంలోకి వచ్చినా రామ్ కిషోర్ దాస్ జీ పై కూడా నిధుల దుర్వినియోగం ఆరోపణలు రావడంతో, న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నప్పుడు ఆకస్మికంగా మరణించారు. ఈ విధంగా మహంతుల నిర్వాకంపై వివిధ న్యాయస్థానాల్లో లెక్కలేనన్ని కేసులు నమోదు కావడంతో; 1898వ సంవత్సరంలో ఉత్తర ఆర్కాట్ జిల్లా ప్రధాన న్యాయస్థానం అప్పటి మహంతును కక్షి దారులైన జియ్యంగార్లు, శ్రీవైష్ణవులు, తిరుమలలో వున్న ఇతర మఠాల వారిని పిలిచి; సయోధ్య కుదిర్చారు. దాని ప్రకారం, న్యాయస్థానం ఆలయనిధుల వినియోగాన్ని పర్యవేక్షించడానికి ఐదుగురు సభ్యులతో ఒక ధర్మాసనాన్ని నియమించింది. దానిపై మహంతులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తరువాతి కాలంలో ఆలయనిర్వహణపై మహంతులకున్న తిరుగులేని అధికారాలకు పరిమితులు విధిస్తూ న్యాయస్థానాలు అనేక తీర్పులిచ్చాయి. వాటన్నింటిపై మహంతులు ఎప్పటికప్పుడు పైకోర్టుల్లో పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. చివరకు లండన్లోని అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అయినప్పటికీ. మహంతులు తప్ప ఆలయంతో సంబంధం ఉన్న మిగిలిన వారందరూ ఒక వర్గంగా ఏర్పడటంవల్ల, మహంతులపై అధికార దుర్వినియోగం ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతుండడం వల్ల తరచూ వారికి న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగులుతూ ఉండడమే గాకుండా, మహంతు వ్యవస్థ పట్ల తొలినాళ్ళలో భక్తులకున్న గౌరవాభిమానాలు క్రమంగా అంతరించి పోయాయి. ఆ విధంగా, 1900వ సంవత్సరం నాటికి మహంతుల ప్రభావం గణనీయంగా తగ్గింది.




*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము తృతీయాశ్వాసము*


*319 వ రోజు*


*అర్జునుడు కౌరవ వీరులను ఎదుర్కొనుట*


అర్జునుడు కౌరవ సేనలను తనుమాడ సాగాడు. రథములు విరుగుతున్నాయి. అశ్వముములు నేల కూలుతున్నాయి. ఏనుగుల కుంభస్థలములు పగులుతున్నాయి. సైనికుల తలలు బంతుల్లా తెగి పడుతున్నాయి. రణరంగం అంతా బీభత్సంగా తయారైంది. కౌరవ సైన్యం భయంతో పారి పోయింది. సింధురాజుకు రక్షణగా ఉన్న యోధులు సింహనాదం చేసారు వారి ఉత్సాహం చూసి అర్జునుడు రథమును సుయోధనుడి వైపు పోనిచ్చాడు. సుయోధనుడికి రక్షణగా ఉన్న ఎనిమిది మంది యోధులు అర్జునుడిని ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నారు. అర్జునుడు దేవదత్తమును పూరిస్తూ వారిని దాటి సైంధవుని వైపు పోతున్నాడు. అది గమనించి మిగిలిన వారు అర్జునుడి మీద శరవృష్టి కురిపించారు. అశ్వత్థామ రెచ్చి పోయి డెబ్బై మూడు బాణాలతో కృష్ణుని మూడు బాణాలతో అర్జునుడిని కొట్టాడు. అర్జునుడి కేతనమును విరిచాడు. అర్జునుడు కోపించి నూట ఆరు బాణములు అశ్వత్థామ మీద ప్రయోగించి పది బాణములతో కర్ణుడిని కొట్టాడు. వృషసేనుడిపై మూడు బాణములు ప్రయోగించి ఒకే ఒక బాణంతో శల్యుని విల్లు విరిచాడు. శల్యుడు వేరొక విల్లు తీసుకుని అర్జునుడి మీద ఏడు బాణములు ప్రయోగించాడు. కర్ణుడు మూడు బాణములు భూరిశ్రవసుడు వృషసేనుడు తలా అయిదు బాణములు కృపాచార్యుడు పది బాణములు అశ్వత్థామ అరవై బాణములు అర్జునుడి మీద ప్రయోగించాడు. అనేక దివ్యాస్త్రాలు అర్జునుడి మీద ప్రయోగించారు. సైంధవుడు వారి చాటున నిలబడి డెబ్బై మూడు బాణములు అర్జునుడిపై వేసాడు. అది చూసిన అర్జునుడికి ఏడుపు నవ్వు ఏక కాలంలో కలిగాయి. అర్జునుడు కర్ణుడి మీద పన్నెండు బాణములు అతడి కుమారుని మీద మూడు బాణములు వేసాడు. ఒకే ఒక బాణంతో శల్యుని విల్లు తుంచి తొమ్మిది బాణములతో శల్యుని కొట్టాడు. మూడు బాణములతో భూరిశ్రవసుని ఎనిమిది బాణములతో అశ్వత్థామను ఇరవై రెండు బాణములతో కృపాచార్యుని కొట్టాడు. మరొక ఇరవై రెండు బాణాలతో అశ్వత్థామ శరీరం అంతా గుచ్చాడు. సైంధవుడు కనిపించినప్పుడల్లా అతడి మీద బాణప్రయోగం చేస్తున్నాడు. సైంధవుడు అర్జునుడికి కనుపించ కుండా వారి వెనుక దాక్కుంటున్నాడు. కౌరవ సైన్యం ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుని ఒకటిగా చేరి అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు వారిని తన బాణములకు ఎరగా వేసాడు.


