22, ఏప్రిల్ 2021, గురువారం

టీ

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

టీ

“ఏమన్నా తాగుదామా” అడిగా మా ఆవిడని, ఇద్దరిలో ఎవరికి తాగాలనిపించినా ఇలా అడగటం పరిపాటి.

“సరే టీ కలపండి” టాబ్ లోంచి మొహం తియ్యకుండానే అంది మా ఆవిడ. 

యుద్ధానికి బయలుదేరిన ఉత్తర కుమారుడిలా, అర్జనుడు లేకుండానే వంటింట్లోకి బయలుదేరా. అయ్యా టీ పెట్టటానికి ఇంత బిల్డప్పా అంటే, మరి పెళ్ళానికి నచ్చేలా పెట్టడం అంటే మాటలు కాదు.

నెమ్మదిగా పాల పాకెట్ ని కట్ చేసి, జాగ్రత్తగా గిన్నెలో పోశా. ఏంటో, ఎంత జాగ్రత్తగా పోసినా సగం పాలు వొలికి పోతాయి ఎప్పుడూ అంతే. గబగబా దొరికిన నాప్కిన్ తో అంతా శుభ్రం చేసి, మల్లీశ్వరి సినిమా లో కుండీ గుద్దెసి, శుభ్రం చేసిన తరువాత బ్రహ్మానందం లా విజయగర్వం తో ఒక నవ్వు నవ్వు కున్నా.

మా ఆవిడ సోఫా లోంచి, “మీకు పాకెట్ లోంచి పాలు తియ్యడం రాదు, జాగ్రత్త!! గిన్నెలో పాకెట్ పెట్టి కట్ చేసుకోండీ, లేకపోతే నేను రానా”  

“అక్కర్లే, జాగ్రత్తగానే తీశా” పూర్తి నమ్మకమైన గొంతు తో చెప్పా. ఏమి విచిత్రమో, అంత నమ్మకం గా చెబితే మా ఆవిడకి అనుమానం వచ్చేస్తుంది.

“ సరే వలికినా మీరు తుడవకండి నేను చూసుకుంటా” మా ఆవిడ నాకు తెలుసులే అన్నట్టు గా.

“టీ పొడి ఎక్కడుంది”

“పోపుల డబ్బా పక్కన”

టీ డబ్బా వెతికి ,టి పొడి తీసే లోపు వెధవ పాలకి ఖంగారు వచ్చేసింది, స్టోవ్ అంతా పొంగి పోయాయి.

మళ్ళి మన నాప్కిన్ తో మరోసారి పొంగిన పాలు, స్టోవ్, శుభ్రం చేసి; పాలలో టీ పొడి, పంచదార వేసి, ఈసారి స్టౌ సిమ్ లో పెట్టి జాగ్రత్తగా చూస్తూ కూర్చున్నా.  

“స్టోర్ రూమ్ లో మామిడి కాయ ఒకటి తీసి కొయ్యండి. ముక్కలు సరిగ్గా తరగండి అందంగా. లేక పోతే నాకు ఇవ్వండి నేను తరుగుతా.” అంది మా ఆవిడ పైకి మెట్లేక్కుతూ.

వెళ్ళి మామిడికాయ లు ఒక రెండు తీసి, శుభ్రం గా కడిగి, సన్నగా అందం గా ముక్కలు చేసి, ఉప్పు కారం సన్నగా చల్లి రెండు ప్లేట్లలో సద్ది ఒకటి మా ఆవిడ కిచ్చా.

“టీ ఏది” అడిగింది మా ఆవిడ,

“తెస్స్తున్నా” అని జాగ్రత్త గా మేనేజ్ చేసి, మార్చి పోయిన టీ చూడటానికి వంటింట్లోకి పరిగెత్తా.

ఇంకేముంది ముచ్చటగా మూడోసారి పొంగి మిగిలిన టీ నాకేసి చూస్తోంది గిన్నె లోంచి.

రెండు చిన్న కప్పులలో ఎలాగో అలా వడపోసి, సద్ది ముందు మా ఆవిడ చేతికి టీ అందించా.

“చాలా బావుంది టీ!!, కొద్దిగానే కలిపారే “ చిరాగ్గా అంది మా శ్రీమతి క్వాంటీటీ సరిపోక.

నెమ్మదిగా నసిగా, “పాలు వలికాయి” అని.

“అనుకున్నాను, ఇందాకటి నుండి పాల వాసన తెగ వచ్చేస్తుంటే, టీ కూడా వలికిందా, సరే వచ్చి కూర్చోండి, అయినా నాది బుద్ది తక్కువ మిమ్మల్ని కలపమనడం” అంటూ వంటింట్లో కి పరిగెట్టింది అర్జనుడిలాగా .  

ఎలా అయినా టీ కాయడం వేళాకోళం కాదండీ బాబు. గొప్ప ఆర్టు.!!! అందరికీ రాదు.


సేకరణ:- పుసులూరి రమేష్.

మనోధైర్యం*

 *మనోధైర్యం*


దాదాపు పాతిక సంవత్సరాల క్రితం ఒక కుటుంబం, జీవనోపాధి కోసం అమెరికా నుంచి ఆస్ట్రేలియా వెళ్ళింది. వారికి ఒక అందమైన కొడుకున్నాడు. యుక్తవయసులో అతడు ఎంతో ఆకర్షణీయంగా వుండేవాడు. సర్కస్ లో ట్రెపీజ్ ఆర్టిస్టుగా చేరాలని అతని అభిలాష. ఎంత ఎత్తు మీద నుంచి అయినా అవలీలగా దూకేవాడు.


ఒకరోజు, ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో అయిదుగురు దొంగలు అతడిపై కత్తులతో దాడి చేసారు. అయితే, అందరిలా అతడు భయపడి పర్సు ఇచ్చెయ్యలేదు. ఎదుర్కొన్నాడు. ఆ ఫలితంగా వారు అయిదుగురూ అతడిని నిర్దాక్షిణ్యంగా చావబాదారు. అరగంట తరువాత అక్కడ గస్తీ తిరిగే పోలీసులు, రోడ్డుమీద రక్తపుమడుగులో పడివున్న అతడిని చూసి, శవమనుకుని, మార్చురీకి తీసుకెళ్ళారు. అక్కడి డాక్టర్లు కొసప్రాణం వుందని నిర్ధారించారు. కొత్తగా చేరిన నర్సు అతడి ఆకృతి చూసి స్పృహ తప్పిపడిపోయింది.

అతడి మొహం స్థానంలో రక్తపు ముద్ద వుంది. ముక్కు వేలాడుతూంది. ఒక కనుగుడ్డు, సాకెట్ లోంచి బయటకొచ్చి నిర్జీవమైపోయింది. పుర్రె రెండు చోట్ల బ్రద్దలై వుంది. శరీరంపై పదహారు ఫ్రాక్చర్లున్నాయి. దవడ పక్కకి తిరిగిపోయింది. మొత్తం పళ్ళన్నీ ఊడిపోయాయి. అతడు మనిషి అవటానికి ఏడాది పట్టింది. అయితే, అతడికి ముక్కులేదు. ఒక కన్నులేదు. పళ్ళు లేవు. ఒకప్పటి అందమైన కుర్రవాడు, కేవలం "కదిలే మాంసపు ముద్ద"లా మిగిలాడు. అందరూ అతడివైపు కనీసం చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. చూడగానే ఒళ్ళు గగుర్పొడిచేటంత భయంకరమైన ఆకృతి. ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. చివరకు, ఏ కంపెనీలో అందమైన ట్రెపీజ్ ఆర్టిస్టుగా చేద్దామనుకున్నాడో, ఆ కంపెనీలో సర్కస్ ఫీట్లు చెయ్యాల్సి వచ్చింది. సర్కస్ లో ప్రేక్షకులకి అతడిని *A MAN WITH NO FACE* గా అనౌన్స్ చేసేవారు.


అసలెవరూ అతడిని అక్కడ ఒక మనిషిగా గుర్తించేవారు కాదు. సరి అయిన తిండి లేదు. తిండివున్నా, తినటానికి పళ్ళు లేవు. అవి కట్టించుకోవటానికి డబ్బు లేదు. ఇంత జరిగినా, అతడు తన చిన్నప్పటి అలవాటుని పోగొట్టుకోలేదు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చర్చికెళ్ళి ప్రశాంతంగా కూర్చునేవాడు. గంటల తరబడి 'ధ్యానం'లో లీనమయ్యేవాడు. దానధర్మాలు చేసేవాడు. ఇలా రెండేళ్ళు గడిచాయి. అతడిని ప్రతిరోజూ చూస్తున్న చర్చి ఫాదర్ కి జాలీ అభిమానం కలిగాయి. మనిషి స్వరూపాన్ని పోగొట్టుకున్నా, మానవ స్వభావాన్ని పోగొట్టుకోని అతడికి, సాయం చేద్దామనుకున్నాడు.


ఆస్ట్రేలియాలోని ప్రముఖ ప్లాస్టిక్ సర్జెన్, ఆ ఫాదర్ కి ఆప్తమిత్రుడు. డెంటిస్ట్ ఖర్చులు చర్చి భరించింది. అతడి మొహం మీద ఆర్నెల్లపాటు ఎనిమిది ఆపరేషన్లు జరిగాయి. గాజు కన్ను అమర్చారు. దవడ వంకర సరిచేసి, ఒక రూపుకి తీసుకువచ్చారు. క్రమక్రమంగా అతడికి ఒక ఆకారం ఏర్పడింది. వివాహం జరిగింది. పిల్లలు పుట్టారు. అతడు కథానాయకుడిగా, పై సంఘటన ఆధారంతో A MAN WITHOUT A FACE అని సినిమా తీసారు. హిట్టయింది. ఆ తరువాత వరుసగా సూపర్ డూపర్ హిట్స్ MAD MAX, BRAVE HEART, LETHAL WEAPON సినిమాలు వచ్చాయి. అతనెవరో మీలో కొందరికి తెలిసే ఉంటుంది.

అతడు *హాలీవుడ్ నెం. 1 నటుడు మెల్ గిబ్సన్.* పది మిలియన్ డాలర్లకధిపతి. ఇప్పటికీ అతడు ఖాళీ సమయాల్లో అదే చర్చి దగ్గర దానధర్మాలు చేస్తూ కనపడతాడు. మనోధైర్యం అంటే అది.


మనం చాలా చిన్న సమస్యలు చూసి బెంబేలు పడతాం. దానికి కారణం, నిజమైన సమస్యలు తెలియక....!! చాలామంది ఈ వాదనని ఒప్పుకోరు. *ఎవరి సమస్య వారికి పెద్దది* అంటారు. ఇది ఆత్మ సమర్థన. 'విచారం' పట్ల వుండే ప్రేమ. 


కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటుందని అందరూ చెబుతారు కానీ కొబ్బరికాయలోకి ఆ నీళ్లు ఎలా వచ్చాయో లేక వస్తాయో చెప్పేవాడే మేధావి, అలాగే సమస్యను పరిష్కరించుకోమని చెప్పడం చాలా తేలిక కానీ ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో చెప్పడమే చాలా కష్టం.

అలా చెప్పగలిగే శక్తి మరియు 

మేధావితనం కేవలం మన మనసు కు మాత్రమే ఉంటుంది. 


*సమస్యతో పాటు పరిష్కారం కూడా పురుడుపోసుకుంటుంది*.సమస్యను చూస్తూ కూర్చుంటే పెద్దదిగా కనిపిస్తోంది కానీ దాన్ని సాధించడం మొదలుపెడితే చాలా చిన్నదిగా కనబడుతుంది.


అర్జునుడు నిర్వేదాన్ని పోగొట్టడానికి కృష్ణ భగవానుడు గీతను బోధించాడు. రామకృష్ణ పరమహంస కన్నీళ్లు తుడవడానికి కాళీ మాత దర్శనం ఇచ్చింది.


అలాగే మన సమస్యల పరిష్కారానికి మన మనసు మంచి మార్గని చూపిస్తుంది. 

మనోధైర్యాన్ని మించిన మందు గాని, అంతకంటే విలువైన ఆస్తి గాని మరేది ఈ ప్రపంచంలో లేదు ఇది అందరికీ తెలిసిన సత్యం.


సమస్యతో సహచర్యం చేయడం తప్ప వేరే మార్గం లేదు మనకి, దానితోనే ఉంటూ దానితోనే పోరాడుతూ,మనల్ని మనం విజయ తీరాల వైపు నడిపించు కోవాలి.


*అపజయానికి కృంగి పోక విజయానికి పొంగిపోక తన గమ్యం వైపు పైనుంచి వాడే పరిపూర్ణమైన వ్యక్తి గా ఎదుగుతాడు*


🌹 *డా. ఓ. మహమ్మద్ రఫి* 🌹

మంచి కథలు గ్రూప్ లో ప్రవేశం కొరకు క్రింది అవకాశం ఉపయోగించుకోవవచ్చును.

*ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక తమిళనాడు మరియు అమెరికా మెత్తం 31 గ్రూపులు ఉన్నాయి (7000 మంది సభ్యులు వున్నారు)* అన్నింటిలో ఒకే కధ పంపించబడుతుంది. 

