19, మే 2022, గురువారం

పరులను అవమానించడం

 శ్లోకం:☝️

*క్షత్రియం చైవ సర్పం చ*

    *బ్రాహ్మణం చ బహుశ్రుతం l*

*నావమన్యేత వై భూష్ణుః*

    *కృశానపి కదాచన ll*


భావం: పరులను అవమానించడం అసలు తగదు. అందునా -  పరాక్రమం గల రాజునీ, పామునూ, బాగా పాండిత్యం గల బ్రాహ్మణునీ, బాగా బ్రతికి - చెడినందువల్ల అవస్థలు పడేవాడినీ, ఎన్నడూ అవమానించరాదు. ఎందుకంటే - వీరు తాత్కాలితంగా ఏమీ చేయకలేకున్నా, తమ శక్తి సామర్థ్యాలకు పదునుపెట్టి అవతలివారి అంతు చూడగలరు. కావున వీరి విషయంలో  అమర్యాద కూడదు.

ఆలోచించండి

 దయచేసి ఓ తురక రచయత పంపిన మెసేజుకి బదులుగా చెంప ఛెళ్ళుమనేలా ఈ పోస్టుని తిరిగి పంపండి..ఇది ఓ కర్తవ్యంగా భావించండి.


మానవత్వానికే మచ్చతెచ్చే అనేక హీన కార్యాలకి ఏ మతస్థులు పూనుకున్నారు?...దానికి కారణం ఎవరు?


ఐదుసార్లు మసీదుకెళ్తేనో ..బురఖాలు దుస్తులు ధరిస్తేనో, గుళ్ళల్లోనో, చర్చిల్లోనో ప్రార్ధనలు చేస్తేనో ఎవరూ సాంప్రదాయవాదులు కాలేరు..


చీరలు కట్టుకున్నా వేరే దుస్తులు ధరించినా మా ఆడవాళ్ళ ఔన్నత్యం..మాతృత్వ సున్నితత్వం మిగతావారి కెక్కడివి?


ఇప్పటికీ మేము అరుంధతీ మాత, సతీ సావిత్రి, అహల్యాబాయ్ హోల్కర్, ఝాన్సీ లక్ష్మీ బాయ్, నేటి తరానికి చెందిన సరోజినీ నాయిడు, సుధామూర్తి లాంటి వారిని గొప్పగా చెప్పుకుంటాం....


_ప్రపంచంలోని వేరే ఏ మతంలోనైనా గొప్ప ఖ్యాతి గాంచిన ఐదుగురు ఆడాళ్ళ పేర్లు చెప్పండి దయచేసి?_


తండ్రి మాటవిని రాజ్యాన్ని వదిలేసిన రాముణ్ణి అనుక్షణం తలుచుకుని గర్వ పడతాం..

రాజ్యం కోసం తండ్రులని, అన్నదమ్ములని చంపి, ఖైదు చేసిన చరిత్రలు ఎవరివి? అవన్నీ మేము రాసినవా?


మేము రోజు గుడికెళ్ళం...కానీ...ఇంటికో తులసి చెట్టు, ఈశాన్యంగదిలో దేవుడు, వందలో కనీసం అరవై శాతం మంది ఫోన్లలో లాక్ స్క్రీన్ కి దేవుడు..రింగ్ టోన్ లో శ్లోకం..ఇలా చెప్పలేనన్ని విధాలుగా మా దేవుడు సన్నిహితంగా ఉండేలా మేం చూసుకుంటూనే ఉన్నాం. అసలు మనుషలలోనే దేవుడిని చూడమన్న గొప్ప మతం కదండీ మాది.. మన మతం కాకపోతే చంపెయ్యండి అన్న మాటలు మా గ్రంధాల్లో ఎక్కడైనా చూపగలరా?


మారిన జీవన విధానాలకోసం కొన్ని సాంప్రదాయాలను పాటించడం కుదరట్లేదు..అయినా మా రామాయణ భారతాలు తరతరాలుగా మా పిల్లలకి మననం అవుతూనే ఉంటాయి...మీకా స్వేఛ్ఛ లేదని మామీద ఎందుకు అసూయ పడతారు? 


ఎవరి పిల్లలు పన్నెండేళ్ళకే తుపాకులు పట్టుకున్నారని వార్తల్లో చదువుతున్నాం? ఎవరి పిల్లలు..పరమతస్తులపై ద్వేషాన్ని, విషాన్నీ కక్కుతున్నారు? చరిత్రలఖ్ఖర్లేదు ...ఇటీవలి వార్తలు తియ్యండి చాలు..


ఏమతాన్ని చూసైనా అసూయ పడాల్సిన ఖర్మ హిందువులకేం పట్టిందండి? అన్ని మతాల సారం, సాంప్రదాయపద్ధ్తతులూ అన్నీ మాదగ్గరే ఉంటే!


