31, జనవరి 2025, శుక్రవారం

వివాహం గురించి

 🙏వివాహం గురించి సంక్షిప్త వ్యాసం 🙏

వివాహ శబ్ద నిర్వచనము వివాహ శబ్దములో 'వి' అనియు, 'వాహః' అనియు రెండు భాగములున్నవి. 'వి' అనుదానికి విశిష్టత అని యర్థము. 'వాహః' అనుదానికి పొందించుట అని యర్ధము.


ఈ విషయము వీరమిత్రోదయము - సంస్కార కాండలో ఇటుల విస్తరించి చెప్పబడినది.


“వివాహః | వహ ప్రాపణే ఇత్యస్మాద్దాతోః, భావే ఘజీ కృతే వహనం వాహః | విశిష్టో వాహః వివాహః | వైశిష్ట్యం చ ప్రతిగ్రహాద్యష్టవిధో పాయాన్యతమోపాయేన హోమాది సప్తపద నయనాంత కర్మాభి సంస్కృతత్వమ్ | తథా చ వివాహ పదార్డో (ద్విదల) ద్విఫల స్సిద్ధ్యతి |  స్వత్వోత్పాదనం  సంస్కారాధానం చేతి | తదేతత్ స్పష్టీకృతం పారస్కరేణ | పిత్రి ప్రత్తా మాదాయ గృహీత్వా ని మతి  వరం దదాతీత్యంతేన |


అనువఱకు ప్రతిగ్రహము మొదలుకొని చెప్పబడిన బ్రాహ్మాది పైశాచాన్త వివాహము లెనిమిదింటిలో నేవిధముగానైనను స్వీకరించిన కన్యతో హోమము మొదలుకొని సప్తపదివఱకు గల సంస్కారములచే సంస్కరింపబడుట అని వివాహశబ్దమున కర్థము. ఇది వివాహములో ప్రధానమని తాత్పర్యము.

యాజ్ఞవల్క్య స్మృతి ననుసరించి పూర్వీకులు ఎనిమిది విధాలైన వివాహాలను శాస్త్ర సమ్మతం చేసారు. ఈ వివాహాల వలన వదూవరులు సుఖ సంతోషాలు పొందుతారని తెలియజేసారు . అవి


1 బ్రాహ్మ :- విద్య మరియు ఆచారాలు గల వరునికి కన్యనిచ్చి చేసే వివాహం

2 దైవ :- యజ్ఞయాగాదులు జరిపించిన పురోహితునికి ఇవ్వవలసిన రుసుమునకు బదులుగా కన్యాదానం చేయడం

3 ఆర్ష :- కన్యాశుల్కంగా వరుడినుంచి ఒక జత ఆవు-ఎద్దులను తీసుకుని పెళ్ళి చేయడం

4 ప్రాజాపత్య :- కట్నమిచ్చి పెళ్ళి చేయడం

ఇంతవరకు చెప్పిన వివాహాలు మాత్రమే ధర్మ శాస్త్రం సమ్మతించినది.

5 ఆసుర :- వరుడు ధనమిచ్చి వధువును కొనడం

6 గాంధర్వ :- ప్రేమ వివాహం ఇది క్షత్రీయులకు మాత్రమే చెప్పబడింది  దుష్యంతుడు -- శకుంతల వివాహం ఇది కేవలం క్షత్రీయులకు ధర్మ సమ్మతమే.

7 రాక్షస :- వధువును ఎత్తుకెళ్ళి పెళ్ళి చేసుకోవడం

8 పైశాచ :- వధువును నిద్రిస్తున్నప్పుడో, మత్తులో ఉన్నప్పుడో ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా అపహరించడం

(వీటిలో మొదటి నాలుగు రకాలు ధర్మశాస్త్రాలు ఆమోదించినవి కాగా చివరి నాలుగు రకాలను ధర్మశాస్త్రాలు ఆమోదించలేదు.)