 👇

https://chat.whatsapp.com/CQ2af235UzgLjnB7EbKND7

అఖండ భారతాన

 ఒకానొకనాడు, ఈ విశ్వ జీవజాలం అతి పవిత్ర భావనతో ఆస్వాదించినది, " అఖండ భారతాన అపౌరుషేయంగా వెలువడ్డ వేద నాద సుస్నేహ గానామృతం ! సువిశాల విశ్వంలో, పవిత్ర భారతావనికి నాటికీ నేటికీ, ఏనాటికైనా చక్కటి మైత్రీ భావనాత్మక దృష్టి సుస్థిరమని గ్రహించాల్సిన సమయమిది ! విశ్వ వ్యాప్తమైన ఆయుర్వేద వైద్య విజ్ఞానపు మూలాలు అదృష్టవశాత్తు, పవిత్ర భరతఖండంలో ఏనాడో వెల్లివిరియడం, సకల జీవుల నిత్య చైతన్య స్ఫూర్తిగా, " సువిశాల విశ్వ సంక్షేమాత్మక, సంరక్షణకై, సంపూర్ణ ఆయురారోగ్య సంపత్తిని " జీవకారుణ్య దృష్టితో  పవిత్ర వేద విజ్ఞానం, " విశ్వ జీవరాశికి నిరంతరాయంగా అందచేయడం " మన అదృష్టం ! మన పండితులు, మన దేశపు పండుగలన్నిటినీ, యావత్ విశ్వ సంక్షేమాత్మక దృష్టిలో జరుపుకోవాలని అనునిత్యం కోరుతుండడం ఈ భరతభూమి గొప్పదనం ! 🕉️🌹🤝                                                              సువిశాల విశ్వంలో, ప్రతి వ్యక్తీ, ప్రస్తుత క్లిష్ట సమస్యలకు సత్వర పరిష్కార సిద్ధికై, తమ వంతు కృషి సల్పడం అత్యంత కీలకమైన విషయంగా భావించి ముందుకు అడుగు వేయాల్సిన తరుణమిది ! యావత్ విశ్వ జీవరాశి, సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆయురారోగ్య సంపత్తిని త్వరితగతిన పొందాలని మనఃపూర్వకంగ ఆశిస్తూ........                             " స్వస్తిశ్రీ  చాంద్రమాన శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు "                                                                            🌹🌸🌺🌻🌍🕉️                                                                    గుళ్లపల్లి ఆంజనేయులు

ప్రాణం ఏ జీవితం ఒకటే* 🙏

 *ప్రాణం ఏ జీవితం ఒకటే* 🙏


ఒక కోటీశ్వరుడు నడుచుకుంటూ వస్తూఉండగా ఒక ఇంటి ముందుకు రాగానే  తన కాలి చెప్పులు తెగిపోయాయి 

ఆ ఇంటిలోని యజమానిని పిలిచి 

నా చెప్పులు తెగిపోయాయి ఇక్కడ వదిలి వెళ్తానండి 

పారేయొచ్చు కానీ కొత్తవి అందుకే మనసు రావట్లేదు 

రేపు పనివారిని పంపించి తీసుకువెళతాను అని అడిగాడు 

అందుకు ఆ ఇంటి యజమాని 

అయ్యా మీరు ఎంత పెద్ద కోటీశ్వరులు మీ చెప్పులు మా ఇంటి ఆవరణలో ఉంటె మాకే గౌరవం అని చెప్పాడు 

ధనవంతుడు తన పనిలో పడి ఆ విషయాన్నీ మరిచిపోయాడు 


ఒకరోజు హఠాత్తుగా ఆ ధనవంతుడు చనిపోయాడు 

అయన శవం ఊరేగింపు జరుగుతున్నది భారీ వర్షం మొదలయింది 

ఎవరూ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి 

అయన ఆరోజు చెప్పులు వదిలిన ఇంటి ముందు శవాన్ని తీసుకొచ్చి ఆపి ఆ ఇంటి యజమానిని పిలిచారు 


వర్షం ఎక్కువగా ఉందండి వర్షం ఆగే వరకు శవాన్ని మీ ఇంటి ముంగిట కాసేపు ఉంచుకుంటాం అని అడిగారు అందుకు ఆ ఇంటి యజమాని కోపం కట్టలు తెంచుకున్నాయి 


మొదట శవాన్ని తీయండి ఎవరి ఇంటి శవాన్ని ఎవరింటి ముందు ఉంచేది మీరు అని కసురుకున్నాడు 


అంతే అండి ప్రాణం ఉన్నంత వరకు చెప్పులకున్న విలువ కూడా ప్రాణం పోయాక ఉండదు నీ వెనుక ఎంత డబ్బు ఉన్నా 


డబ్బుకు విలువ ఎక్కువ అనుకుంటారు కానీ నిజానికి ప్రాణంకే విలువ ఎక్కువ

ప్రాణం పోయాక కోట్లు ఉన్నా వృధానే 


లోకాన్ సమస్తాన్ శుఖినోభవంతూ

తెలుగు బ్రాహ్మణులు

 తెలుగు బ్రాహ్మణులు


వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న బ్రాహ్మణులలో తెలుగు బ్రాహ్మణులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కల్హణుని 'రాజతరంగిణి'లో పేర్కొన్న 'పంచ ద్రావిడుల'లో తెలుగువారు ఒకరు. ఒక జాతి సంఖ్యాపరంగా విస్తృతం అవుతున్నప్పుడు, వారు భాషలవారీగా, ప్రాంతాలవారీగా, పాటించే విధానాలు, ఆచారవ్యవహారాల ఆధారంగా పలు తెగలుగా విడిపోవడం సహజం. సాంఘికంగా ఇలా వచ్చే అనేక మార్పులలో భాగంగానే, తెలుగు మాట్లాడే ప్రాంతాలలోని బ్రాహ్మణులు 'తెలుగు బ్రాహ్మణులు'గా పరిగణనలో ఉండటం సహజం. వీరుకూడా, కాలానుగతంగా వచ్చే మార్పుచేర్పులకు లోనవుతూ, అనేక విధాలైన పరిణామాలకు గురి అవుతుంటారన్నది గుర్తించాలి. 


1891లో ప్రచురితమైన ఒక గ్రంధం ప్రకారం, తెలుగు బ్రాహ్మణులలో స్మార్తులు అత్యధికులు. మధ్వులు ఉన్నప్పటికీ వారి సంఖ్య పరిమితం. మధ్వులలోనూ కన్నడ ప్రాంతాలనుంచి వచ్చి, తెలుగు ప్రాంతాలలో స్థిరపడినవారే అధికం. 


ఆ పుస్తకం ప్రకారం, తెలుగు స్మార్త బ్రాహ్మణులలో కానవస్తున్న తెగలు అనేకం ఉన్నప్పటికీ, వాటిలో ప్రధానమైన తెగలు ఇవి:


1. తెలగాణ్యులు :


నైజామ్‌ ప్రాంతంలో, నాటి నిజామ్‌ దురంతాలను భరించలేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు. వీరు ముఖ్యంగా నేటి కరీమ్‌నగర్‌ జిల్లాలోని ధర్మపురి, మంథని, కాళేశ్వరం, చెన్నూరు ప్రాంతాలకు చెందినవారు.


2. మురికినాడు :


ఇది చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం ప్రాంతమని 'కాకతీయ సంచిక'లోని 168వ సేజీ పక్కనగల చిత్రపటం ద్వారా తెలుస్తోంది. ఈ మురికినాడులోని కొంత ప్రాంతాన్నే 'తొండపినాడు', 'తొండపి మండలం' అనికూడా అనేవారు. ('ముల్క్‌' అంటే 'దేశం' అని అర్థం. నైజామ్‌ ప్రాంతానికి ఒకప్పుడు 'ముల్క్‌' అనే పేరుండేది. ఇది 'ముల్కి నాడు' శబ్దం అపభ్రంశం అయి, 'మురికినాడు' అయిందన్న భావన తప్పుగా తోస్తోంది.) 


3. వెలనాడు - వీరిలోనూ 3 తెగలు. అవి:


             1. శుద్ధ వెలనాడు, 2. కాకిమాని వెలనాడు, 3. పెరుంబటి వెలనాడు.


(వీరినే 'వెలినాటి బ్రాహ్మణులు' అంటారనీ తెలుస్తోంది. వీరిలోని 3 శాఖలనూ 1. శుద్ధ వెలినాడు, 2. పేరుంబేడి వెలినాడు, 3. వెలినాడు బ్రాహ్మణులుగా పేర్కొంటున్నారు. మొత్తంమీద వీరందర్నీ 'వెల్నాటి బ్రాహ్మణులు' అనడమూ ఉంది.)  


4. కాసలనాడు :


ఒకప్పటి 'కోసల దేశం' నేటి 'మధ్యప్రదేశ్‌' అనుకోవచ్చు. అప్పటి దక్షిణ కోసల దేశం అయిన జబల్‌పూర్‌, రేవా, బిలాస్‌పూర్‌, సాగర్‌, సాత్నా వంటి ప్రాంతాలనుంచి కొన్ని మతపరమైన కారణాల వల్ల మన ప్రాంతాలకు వలస వచ్చినవారు వీరు. వీరినే 'కోసలనాటి బ్రాహ్మణులు' అనేవారు. 


5. కరణ కమ్మలు -


         1. బాల కరణాటి బ్రాహ్మణులు, 2. కొలింగేటి బ్రాహ్మణులు, 3. ఓగేటి బ్రాహ్మణులు. 

(వీరిలోనూ 1. బగల్నాటి కరణ కమ్మలు, 2. కొవిజేటి కరణ కమ్మలు. 3. ఓగోటి కరణ కమ్మలు అని 3 శాఖలున్నట్లు కూడా ఉంది. ఇవి పౖౖెన పేర్కొన్న 3 శాఖల పేర్లే అనిపిస్తోంది.)


6. వేగినాడు


7. తొండ్రనాడు


(ఇది బహుశా నేటి తిరుపతి ప్రాంతం కావచ్చు. తిరుమాండ్యం శాసనం, కపిలేశ్వర శాసనాల ఆధారంగా నేటి తిరుపతి ప్రాంతానికి ఒకప్పుడు 'తుండీర మండలం', 'తుండక విషయం', 'తుండైనాడు', 'తొండమనాడు' అనే పేర్లుండేవని తెలుస్తోంది. ఈ పేర్లలోంచే 'తొండ్రనాడు' కూడా రూపొంది ఉండవచ్చు.) 


8. ఔదమనాడు


9. కోనసముద్ర ద్రావిడులు 


10. ఆరామ ద్రావిడులు

1891లో ప్రచురితమైన ఆ పుస్తకం ప్రకారం పైన పేర్కొన్న పది తెగలవారూ 'వైదికులు'. వీరిలో కోనసీమ ద్రావిడులు, ఆరామ ద్రావిడులూ మొదట తమిళనాడు ప్రాంతానికి చెందినవారైనా, తెలుగునాడుకు వచ్చి, ఇక్కడ స్థిరపడ్డారు. క్రమంగా వీరి భాష, కట్టూబొట్టూ అన్నీ పూర్తిగా తెలుగు సంప్రదాయానికి అనుగుణంగా మారిపోయాయి. ఈ రెండు తెగలవారికీ తెలుగు బ్రాహ్మణులలో విశిష్టస్థానాలు ఉన్నాయి. తమిళ ప్రాంతంనుంచి వచ్చి, తెలుగు ప్రాంతంలో స్థిరపడిన కారణంగా, వీరిని కొన్నిచోట్ల 'సంకీర్ణులు' అని వ్యవహరించటంకూడా ఉంది. 


ఆరామ ద్రావిడులు

 ఆరామ ద్రావిడుల గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం: 


ఆరామ ద్రావిడులనే కొందరు 'తూర్పు ద్రావిడులు', 'కోస్తా ద్రావిడులు', 'కోనసీమ ద్రావిడులు', 'పేరూరు ద్రావిడులు' అనడమూ ఉంది. ప్రాథమికంగా ఇవన్నీ వారు స్థిరపడిన ప్రాంతాలకు సంబంధించిన పేర్లేనన్నది స్పష్టం. తూర్పు ద్రావిడులు ప్రధానంగా మన కోస్తాకు ఆవల ఉన్న ఉత్కళ ప్రాంతం, తూర్పు ఆంధ్రదేశంలోని వారు. కోస్తా ద్రావిడులు కోస్తా జిల్లాలలో స్థిరపడినవారు. ఇక, కోనసీమ ద్రావిడులు మన కోనసీమలో స్థిరపడినవారు. ఈ ఆరామ ద్రావిడులలో పేరూరు ద్రావిడులనే వారూ ఉన్నారు.


ఆరామ ద్రావిడులు ఆంధ్రదేశానికి రావటం వెనుక కొన్ని కథలు ఉన్నాయి. జనజీవనచరిత్ర అంతా పలు సందర్భాలలో జరిగిన, జరుగుతున్నవలసల వివరమేనన్నది వాస్తవం. ఆరామ ద్రావిడుల కథా అంతే! ఒక కథనం ప్రకారం - చాళుక్యరాజైన రాజేంద్రచోళుడు, తన కుమార్తె అయిన అమ్మంగి దేవిని రాజమహేంద్రవర పాలకుడైన రాజరాజ నరేంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ సందర్భంలో, ఆయన తన కుమార్తెతోబాటుగా, 18 కుటుంబాల బ్రాహ్మణులను వేంగి రాజ్యానికి పంపాడు. ఈ 18 కుటుంబాలవారూ అసలు నాటి చాళుక్యదేశం (దాదాపు నేటి తమిళనాడు) లోని 'వేలంగమన్‌' అనే గ్రామానికి చెందినవారు. (ఇప్పుడు ఈ గ్రామం 'వలంగైమన్‌' పేరుతో తిరువరూర్‌ జిల్లాలో ఉంది.) రాజాజ్ఞ తలదాల్చి, వీరిలో కొందరు 'అగ్నిహోత్రం' ధరించి, కాలినడకన వేంగి రాజ్యానికి రాగి, మరికొందరు నావలమీద వచ్చారు. నావలమీద వచ్చినవారు సముద్రతీరంలోని 'కొనసీమ' లేదా 'కోనసీమ'కు చేరారు. వారే 'కోనసీమ ద్రావిడులు' అయ్యారు. ఇక, భూమార్గాన వచ్చినవారికి రాజరాజనరేంద్రుడు, ర్యాలి సమీపాన స్థలం ఇచ్చి నివాసం ఉండమన్నాడు. వారంతా అరవ ప్రాంతంనుంచి వచ్చిస్థిరపడిన కారణంగా, అక్కడ (ర్యాలిలో) ఉన్న గుట్టలను స్థానికులు 'అరవ దిబ్బలు'గా వ్యవహరించేవారని అంటారు. నేటికీ ర్యాలిలో అరవ దిబ్బలు ఉన్నాయి. 


అరవదేశంనుంచి ఇక్కడ స్థిరపడినవారిలో - నన్నయభట్టారకుడి శిష్యుడు నారాయణ భట్టు ముఖ్యుడు. 'శ్రీమదాంధ్ర మహాభారతం' ఆంధ్రీకరణంలో నన్నయభట్టుకు నారాయణ భట్టు చేసిన సహాయానికి మెచ్చిన రాజరాజ నరేంద్రుడు ఆయనకు నందంపూడి అగ్రహారాన్ని కానుకగా ఇచ్చారన్న కథా ఉంది. 