*కౌరవ పాండవ సమరం*

ధర్మరాజు ద్రోణుడు ఉన్న రణరంగమున పరిస్థితి భయంకరంగా ఉంది. యుద్ధం ఘోరంగా సాగుతుంది. బృహత్క్షతృడిని క్షేమధూర్తి, ధృష్టకేతుడిని వీర ధ్వనుడు, నకులుడిని కర్ణుడు, సహదేవుడిని దుర్ముఖుడు, సాత్యకిని వ్యాఘ్రదత్తుడు ఎదుర్కొని యుద్ధం చేస్తున్నాడు. శల్యుడు మాత్రం అటు శకట వ్యూహం నుండి పద్మవ్యూహం వరకు అటూ ఇటూ తిరుగుతునే మధ్యలో ఉపపాండవులతో యుద్ధం చేస్తున్నాడు. అలంబసుడు భీముని ఎదుర్కొన్నాడు. ద్రోణాచార్యుడు ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ధర్మరాజు ద్రోణాచార్యుని శరీరంపై తొంభై బాణములు గుచ్చాడు. ద్రోణుడు ధర్మరాజు గుండెలకు గురిపెట్టి ఇరవై అయిదు బాణాలు వేసాడు. ద్రోణుడు తన బాణములతో ధర్మరాజు రథమును ముంచెత్తాడు. ధర్మరాజు ద్రోణుడు వేసిన బాణములు నిర్వీర్యం చేసాడు. ద్రోణుడు కోపించి ధర్మరాజు విల్లును త్రుంచాడు. అది చూసిన వారంతా ఈ రోజు ద్రోణుని చేతిలో ధర్మరాజు బంధీ అయ్యాడు అనుకున్నారు. ధర్మరాజు వేరొక విల్లు అందుకుని ద్రోణుడు వేసిన బాణాలన్నింటిని త్రుంచి వెంటనే ద్రోణుని మీద శక్తి ఆయుధాన్ని వేసాడు.  

*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

భక్తి యోగం సంబంధ 34 పుస్తకాలు

 *భక్తి యోగం సంబంధ 34 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో!. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