వివాహము స్త్రీ పురుషులలోని అపూర్ణత్వమును తొలగించి, వారికి పూర్ణత్వ మొసగజాలిన యొక పవిత్ర సంస్కారము, స్త్రీపురుషులిర్వురు దానికి రెండు పక్షములు. ఈ రెంటిని కలిపి - అనగా ఈ యుభయ శక్తులను సమన్విత మొనర్చి, ఈ సమన్వితశక్తిని ఏకలక్ష్యోన్ముఖము సేయుటయే ఈ సంస్కారముయొక్క ముఖ్యోద్దేశ్యము. ఈ సంస్కార ప్రయోజనము కేవలము ఇహలోకమునకే పరిమితముకాక, పరలోకమునకు గూడ ప్రాప్తమై యున్నది. కేవలము శారీర - ఐంద్రియ పరితోషము మాత్రము వివాహమునకు గమ్యముగాక, కర్తవ్యపాలనము, దైవారాధనము, అతిథిపూజ, సంతానప్రాప్తి, అధ్యాత్మికోన్నతి, పారివారిక, సామాజిక శ్రేయము నిశ్రేయము దీనికి గమ్యములు  కావుననే ఇది సర్వసంస్కారములలో నుత్తమ మయినదిగాను పవిత్రమయినదిగాను ఋషులు ప్రతిపాదించినారు.


“విశేషణ వాహయతీతి వివాహః” అనగా వివాహితులయిన దంపతులకు విశేషముగా గృహస్థ ధర్మములను వహింపఁజేయు సంస్కార విశేషమునకు వివాహము అని పేరు (చెప్పినారు). దీనికి పాణిగ్రహణమని వ్యవహారము గలదు. ఈ సంస్కార విశేషము ప్రత్యక్ష ప్రయోజనము, పరోక్ష ప్రయోజనము ఉభయప్రయోజనము నయి యున్నది. ఇట్టి ప్రయోజనములతోగూడిన సంస్కార జనక క్రియా కలాపము వివాహమని సారాంశము.


హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైంది. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్లి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా విభేదాలు తలెత్తినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం వివాహానంతరం స్త్రీ పురుషులకు అనేక సంప్రదాయక విధులు నిర్వహించే అర్హత కలుగుతుంది

వివాహం కానివారు, వివాహానంతరం అనేక కారణాలతో విడిపోయిన స్త్రీ, పురుషులు సంప్రదాయక కార్యక్రమాలను నిర్వహించడానికి అనర్హులని హిందూ ధర్మశాస్త్రం వివరిస్తుంది. దంపతులైన స్త్రీ పురుషులు మాత్రమే సంప్రదాయక విధి నిర్వహణకు అర్హులౌతారు. కాబట్టి హిందూ సంప్రదాయంలో వివాహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తీర్ధయాత్రల సమయంలో చెప్పే సంకల్పం, దేవతామూర్తుల కల్యాణం, సత్యనారాయణ వ్రతం, హోమం, యజ్ఞం, యాగం లాంటివి నిర్వహించాలంటే గృహస్థు ధర్మపత్ని సమేతంగా జరపాలనే నియమం ఉంది. వివిధ కులాలను బట్టి, ప్రాంతాలను బట్టి కొద్దిపాటి తేడాలున్నప్పటికీ, స్థూలంగా భారతదేశంలో జరిగే హిందూ వివాహాలన్నీ ఒక పద్ధతిలోనే సాగుతాయి.

 సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కోపంతో మాట్లాడితే

 🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏               🔥 కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు..అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతావు..అనవసరంగా మాట్లాడితే అర్ధన్ని  కోల్పోతావు..అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు.. అబద్దాలు మాట్లాడితే పేరును కోల్పోతావు.. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తావు🔥జీవితంలో ఏదీ కోల్పోయినా పర్వాలేదు కానీ.. ఎదుటి వారు మన మీద పెట్టుకున్న నమ్మకం మాత్రం కోల్పోయేలా చేసుకోవద్దు.. ఎందుకంటే నమ్మకం ఒక్క సారి పొతే ఎంత ప్రయత్నించినా తిరిగి రాదు..జీవితంలో లెక్కలేనన్ని బంధాలు అవసరం లేదు..ఉన్న కొద్ది బంధలలో జీవం ఉంటే చాలు..జీవం లేని ఎన్ని బంధాలున్నా ఒక్కటే లేకపోయినా  ఒక్కటే🔥బియ్యం మరిగే పాలలో వేస్తే పాయసం అవుతుంది.. అదే మరిగే నీటిలో వేస్తే అన్నం అవుతుంది.. అదే బియ్యం బొగ్గుతో కాలిస్తే చేడుకి ఉపయెగించే పదార్థం అవుతుంది.. అదే బియ్యం పసుపులో కలిస్తే శుభానికి ఉపయెగించే అక్షితలు అవుతాయి.. మనం కూడా అంతే.. మనం నలుగురిలో కలిసే విధానం బట్టే మన యెగ్యత నిర్ణయించబడుతుంది🔥🔥మీ  *అల్లoరాజు భాస్కరరావు. శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్. D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593. 9182075510* 🙏🙏🙏

మేలిమిఁ గూర్చ,

 ఉ.మేలిమిఁ గూర్చ, జాతి కనిమేషుల వోలె తపించి, పేర్మితో

ఆలనకై కృశించుచు, శ్రమార్జితమౌ ధనధాన్య వృధ్ధికై

తాలిమిఁ దీర్చు కర్షకులు ధన్యులు, వారి సమాదరింపగా

పాలకు లెంచునట్లు పరిపాలన జేయఁ దలంచు భారతీ!!౹౹17


ఉ.భీతిఁ దొఱంగి ధర్మ పరిపీడిత దుష్కృత దుష్ట మార్గపుం

జేతల మించి, ఆప్తుల విశిష్ట మనోరథులైన ధార్మిక

త్రాతల కెంచి చేసిన అధర్మపు కర్మల దైవమెప్పుడే

రీతి సహింప నోర్చు, సమరింపక, భీకర భాతి భారతీ ౹౹ 18

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం  - ద్వితీయ - శతభిషం -‌‌ భృగు వాసరే* (31.01.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ఆహారపు రుచులు

 ఆహారపు రుచులు మరియు వాటివలన మానవ శరీరముకు కలుగు ఉపయోగాలు  - 


    రుచులు మొత్తం 6 రకాలు .  అవి 


  తీపి , పులుపు , ఉప్పు , చేదు , కారము , వగరు  అని 6 రకాలుగా ఉంటాయి. మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలో ఈ ఆరు రుచులు అంతర్లీనంగా ఉంటాయి. మనుష్య శరీరం నందు రోగాలు పుట్టుటకు మరియు రోగాలు తగ్గుటకు మనకి ఈ ఆరు రుచులు సమ్మిళితమైన ఆహారమే ప్రధాన కారణం .

        ప్రథమంగా ముందు మన ప్రాచీన ఆయుర్వేదం లో మానవ శరీరం గురించి

 మానవశరీరం నందు ఏడు చర్మములు , ఏడు ధాతువులు , ఏడు ఆశయాలు , ఏడు వందల శిరలు , అయిదు వందల పేశిలు , తొమ్మిది వందల స్నాయువులు , మూడు వందల ఎముకలు కాని చరకుడు వివరించిన దానిప్రకారం ఎముకలు మూడువందల ఆరు. పాశ్చాత్త్యా సిద్ధాంతం ప్రకారం రెండువందల పదియే కలవు. రెండు వందల పది సంధులు , నూట ఏడు మర్మస్థానములు , ఇరవైనాలుగు ధమనులు , మూడు దోషములు , మూడు మలములు , తొమ్మిది స్రోతస్సులు , పదహారు కండరములు , పదహారు సన్నని జాలములు అనగా సన్నని నరముల అల్లికలు , ఆరు కూర్చములు అనగా ఎముకల కట్టలు నాలుగు మరియు శిరల కట్టలు రెండు రకాలు . నాలుగు పెద్దతాళ్లు , ఏడు కుట్లు , పదనాలుగు ఎముకల కూటములు , పదనాలుగు సీమంతములు , ఇరువది రెండు శ్రోతస్సులు , రెండు ప్రేవులు , మూడున్నరకోట్ల రోమకూపములు.   ఇంత ఉత్క్రుష్టమైనది మానవశరీరం . నిద్రాహార విహారాలలో మార్పులు మరియు హెచ్చుతగ్గుల వలన శరీరంలో రోగాలు సంభవిస్తాయి.