ఇక, చోళదేశంనుంచి వచ్చిన మరికొందరు, పలిమెలపాడు పాలకుడి అనుమతితో పేరూరులో స్థిరపడ్డారని అంటారు, వీరు అసలు తమిళనాడులోని 'పెరియ ఊర్‌' (పెద్ద ఊరు) నుంచి వచ్చారని, కనుక, తాము స్థిరపడిన ఊరికి అలాగే, 'పేరూరు' అని పేరు పెట్టుకున్నారని అంటారు. ఇక్కడి ద్రావిడులు 'పేరూరు ద్రావిడులు'గా సుప్రసిద్ధులయ్యారు.


వీరికి 'ఆరామ ద్రావిడులు' అన్న పేరు రావడానికి మరో కారణాన్ని శ్రీ చందూరి వేంకట సుబ్రహ్మణ్యం గారు తమ 'వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు' పుస్తకం (పేజీ 82)లో వివరించారు. మన రాష్ట్రంలో ఉన్న పంచారామాలు- ద్రాక్షారామం, భీమారామం, క్షీరారామం, అమరారామం, కుమారారామం- లలో ముందుగా స్థిరపడిన ద్రావిడులు గనుక వీరిని 'ఆరామ ద్రావిడులు' అంటారని ఆ పుస్తకంలో ఉంది.  


11. తుంబల వారు


12. ప్రథమ శాఖీయులు 


13. నియోగులు-  


        1. ఆరువేల నియోగులు 2. కమ్మెల బ్రాహ్మణులు 3. ప్రాజ్ఞాడు బ్రాహ్మణులు 4. నందవరీక బ్రాహ్మణులు

        5. పెసలవాయిల బ్రాహ్మణులు 6. తుమ్మనాడు లేదా కమ్మనాడు బ్రాహ్మణులు 7. లింగధారులు 8. ప్రథమశాఖ నియోగులు 


ఇక్క డ మనం కొన్ని ముఖ్య విశేషాలు గమనించాల్సి ఉంది. పైన పేర్కొన్న తెగలలో కొన్ని ప్రాంతాలపరంగా ఉండటం స్పష్టం. వీటిలో కొన్ని ఇప్పుడు కనపడటం లేదనిపిస్తోంది.


(బాల కర్నాటి, కొలింగేటి, ఓగేటి, తొండ్రనాడు, ఔదమనాడు వంటి కొన్ని నియోగ బ్రాహ్మణ శాఖలు ఎక్కడైనా ఉన్నాయోమో కానీ, ఈ సంకలనకర్త దృష్టికి రాలేదు.) 


నందవరీకులు

    నందవరీకుల గురించిన ఈ దిగువన వివరిస్తున్న చరిత్ర శ్రీ గోపానందనాథులు 1996లో రాసిన 'శ్రీ దేవీ మాహాత్మ్యము- శ్రీ చౌడేశ్వరీ చరిత్రము' అనే పుస్తకంలో ఉంది. 


    సోమ వంశంలో పాండురాజు సంతతికి చెందిన నందరాజు అప్పటి కర్నాటక దేశంలోని నందవరం రాజధానిగా పరిపాలన చేసేవాడు. ఈ నందరాజు జనమేజయునికి తొమ్మిదో తరానికి చెందిన ఉత్తుంగభుజుని కుమారుడు. ఈయన చాణక్య-మౌర్యుల చరిత్రలోని నవనందులలోనివాడు కాడు. నందరాజు గొప్పశివభక్తుడు. ఈయన శివభక్తికి మెచ్చి, ఒక సిద్ధుడు ఒక దివ్యపాదుకల జతను ప్రసాదిస్తాడు. తను ఇచ్చిన దివ్యపాదుకల విషయం ఎవ్వరికీ చెప్పవద్దనే ఆంక్ష కూడా విధిస్తాడు. ఈ దివ్యపాదుకల ప్రభావంతో నందరాజు ప్రతీ నిత్యమూ వేకువజామున లేచి, కాశీనగరం చేరుకుని గంగాస్నానానంతరం విశ్వేశ్వరుని, విశాలాక్షిని దర్శించుకుని, తిరిగి తెల్లవారే లోగా తన రాజధానికి చేరుకునేవాడు. ఇలా కొంతకాలం జరిగాక, తన భర్త తెల్లవరే సమయంలో అదృశ్యం కావడాన్ని గుర్తించిన రాణి, తన భర్తను ఆ విషయమై నిలదీస్తుంది. తప్పనిసరై, నందరాజు తనకు సిద్ధుడు ఇచ్చిన పాదుకలగురించి వివరిస్తాడు. అది ఒక గొప్పవింతగా భావిస్తూ, తననూ కాశీకి తీసుకువెళ్లమని కోరుతుంది. నందరాజు ఆమెను అక్కడికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత, రాణికి రజోదర్శనం అవుతుంది. ఆ అశుచి ఫలితంగా దివ్యపాదుకలను ఉపయోగించుకోలేక, రాజధానికి తిరిగి చేరలేని పరిస్థితి ఏర్పడి, వారిద్దరూ కాశీలో చ్కిడిపోతారు.


ఈ దశలో వారు అక్కడున్న కొందరు విప్రులను చూస్తారు. వారి తేజస్సును చూసి, వారికి నమస్కరించి, తమకు సంప్రాప్తించిన విపత్తును వివరించి, సహాయం చేయవలసిందిగా కోరతారు. తపస్సంపన్నులయిన ఆ బ్రాహ్మణులు తమ దివ్యదృష్టితో భవిష్యత్తును చూసినవారై, త్వరలోనే కాశీనగరం కరవుకాటకాల పాలవుతుందని గ్రహించి, ఆ సమయంలో తమను నందరాజు ఆదుకోగలడని ఆశిస్తూ, ఆయననుంచి తగిన వాగ్దానం పొందుతారు.


వారు చేస్తామన్న సహాయానికి ప్రతిగా, తన రాజ్యంలోని నందవర అగ్రహారాన్ని వారికి దానం ఇచ్చేందుకు అంగీకరిస్తూ, విళంబినామ సంవత్సర చైత్ర బహుళ అమావాస్య సూర్యోదయ సమయంలో కాశీలోని గంగాతీర మణికర్ణికా ఘట్టంలో, శ్రీవిశ్వేశ్వర మహాదేవునికి సమర్పణంగా, శ్రీ చాముండాదేవి సాక్షిగా


ఆ విప్రులకు దానం చేశాడు. (ఇది నేటి క్రీ.శ. 2013కు 4135 సంవత్సరాల క్రితం, అంటే యుధిష్టిర శకంలోని 980కి సమానం.) ఆ తర్వాత, ఆయనకు సహాయం చేయడానికి సిద్ధపడిన విప్రులు, వేదోక్తవిధిని రాణిని శుచిని చేసి, రాజును, రాణిని క్షేమంగా నందరాజ్యానికి చేర్చుతారు. 


    ఆ తర్వాత, ఆ విప్రులు గుర్తించినట్లే కాశీనగరం కరవుకాటకాల పాలవుతుంది. తాము అక్కడ ఉండలేక, మొత్తం 500 ఇళ్లవారు నందరాజు తమకు ఇచ్చిన దానాన్ని గుర్తు చేసుకుని, నందరాజ్యానికి వస్తారు. నందరాజ్యం చేరిన వారికి రాజదర్శనం వెంటనే లభించక, కొంత సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో తమ నిత్యకర్మానుష్టానాలను రాజభవనంముందే పూర్తి చేసి, తీర్థజలాన్ని అక్కడే ఉన్న ఒక ఎండు రావి చెట్టుమీద చల్లుతారు.


ఆ విధంగా మూడు రోజులు గడిచేసరికి, ఆ ఎండు చెట్టు చిగురిస్తుంది. ఇది కేవలం ఆ విప్రుల తపోబలప్రభావమేనని భావించిన రాజసైనికులు వెంటనే


ఆ విషయాన్ని రాజుగారికి తెలియజేస్తారు. ఆయన రాజభవనం ముందుకు వచ్చి, ఆ విప్రులను సభకు ఆహ్వానిస్తాడు. సభలో, విప్రులు రాజుకు ఆయన తమకు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుకు తెస్తారు. నందరాజుకు ఆ విషయం జ్ఞప్తికి వచ్చినా, తాను దివ్యపాదుకలను పొందిన సంగతినిగానీ, తాను ప్రతినిత్యం కాశీకి వెళ్లిన సంగతినిగానీ ప్రజలు విశ్వసించరేమోనన్న భీతితో, తాను అసలు కాశీకి వెళ్లనే లేదని బొంకుతాడు. అప్పుడు ఆ విప్రులు నందరాజు, కాశీలో విశాలాక్షి సాక్షిగా తమకు వాగ్దానం చేశాడని సభలో వివరిస్తారు. అయితే, సభలోని పురజనులు సైతం రాజుకే వత్తాసు పలుకుతూ, తమ రాజు అసలు కాశీకి వెళ్లనే లేదనీ, ఒకవేళ విప్రులు చెప్పేది నిజమే అయిన పక్షంలో విశాలాక్షిచేత తనముందు సాక్ష్యం చెప్పించాలని గేలి చేస్తూ విప్రులను నిండుసభలో అవమానపరుస్తారు. జగన్మాతముందు చేసిన వాగ్దానాన్ని కాదనటమేగాక ఆవిధంగా నిండుసభలో తమను అవమానపరచటంతో వారు ఎంతగానో నొచ్చుకుని, కాశీలోని విశాలాక్షి మాత చేతనే సాక్ష్యం చెప్పించటం భావ్యంగా ఉంటుందని భావించి, తమలో నలుగురు పెద్దలను ఎంచుకుని, వారిని విశాలాక్షి దగ్గరకు పంపుతారు. అలా కాశీకి వెళ్లిన నలుగురు పెద్దలు:


    1. బ్రహ్మశ్రీ అవధానం పెద్దిభట్టు (శ్రీవత్సస గోత్రం)

    2. బ్రహ్మశ్రీ తర్కశాస్త్రం మాధవభట్టు (వశిష్టస గోత్రం)

    3. బ్రహ్మశ్రీ పురాణం శ్రీధరభట్టు (భారద్వాజస గోత్రం) 

    4. బ్రహ్మశ్రీ వార్తికం కమలనాభ పండితుడు (హరితస గోత్రం)


పై నలుగురు ప్రముఖులు కాశీకి వెళ్లి, అక్కడ జపతపహోమాలను శాస్రోక్తంగా చేసి, జగన్మాతను పూజించి, ఆమెను ప్రసన్నం చేసుకుంటారు. వారి భక్తికి మెచ్చి, ఆమె వారిముందు ప్రత్యక్షం కాగానే, జరిగిన విషయం ఆ తల్లికి వివరించి, తమతో వచ్చి, సభలో సాక్ష్యం చెప్పవలసిందిగా కోరతారు. వారు కోరినట్లే తాను నందరాజు వద్దకు వచ్చి, సాక్ష్యం చెప్తాననీ, అయితే, మార్గంలో ముందు వెళ్లే విప్రులు ఎవ్వరూ జ్యోతి రూపంలో వచ్చే తనను వెనుదిరిగి చూడరాదని స్పష్టం చేస్తుంది. ఆ ప్రకారమే, నందరాజ్యం పొలిమేర వరకూ వచ్చిన విప్రులు, అక్కడ వెనుదిరిగి చూస్తారు. ఫలితంగా ఆ జగన్మాత జ్యోతి రూపంలో అక్కడ నిలిచిపోతుంది. ఈ వృత్తాంతం అంతా విప్రులు వచ్చి, నందరాజుకు విన్నవిస్తారు. ఆయన తన సతీమణి, బంధుమిత్ర పురజనపరివారసహితంగా వచ్చి, అందరిముందూ జరిగినదంతా తెలియజేసి, మహానుభావులైన విప్రుల పట్ల తను చేసిన తప్పును క్షమించమని జగన్మాతను ప్రార్థిస్తాడు. పశ్చాత్తాపం చెందుతున్న రాజును జగన్మాత క్షమించి, విప్రులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చమని ఆనతి ఇస్తుంది. ఆ ప్రకారమే, నందరాజు వెంటనే ఆ విప్రులకు నందవరాది అగ్రహారాలను దానం చేసి, తగిన వృత్తులను కలగజేస్తాడు. కాశీనుంచి విచ్చేసిన జగన్మాతను అక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకోవలసిందిగా నందరాజు ప్రార్థిస్తాడు. తాను చౌడేశ్వరీ నామంతో అక్కడ వెలసి, విప్రులను, ఇతర చరాచరసృష్టినీ కాపాడతానని తల్లి అభయప్రదానం చేసి, అక్కడ జ్యోతిరూపంలో వెలుస్తుంది. నాటినుంచీ అక్కడి బ్రాహ్మణులు అందరూ 'నందవరీకులు'గా పేరొంది, నిత్యం వేదశాస్త్ర అభ్యాసంతోబాటు, అగ్నిష్టోమ్యాది యజ్ఞకర్మలను ఆచరిస్తూ,, తమ ఇళ్లలోని అన్ని శుభకార్యాలలోనూ చౌడేశ్వరీమాతను 'జ్యోతి' రూపంలో కొలుస్తూ, ఆ జగన్మాతను ఆరాధిస్తూ,


తల్లి కరుణతో జగద్విఖ్యాతిని పొందుతున్నారు - అని ప్రచారంలో ఉన్న గాథ. 


    శ్రీ చౌడేశ్వరీమాత ఆవిర్భావ చరిత్ర, చరిత్రరచనకు ముందునాటి భవిష్యత్పురాణం, భాగవతంలోని ద్వాదశ స్కంధములో ఉన్నట్లూ, ఆధునిక కాలంలో విన్నకోట సీమ, కొండవీడు, కొండపల్లిల దండకవిలెలలోనూ నమోదు అయిఉన్నట్లు శ్రీ గుంటుపల్లి సోమయ్య వివరించారు. వీరు 1914 ప్రాంతంలో 'ప్రబంధ కల్పవల్లి' అనే మాసపత్రికకు సంపాదకులుగానూ ఉండేవారు. చారిత్రక ఆధారాలనుబట్టి, శ్రీ చౌడేశ్వరీమాత అవతారం జరిగి, క్రీ.శ. 2013 నాటికి సుమారు 4134 సంవత్సరాలయిందని శ్రీ గోపానంద నాథులు రచించిన 'శ్రీ నందవర చౌడేశ్వరీ చరిత్ర' అనే పుస్తకం పేర్కొంటోంది. 


