31, అక్టోబర్ 2021, ఆదివారం

శివ పరమాత్మ బోధించిన ఆరోగ్య రహస్యం

 శివ పరమాత్మ బోధించిన ఆరోగ్య రహస్యం


మీ మనస్సు ఎలా ఆలోచిస్తుందో మీరు అలాగే తయారవుతారు అందువలన ఎప్పుడూ మిమ్మల్ని మీరు రోగిగా భావించకండి. మంచిగా అవుతాను అనే కోరికను ఎప్పుడూ వదలకండి. మీ ప్రతీ బాధ త్వరలోనే తొలగిపోతుంది, నవ జీవితం మీకు తిరిగి తప్పక లభిస్తుంది. దు:ఖం యొక్క లక్ష తుఫానులు వచ్చినా కానీ భగవంతుడు మీ తోడుగా ఉన్నారు. ఈ అదృష్టాన్ని చూసుకుని మురిసిపోండి. స్వయాన్ని దేహానికి అతీతంగా ఆత్మగా భావించి మనస్సుని శివపరమాత్మతో జోడించండి, శరీరానికి ముందు ఎంత అవసరమో మనస్సుకి పరమాత్మ స్మృతి అంతే అవసరం, ప్రతి శ్వాసలోను శివ తండ్రి జ్ఞాపకం ఉంటే ఎలాంటి  రోగం అయినాతగ్గిపోతుంది. . మనస్సుని అచంచలంగా ఉంచుకునే వారు నిరోగి శరీరాన్ని తిరిగి పొందుతారు. మీలో ధైర్యాన్ని ఎప్పుడూ వదలకండి, సదా సంతోషంగా ఉండండి. అప్పుడు ఎటువంటి బాధ అయినా దూరం అయిపోతుంది. జ్ఞాన దీపాన్ని మనస్సులో వెలిగించుకుని ప్రతి సమస్యను ఆటగా భావించి నడవండి. గౌరవం-అగౌరవం, జయం-పరాజయం ఏదైనా సరే అన్నిటిని సమదృష్టితో చుడండి. మీ మనస్సుని స్థిరంగా చేస్కోండి అప్పుడు సదా మీరు ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా వుంటారు. ఎటువంటి ఉద్రేకాలకు లోను కాకండి. ప్రశాంతంగా వుండండి. ఇతరులతో సున్నితంగా మాట్లాడండి. అప్పుడు వారు కూడా మీ యెడల సద్భావనతో వుంటారు. ఆవేశం అనారోగ్యహేతువు అని గుర్తుంచుకోండి. ప్రేమే ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇస్తుంది మరవకండి. 

అన్నింటిలోను మనసారా శివపరమాత్మను జ్ఞాపకం చేయండి.  

సంస్కృత మహాభాగవతం

 *31.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఇరువదియవ అధ్యాయము*


*జ్ఞాన, కర్మ, భక్తి యోగములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*20.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*యత్కర్మభిర్యత్తపసా జ్ఞానవైరాగ్యతశ్చ యత్|*


*యోగేన దానధర్మేణ శ్రేయోభిరితరైరపి॥13037॥*


*20.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*సర్వం మద్భక్తియోగేన మద్భక్తో లభతేఽఞ్జసా|*


*స్వర్గాపవర్గం మద్ధామ కథంచిద్యది వాంఛతి॥13058॥*


కర్మతో, తపస్సుతో, జ్ఞానవైరాగ్యములతో, యోగముతో, దానధర్మములతో ఇతర శ్రేయస్సాధనములతో ఏయే ఫలములు లభించునో, వాటినన్నింటినీ భక్తిప్రభావముచే నా భక్తుడు అవలీలగా పొందగలడు. ఒకవేళ నా భక్తుడు స్వర్గమునుగానీ, మోక్షమునుగానీ, నా ధామమునుగానీ ఏది కోరిననూ దానిని అతడు సునాయాసముగనే పొందగలడు.


*20.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*న కించిత్సాధవో ధీరా భక్తా హ్యేకాంతినో మమ|*


*వాంఛంత్యపి మయా దత్తం కైవల్యమపునర్భవమ్॥13039॥*


నా యొక్క ఏకాంతభక్తుడు ధీరుడై, సాధుశీలిగా నుండును. అతడు ఏదీ కోరనే కోరడు. ఒకవేళ నేను స్వయంగా కైవల్యమును లేదా మోక్షమును ఇచ్చిననూ, వాటిని అతడు కోరడు. కోరుమని కోరినా నాయందు భక్తిని తప్ప వేరేదానిని కోరనేకోరడు.