           కొన్ని రకాల ద్రవ్యములను తినిన యెడల శరీరంలో రోగాలు నశించగలవు. కొన్నిరకాల ఆహారపదార్థాలను తినిన యెడల శరీరం నందు కొత్తకొత్త రోగాలు పుట్టును . అసలు రోగం అంటే ఏంటో మీకు తెలియచేస్తాను .శరీరధారకములు అగు వాత, పిత్త, శ్లేష్మములలో ఉండవలసిన ప్రమాణం కంటే హెచ్చుతగ్గులు ఉండుటయే రోగం . 

          మనం తీసుకునే ప్రతి ఆహారం 6 రకాల రుచులతో సమ్మిళతం అయి ఉంటుంది అని చెప్పాను కదా .  ఇందులో మొదటివగు తీపి , పులుపు , ఉప్పు ఇవి వాత దోషమును పోగొట్టును . చేదు , కారం , వగరు ఇవి కఫాన్ని హరించును . వగరు, చేదు , తీపి రసములు పిత్తదోషమును హరించును . ఆహారం జీర్ణం అయిన తరువాత వేడిచేయుట , చలువచేయుట అను రెండు విధాలుగా మాత్రమే ఉండును.  


  మధురరస గుణములు  - 

   తీపిగా ఉన్న పదార్థాలను తినటం వలన , పుట్టినప్పటి నుండి అలవాటు పడిన సప్త ధాతువులకు బలం కలుగును.

   చిన్నపిల్లలకు , ముసలివారికి , దెబ్బలు తగిలిన వారికి , బలం క్షీణించినవారికి , రక్తమాంసములు క్షీణించినవారికి తీపి పదార్థాలు చాలా హితకరం అయినవి.

   శరీరవర్ణం పెరుగుటకు , వెంట్రుకల వృద్ధికి , ఇంద్రియ బలం పెరుగుటకు , ఓజస్సు వృద్ది చెందుటకు ఈ మధుర రసం ఉపయోగపడును.

   శరీరంకి మంచి పుష్టిని ఇచ్చును.   కంఠస్వరం పెరుగును .   బాలింతలగు స్త్రీలకు ఎండిపోయిన పాలను వృద్ది పరుచును.   ఆయుష్షుకు కారణం , ప్రాణరక్షణకరమైనది .   వాత, పిత్త, విషాలను హరించును . 


  గమనిక  - 

          ఈ మధుర రసమును అధికంగా వాడిన మేధస్సుతో కూడిన కఫ వ్యాధులను పుట్టించును .శరీరం లావెక్కును . అగ్నిబలం తగ్గును అనగా జఠరాగ్ని తగ్గును. ఇరువది అగు మేహరోగాలు జనించును. అర్బుదం అనగా గడ్డతో కూడిన కేన్సర్ వచ్చును.


 ఆమ్లరసం గుణములు  - 

   ఈ ఆమ్లరసం ( పులుపు ) అగ్నిదీప్తి అనగా జఠరాగ్ని పెంచును.   హృదయముకు బలమునిచ్చును.

   ఆహారాన్ని అరిగించును.   రుచిని పుట్టించును .    శరీరం నందు వేడి కలుగచేయును .   మలాన్ని విడిపించును.   తేలికగా జీర్ణం అగును.   కడుపులో బిగిసి ఉన్న వాయువుని బయటకి వెడలించును.


  గమనిక  - 

        దీనిని అధికంగా వాడినచో కఫమును పెంచును , రక్తపిత్త వ్యాది అనగా నోటివెంట రక్తం పడువ్యాధిని పుట్టించును , శరీర అవయవాల పట్టు సడలించును , తిమ్మిరి , భ్రమ , దురదలు , పాండురోగం , విసర్పవ్యాధి , శరీర భాగాల్లో వాపు , దప్పిక, జ్వరం వంటి వ్యాధులను పుట్టించును . 