సీ. జన్మదేశంబశేష బ్రహ్మవిద్యల కాశ్వలాయన శాఖకాశ్రమంబు  


     సంకేత భవనంబు సకల శాస్త్రములకు ప్రథమాగమములకు పట్టుకొమ్మ,

     ఉపనిషత్తులకు నిత్యోత్సవస్థానంబు, యామళంబులకు సింహాసనంబు,

     ఆలయంబఖిల కావ్యాదికంబులకు గంధర్వలోకంబు గాంధర్వమునకు,

     కాశికాక్షేత్ర కళ్యాణ కటకనగర విప్ర పంచశతీ వృత్తి విస్తృతంబు,

     గుణపవిత్ర త్రయోదశ గోత్రయుతము నందభూవరదత్తంబు నందపురము.


సీ.శ్రీవత్సగోత్ర, వాశిష్ఠ సాత్రేయ, కౌశికస విశ్వామిత్ర, శ్రీ యగస్త్య,

    కాశ్యప, కుత్సస, గౌతమ, మౌనభార్గవ ఋషిగోత్ర మౌద్గల్య, వీత

    హవ్య, భరద్వాజ హరితస ముఖ్య త్రయోదశ గోత్రులౌ భూదివిజుల

    నాశ్వలాయన సూత్రులౌ విప్రవర్యుల సకత వేద శాస్త్ర పురాణవిదుల


          చముండ మాంబా ప్రసాద ప్రశస్త ఘనుల


          పూజ్యుల గణించి తనదు సామ్రాజ్యగరిమ 

          నగ్రహార క్షితిని వృత్తులారునేడు

          భూవరు డొసగె యానంద లీల.


     పైన చెప్పిన విధంగా నందవరీకులు ప్రధానంగా కాశీనుంచి ఇక్కడికి వచ్చినవారుగా అర్థమవుతోంది. అయితే, పైనగల మొదటి సీస పద్యం ఆరో పాదంలో 'కాశికాక్షేత్ర కల్యాణ కటకనగర...' అన్న పదాల ఆధారంగా వీరు కల్యాణ్‌ (నేటి మహారాష్ట్ర ప్రాంతంలో ఉంది), కటకనగరం (నేటి ఒడిషా రాష్ట్రంలో ఉంది) వంటి ప్రాంతాలనుంచి కాశీకి చేరి ఉంటారనే భావనా ఉంది. 


అలాగే, రెండో సీస పద్యంలో పేర్కొన్న విధంగా వీరిలో 'శ్రీవత్సగోత్ర, వాశిష్ఠ సాత్రేయ, కౌశికస, విశ్వామిత్ర, శ్రీ యగస్త్య, కాశ్యప, కుత్సస, గౌతమ, మౌనభార్గవ, (ఋషిగోత్ర) మౌద్గల్య, వీతహవ్య, భరద్వాజ హరితస' అనే 13 గోత్రాలు ఉండేవనేదీ స్పష్టం. వీరు ఋక్శాఖ, ఆశ్వలాయన సూత్రులైన కరణకర్మ శాఖీయులు. అలాగే, మిగిలిన అందరు బ్రాహ్మణులకు మల్లేనే నందవరీకులు సైతం మొదట పూర్తిగా వైదికులేకాగా, తర్వాత కాలంలో వారిలోనూ వైదికి, నియోగి విభేదాలు ఏర్పడ్డాయి.


    నందవరీకులలో విశిష్టమైన ఖ్యాతి గడించిన ప్రముఖులు అనేకంగా ఉన్నారు. చాణక్యుడు, మహామంత్రి తిమ్మరుసు, విద్యానాథుడు, తాళ్లపాక అన్నమయ్య, తరిగొండ వేంగమాంబ, నన్నయ భట్టారకుడు, సంకుసాల నృసింహ కవి, రాయన భాస్కర మంత్రి వంటి ప్రముఖులు అందరూ నందవరీకులే.


లింగధారులు

    లింగధారణ అనేది శివారాధనకు చెందిన విశ్వాసచిహ్నం అన్నది స్పష్టం. 


    వీరశైవులకు వృషుడు, నంది, భృంగి (భృంగిరిటి), వీరుడు, స్కందుడు అనే అయిదుగురే గోత్రకర్తలు, పంచాచార్యులు. వీరికే యుగభేదాలనుబట్టి వేర్వేరు పేర్లు సమకూడాయి. అలా వచ్చిన పేర్లు (పైన చెప్పిన వరుస క్రమంలోనే): రేవణసిద్ధ, మరుళసిద్ధ, ఏకోరామ, పండితారాధ్య, విశ్వారాధ్య అనేవి. ఈ ఆరాధ్య మతధర్మాలను స్వీకరించినవారు మిగిలిన బ్రాహ్మణులనుంచి తాము భిన్నమని చెప్పుకోవడానికి 'ఆరాధ్య' పదస్వీకారం చేసి, 'ఆరాధ్యబ్రాహ్మణులు' అయ్యారని తెలుస్తోంది. 


        'ఆరాధ్య బ్రాహ్మణులు లింగధారణాది వీరశైవ ధర్మములను స్వీకరించినను లింగముతోబాటు యజ్ఞోపవీతమును ధరించి యుపనయన సంస్కారములు గ్రహింతురు. లింగధారులుగాని బ్రాహ్మణులు చెప్పికొను ఋషిగోత్ర సూత్రములనే వీరును జెప్పుకొందురు. వీరిలో నిప్పటికినిట్టి గోత్రసూత్రవ్యవహారమే జరుగుచున్నది.' అంటారు శ్రీ బండారు తమ్మయ్యగారు. (పాలకురికి సోమనాథ కవి, వ్యాసం, కాకతీయ సంచిక, 1991, పే. 214)  


ప్రథమ శాఖీయులు

    ప్రథమ శాఖీయులు అటు వైదీకులలోనూ, ఇటు నియోగులలోనూ ఉండటం గమనార్హం. 


    ప్రథమ శాఖీయులగురించి తెలుసుకోవాల్సిన విశేషాలు అనేకం ఉన్నాయి. ముందుగా వీరికి 'ప్రథమ శాఖ' అన్న పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం:


    వైశంపాయనుడి వద్ద వేదాభ్యాసం చేస్తున్న యాజ్ఞవల్క్యుడు, వైశంపాయనుని ఆగ్రహానికి గురై, తను అంతవరకూ నేర్చుకున్న వేదాలను కక్కివేయాల్సివస్తుంది. అప్పుడు, తీవ్రమైన నిరాశకు గురయిన యాజ్ఞవల్క్యుడు వేదాభ్యాసం కోసం సూర్యుడిని ప్రార్థిస్తాడు. సూర్యుడు ఒక గుర్రం రూపంలో ప్రత్యక్షమయి, యాజ్ఞవల్క్యునికి యజుర్వేదం నేర్పుతాడు. ఆయన నేర్పినవే 15 శాఖలు. యజుర్వేదంలోని ఆ మొదటి 15 శాఖలను 'శుక్ల యజుర్వేదం' అంటారు. వాటిని యాజ్ఞవల్క్యుడు తన శిష్యులైన కణ్వుడు, మధ్యందినుడు, కాత్యాయనుడు, వాజసనేయుడు-లకు నేర్పాడని భాగవతంలో ఉంది.


అయితే, సూర్యుడినుంచి వేదం నేర్చుకోవటం పాపమనీ, అధమమనీ వైశంపాయనుడు శపిస్తాడు. దానికి యాజ్ఞవల్క్యుడు, బాధపడి, తన గురువైన వైశంపాయనుడిని క్షమాపణ కోరతాడు. అప్పుడు సూర్యుడి వినతి మేరకు శాంతించిన వైశంపాయనుడు, తన శాపం తప్పదనీ, అయితే దానికి కొంత మినహాయింపు ఇవ్వగలననీ చెప్తూ, శుక్ల యజుర్వేదం నేర్చుకునేవారు ప్రతీదినం ఒక ముహూర్తకాలంపాటు (అంటే, 48 నిమిషాలపాటు) అధములుగా ఉంటారని చెప్పాడని వరాహ పురాణం పేర్కొంటోంది. ఈ శుక్ల యజుర్వేద (యజుర్వేదంలోని తొలి 15) శాఖలను అనుసరించేవారిని 'ప్రథమ శాఖీయులు' అంటారు. వీరినే 'వాజసనేయులు', 'కాత్యాయనులు' లేదా 'శుక్ల యజుస్‌'లనీ అనడమూ ఉంది. యాజ్ఞవల్క్యుని వద్ద వేదం నేర్చుకున్న కాత్యాయనుడు, వేదానికి సూత్రాలను రాశాడు కనుకనే, ఈ సూత్రాలను పాటించే వీరికి 'కాత్యాయనులు' అని పేరు వచ్చింది.  


    స్కంద పురాణం, 17, 18 అధ్యాయాలలో శుక్ల యజుర్వేదం గురించిన ప్రసక్తి ఉన్నా, ఈ శాపం గురించిన ప్రస్తావన లేదు. 


    యాజ్ఞవల్క్యుడు, సూర్యుని వద్ద నేర్చుకున్న యజుర్వేద శాఖలను ఏమాత్రం ఎవ్వరూ మార్చలేదు గనుక, ఇవి 'శుద్ధ'మైనవి గనుక, ఇవి 'శుక్ల యజుర్వేదం'గా పేరు పొందాయనీ అంటారు.

రామాయణం

 రామాయణం.....*


రామాయణం నుండి నేర్చుకోవలసిన కొన్ని విషయాలు..

రామాయణం పనితనం పెంచుతుంది. నిద్రపోయే కుంభకర్ణులు కావద్దంటుంది.

సేవా భావం నిర్మాణం చేస్తుంది. ఆంజనేయునిలా, లక్ష్మణుడిలా సేవ చేయండని పిలుపునిస్తుంది.

ఏకతాపథంలో నడిచే ఆలోచనలను కలిగిస్తుంది. రామానుజుల్లా కలిసి ఉండమంటుంది. వానరుల్లా సంఘటిత శక్తితో నడవండి అంటుంది.

రామాయణం సజ్జనులను కాపాడమంటుంది. దుర్జనులను శిక్షించమంటుంది.

రామాయణం తల్లిదండ్రుల మాటలను పాటించమంటుంది. అందుకొరకు మనముందు దశరథుణ్ణీ, శ్రీరామున్ని నిలిపింది.

రామాయణం కన్నతల్లిని ప్రేమించమంటుంది.
కన్న నేలను రక్షించుకొమ్మంటుంది.

రామాయణం గురువుల మాటను పాటించి ప్రజానురంజక పాలన చేయమంటుంది.
ఉదాహరణకు.. వాల్మీకి, వశిష్ట, విశ్వామితులున్నారు.

వ్యక్తిసుఖం కంటే దేశం.. దేశ ప్రజలే ముఖ్యమని రామాయణం సందేశమిస్తున్నది.
ఉదాహరణకు.. సీతా పరిత్యాగాం..

రామాయణం అపూర్వగ్రంథం..

మనల్ని నీతిమంతులుగా,
బుద్ధిమంతులుగా,
శక్తిమంతులుగా,
శ్రీమంతులుగా,
ధర్మమూర్తులుగా,
ప్రతిభావంతులుగా,
దేశ భక్తులుగా,
దేశ సంరక్షకులుగా,
సర్వగుణ సంపన్నులుగా తీర్చిదిద్దుతుంది..

రామాయణం చదువుదాం..
ఆలోచిద్దాం..
పరమార్థాలు పదిమందికి చెబుదాం..
అందరూ రామాయణం చదివేందుకు దోహదం చేద్దాం..

రామాయణం...

ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ..
ఒక కొడుకుకి తండ్రి మీద ఉన్న గౌరవం..
ఒక భర్తకి భార్య మీద ఉన్న బాధ్యత..
ఒక భార్యకి భర్త మీద ఉన్న నమ్మకం..
ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం..
ఒక తమ్ముడికి అన్న మీద ఉన్న మమకారం..
ఒక మనిషిలోని బలం..
మరో మనిషి లోని స్వార్ధం..
ఇంకో మనిషి లోని కామం..
ఒకరి ఎదురు చూపులు..
మరొకరి వెతుకులాటలు..
అండగా నిలిచిన మనుషులు..

అన్ని కలిపి మనిషి మనిషి గా బ్రతకడానికి అవసరమైన ఒక నిఘంటువు...

శక్తి ఉన్నా ఒద్దికగా ఉండటం రామ తత్వం..
అవకాశం ఉన్నా భర్త వెంట నడవటం సీత తత్వం..
కష్టాల్లో తోడు నిలవడం ఆంజనేయ తత్వం..
ప్రతి అడుగులో మంచిని గ్రహించాలన్నదే రామాయణ పరమార్ధం...

ఇదే రామాయణం మనకిచ్చే ఆదర్శ సందేశం...

*|| ఓం నమః శివాయ ||*

హిందూ సనాతన ధర్మమునకు సంభదిత విషయములు తెలుసుకొనుటకు కొరకు టెలిగ్రామ్ యాప్ వాడే వారు ఈ క్రింది లింక్ ద్వారా మన సమూహం నందు జాయిన్ అవచ్చును.....

Spiritual Seekers 🙏
https://t.me/Spiritual_Seekers 

కల్యాణోత్సవం

 *శ్రీరామ నవమి కల్యాణోత్సవం* 🙏🌷🌹💐


గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.


 **చరిత్ర ** 

రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు; కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.


ఉత్సవం సవరించు

ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు {క్రీ.పూ} శాలివాహన శకం 5114, జనవరి 10 న జన్మించారు.


 *ఉత్సవంలో విశేషాలు*  

ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కల్యాణం. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.

బెల్లం, మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది.

ఉత్సవ మూర్తుల ఊరేగింపు. రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం.

ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు.).

దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది.

భద్రాచలంలో రామదాసు చే కట్టబడిన రామాలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి తన తలమీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తాడు.

ఇస్కాన్ దేవాలయం వారు ఈ వేడుకలను నానాటికీ ఎక్కువవుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఇంకా ఘనంగా నిర్వహిస్తోంది. కొన్ని చోట్ల స్వామి నారాయణ్ జయంతిని కూడా దీనితో కలిపి జరుపుకుంటారు.