భక్తి సారము-1 నుంచి 2 భాగాలు www.freegurukul.org/g/BhaktiYogam-1


భక్తి తత్త్వ దర్శనము www.freegurukul.org/g/BhaktiYogam-2


భక్తి సుధ -2 www.freegurukul.org/g/BhaktiYogam-3


దేవుడెవరు? దేవుడెట్లు కనపడును? www.freegurukul.org/g/BhaktiYogam-4


భగవానుని 5 నివాస స్థానాలు www.freegurukul.org/g/BhaktiYogam-5


భక్తి యోగం www.freegurukul.org/g/BhaktiYogam-6


భక్తి తత్వము www.freegurukul.org/g/BhaktiYogam-7


భక్తి రసాయనము www.freegurukul.org/g/BhaktiYogam-8


భక్తి యోగ తత్త్వము www.freegurukul.org/g/BhaktiYogam-9


భక్తి,భగవంతుడు www.freegurukul.org/g/BhaktiYogam-10


మధుర భక్తి www.freegurukul.org/g/BhaktiYogam-11


భక్తి సోపానము www.freegurukul.org/g/BhaktiYogam-12


శరణాగతి www.freegurukul.org/g/BhaktiYogam-13


భక్తుడు భగవంతుని భాంధవ్యము www.freegurukul.org/g/BhaktiYogam-14


కృష్ణ భక్తి www.freegurukul.org/g/BhaktiYogam-15


భక్తి-సంకీర్తనము www.freegurukul.org/g/BhaktiYogam-16


భక్తి - భగవంతుడు www.freegurukul.org/g/BhaktiYogam-17


అమూల్య సమయము దానిఉపయోగం www.freegurukul.org/g/BhaktiYogam-18


మధురభక్తి-ముగ్ధ భక్తి www.freegurukul.org/g/BhaktiYogam-19


భక్తి సుధ -3 www.freegurukul.org/g/BhaktiYogam-20


పరాభక్తి www.freegurukul.org/g/BhaktiYogam-21


ప్రార్ధనలు నిజంగా పనిచేస్తాయా www.freegurukul.org/g/BhaktiYogam-22


ఈశ్వర ప్రార్ధనలు www.freegurukul.org/g/BhaktiYogam-23


భక్తాంజలి www.freegurukul.org/g/BhaktiYogam-24


ప్రార్ధన www.freegurukul.org/g/BhaktiYogam-25


నవవిధ భక్తి రీతులు www.freegurukul.org/g/BhaktiYogam-26


నామ మహిమ - నామ రహస్యము www.freegurukul.org/g/BhaktiYogam-27


భక్తి ప్రసూనాలు www.freegurukul.org/g/BhaktiYogam-28


నారద భక్తి సూత్రములు www.freegurukul.org/g/BhaktiYogam-29


నారద భక్తి సూత్రాలు www.freegurukul.org/g/BhaktiYogam-30


రామనామ మహిమ -గాంధిజీ www.freegurukul.org/g/BhaktiYogam-31


శ్రీమన్నారద భక్తి సూత్రాలు www.freegurukul.org/g/BhaktiYogam-32


నారద భక్తి సూత్రాలు www.freegurukul.org/g/BhaktiYogam-33


భగవన్నామ సమ్మేళన మాటలు www.freegurukul.org/g/BhaktiYogam-34


భక్తి యోగం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను ప్రతి రోజు పొందుటకు:

Whatsapp Group లో join అగుటకు www.freegurukul.org/join   

Telegram Channel లో join అగుటకు https://t.me/freegurukul

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


*ధర్మసందేహాలు*

*శ్లో॥ చందనం పితృకారేషు*

 *ఫాలమధ్యేవినిక్షి పేత్ !*

*కంఠే కక్షే తధాపృష్టే* 

*నిరాశాః పితరోగతాః |*


*తా॥ పితృకార్యములయందు ముఖము నందే మంచి గంధమును ధరించవలయును గాని కంఠమునందును, భుజములయందును, వీపునందును ధరించిన యెడల పితృదేవతలు ఆశారహితులై వెళ్ళిపోవుదురు.*✍🏽🌹💐🪷🙏

నిందాస్తుతి

 శు భో ద యం 🙏


నిందాస్తుతి!


 సీ:హరి! నీకుఁ బర్యంకమైన శేషుఁడు చాలఁ, బవనము భక్షించి బ్రతుకుచుండు

ననువుగా నీకు వాహనమైన ఖగరాజు, గొప్ప పామును నోటఁ గొఱుకుచుండు

అదిగాక నీ భార్యయైన లక్ష్మీదేవి, దినము పేరంటంబు దిరుగుచుండు

నిన్ను భక్తులు పిల్చి నిత్యపూజలు చేసి, ప్రేమఁ బక్వాన్నముల్ పెట్టుచుండ్రు


స్వస్థముగ నీకు గ్రాసము జరుగుచుండుఁ

గాసు నీ చేతి దొకటైనఁ గాదు వ్యయము

భూషణవికాస! శ్రీధర్మపురనివాస!

దుష్టసంహార! నరసింహ దురితదూర

-కాసుల పురుషోత్తమకవి!