   లవణ రస గుణాలు  - 

   ఈ లవణ రసం శరీరంలో స్తంభించిన దోషాన్ని విడిపించి బయటకి పంపును .    జఠరాగ్ని పెంచును.

   చమురు కలది.   చెమట పుట్టించును .    తీక్షణమైనది , రుచిని పుట్టించును .    వ్రణములు అనగా గడ్డలు పగిలేలా చేయును .   శరీరం నందు మలినపదార్థాలు విడగొట్టి బయటకి పంపును 


  గమనిక  - 

           ఈ లవణ రసాన్ని అధికంగా వాడటం వలన వాతారక్త వ్యాధిని కలిగించును . బట్టతలను తగ్గించును .  వెంట్రుకలు నెరిసిపోవును , శరీరం ముడతలు పడును. దప్పికను కలిగించును , కుష్టు రోగము కలుగును. విసర్పి రోగం కలుగును. బలమును  హరించును .


   తిక్త ( చేదు ) రస గుణాలు  


ఇది అరుచిని హరించును .   శరీరం నందలి క్రిములను , దప్పిక , విషమును , కుష్టు , మూర్ఛని హరించును .    మూర్చ, జ్వరాలను , శరీరం నందలి మంటలను, వేడిని , కఫాన్ని హరించును .

   శరీరం నందలి వ్రణాల నుండి కారు దుష్టజలాన్ని , మాంసం నందలి కొవ్వుని కరిగించును. ఎముకల్లో మూలుగను , శరీరంలో మలమూత్రాలను హరించును .   తేలికగా జీర్ణం అగును.   బుద్దిని పెంచును.

   చమురు హరించును .   స్త్రీల పాలు యందు మరియు కంఠం నందలి దోషాలు పొగొట్టును.


  గమనిక  - 

          అధికంగా తీసుకున్న ధాతువులను క్షీణింపచేసి వాత రోగాల్ని పుట్టించును .

 

  కటు ( కారం ) రసం గుణాలు  - 

   ఈ కటు రసం కంట రోగం , కుష్టు , వాపు పోగొట్టును .   వ్రణములు తగ్గించును    శరీరం నందలి దుష్ట జలాన్ని , కొవ్వుని హరించును .    జఠరాగ్ని పెంచును.   అన్నమును జీర్ణింపచేయును .   రుచిని పుట్టించును .   సన్నని నరములలోని దోషాలు కూడా శోధించి వ్యర్థాలను బయటకి పంపును .

   నవరంధ్రాలు ను తెరిపించును.   కఫాన్ని హరించును .


  గమనిక  - 

        దీనిని అతిగా తీసుకున్నచో దప్పిక పుట్టించును . శుక్రమును , బలాన్ని నశింపచేయును. మూర్చని కలిగించును. అంగములు ముడుచుకున్నట్లు చేయును . వణుకు పుట్టించును .నడుము , వీపు నందు నొప్పి కలుగచేయును .


  కషాయ ( వగరు ) రస గుణములు  - 

   వగరు పదార్థం పిత్తశ్లేష్మాలని హరించును .   రక్తాన్ని శుద్దిచేయును .   నొప్పిని కలిగించును.   వ్రణాలను మాన్చును.   శరీరం నందలి దుష్ట జలాన్ని తీసివేయును .   ఆమమును స్తంభింపచేయును .   మలాన్ని గట్టిపరుచును.   చర్మాన్ని నిర్మలంగా చేయును .

 

  గమనిక  - 

       దీనిని అతిగా సేవించిన మలబద్దకం , కడుపు ఉబ్బరం , గ్యాస్ , గుండెజబ్బులు , దప్పిక, లివరు చిక్కిపోవుట, సంభోగ శక్తిని నశింపచేయును . మలబద్దకం కలిగించును.

       పైన చెప్పిన విధంగా మనం తీసుకునే ఆహార పదార్థం యొక్క రుచిని బట్టి మన ఆరోగ్యం అధారపడి ఉండును.