ఉదాహరణకి విగ్రహారాధన కి మీరు వ్యతిరేకం..మా చిదంబరం గుళ్ళో మేము పాటించేదే కదండీ ఆ పద్ధతి?


ఇహ చివరగా..


మీ మతాలని విమర్శిస్తూ ఎవరైనా పోస్ట్ పెడితే పరిణామం దారుణంగా ఉంటుంది....మావాళ్ళు ' పోన్లే..ఎంత తలకుమాసినవాడైనా మనమంచికే చెప్పాడు ' అనుకుని క్షమించి అందరికీ ఫార్వార్డ్ చేస్తారు..


ఎవరు మానవత్వానికి దగ్గరగా ఉన్నారు? ఎవరు మారణహోమానికి నిత్యం అంగలార్చుతున్నారు? 

_ఎవరిని చూసి ఎవరు అసూయ పడి విషాన్ని కక్కుతున్నారు?_


*ఆలోచించండి. మీరే కాదు..మావాళ్ళూ ఆలోచించాల్సిందే..*

విష్ణుపురం శాస్త్రి గారి అనుభవాలు

 విష్ణుపురం శాస్త్రి గారి అనుభవాలు


1940లో పరమాచార్య స్వామివారు కాశీయాత్రను ముగించుకుని విష్ణుపురం విజయం చేశారు. పరమాచార్య స్వామివారు సవారి వెళ్తున్నప్పుడు, ఒక ప్రముఖ వ్యక్తి సమీపించి పరమాచార్య స్వామివారికి బోధన చేసిన గురువుని సామి శాస్త్రిగారు అని సంబోధించాడు. 


స్వామివారు ఎంతో ఆవేదనతో అతణ్ణి “ఏమన్నావు? ఏమన్నావు?” అని అడిగారు.

ఆ భక్తుడు కాస్త కంగారుపడి “నేను ఏమి అపచారం చేశాను? పరమాచార్య స్వామివారు అంత క్షోభ పడుతున్నారు?” అని పరిపరివిధాల ఆలోచిస్తున్నాడు.

మహాస్వామి వారు అతనితో, “వారి గురించి నీకు ఏమి తెలుసు? నేను సైతం ఎన్నడూ వారిని పేరు పెట్టి పిలవలేదు; విష్ణుపురం శాస్త్రిగారు అనే అనేవాణ్ణి” అన్నారు. గురువులపై అంతటి గౌరవం వారికి.


ఈ సూచన కేవలం ఆ భక్తుడికి మాత్రమే కాదు, మనకు కూడా!


శ్రీ పరమాచార్య స్వామివారికి శిక్షణ ఇచ్చేందుకు కుంభకోణంలోని శ్రీమఠం పక్కనే మా తాతగారికి కూడా వసతి ఏర్పాటు చేశారు. మా నాన్నగారు కూడా తరచూ అక్కడకు వెళ్లి కొన్ని రోజులు ఉండేవారు.


మఠం పైన ఉన్న మేడమీద వర్షపు నీరు వెళ్ళడానికి గొట్టాలు ఉన్నాయి. వర్షం పడినప్పుడు, పరమాచార్య స్వామివారు మా నాన్నగారితో పాటు మేడపైకి వెళ్ళేవారు. ఇద్దరూ ఆ గొట్టాలను తీసి అక్కడ నిల్చున్న నీటితో ఆటలాడుకునేవారు. సూర్యుడు ఉండగా వర్షం కనుక పడితే, మహాస్వామి వారు వర్షంలో తడుస్తూ, “గంగ స్నానం, గంగా స్నానం!” అని అరుస్తూ, నాట్యం చేస్తూ ఆనందపడేవారు.


***********************************


అప్పట్లో పరమాచార్య స్వామివారి యాత్ర అంటే, స్వామివారితో పాటు పెద్ద రాజ పరివారం వెళ్ళేది. మూడు ఏనుగులు, అయిదు గుర్రాలు, ఇరవైరెండు ఆచ్చాదన ఉన్న ఎడ్లబండ్లు, పదిహేను గోవులు, రెండు సవారి గుర్రాలు (ఒకటి నల్లనిది, ఒకటి పంచకల్యాణి - ముఖము, కాళ్ళు తెల్లగా ఉండేది), రెండు గుర్రపు బగ్గీలు, సవారి ముందర పెద్దగా శబ్దం చేస్తూ బాకా. అయిదుగురు లోపలి వలయం కాపలావాళ్ళు, బయటి వలయం కాపలావాళ్ళు అయిదుగురు. వీరు కాకుండా, ఎందఱో వేదపండితులు, వ్యక్తిగత సహాయకులు, మేనేజరు, కోశాధికారి, ప్రముఖులు మరియు మేళ తాళాలు.