     మనసాహిత్యమున నిందాస్తుతులకు కొదవలేదు.ధూర్జటి ఇత్యాదులు తమశతకములలో ముద్దు ముద్దుగా శివకేశవులనుతెగడినట్లుగా పొగడినారు.

     నిందాస్తుతి భాజనమైన శతకములలో 1శ్రీకాకుళాంధ్రదేవ శతకము. 2ధర్మపురి  నరసింహ శతకము లు సుప్రసిధ్ధములు.

       ధర్మపురి నరసింహశతకములోని

పద్యమును చిత్తగింపుడు భక్తులొనర్చు కైంకర్యములతో

సుఖపడుచు శ్రీ హరి సోమరిగా నెట్లుమారెనో కవిగారి కథనంలో-ఇదంతా నిందనుకునేరు.కాదుకాదు. స్తుతియే!!!

                                   స్వస్తి!!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

పోతన రూపచిత్రణ!

 పోతన రూపచిత్రణ! 


మ: త్రిజగ న్మోహన నీలకాంతి తనువుద్దీపింపఁ బ్రాభాత నీ


        రజ బంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల , నీలాలక


        వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృభింప మా


        విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్!


                   ఆం: భాగవతం- ప్రధమస్కంథం- 247: వ: పద్యము;


                     

                   ముల్లోకాలను మైమరపించే నీలమేఘ ఛ్ఛాయగల తనువుతో, ఉదయారుణ కిరణ కాంతిని 


   ప్రతిఫలించు నుత్తరీయంబుతో ,గాలికి నూయలలూగు నల్లని ముంగురులతో నొప్పు ముఖారవిందముతో చూడముచ్చటఁ గొల్పుచు మా అర్జును దరికి నరుదెంచుచుండు అందగాడు శ్రకృష్ణుఁ డెల్లవేళల నామదిలో నిలచుగాక! అనిభీష్మ స్తుతి;


                 నల్లనివాడే గాని యామేనిలో నొక మెఱపున్నది. ఆకర్షణ యున్నది. అదియెంతటిదనగా ముల్లోకములను మోహింప జేయు నంతటిదట! ఆమూర్తి కన్నుల బడెనా అంతే ఆయాకర్షణ ప్రవాహమున గొట్టికొని పోవలసినదే!


                         ఇఁక నాతఁడు ధరించిన పీతాంబరమా ఉదయారుణ కాంతి రంజితమై చూపరులకు యింపు నింపు చున్నది. 

కృష్ణుడు కదలివచ్చుచుండ బాలసూర్యోపమ మైన కాంతిపుంజ వలయమేర్పడుటకా వస్త్రము ఆధారమగుచున్నది. ఎంత యద్భుతము! 


                  మోమా అరవిందమును బోలియున్నది. అది నల్లని ముంగులతో శోభాయమానమై యున్నది.కవి బయటకు చెప్పకున్నను తుమ్మెదలు ముసిరిన పద్మమును బోలియున్నది. 


                              ఇంత యందమును మూటగట్టి వచ్చువాడు వన్నెలాడు (సోకులరాయడు) గాకుండునా? 


              ఇదీ పోతన గారి యద్భుత రూప చిత్రణా సామర్ధ్యము!


                                                             స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

నీపంచంబడియుండగాఁగలిగినన్

 శు  భో  ద  యం 🙏


"నీపంచంబడియుండగాఁగలిగినన్ భిక్షాన్నమేచాలు, ని/క్షేపంబబ్బిన రాజకీటముల నే సేవింపఁగా నోప,నా/

శాపాశంబులఁ జుట్టిత్రిప్పకుము సంసారార్ధమై, బంటుగా/

జేపట్టందగుఁబట్టి మానదగదో శ్రీకాళహస్తీశ్వరా!


కాళహస్తీశ్వర శతకం.

ధూర్జటి మహాకవి.


భావము:స్వామీ! నన్ను నీపంచన పడియుండనిమ్ము,భిక్షాన్నమబ్బినను అగియేనాకు చాలును.

నిధి నిక్షేపములొసంగినను రాచపురుగులను సేవింపను.ఆశాపాశముతో నన్నుబంధించి నన్ీసంసారముకొఱకై త్రిప్పవలదు.నీసేవకునిగా గైకొనుము నన్నెచ్టిపరిస్థితులలోను దూరముగావింపకు.


విశేషములు:

పంచ అనునది పల్లెలలో వసారాగా చెప్పబడు చిన్నఅరుగు.