ఆచార్య సద్బోధన*

 *ఆచార్య సద్బోధన*


భగవంతుడు మనకు వివేకాన్ని, ఆచరణకు సన్మార్గ విలువలను ఇచ్చాడు. భగవంతునితో సంబంధం పెంచుకోవా్డానికి ఈ రెండూ ఆవశ్యకాలే.


పరమాత్మునితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం వలన మనిషిలో సమతుల్యత ఏర్పడుతుంది. ఆ సంబంధం అతడిని శక్తిమంతుడిని గావిస్తుంది. 


జీవితంలో అమూల్యమైన అనుభవం మనం పరమాత్ముడిని ఆశ్రయించినప్పుడే కలుగుతుంది. అప్పుడే జీవితానికి స్వాంతన, భద్రత కలుగుతాయి.


పరమాత్ముడి ఆలోచనలు, అన్వేషణ ద్వారా కనుగొనాలి. ఆ సంబంధాన్ని కనుగొన్నప్పుడే ఈ ప్రపంచంలో మన స్థానాన్ని స్వీకరించి వివేకంతో దానికి పరిపూర్ణత చేకూర్చినవారమవుతాం.


*శుభంభూయాత్*

Message from Air Marshal Ashutosh Sharma, Chest physician &

 *Message from Air Marshal Ashutosh Sharma, Chest physician & pulmonologist COMMAND HOSPITAL AIR FORCE, BANGLORE* 

Please send this message to all your colleagues daily.


*Important Message for all* 


The hot water you  

     drink is good for your throat. 


But this Corona   

      virus is hidden behind the 

      Paranasal sinus of your nose for 3 to 4 days. 


The hot water we 

      drink does not reach there. 


After 4 to 5 days  

    this virus that   

    was hidden behind the  

   paranasal sinus reaches your lungs.


 Then you have trouble breathing.


That's why it is very important to take steam, 


which reaches the  

    back of your Paranasal sinus.


 You have to kill this  

   virus in the nose with steam.


At 50°C, this virus becomes disabled i.e. paralyzed. 


At 60°C this virus  

    becomes so weak that any 

     human immunity  

     system can fight against it.


 At 70°C this virus dies completely.


This is what steam does. 


The entire Public    

    Health Department knows this.


 But everyone wants to take   

    advantage of this Pandemic. 


So they don't share this information openly.


One who stays at home should take steam once a day. 


If you go to the market to buy Groceries   

vegetables etc.

 take it twice a day.


 Anyone who meets  

     some people or goes to office

    should take steam 3 times a day.                      


 *Steam week* 


   According to doctors, 

Covid -19 can be killed by 

    inhaling steam from the nose and mouth, 

   eliminating the Coronavirus.  


If all the people  

   started a steam drive campaign for a week, 


the pandemic will soon end. 


So here is a suggestion: 


* Start the process for a week from

morning and evening, for 

  just 5 minutes  

    each time, 

to inhale steam.  

  

If we all adopt this practice for a week  the deadly 


Covid-19 will be erased.


This practice has no side effects & doesn't cost anything either.


  So please send this message to all your Loved Ones, relatives,

    friends and neighbours, 

     so that we all can kill this 

     Corona virus together and live and walk freely

    in this beautiful world.


          *Thank you, jai hind*

విధిరాతను

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹


🍀విధిరాతను తప్పించలేరు🍀

✍✍

దేవతల రాజైన ఇంద్రుడు ఓసారి కాశీ నగరంలో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. భూలోకంలోని రాజులు, ఋషులు, మామూలు ప్రజలు, జంతువులు, పక్షులు, కీటకాలు- అందరినీ ఆ సమావేశానికి ఆహ్వానించాడు. "అక్కడ ప్రతి ప్రాణీ తమ కష్టాల్ని నేరుగా దేవతలకు విన్నవించుకోవచ్చు" అని ప్రకటించాడు.

దాంతో చాలా మంది ఎక్కడెక్కడినుండో చేరుకున్నారక్కడికి. వరసగా అందరూ సభ లోకి వెళ్తున్నారు. 

ఆ సభ వాకిలి మీద ఒక చిలుక వాలి ఉంది. ప్రతి ఒక్కరినీ మర్యాదగా పలకరిస్తున్నది అది. అందరూ దాన్ని చూసి ముచ్చట పడుతూ లోనికి పోతున్నారు. 

ఇంద్రుడి పిలుపును అందుకొని యమ- ధర్మరాజు కూడా వచ్చాడు, ఆ సభకు. యముడిని కూడా మర్యాదగా లోనికి ఆహ్వానించింది చిలుక.

యముడు మృత్యువుకు అధిపతి: ఏ ప్రాణి ఎప్పుడు, ఎక్కడ చచ్చిపోతుందో ఆయనకు తెలుసు. అట్లాంటి యముడు సభలోకి పోతూ-పోతూ, వెనక్కి తిరిగి మరీ ఆ చిలుక కేసి చూశాడు. పూర్తిగా లోనికి పోబోతూ మళ్ళీ ఓసారి ఆగి, చిలుక వైపుకు తిరిగి చూసి- నవ్వాడు కూడా!

అప్పటివరకూ సంతోషంగానే ఉన్న చిలుకకు ఇప్పుడు దిగులు మొదలైంది- "ఎందుకు, ఈ యముడు నన్ను చూసి ఎందుకు నవ్వాడు?" అని బెంగ మొదలైంది.

క్షణ క్షణానికీ దాని బెంగ ఎక్కువైంది. కొద్ది సేపట్లోనే అది నీరసపడిపోయింది. దానికి కళ్ళు తిరగటం మొదలు పెట్టాయి. వాంతి వచ్చినట్లయింది- అంతలో పక్షిరాజు గరుత్మంతుడు అక్కడికి వచ్చాడు. ఆయన కూడా సభలోనికి పోబోతూ చిలుక పరిస్థితిని గమనించి పలకరించాడు- ఏం చిలకమ్మా, దిగులుగా ఉన్నావు? నీ సమస్య ఏమిటి? నాకు చెప్పు; నేను నీకు ఏ సాయం కావాలన్నా చేస్తాను" అన్నాడు.

చిలుకకు ప్రాణం లేచివచ్చినట్లయింది. "నీకు గాక ఇంకెవరికి చెప్పుకుంటాను స్వామీ! మా పక్షులందరికీ పెద్ద వాడివి నువ్వే కదా! అందుకని నా కష్టాన్ని నీకే చెప్పుకుంటాను. విను- ఇందాక యముడు సభ లోకి వెళ్ళాడు. నన్నే మళ్ళీ మళ్ళీ‌ చూస్తూ పోయాడు. చివరికి వెనక్కి తిరిగి నావైపు చూసి నవ్వాడు కూడా! నాకు భయం వేస్తున్నది. అతని నవ్వు గుర్తుకొచ్చినకొద్దీ నాకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లనిపిస్తున్నది. లేకుంటే అంతమందిలో నన్ను ఒక్కడినే వేరుచేసి ఎందుకు చూస్తాడు యముడు? నాకిప్పుడు మనసు మనసులో లేదు. ఇక ఎవ్వరినీ స్వాగతించలేను.

ఎక్కడికన్నా వెళ్ళి దాక్కుందామనిపిస్తున్నది. నా వెంటపడి తరిమే మృత్యువుకి అందకుండా ఎక్కడికన్నా వెళ్ళిపోదామని ఉన్నది" గరుడుడికి చెప్పుకొని ఏడ్చింది చిలుక.

"ఓసి! ఇంతేనా! నువ్వు దిగులు పడకు! నిన్ను నేను కాపాడతాను. ఈ భూలోకంలో సురక్షిత స్థలాలకోసం‌ వెతికి వేసారేదెందుకు? వేరే చోట ఎక్కడా అవసరం లేదు. మా పక్షి జాతి దానివి నువ్వు- ఎవరికీ అందకుండా నేను నిన్ను నేరుగా దేవలోకంలో విడిచి వస్తాను- పద; నీకెందుకు భయం!" అని గరుత్మంతుడు దాన్ని తన వీపు మీద ఎక్కించుకొని క్షణాల్లో దేవలోకం చేరుకు-న్నాడు. అక్కడ దాన్ని నందనవనంలో వదిలి- "బాగుందా, ఇక్కడ? ఏది కావాలన్నా ఊరికే కోరుకో చాలు- అది నీ సొంతం అవుతుంది. ఇక భయపడవుగా?! నేను సభకు వెళ్ళొస్తా మరి- ఉండు!" అని దాన్ని అక్కడ విడిచిపెట్టి పోయాడు.

సభంతా ముగిసిన తరువాత అందరూ బయలుదేరి బయటికి వస్తున్నారు. యమ-ధర్మరాజు కూడా బయటికి వస్తూ అంతకుముందు చిలుక కూర్చున్న వాకిలి వైపు చూశాడు. చిలుక అక్కడ లేదు! యముడి నొసలు ముడి పడ్డాయి. ఆయన అటు వైపు వెళ్ళి, చిలుక కోసం వెతకటం మొదలు పెట్టాడు.

అంతలో గరుత్మంతుడు అక్కడికి వచ్చి, యముడిని చూసి నవ్వాడు- "ఏమి యమధర్మరాజా! ఏదో వెతుకుతున్నావు?" అని అడిగాడు.

"ఈ వాకిలి మీద ఒక చిలుక ఉండింది ఇందాక- 'అది ఇప్పుడు ఎక్కడ ఉన్నదా' అని వెతుకుతున్నాను" అన్నాడు యముడు. 

గరుత్మంతుడు గర్వంగా నవ్వాడు- "ఏమి, దాని ప్రాణాలను తీసుకు పోదామనుకున్నావా? అది ఇప్పుడు ఇక్కడ లేదు.

నువ్వు ఇందాకదాన్ని చూసి నవ్వావట గదా- అది చాలా భయపడింది. అందుకని నేను దాన్ని తీసుకెళ్ళి, నీకు అందని చోట- దేవలోకంలో- దాచి వచ్చాను" అన్నాడు.

"అయ్యో!‌ ఎంత పని చేశావు!" అన్నాడు యముడు, తల పట్టుకొని.

"ఏమైంది?" అడిగాడు గరుడుడు.

"ఇందాక నేను దాన్ని చూసి, దాని మరణం ఏవిధంగా ఉండనున్నదో చదివాను- 'కొద్ది సేపటిలో ఈ చిలుక దేవలోకంలో నీటమునిగి చనిపోతుంది' అని రాసి ఉంది దాని నుదుటన! 'భూలోకంలోని ఈ పక్షి దేవలోకానికి ఎట్లా పోతుంది? -అదీ కొద్ది సేపట్లో ఎట్లా పోతుంది?- పోయి అక్కడ ఎట్లా చనిపోతుంది? -అంతా అబద్ధం; జరిగే పని కాదు!' అనుకొని నవ్వాను నేను! చూడగా నువ్వు విధివ్రాతను నిజం చేసినట్లున్నావు- ఇప్పుడు అది ఎలా ఉన్నదో ఏమో!" అన్నాడు యముడు బాధగా.

ఆ సరికి నిజంగానే చిలుక దేవలోకంలో నీటమునిగి చనిపోయి ఉన్నది!

"చేతులారా చిలుకను మృత్యువు వాకిటికి చేర్చానే!" అని బాధపడుతున్న గరుడుడిని ఓదారుస్తూ యముడు అన్నాడు-"విధిని తప్పించటం ఎవరి తరమూ కాదు గరుడరాజా, నేను కూడా‌ విధివ్రాతకు లోబడి వర్తించాల్సిందే!" అని.✍✍

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఙ్ఞానమని ప్ర ఙ్ఞానము

 మనిషి తనను తాను తనలో వున్న జీవ రూపమైన ఆత్మ దాని ఆశ్రయమైన దేహ లక్షణం నా సంబంధమైన సూత్రములను తెలియుటయే ఙ్ఞానమని ప్ర ఙ్ఞానము. దీని వివరణ. ముందు బీజాక్షరాలుతో మననం వలన తపశ్శక్తితో తెలియుట. దీనిని యింకా సులువుగా మహాసౌరం ద్వారా వేద వివరణ. యిది కూడా తెలియని యెడల యింకా సులువుగా ఆదిత్య హృదయం. యిది కూడా తెలియక యింకా సులువుగా సూర్య దండకం. యిది కూడా తెలియక ఏక శ్లోక రూపంలో వివరణ. యిది కూడా తెలియక ప్రకృతి రూపంలో ప్రత్యక్షంగా నమస్కారము రూపంలో ప్రత్యక్షానుభూతి. దీనివలన కొంత వరకే మనకు తెలియును.అనంతమైన ఉష్ణ శక్తి రూపంలో గల జీవ శక్తిని తెలియుట బహు దుర్లభమైనది. దీనిని ఆచరణ ద్వారా ప్రతీ జీవి తెలియుటయే విఙ్ఞానము. మిగిలినది మౌనంగా అభ్యాసం ద్వారా తెలియుట. మన జీవ పరిణామమును మహర్షులు గ్రహించి సులువుగా దానిని తెలియుటకు శాస్త్ర సంపద గాన రూపంలో మరియు కధల రూపంలోఎవరికి ఎలా అందుబాటలో వుండాలో అదే విధంగా ప్రకృతి పరంగా కాలానుగుణంగా ఆచరణ కూడా సాధన చేసి శోధించి చెప్పినవే. శోధించుటయనేది ఆత్మజీవ దేహ రూపంలో గల తత్వం. శ్రీ రామునికి తెలియకనా ఆదిత్య హృదయ స్తోత్ర బోధన.వేదపురుషుడైన విష్ణువు మానవ రూపంలో ఆచరణకే అవతార పరమావధి దుష్టశిక్షణయే.అనగా సృష్టి జీవమును కాపాడుటయే. మనకు వాటి శక్తిని వాటి సూత్రములను విశ్శ్లేషించి సూత్రములను తెలియపరచుటకు మాత్రమే. అనంతమైన ఙ్ఞాన సముపార్జన గురించి తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

తపస్సునొనరించే చోటు...

 

మతంగముని శిష్యులతో తపస్సునొనరించే చోటు...


ఆశ్రమంలో అడుగడుగునా కుందేళ్లు. 

అక్కడున్న అన్ని వృక్షాలకీ వందేళ్లు. 