పరమాచార్య స్వామివారు విజయం చేస్తున్నారని తెలిస్తే, ఊరు మొత్తం కోలాహలంగా, సందడిగా, పండుగ వాతావరణంతో ఉండేది. ఇప్పుడు ఇవన్నీ కేవలం ఊహించి మాత్రమే దర్శించాలి.


***********************************


పరమాచార్య స్వామివారికి శ్రీమద్భాగవతం అంటే అమిత ఆసక్తి. ఒకసారి, రామమూర్తి అయ్యర్ భాగవతం చదువుతూ ఉంటే, స్వామివారు వింటున్నారు.

అప్పుడు, భాగవత ప్రవచనాలకు ప్రసిద్ధుడైన నీడమంగళం శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారు అక్కడకు వచ్చి ఢిల్లీలో భాగవత సప్తాహం ముగుంచుకుని వస్తున్నాను అని స్వామివారికి తెలియజేశారు.


“విద్వాంసులు కూడా వచ్చి విన్నారా?” అని అడిగారు స్వామివారు.

“అవును వచ్చారు”


“వారు ఏమన్నారు?”


ఒక పండితుడు అన్నాడు, “అందులో రాస పంచాధ్యాయి కనుక లేకపోయి ఉంటే, శ్రీమద్భాగవతం అద్భుత గ్రంథం అయ్యుండేది”.


అందుకు స్వామివారు చిన్నగా నవ్వి, “రాస పంచాధ్యాయిని పఠనము-శ్రవణము-మననము చేసిన తరువాతనే, నాకు సన్యాసం సిద్ధించిందని నిర్ణయించుకున్నాను నేను” అన్నారు.


విషయాన్ని అర్థం చేసుకోకుండా కేవలం చిన్నపిల్లలు మాట్లాడినట్టు ప్రవచనం చేసేవారికి ఇది ఒక పాఠం అని మనం అర్థం చేసుకోవాలేమో.


***********************************


పరమాచార్య స్వామివారు విష్ణుపురానికి ఏడెనిమిది సార్లు విజయం చేసుంటారు. శంకర జయంతి, నవరాత్రి వంటి ముఖ్యమైన సందర్భాల్లో స్వామివారు అక్కడ మకాం చేశారు.


మా ఊరి ముఖద్వారం వద్ద, వీధుల్లో మరియు దారుల కూడళ్ళలో స్వామివారిని స్వాగతించడానికి క్రమానులను ఏర్పాటుచేసేవారం. వాటిపై గీతలోని ముఖ్య శ్లోకాలను పెద్ద పెద్ద అక్షరాలతో రాసేవాళ్ళం. 


మహాస్వామివారు మేనాలో రావడంతో వాటిపై రాసినది స్వామివారికి కనిపించేది కాదు. రాత్రి పూజ అయిపోగానే, ఒక పెట్రోమాక్స్ గ్యాస్ లైటు తీసుకుని ఒక్కొక్క శ్లోకం చదువుతూ వెళ్ళేవారు. ఈ గీతా శ్లోకాలను ఎవరు నిర్ణయించారు అన్నప్పుడు మా గుండెల్లో చిన్న వణుకు. మెచ్చుకుంటారా? మందలిస్తారా? అని. 


చివరగా స్వామివారే అన్నారు, “అంతా బావుంది! నేను ఎలా ఉండాలో మీరు నాకు గుర్తు చేశారు” అని.


ఈ మాటలు వినగానే, మాకు దిగులు పట్టుకుంది. కాని తరువాత మాకు అర్థం అయ్యింది అది ఆరోపణ కాదు, అది కేవలం సరదాగా చేసిన స్వీయ విమర్శన మాత్రమే అని. ఆత్మ పరిశోధన చేసుకునే ఆత్మబలం అది. 

 

--- శ్రీమతి మోహన పంచపకేశన్, మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

*పితృ దోషము

 *పితృ దోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం*


పితృ దోషం' ...

మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో ...

అలాగే... 

తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి.

మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది.

అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు -

 మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే.

అదే

" పితృ దోషము "

ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం.

అందుకే ఈ పోస్టు పెడుతున్నాను.

పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది.

ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు.

వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.

పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాము...

చిన్న వారు అకాలమరణం పొందడం 

శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం.

అప్పులపాలు అవ్వడం లేనిపోని అపనిందల పాలు అవ్వడం మన ప్రమేయం లేకుండా

ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలను అనుభవించడం

మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం

ఇలా వీటన్నిటికీ కారణం పితృ దోషం కారణం

దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం.మోక్ష నారాయణ శ్రద్ద పూజ చేయవలయును.సంప్రదించవలసిన నెంబర్లు 9440544759/9491298422.


*సర్వేజనా సుఖినోభవంతు*

*గురుభ్యోన్నమః*