శినసన్నిలోనున్నపంచయైనచాలునట.భిక్షాన్నమైనను అభ్యంతరములేదట.(శివుడునిత్యభైక్షికుడు అతనికడదొరుకునది భిక్షాన్నమేకదా! "లోకంలోవాడుక మీయిట్లో పచ్చడి మెతుకులైనా నాకుపరమాన్నమే"-ననివాడుక,అట్లే యిదియు.

          నిధినిక్షేపములనిచ్చిననురాజకీటములసేవింపనొల్లడట! ఇటప్రభువులు కవికి కీటక సమానులుగా దోచుచున్నారు.బహుశఃఇది రాయలయనంతరపు మాటయైయుండవచ్చును


సంసారభారమునుజూపి ఆశాపాశములతో ననుబంధించి పరిభ్రమింపజేయకుము.నీబంటుగా సేకొన్నచాలును చేపట్టి యెన్నటికి విడువబోకుము.నాకంతకుమించి వలదనుచున్నాడు.

లోకమున నాశనుజయించినవాడు.లేడు.నిజముగా నదిపాశమువంటిదే"ఆశాపాశముదాగడున్నిడుపు లేదంతంబు రాజేంద్ర!" యన్నవామనోక్తులు సర్వధాస్మరణీయములు.ఆశను జయించినవాడే ఆధ్యాత్మిక సింహాసనమున నధివశిచుటకు యోగ్యుడు.ఆయోగ్యనుప్రసాధింప గోరుట ధూర్జటి యాధ్యాత్మిక జ్ఙానపరిపక్వతకు నిదర్శనము.

                         స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

విలువ ఇస్తారు

 *మనిషికి ఆ మనిషిలో ఏమి చూసి విలువ ఇస్తారు...?*


1)మనిషి " రంగూ , రూపూ " చూసి మాత్రం " విలువ " ఇవ్వరు.!!

కేవలం బాగున్నారు అన్న " ప్రశంస " దక్కుతుంది .!!


2) అంగ బలం , ఆర్ధిక బలం ఉన్నా ఇవ్వరు...

వీడితో ఎప్పుడైనా అవసరం ఉంటుందేమో అని 

" అణుకువ " నటిస్తారు.

అంతవరకే...


3)పదవి , పలుకుబడి , చూసినా , అవి ఉన్నన్ని రోజులూ చుట్టూ  తిరుగుతారు. " విలువ " ఇవ్వటానికి కాదు వాడుకుందామని 

పదవి పోయిన పూటకే " వెనుతిరిగి " చూస్తే 

ఒక్కడూ ఉండడు.

ఇది నిజం...


4) కొంత మంది కబుర్లు చెప్పి " కడుపు " నింపినంత 

గొప్పగా చెబుతారు.!

కాసేపు కబుర్లు " ఎంజాయ్ " చేస్తారు కాని " విలువ " మాత్రం ఇవ్వరు...

*మనిషి " విలువ "* పొందాలంటే ఉండవలసినవి 

1 కరుణ,

2 దయ,

3 ప్రేమ ,

4 జాలి ,

5 సేవాభావం ,

6 సాయపడాలనే తపన ,

7 మంచి మనసు ,

8 తెగింపు ,

9 విశాలహృదయం ,

ఉండాలి.!!!

పై లక్షణాలు మనకు ఉంటె

 *" విలువ "*

మనం పిలవకుండానే 

మన దగ్గరకు  వస్తుంది...ఆర్.కే.ఆర్!


*సర్వేజనా సుఖినోభవంతు!*

https://chat.whatsapp.com/LgaiPc1mEg76Hv7g1H8gXO

తలచిన విస్తరించుఁ

 చ.తలచిన విస్తరించుఁ బరితాప వివర్ధిత దుష్ట రోగమే

చెలగి, యనేక జీవుల నశింపగ జేయగఁ బూని యున్న దెం

దులకొ? వివేక మొంది సుమతుల్ గని మేల్కొన మేలు, లేనిచో

తొలగదు! రూపు మాపుటకు దూకుడు నాపుట మేలు భారతీ!౹౹89


ఉ.వైద్యుల సూచనల్ గొని అపార విచక్షణ తోడ సర్వ సం

వేద్యము నైన వ్యాధిని వివేకముతో గమనింపగాఁ దగున్

చోద్యము జూడ నొప్పదు విశుధ్ధపు వర్తన, మెంచి చూడ సం

వేద్యుల బోధనల్ వినెడు విజ్ఞత,  మేలును గూర్చు భారతీ!౹౹ 90

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం - తృతీయ - చిత్ర -‌‌ ఇందు వాసరే* (17.03.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