అలల అలజడితో గలగలల పంప. 

అడివంతా పుష్పసంపదలొక చెంప.


అణువణువూ అనురాగభరితం. 

అసలెక్కడ చూసినా మొత్తం హరితం.


మతంగ ముని ఆదరణతో ఎన్నోయేళ్లు గడిపేసింది.....


శబరి....!


ఒక నిషాద స్త్రీ! వేటను వృత్తిగా చేసుకుని జీవించే కుటుంబంనుంచి వచ్చింది. క్రౌర్యాన్నీ,  ధైర్యాన్నీ కలగలిపి అడవి జంతువుల్ని వెంటాడి, పచ్చి మాంసాన్ని సైతం భక్షించే ఆ కులంలో పుట్టిందన్న కారణమే ఆమెకు అడ్డంకిగా మారింది.


బాల్యము, యవ్వనము గడిచిపోతున్న కొద్దీ మనసులో కోరిక ఋష్యమూక పర్వతంలా పెరిగిపోతోంది. ఆశ్రమవాసులకు సేవలందించి, ప్రశాంత జీవనం గడపాలని, సజ్జన సాంగత్యంలో సహృదయాన్ని సాధించాలని, సకల జీవజాలాన్నీ సమప్రాణులుగా భావించాలనీ ఆశ!!! 


మునులంతా వలదన్నారు. దాంతో విషాద వనితగా మారిన ఆ నిషాద యువతిని మతంగ మహర్షి ఆదరించాడు. ఆశ్రమానికి కావలసిన ఆదరువులు అమర్చిపెట్టవచ్చన్నాడు. మతంగుని మాటకు మనసు పతంగమై ఎగసింది. 


ప్రతినిత్యం ముని కుమారులందరూ ఎన్నో చెట్లను గాలించి, శోధించి సాధించుకొచ్చే ఫలాలు ఎంతో బరువుండేవిట. వాటిని మోస్తూ వారు చిందించిన స్వేదబిందువులు నేలను తాకి ఎన్నో వేల వృక్షాలు మొలకెత్తాయి. ఆ తపశ్శక్తి ప్రభావాన అచట పూచిన పూలు వాడిపోవుట. పళ్లు ఎండవుట. అదొక నిరంతరమైన జీవశక్తితో అలరారే దట్టమైన అడవి.


అంతకాలం మునులు సూర్యుడికన్నా ముందే బయటపడి శ్రమదమాదులకోర్చి సాధించుకొచ్చే పుష్పఫలాదులన్నీ అప్పటికే గుమ్మాల ముందు కనబడ్డం మొదలెట్టాయి. కుటీరాల గోడలన్నీ గోమయంతో అలికినట్టుగాను, ఇంటిముందు కళ్లాపి చిలికినట్టుగానూ కనబడేవి. ముగ్గులెట్టిన ముంగిళ్లు ముత్యాల్లా మెరిసిపోతోంటే చిక్కటి ఆకాశాన చక్కటి నక్షత్రాల్లా తోచేవి. 


ఎవరు ఆశ్రమానికై ఆ శ్రమనొనరిస్తున్నది? అవగతమవ్వలేదు. మహర్షుల సమాధానం విన్న మునులు మౌనం వహించారు. నిషాదుల సేవలు నిషేధమని వారించే చొరవ చెయ్యలేకపోయారు. కాలక్రమంలో సజ్జన సాంగత్యం, సాధుసంతులతో సహజీవనం, దైవారాధన, నిత్యపారాయణ ఇత్యాది నవవిధ భక్తిమార్గాలూ అలవడ్డాయి. 


ఋషులంతా ఒకరొకరుగా విష్ణుసాయుజ్యం పొందుతున్నారు. వారు నడిచిన నేలంతా పూలురాలి నిశ్శబ్దంగా రోదిస్తున్నాయి. నిరతమూ హరినామాన్ని నినదించే మునిపుంగవులు ఒక్కొక్కరుగా ఆ హరిని చేరసాగారు. చెట్లనంటిపెట్టుకుని, పళ్లు మెక్కి కూతకెక్కిన పక్షులకు ఆకలెయ్యడం మానేసింది. అడివంతా ఏదో బాధ. శబరికీ విచారం మొదలయింది.


మతంగుని అవసాన దశలో వారి పాదాలచెంత నిలిచి ‘తన సంగతేమిట’ని ప్రశ్నించింది. దానికా మహర్షి చెప్పిన కబురుకి శబరికి ఒడలంతా పులకరించింది. మళ్లీ పిల్లతెమ్మెర పలకరించింది. పక్షుల కిలకిలలు, పంప గలగలలూ వినబడసాగాయి. 


రాముడొస్తాట్ట! అతడు హరేనుట!! ఆ వచ్చేది తనకోసమేనుట!!!


ముని ఇంకా ఇలా అన్నాడు....


‘నువ్వు సామాన్యురాలివి కాదు శబరీ, నిన్ను కలవాలని ప్రత్యేకించి ఇంత మారుమూల అడవిలోకీ విచ్చేసి నీ ఆతిథ్యం స్వీకరిస్తాడు. సోదరులిద్దరినీ ఆదరించు. అతడికోసం దాచుంచే పనిలేదు. తోచిందే పెట్టు. మంట మండించి వంట వండాల్సిన అవసరంలేదు. ‘ఫల’హారమే చాలు. మావి నిష్కామ కర్మలనీ, ఎటువంటి ఫలాపేక్షా లేని తపస్సులనీ భావిస్తూనే గడిపాం. నిజానికి నీదీ యోగమంటే! కమలాక్షునర్చించు కరములే కరములు. శుభం భూయాత్!’


ఆనక ఆయనా స్వర్గం మీదుగా వైకుంఠానికి పయనమయ్యాడు.


ఆశ్రమమంతా బోసిపోయింది. అడవి కన్నీటి కడవలా మారింది. క్రూరజంతువులు, రోజులు భారంగా నడుస్తున్నాయి. 


రాముడొస్తాట్ట! ఆ ఒక్కమాటే చెవుల్లో ధ్వనిస్తోంది. ఎలావుంటాడు? ఇంతదూరం రావాలంటే చాలా కాలం పడుతుంది.  తైలసంస్కారం చేసుకునే తీరికుండదు. అడ్డదిడ్డంగా వేలాడే కేశాలకు ఎటువంటి క్లేశమూ కలగకూడదని అడ్డంగా మొలిచిన పూలతీగల్ని తొలగించేది. దారిలో పడివున్న పలుగురాళ్లని దూరంగా విసిరేసేది. ఆలేత పాదాలు కందిపోతే రాయడానికని నూనె సిద్ధం చేసుకునేది. పళ్లన్నీ ఏరికోరి తెంపుకొచ్చేది. పువ్వులైతే సరేసరి. 


రాత్రిపూట దీపం కొడిగట్టకుండా చమురేస్తూ తడిపేది. 

రాముడెంతకూ రాడేమని కన్నులు చెమరిస్తూ గడిపేది.


ఒకటికాదు, రెండుకాదు. పదమూడేళ్లు ఎదురుచూసింది.


కైక కోరిన విధంగా అడవుల పాలైన రాముడు అనతికాలంలోనే భార్యను పోగొట్టుకున్నాడు. ఎక్కడుందో తెలియక అడివంతా గాలిస్తూ ‘కబంధ’ హస్తాల్లో చిక్కుకున్నాడు. వాడొక గంధర్వుడు. శాపవశాత్తూ వికృతరూపంతో, దొరికిన జంతువుల్ని చంపితింటూ బతుకుతున్నాడు. శాపవిమోచనం కొరకై ఎదురుచూస్తూ వేల వత్సరాలుగా అక్కడ పడున్నాడు. 


వాడి భుజాలు కోసిపడేసిన రామలక్ష్మణులు తదుపరి అతడికి అగ్నిసంస్కారం కూడా జరిపించారు. ఆనక నిజరూపం పొందిన నవ మన్మథాకారుడైన కబంధుడు శబరి గురించి రాముడికి చెప్పాడు. వెళ్లి కలవమన్నాడు.


‘నీకోసమై ఎదురుచూసే ఆ కళ్లు గాజుగోళాల్లా మారిపోయాయి. మళ్లీ నీ దర్శనంతో నీలాలుగా మారతాయి. నీకొరకై కోసితెచ్చిన ఫలాలు నీవారగిస్తే ఆమె కలలు సఫలాలవుతాయి. అంచేత నువ్వు వెళ్లు. నీకు చాలా విషయాలలో సాయమొనరిస్తుంది. నీ సీత జాడ కూడా చెప్పగలదు! శుభం!’ అంటూ విమానమెక్కి నిష్క్రమించాడు.


దారిపొడవునా ఎందరో మునులు వారిని ఆహ్వానించారు. తమ ఆశ్రమాల్లో సేదతీరమన్నారు.  నీకేలోటూ రానివ్వమన్నారు. ‘సీతమ్మను మనం కలిసి వెదుకుదాం!’ అనీ అన్నారు. కానీ రాముడికి తెలుసు. నిజభక్తికి నిలువెత్తు నిదర్శనం ఎవరో??


అనేక జంతువులను, సరస్సులను చూశారు. ఎన్నడూ కనని పక్షుల్ని చూశారు.  కూతలు విన్నారు. నడుస్తూనే వున్నారు. 


ఆశ్రమ మార్గం దగ్గరవుతున్న సమయాన శబరికి ఎడమ కన్నదిరింది. ఊతకర్ర సాయంతో పక్షుల కూతలొచ్చిన దిశగా నడుస్తోంది. కళ్లలో కటకాలు సంకటకాలంలో సహకరించట్లేదు. ఏమీ కనబడదాయె!


ఎదురుగా ఏనుగు నిలబడినా తాకి తెలుసుకోవలసిందే! వెలుగుండగానైతే ఫరవాలేదు.


ఎవరో వస్తున్నారు. అడుగుల సడికి ఆకులు నలిగిన శబ్దం రాగయుక్తంగా వినబడుతోంది. 


ఇవాళెందుకో ఈ నీటికోళ్లకి, క్రౌంచ పక్షులకీ అరుపులు ఎక్కువయ్యాయి. రోజూలా లేవు. ఆ అరుపులో బాధ వినబట్టం లేదు. ఎదురుచూస్తున్న ముహూర్తం దగ్గరవుతుందన్న ఆనందమో, ఎద చిందులేస్తున్న సంబరమో...??


ఆ వచ్చేది రాముడేనా? ఎదురుపడి స్వాగతం పలకాలనుంది.


పుష్పాలన్నీ గుదిగుచ్చి మాలచేసి మెడలో వెయ్యాలనుంది!


ఒళ్లంతా పన్నీరు చల్లి, కన్నీరు మున్నీరవ్వాలనుంది!!


మనసు వాయువేగంతో పరుగెడుతోంటే తనువు మాత్రం వయోభారంతో పడిలేస్తోంది. దగ్గరకొచ్చేశారు వాళ్లు. ఎవరో? ఇద్దరని తెలిసింది. నిద్దర వదిలింది. రామలక్ష్మణులని ముద్దరేసుకుంది. 


దగ్గరగా వెళ్లి అరచేతిని నుదుటనుంచుకుని పరికించింది. వెలుగుంటే చక్కగా కనబడుతుంది తనకి. రాముడొచ్చిన వేళావిశేషం, అక్కడంతా వెలుగే! ఆ రాముడి ముఖవర్చస్సుతో ‘అడవిని వెన్నెల కాచిన’ట్లయింది. సీత కనబడలేదన్న అంత విషాదంలోనూ సహజమైన సౌందర్యం మాత్రం ఎప్పటిలానే ప్రకాశిస్తోంది.


‘రామా! నువ్వేనా? నాకుతెలుసు నువ్వొస్తావని. మతంగుని మాట ఊరికే పోతుందా? దా! కూర్చో! ఇదుగో, ఈ రాళ్లమీద కూర్చోండి. బండలేలే! అయినా చల్లగా వుంటాయి. నీకోసం సుఖాసనాలు, సింహాసనాలు తేలేను. భక్ష్యభోజ్యాలు వడ్డించలేను. ఎప్పుడు తిన్నారో, ఉండండి, పళ్లున్నాయి. మాకిక్కడ చాలా పళ్లు దొరుకుతాయి. కానీ వాటిలో నీమాటలా తియ్యటివి కొన్నే వుంటాయి. నేనిస్తాగా? ఏరికోరి నీకందిస్తాను. కడుపారా తిను. ఆనక పంపలో నీళ్లు తాగుదురుగాని. అవైతే సువర్ణజలాలే! మాలిన్యమెరుగని మంచినీరు!’


అంటూ వణికిపోతోంది. లోపలికెళ్లి ఒక బుట్టనిండుగా చాలా పళ్లు తెచ్చిపెట్టింది. రాముడొకటి కొరకబోయాడు. శబరి వద్దని వారించింది. ఒక్కొక్కటీ తీసి కొరికి చూడసాగింది. అందులో చేదున్నవాటిని, పులుపైన వాటిని విసిరికొట్టింది. తియ్యనైనవన్నీ తినమని అరచేతిలో పోసింది.


దాశరథి నిస్సంకోచంగా ఆ ఎంగిలి పళ్లను తినసాగాడు. లక్ష్మణుడు నివారించాలని అన్న భుజమ్మీద చెయ్యేశాడు. కనులు పైకెత్తి తమ్ముడి కళ్లలోకి చూసిన రాముడు చెప్పాల్సిన విషయాన్ని చెప్పకుండగనే అవగతమయ్యేలా చేశాడు.


శబరిది నిష్కళంకమైన భక్తి. నిజమైన సేవ. నిరాడంబరమైన ఆదరణ. అదే భగవంతుడు కోరుకునేది. 


అంతకాలమూ రాముణ్ణి తనకంటే వేరెవరూ అంతలా ప్రేమించలేరన్న అహంతో అలమటించే సౌమిత్రికి శబరిని చూసి కన్నులు తడిశాయి. 


ఎందరో అడుగులకు మడుగులొత్తుతామని పిలిచినా వెళ్లకుండా ఆ బడుగుకి  ప్రసాదించిన ఆ దర్శనంలో రాముడి ఆదర్శం గోచరమైంది. 


నవవిధ భక్తిమార్గాలన్నీ సాధించిన శబరిదే పుణ్యం.


సజ్జనులైన మునులతో సహజీవనం చేసింది.

నిరతమూ హరికథలను వింటూ గడిపింది.

అహర్నిశలూ గురువులకు సేవలొనరించింది.

భగవంతుని గాధలను గానమొనరించింది.

నిత్యమూ ఆతడి నామస్మరణ గావించింది.

తనకోసమని ఏదీ ఆశించని నిస్వార్ధ తత్త్వం కలది.

సకలజీవరాశులయందూ సమాన దృష్టి కలిగివుంది.

కలిగిన దానితోనే సంతృప్తి చెందింది.

కష్టసుఖాలన్నిటినీ ఒకేలా భావించే నిర్వికార స్థితి చేరుకుంది.


రాముణ్ణి దర్శించినంతనే జన్మ చరితార్ధమై సద్గతులకేగింది!


రాముడు మన జీవితానికి మార్గదర్శనం చేసినవాడు. నువ్వు కష్టాల్లో వున్నప్పుడు అరణ్యకాండనీ, స్నేహితుల కోసం సుందరకాండనీ జ్ఞప్తికి తెచ్చుకో! 


తాకడానికే తటపటాయించే జటాయువుని పసిపాపలా సాకాడు. 


అత్యల్పమైన ప్రాణిని సైతం ‘ఉడతాభక్తి’గా ప్రశంసించాడు. 


నిజమైన భక్తి గుళ్లోదీపంలాంటిదని నమ్మాడు. ఎంగిలంటని ఆ వెలుగే హరికి నిక్కమైన ఆరాధనంటూ తెలిపాడు. 


సాధుజనుల సత్కార్యాలలో లోకకల్యాణమే పరమార్ధమని ఎరిగినవాడు. అందుకే అడ్డొచ్చిన దానవుల్ని దారితొలగించాడు. 


అన్నదమ్ములందు అల్పుని చేరదీశాడు. అన్యాయాన్ని అణగద్రొక్కాడు. 


ఎలా జీవించాలో జీవించి చూపాడే తప్ప సూక్తులు, సూక్ష్మాలూ బోధించలేదు. 


మనకు మార్గాన్ని చూపించి తప్పుకోలేదు. ముందు నడుస్తూ నిరూపించాడు.


అందాల రాముడు...

అందువలన దేవుడు!


శుభాకాంక్షలు!


చిత్రకారులు: *స్వర్గీయ బాపు* 


 *జ గ దీ శ్  కొ చ్చె ర్ల కో ట*

అపురూపంగా పుట్టావు.


               🌷🌷🌷

పిల్లలిక పుట్టరేమో అనే సమయాన అపురూపంగా పుట్టావు. 


అవడానికి  పెద్దాడివే అయినా అల్లరిచేశావు. 


అందరాని చందమామకోసం అలకలుపోయావు. 

కాస్త జ్ఞానం రాగానే విద్యలన్నీ బుద్ధిగా నేర్చేసుకున్నావు. 


బాగా చిన్నప్పుడే ఆస్టల్లో పడేసినట్టు ఆ విశ్వామిత్రులవారి వెనకాల పంపిస్తే పేచీలేం పెట్టకుండా బుద్ధిగా వెళిపోయావు. 


ఆయన్నేర్పిన నాలుగు ముక్కలూ వంటబట్టించుకుని తిరిగొచ్చావు. 


ఎంత వీరుడివే అయినా నచ్చిందికదా అని నచ్చినట్టు చేసెయ్యకుండా గురువుగారు చెప్పినట్టు నీ ప్రతిభను ప్రదర్శించాకే ఆవిణ్ణి కట్టుకున్నావు. 


తీరా పెళ్ళయ్యీ భోయనాలకి కూచుందాఁవనుకుంటోంటే ఆయనెవడో గొడ్డలట్టుకు బయల్దేరాడు. 


చెప్పొద్దూ! అంతహంకారం పనికిరాదని మర్యాదగా చెప్పే ధైర్యం ఎవరికీలేదు. 


ఎంతటి పరాక్రమవంతుడైనా గర్వం వుంటే అది ప్రతిభను ఎలా కప్పేస్తుందో చిరునవ్వుతో నిరూపించేశావు.


ఎంత ముద్దు చేసినా పెద్దాళ్ళంటే గౌరవమే చూపిస్తూ మెలిగావు. 


నీకు పట్టాభిషేకం చేద్దామని, ఏదో పెద్దాయన సరదాపడ్డాడే అనుకో ఆవిడగారేమో ఆయాల మాటట్టుకుని నానా యాగీ చేసేసింది. 


నిన్ను రాజుని చెయ్యడానికి వీల్లేదు పొమ్మంది. అక్కడితో ఆక్కండా అడవుల్లోకి పొమ్మని ఆర్డరేసేసింది. 


ఇక్కడుంటే తమిళనాడులోలా మిగతా ఎమ్మెల్యేల్ని ప్రభావితం చేస్తావనో ఏఁవిటో? 


పోనీ అప్పుడైనా మంత్రిపదవి దక్కలేదని మా ఎమ్మెల్యేల్లా అలిగావా? లేదు. 


‘నాన్నారెలా చెబితే అలానే!’ అంటూ డ్రెస్ మార్చేసి ఎక్కడికెళ్ళాలో అడ్రెస్సైనా అడక్కండా బయల్దేరిపోయావు. 


నీకు తోడు ఆవిడా అలాంటిదే! ‘మీరెళితే వెళ్ళండి! నేనిక్కడే మా అమ్మావాళ్ళింటో వుంటాను. మీరొచ్చేముందు ఓవుత్తరం రాసిపడెయ్యండి. వచ్చేస్తా’నన్లేదు. 


తనూ నారబట్టలు కట్టేసుకుని, మావారెక్కడుంటే అక్కడే నాకు వెన్నెలంటూ తయారైపోయింది.


ఇహ మీతమ్ముడు. చిన్నచిన్న సాయాలడగడానికే భయఁవేసేస్తోంది తమ్ముళ్ళని! 


వందచెప్తారు. 


డబ్బడిగితే జేబుఖాళీ అంటారు. 

పన్చెబితే చెయిఖాళీలేదంటారు. 


అలాంటిది నీతోపాటు తనూ తయారైపోయాడు. కష్టాలూ, కన్నీళ్ళూ కలబోసుకున్నారు. 


వాళ్ళతో కలిసి నీమూలాల్ని మరిచి కందమూలాల్నే తిన్నావు. 


నిశ్శబ్దమందిరాల్లో నిదరోయే మహరాజు బిడ్డవే అయినా క్రూరమృగాల కూతలమధ్య, కీచురాళ్ళ మోతలమధ్య ఒఠ్ఠి కిందే పడుకున్నావు.


ఒకటారెండా....పధ్నాలుగేళ్ళు! 


ఎన్నో తప్పులుచేసిన మావాళ్ళైతే గుండెనొప్పని చెప్పేసి పొలోమని అపోలోలో చేరిపోతారు. 


జెయిలంటే బెయిలంటారు. కనీసం ఒక్కనెలయినా మా సరదా తీర్చకుండా బయటే ఊరేగుతూ వుంటారు.


అలాంటిది నువ్వేతప్పూ చెయ్యకుండానే దండకారణ్యాల్లో దండననుభవించావు. 


అందమైన జీవితాన్ని అడవిపాలు చేసేసుకున్నావు. అడవికాచిన వెన్నెల్లోనే సీతమ్మతో ఆనందాన్ని పంచుకున్నావు. 


నిన్నర్ధంచేసుకోడానికి మాకెన్ని యుగాలైనా సరిపోవట్లేదు. 


ఇంటో అన్నీ వుంటేనే పెళ్ళాంకోరిన సినిమాకి తీసికెళ్ళడానికి తీరికలేదంటాం! 


అట్టాంటిది ఆవిడేదో సరదాపడిందని, ఆ లేడికన్నుల్లో బంగారులేడిని చూసి మెరిసిన ఆనందాన్ని చూసి, మురిసి మురిపం చెంది,  తెద్దాఁవని బయల్దేరావు.


మాయలూమంత్రాలతో కట్టుకున్నదాన్ని పట్టుకెళిపోతే చెట్టుపుట్టల్ని వేడుకున్నావు. చెట్టపట్టాలేసి కోతులతో కలిశావు. 


ఏ మాయా చెయ్యలేదు. కుతంత్రాలూ లేవు. 


నిస్సహాయతనేది సామాన్య మానవుణ్ణి ఎలా బాధిస్తుందో నిరూపించావు. 


మా హీరోల్లా విలనింట్లోనే కుటుంబమంతా చేరి, వాళ్ళందర్నీ వెర్రిపీనుగుల్ని చేసి ఆడేసుకుని, చివరాఖర్న వాళ్ళింటమ్మాయిని తెచ్చేసుకోలేదు. 


ఎంతో ఇష్టంకాబట్టే ఎంత కష్టపడాలో అంతాపడ్డావు. 


ఏ సాయమూ దొరక్కపోతే దొరికిన సాయాన్ని ఎలావాడుకోవాలో నువుచెప్పినట్టు ఏ మనోవైజ్ఞానిక గ్రంథాలూ చెప్పలేదు. 


తాతయ్య నోటివెంట నీ కథ విన్న ప్రతి మనవడికీ వచ్చే మొదటనుమానం కోతుల్నెలా లొంగదీసుకోడమని! 


అదీ చూసేవాళ్ళం మా చిన్నతనాల్లో! చెప్పినపనల్లా చేసిపెట్టే కోతుల్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయేవాళ్ళం! 


వాటికి శిక్షణనివ్వడానికి వాడెంతకాలం కృషిచేశాడో తెలీని మాకు వినోదమే కనబడేది! 


ఇపుడాలోచిస్తే నిలకడలేని ఆ వానరుల ఓనరుతో నువు చేసిన స్నేహమూ, ఆనక వాళ్ళ సాయంతోనే నువు కట్టిన వారధీ చూస్తే... 


దుస్సాధ్యం వుంటుందేమోగానీ అసాధ్యమనేది వుండబోదని అనిపిస్తుంది!


సెభాషోయ్ రామా! నీ గురించి మొదలెడితే నిండిపోయింది మనసు. నిద్రా, నీళ్ళూ గుర్తురావట్లా! 


నిజాయితీకి నిదర్శనం, నిరాడంబరతకి నిలువెత్తు దర్పణం నీ జీవితం!


నిలకడ లేని వాళ్ళతో పొంతన

నీళ్ళను దాటడానికొక వంతెన

నిర్భయమేగావుంటే నీచెంతన

నిరాధారులకిచ్చావు సాంత్వన

నికార్సైనది నీ మార్గం ఎంతైనా

నిరతమూ మాకదేకదా చింతన


నీకందుకే మండే ఎండల్లోనూ కిక్కిరిసిన పందిళ్ళలో కిక్కురుమనకుండా కూర్చుని కళ్యాణం జరిపిస్తాం!


నకనకలాడే ఆకలికి పానకాలతోనే పొట్టనింపుకుని 

నీకన్నంపెట్టిన తరవాతే ముద్దమింగుతాం!


పదిమందీ కలిస్తే పండగ! 

పదిమందికి మంచిచేస్తే కళ్యాణం! 

పదిమందికి అన్నంపెట్టడం లోకకళ్యాణం!


అందాలరాముడు....

అందువలన దేముడు!!


..........జగదీశ్ కొచ్చెర్లకోట

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...                                  


*స్తోత్ర పఠనం..విధి విధానాలు..*


*(ఐదవ రోజు)*


శ్రీ స్వామివారు ఆదేశించిన మీదట, ప్రభావతి గారు ఆదిత్యహృదయం స్తోత్రాన్ని రోజూ తాను పఠించే విధంగా గబ గబా చెప్పేసారు..ఈసారి ఎటువంటి తడబాటూ లేదు..ఒక్క అక్షరమూ తప్పు పోలేదు..మొత్తం ముప్పై ఒక్క శ్లోకాలూ గడ గడా చెప్పేసారు..రెండు మూడు నిమిషాల్లోనే పూర్తి స్తోత్రం చెప్పడం అయిపోయింది..


ఆదిత్య హృదయం స్తోత్రం విన్న స్వామివారు..ప్రభావతి గారి వైపు చూసి..ఒకింత అసహనంగా.."ఏమిటమ్మా ఆ వేగం?..అమ్మా!..నువ్వు చదివిన స్తోత్రం నీకు అర్ధమైందా?..ఆ ఆదిత్యుడు కూడా ఈ వేగం అందుకోలేడమ్మా..ఇలా రోజూ పారాయణం చేస్తే ప్రయోజనము వుందా తల్లీ!..తపశ్శక్తి సంపన్నులైన మహర్షుల నోటి నుంచి దేవభాష అయిన సంస్కృతంలో బీజాక్షర సహితంగా రూపుదిద్దుకున్న స్తోత్రాన్ని..నువ్వు ఒక్క క్షణంలో వల్లె వేసావే.. ఆ మంత్రాల్లోని సుస్వరమూ..సంధులూ.. సమాసాలూ..ఒక నియమానుసారంగా వుండి.. ఉచ్ఛారణలో ఆ మంత్ర శక్తి ప్రాణం పోసుకుంటుంది..ఆ మంత్రోచ్ఛారణే మనం పూజించే దైవాన్ని నామరూపాలతో మన హృదయానికి సాక్షాత్కరింపచేసే ఉత్తమ మార్గం అవుతుంది..ఎంతో మహిమాన్వితమైన ఆదిత్యహృదయ స్తోత్రం అగస్త్య మహాముని విరచితం..వాల్మీకి మహర్షి వ్రాసిన ఆదికావ్యం రామాయణం లో చెప్పబడింది..అటువంటి స్తోత్రాన్ని నువ్వు ఎంత తక్కువ సమయంలో అప్పచెప్పుతానా అన్నట్లు చెప్పేసావే..ఇది కాదు పద్ధతి!.." 