సోమవారం🕉️* *🌹17, మార్చి, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

      *🕉️సోమవారం🕉️*

*🌹17, మార్చి, 2025🌹*

    *దృగ్గణిత పంచాంగం*                  


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిరఋతౌః*

*ఫాల్గుణ మాసం -  కృష్ణపక్షం*


*తిథి       : తదియ* రా 07.33 వరకు ఉపరి *చవితి*

*వారం    : సోమవారం* ( ఇందువాసరే )

*నక్షత్రం  : చిత్త* మ 02.47 వరకు ఉపరి *స్వాతి*


*యోగం  : ధ్రువ* సా 03.45 వరకు ఉపరి *వ్యాఘాత*

*కరణం   : వణజి* ఉ 06.14 *భద్ర* రా 07.33 ఉపరి *బవ*


*సాధారణ శుభ సమయాలు:* 

*ఉ 09.30 - 11.30 సా 05.30 - 06.30*

అమృత కాలం  : *ఉ 07.34 - 09.23*

అభిజిత్ కాలం  : *ప 11.52 - 12.40*


*వర్జ్యం             : రా 09.06 - 10.54*

*దుర్ముహూర్తం  : మ 12.40 - 01.28 & 03.05 - 03.53*

*రాహు కాలం   : ఉ 07.44 - 09.15*

గుళికకాళం      : *మ 01.46 - 03.17*

యమగండం    : *ఉ 10.45 - 12.16*

సూర్యరాశి : *మీనం*

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 06.14* 

సూర్యాస్తమయం :*సా 06.18*

*ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 06.14 - 08.39*

సంగవ కాలం         :      *08.39 - 11.04*

మధ్యాహ్న కాలం    :      *11.04 - 01.28*

అపరాహ్న కాలం    : *మ 01.28 - 03.53*


*ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ బహుళ తదియ*

సాయంకాలం        :  *సా 03.53 - 06.18*

ప్రదోష కాలం         :  *సా 06.18 - 08.41*

రాత్రి కాలం             :  *రా 08.41 - 11.52*

నిశీధి కాలం          :*రా 11.52 - 12.40*

బ్రాహ్మీ ముహూర్తం  :*తె 04.38 - 05.25*

_______________________________

         *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*నటరాజ స్తోత్రం (పతంజలి కృతం)*

*అథ చరణశృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రం*


*అసంఘమనసం జలధి జన్మగరలం కవలయంత మతులం గుణనిధిం*

*సనంద వరదం శమితమిందు వదనం* 

*పర చిదంబర నటం హృది భజ ॥*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

ముగ్గు

 ఇంటి గడప/గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డ గీతలు ఇంటి లోనికి దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి.


ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.


ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డ గీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు.

పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. 


ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.


నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది.


అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా.


యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు.


అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.


తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి దీపారాధాన చేయాలి. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి.


దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.


నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.


దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. 

ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.


ఏ స్త్రీ అయితే దేవాలయం లోనూ, అమ్మవారు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైదవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.


పండుగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు.


అంతే కాదండోయ్! మనం ముగ్గులు రోజు వేయ లేక పెయింట్ పెట్టిస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. 


ఏ రోజుకారోజు బియ్యపు పిండితో ముగ్గు పెట్టాలి.


నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. 


ముగ్గు పాజిటివ్/ దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.


ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి.


పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. 


ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునే వారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. 


ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు.


అందుకే మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. 


శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.


ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి.


మన ఆచరించే ఏ ఆచారమూ మూఢ నమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి. స్వస్తి.

సంకటహర చతుర్థి*

 ..*17 మార్చ్ సోమవారం సంకటహర చతుర్థి*

హిందువులకు పవిత్రమైన పండుగల్లో ఒకటి సంకటహర చతుర్థి. ఈ పండగ గణపతికి అంకితం చేయబడింది. ఈ రోజున విఘ్నాలకధిపతి వినాయకుడికి పూజిస్తారు. ఉపవాసం ఉంటారు. ఈ రోజున చేసే పూజ మాత్రమే కాదు దానాలు కూడా ఫలవంతంగా ఉంటాయి. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొంటాయి. కనుక ఈ రోజు సంకటహర చతుర్థి ఎప్పుడు? ఈ రోజున సుఖ సంతోషాల కోసం చేయాల్సిన దానాలు ఏమిటో తెలుసుకుందాం..