"ఒక స్తోత్రాన్ని చేసేటప్పుడు..అందులోని ప్రతి అక్షరము..సంధి..సమాసము..దానిలోని అర్ధమూ..స్పష్టమైన ఉచ్ఛారణతో.. మన మనసుకు తెలుసుకుంటూ చేస్తే..ఆ మంత్రాధి దేవతకు నిజమైన పూజ చేసినట్లు..అంతేకానీ..ఇప్పుడు నువ్వు చదివినట్లుగా..ఇదిగో, ఇన్ని నిమిషాల లోపు ఈ స్తోత్రం చదవడం అయిపోవాలి అని లెక్క పెట్టుకొని చేసేది పూజ కాదమ్మా..అసలు నీ మనసంతా ఎంత సమయంలో పూర్తి చేసామనే విషయం మీద కేంద్రీకృతమైనప్పుడు ఇక భగవంతుడి గురించిన చింత ఎక్కడుంది?..కొద్దిసేపు పూజ చేసినా..ఏకాగ్రచిత్తంతో భగవంతుడిని సాక్షాత్కరించుకునే విధంగా చేయాలి..చిత్తశుద్ధి ముఖ్యం..ఇక మీదట నువ్వు ఏ స్తోత్రాన్ని చేసినా..మెల్లిగా ఆ స్తోత్ర అర్ధాన్ని ఆకళింపు చేసుకుంటూ..ఆ దేవీ దేవుళ్ళ రూపాలను మనసులో ప్రతిష్టించుకొని చేయి..ఫలితం ఉంటుంది.."


"అహంకారం తొలిగిపోనంతవరకూ..మనసు వాసనారహితం కానంతవరకూ..బ్రహ్మజ్ఞానం గోచరం కాదు..అందుకు సద్గురు కృప ఉండాలి తల్లీ!..ఆత్మ సర్వ జీవులలోనూ వ్యాపితమై ఉంటుందని అందరూ చెపుతారు..కానీ ఆ ఆత్మతత్వాన్ని ఎవరూ ఇతమిద్ధంగా వర్ణించలేరు..ఆత్మ సాక్షాత్కారమూ సులభంగా పొందలేరు..గురువు అనుగ్రహమొక్కటే జ్ఞానాన్ని పొందే మార్గాన్ని చూపిస్తుంది..సద్గురువుల, సాధు సత్పురుషుల సాంగత్యం తోనే బ్రహ్మ జ్ఞానాన్ని పొందగలరు..నిత్య నైమిత్తిక కర్మలు యధావిధిగా ఆచరించాలి..శుద్ధమైన మనసుతో, సంస్కారయుతంగా కర్మలను చేయాలి.."


ఇలా చెపుతున్న స్వామివారి వాక్ప్రవాహం అంతటితో ఆగలేదు..శ్రీధరరావు దంపతుల కు ఉపనిషత్తుల గురించి..వాటి లోని ముఖ్యమైన శ్లోకాలు..వాటి అర్ధాలు..వాటి ఉచ్చారణ..భగవద్గీతా శ్లోకాలు..భక్తి, జ్ఞాన యోగాలు..గంగా ప్రవాహంలా ఆయన నోటినుంచి జాలువారుతున్నాయి..   ఉదయం 10 గంటలకు స్వామివారి వద్ద కూర్చున్న ఆ దంపతులిద్దరికీ..సమయమెంత గడిచిందో గుర్తుకురాలేదు..సాయంత్రం 4 గంటల దాకా ఒకే ఆసనంలో కూర్చుని శ్రీ స్వామివారు చేసిన బోధ వాళ్ళిద్దరి హృదయాలలో నాటుకొని పోయింది..


మాలకొండ వచ్చి, పార్వతీదేవి మఠం వద్ద మొదటి సారి ఆ యోగిని దర్శించుకోవడం..ఆయన ఉపదేశము విన్న ప్రభావతి గారికి మనసులో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలై పోయాయి..తాము దర్శించుకున్నది సాధారణ మానవుణ్ణి కాదనీ..సాక్షాత్ జ్ఞాన స్వరూపమే ఈ యోగిపుంగవుడి రూపంలో ఇక్కడ నడయాడుతోందనీ అర్ధమైంది..ఇంతకాలం ఈయన గురించి తన భర్తగారు చెప్పిన ప్రతి మాటా అక్షర సత్యమని బోధపడింది..


"శ్రీధరరావు గారూ..పొద్దుకూకుతోంది.. మీరు మళ్లీ మీ గ్రామం చేరాలి..బైలుదేరండి!..నాకూ జపానికి వేళయింది.." అంటూ శ్రీ స్వామివారు హెచ్చరించాకగానీ...వాళ్ళు ఇహ లోకంలోకి రాలేదు..

దంపతులిద్దరూ వెళ్ళొస్తామని శ్రీ స్వామివారికి చెప్పి, పార్వతీదేవి మఠం వెలుపలికి వచ్చేసారు..శ్రీ స్వామివారు తలూపి..పార్వతీదేవి అమ్మవారికి నమస్కారం చేసుకొని, వీళ్లిద్దరి దగ్గరకూ వచ్చి..ఆశీర్వదించినట్లుగా చేయెత్తి ఊపి..లోపలికి వెళ్లిపోయారు..


మాలకొండ నుంచి తిరిగి ఆ దంపతులిద్దరూ మొగలిచెర్ల కు తమ రెండెడ్ల బండిలో పయనమయ్యారు..దాదాపు ఆరు ఏడు గంటలపాటు శ్రీ స్వామివారి వద్ద గడిపి, తాము పొందిన అనుభూతి ని ఇద్దరూ మాట్లాడుకోసాగారు..


"స్వామి వారి పూర్వాశ్రమం గురించి మీరేమన్నా కనుక్కున్నారా?..వారిది ఏ ఊరు?..తల్లిదండ్రులెవరు?..మాలకొండకు ఎప్పుడు వచ్చారు?.." అని ప్రభావతి గారు భర్తను అడిగారు..శ్రీధరరావు గారు.."కొంత వివరం సేకరించాను ప్రభావతీ..ఇంటికెళ్లి మాట్లాడుకుందాం.."అన్నారు..


శ్రీ స్వామివారి పుట్టుపూర్వోత్తరాలు...రేపటినుంచీ తెలుసుకుందాము...


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

వారాలను

 *🕉వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా?*🕉


"మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః "

- అంటే అర్ధం తెలుసా???

SUN'DAY

MO(O)N'DAY

TUESDAY

WEDNESDAY

THURSDAY

FRIDAY

SATUR(N)DAY

- అంటే ఏమిటో తెలుసా?

అసలు ఈ వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా?


వీటిని కాపీ కొట్టి, ఇవి మావే అని డబ్బా కొట్టుకుంటున్నది ఎవరో తెలుసా?

సూర్యహోర

చంద్రహోర

కుజహోర

బుధహోర

గురుహోర

శుక్రహోర

శనిహోర - అంటే తెలుసా?

ఇవి సంస్కృత గ్రంధాలలో మన ఋషులు చేసిన వారాల విభాగమని తెలుసా?

ఇవి ఎంతో శాస్త్రీయమైనవి కాబట్టే, బ్రిటిష్ వాళ్లు వీటిని తమ క్యాలెండర్ లో పేర్లు మార్చి, వాటిని వారి విజ్ఞానంగానే ప్రపంచాన్ని నమ్మిస్తున్నారని తెలుసా?

తెలియదా!? 

సరే... ఇప్పుడైనా తెలుసుకుందాం! రండి!

ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు - అక్కడి నుంచి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి!

వారము - అంటే 'సారి' అని అర్ధము.

1వ సారి, 2వ సారి... అంటాము కదా దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము, ద్వితీయ వారము - అని అంటారు!

కాస్త విపులంగా....

భూగోళము బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందని మన ఋషులు కనుగొన్నారు. 

భూగోళము తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్ని "ఒక వారం" అని పిలిచారు. ఒకసారి అన్నా - ఒక వారం అన్నా ఒకటే. 

ఆకాశంలో గ్రహాల వరస ఎలా ఉందో, సూర్య సిద్ధాంత గ్రంధంలో రికార్డు చేయబడి ఉంది.



#మందా_మరేడ్య_భూపుత్ర_సూర్య_శుక్ర_బుధేందవః

అనగా... పై నుండి క్రిందికి వరుసగా - శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలున్నాయి. 


ఆకాశంలో గ్రహాలు ఈ వరసలో ఉంటే, వారాల్లో సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని అనే వరసలో ఎందుకున్నాయి? 


ఆ గ్రహాల వరసకి, ఈ వారాలకీ అసలు సంబంధం ఏమిటి? దీంట్లో ఏం లాజిక్ ఉంది? ఇది కేవలం మూఢ విశ్వాసమా?

ఈ విషయాలు తెలియాలంటే, భారతీయ ఋషుల విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి.


భూమి తనచుట్టూ తాను తిరగడానికి 60 ఘడియలు పడుతుంది. 

ఈ 60 గడియలలో ఈ 7 గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించారు.

ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే ఒక "అహః" ప్రమాణంలో 24 భాగాలు కనిపించాయి. 

ఆ భాగాలను వారు "హోర" అన్నారు.

"అహః ప్రమాణం" అన్నా, "అహోరాత్ర ప్రమాణం" అన్నా ఒక్కటే. అహోరాత్ర అనే పదంలో మధ్య రెండక్షరాలు కలిపితే "హోర" అయింది.

దీన్నే సాంకేతిక పదంగా తీసుకొని రోజుకి 24 హోరలు అన్నారు. 

ఈ హోర పదాన్ని అవర్(HOUR) గా మార్చి పాశ్చాత్యులు 24 అవర్స్(HOURS) అన్నారు.

హోర శబ్దానికి అవర్ శబ్దానికి ఉన్న భాషాశాస్త్రపరమైన సామ్యాన్ని(పోలిక) పరిశీలించినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోక తప్పదు.


ఒక్కొక్క గ్రహాల ప్రభావం అదే వరుసలో భూమిమీద ప్రసరిస్తూ చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది. 

ఈ భ్రమణంలో చిత్రమేమిటంటే, ఇవాళ - ఆదివారం అయితే ఈరోజు మొదటి హోర, సూర్యహోర వస్తుంది. ఇందాక చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో... ఒక్కొక్క హోరనూ పంచుకుంటూ వస్తే మర్నాడు ఉదయానికి సరిగ్గా చంద్ర హోర ఉంటుంది. 

కనుక ఆ రోజు చంద్రవారం లేక సోమవారం.

మళ్లీ వరుసగా హోరలు పంచుకుంటూ వెళితే ఆ మర్నాడు ఉదయానికి మంగళహోర వస్తుంది. కనుక ఆ రోజు - మంగళవారం,

ఆ మరునాడు ఉదయానికి బుధహోర - బుధవారం ఆ మరునాడు ఉదయానికి గురుహోర అది -గురువారం.

ఆ మర్నాడు ఉదయానికి ఈ శుక్రహోర - శుక్రవారం. ఆ తరువాత ఉదయానికి శని హోర - అది శనివారం. ఇలా సూర్యోదయ సమయానికి ఉండే హోర మీద ఏ గ్రహం ప్రభావం ఉంటుందో ఆ గ్రహమే ఆ రోజుకు పేరు అవుతుంది.

అయితే... ఈ విధానం వినడం కొత్త అయిన హేతువాద, నాస్తిక, పచ్చ బాబులకు... మొదటి రోజు సూర్యోదయ సమయానికి సూర్యహోర అవుతుందనుకుంటే కదా ఈ లెక్కలన్నీ...ఇలా వచ్చేది! 

అసలు అలా ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న సహజం. 

వస్తున్నా... అక్కడికే వస్తున్నా...

ఎందుకనుకోవాలంటే - సూర్యుడి(ఆనాటి నిరక్షరాస్యునికి కూడా విపులంగా అర్ధం కావడం కోసం మన ఋషులు సూర్యున్ని గ్రహం గా తీసుకున్నారని గమనించాలి) - ఆధిపత్యంలో... సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న ఘడియలో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి. 


దీన్నే మరోరకంగా చెప్పుకుంటే సృష్టి ప్రారంభంలో ఏ గ్రహం ప్రభావం అమలులో ఉందో ఆగ్రహం పేరే ఆదిత్యుడు. అంటే మొదటివాడు.

అదే మొదటిరోజు. 

అందువల్ల ఆ రోజు ఆదివారం అవుతుంది.

ఆదివారం అన్నా, ఆదిత్యవారం అన్నా ఒకటే. 

అక్కడినుంచి ఒక హోరకు ఒక గ్రహంగా ఇప్పుడు చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో గ్రహాలను పంచుకుంటూ వస్తే, మర్నాడు సూర్యోదయానికి మొదటి గ్రహం నుంచి నాలుగో గ్రహం యొక్క హోర వస్తుంది. ఈ లెక్క ప్రతిరోజు ఇలాగే సాగుతుంది. ఈ లెక్క ప్రకారం, హోరాధిపతుల వరస ఆదిత్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని - ఈ విధంగా వస్తుంది.


అందుకే వారాల పేర్లు ఈ వరసలోనే వచ్చాయి.

ఈ విధంగా ఆకాశంలో ఉండే గ్రహాల వరస వేరుగా, వారాల వరస వేరుగా అయింది. 


ఈ సత్యాన్ని అన్ని దేశాల్లో ఇలాగే పాటిస్తున్నా, ఇవాల్టి వైజ్ఞానిక లోకానికి కూడా " ఫలానా ఈ వారానికి ఈ పేరే ఎందుకు రావాలి?" అనే విషయం తెలియదు. 


అది భారతీయులైన మహర్షులకే తెలిసిన సత్యం! 


కాబట్టి హేతువాదులని చెప్పుకునే కుహనా మేధావులారా! అన్యమత సంస్కృతులను మూఢాచారాలని నమ్మే కమ్మే వారాల పేర్లు ఇతరమత గ్రంథాల్లో ఇమడవు కదా! 


మరి ఆ మాక్స్ ముల్లరూ, విలియం జోన్సూ, రిస్లే బాస్టెడూ ఎందుకు వీటిని తీసెయ్యలేకపోయారూ? 

పేర్లు మార్చి, కాపీ కొట్టి ఇవి మావేనని ఎందుకు జబ్బలు చరుచుకుంటున్నారు??? ఎందుకంటే ఇవి బైబిల్ చట్రంలో ఇమడలేదు, తీసెయ్యడానికి కుదరలేద!


అదీ...భారతీయ ఋషుల గొప్పదనం! 

నేటికైనా తెలుసుకోండి.. తెలియకపోయినా పాటించండి! సనాతన ధర్మ సంస్కృతిలో ప్రతీదీ మనిషికి పనికొచ్చే సైన్సే తప్ప వేరే కాదు 

జై గురుదేవ్.. 🙏