సంకటహర చతుర్థి అనేది హిందూ మతంలో గణేశుడికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన పండుగ. ఇది ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్థి తిథి రోజున జరుపుకుంటారు. ఈ రోజున గణేశుడిని పూజిస్తారు. ఉపవాసం చేస్తారు. గణపతి ఆశీర్వాదం పొందడానికి నియమనిష్టలతో పూజించాలి. గణేశుడిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. అంటే అడ్డంకులను తొలగించేవాడని అర్ధం.సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించడం వల్ల జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఈ రోజున గణేశుడిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయని, కుటుంబంలో ఆనందం నెలకొంటుందని నమ్ముతారు. భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి సంకటహర చతుర్థి రోజున ఉపవాసం కూడా పాటిస్తారు.


పంచాంగం ప్రకారం పాల్గుణ మాసం కృష్ణ పక్ష చతుర్థి తిధి మార్చి 17, సోమవారం సాయంత్రం 07:33 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మార్చి 18 మంగళవారం రాత్రి 10:09 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున, చంద్రోదయ సమయంలో పూజ నిర్వహిస్తారు. అటువంటి పరిస్థితిలో బాల చంద్ర సంకటహర చతుర్థి మార్చి 17న మాత్రమే జరుపుకోవాల్సి ఉంటుంది.


సంకటహర చతుర్థి రోజున ఏ వస్తువులను దానం చేయాలంటే

బట్టలు: మీరు పేదలకు, అవసరంలో ఉన్నవారికి కొత్తవి లేదా శుభ్రమైన దుస్తులను దానం చేయవచ్చు.

ధాన్యాలు: బియ్యం, గోధుమలు, పప్పులు సహా ఇతర ధాన్యాలను దానం చేయవచ్చు.


పండ్లు, స్వీట్లు: గణపతి పూజలో పండ్లు, స్వీట్లు సమర్పించి.. పేదలకు పంచడం మేలు చేస్తుంది.

డబ్బు: పేదలకు, అవసరంలో ఉన్నవారికి డబ్బును దానం చేయవచ్చు.

పుస్తకాలు, స్టేషనరీ: పిల్లలకు పుస్తకాలు,స్టేషనరీ వస్తువులు అంటే పెన్సిల్స్, పెన్నులు వంటివాటిని విరాళంగా ఇవ్వవచ్చు.


జంతువులకు ఆహారం: ఆవులు, కుక్కలు, ఇతర జంతువులకు ఆహారాన్ని దానం చేయవచ్చు.

నీరు: దాహం వేసిన వారికి నీరు ఇవ్వడం అంటే వేసవిలో దాహార్తి తీర్చడానికి మంచి నీటి స్టాల్స్ ఏర్పాటు చేయవచ్చు.


గొడుగు లేదా బూట్లు: అవసరమైన వారికి గొడుగు లేదా చెప్పులను దానం చేయవచ్చు.

నెయ్యి: నెయ్యిని దానం చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని నమ్మకం.

బెల్లం : బెల్లం దానం చేయడం వల్ల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అదృష్టం కలుగుతుంది.


దానం చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోండి

దానం చేసేటప్పుడు మనసులో స్వార్థం ఉండకూడదు.

ఎల్లప్పుడూ పేదలకు దానం చేయాలి.

దానం చేసేటప్పుడు ఎవరినీ అవమానించకూడదు.

ఎవరి శక్తి సామర్థ్యం మేరకు దానం చేయాలి.

దానధర్మాలు రహస్యంగా చేయాలి.


సంకటహర చతుర్థి రోజున దానం చేయడం ద్వారా గణేశుడు సంతోషించి భక్తులను ఆశీర్వదిస్తాడని నమ్మకం. దానం చేయడం వల్ల ఇతరులకు సహాయం చేయడమే కాదు దాతకు మానసిక ప్రశాంతత, సంతృప్తి లభిస్తుంది. దీనితో పాటు జీవితంలో వచ్చే అడ్డంకుల నుంచి విముక్తి లభిస్తుంది.

Panchang