*నాఽఽస్థా ధర్మే న వసునిచయే నైన కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్! పూర్వకర్మానురూపమ్|*


*ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్నజన్మాంతరేఽపి త్వత్పాదాంభోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు॥*


దేవా! నాకు జన్మజన్మలయందును నీ పాదపద్మములను సేవించుచుండెడి నిశ్చలభక్తి అబ్బిన చాలును. మఱి దేనినీ వాఛింపను అని అన్నారు భక్తశిరోమణియైన ఆళ్వారులవారు. (ముకుందమాల 5)


*20.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*నైరపేక్ష్యం పరం ప్రాహుర్నిఃశ్రేయసమనల్పకమ్|*


*తస్మాన్నిరాశిషో భక్తిర్నిరపేక్షస్య మే భవేత్॥13040॥*


ఉద్ధవా! నిరపేక్షము అనగా అపేక్ష లేకుండుట సర్వోత్కృష్టము. ఉత్తమోత్తమము. పరమమంగళప్రదము. ఎంతో గొప్పది. కావున, నిష్కాముడు, నిరపేక్షుడు ఐన వానికే నా యందు అనన్యభక్తి పాదుకొనును. 


*20.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*న మయ్యేకాంతభక్తానాం గుణదోషోద్భవా గుణాః|*


*సాధూనాం సమచిత్తానాం బుద్ధేః పరముపేయుషామ్॥13041॥*


నాయందు ఏకాంతభక్తి గలిగినట్టి మహాత్ములు సమచిత్తమును కలిగి, సమదర్శనులై బుద్ధికి అతీతమైన పరమతత్త్వమును పొందెదరు. అట్టివారిని గుణదోషములతో ఏర్పడు గుణములు ఎంతమాత్రము బాధింపవు.


*20.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*ఏవమేతాన్ మయాఽఽదిష్టాననుతిష్ఠంతి మే పథః|*


*క్షేమం విందంతి మత్ స్థానం యద్బ్రహ్మ పరమం విదుః॥13042॥*


ఉద్ధవా! ఈ విధముగా నాచే ఉపదేశింపబడిన జ్ఞాన, భక్తి, కర్మమార్గములను అనుష్ఠించువారలు నా యొక్క పరబ్రహ్మతత్త్వమును ఎరుగుదురు. కావున వారలు మిగుల కళ్యాణస్వరూపమగు నా పరంధామమును క్షేమముగా చేరుకొందురు.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే వింశోఽధ్యాయః (20)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *జ్ఞాన, కర్మ, భక్తి యోగములు* అను ఇరువదియవ అధ్యాయము (20)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కార్తీక_మాస_విశిష్టత

 💐💐💐#కార్తీక_మాస_విశిష్టత💐💐💐


శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీకమాసం నెలరోజులూ పర్వదినాలే. కార్తీకంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి, తులసికోట ముందు భగవన్నామ సంకీర్తన చేస్తూ ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండి అలౌకికమైన, అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. మామూలు రోజులలో భగవదారాధన మీద అంతగా శ్రద్ధ పెట్టనివారు, గుడిలో కాలు పెట్టని వారిని సైతం పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణమే గుడికి తీసుకెళ్తుంది. వారిని దేవుని ముందు కైమోడ్చేలా చేసి, పాపాలు పటాపంచలు చేసి మోక్షప్రాప్తి కలిగిస్తుంది ఈ మాసం. అందుకే ఇది ముముక్షువుల మనసెరిగిన మాసం.


న కార్తీక నమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్ నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః


కార్తీక మాస మహాత్మ్యాన్ని మొదటగా వశిష్ట మహర్షి జనక మహారాజుకు వివరించగా శానకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు.


కార్తీక మాసంలో ఆర్చనలు, అభిషేకాలతోపాటు, స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవే. నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్ల కాలువలలోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపీ, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు మొదలయిన నదులన్నింటి నీరూ ఉందని భావించాలి.


కార్తీకమాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతోటీ, కమలాలతోటి పూజిస్తే జీవించినన్నాళ్లూ ధనానికి లోటు లేకుండా ఉండి, సమస్త సౌఖ్యాలు కలగటంతోపాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుందట. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున, మాసశివరాత్రినాడు, సోమవారం నాడు, కార్తీక పున్నమి నాడూ రుద్రాభిషేకం చేసి, బిల్వదళాలతోనూ, రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతోబాటు అంత్యమున శివసాయుజ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది.


ఈ మాసంలో ప్రతి రోజూ పుణ్యప్రదమైనదే. అయితే ఏ తిధిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.


కార్తీక శుద్ధపాడ్యమి: తెల్లవారు జామునే లేచి స్నానం చేసి, అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికెళ్లి, 'నేను చేయ దలచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి.


విదియ: ఈ రోజు సోదరి ఇంటిల్లి ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి.


తదియ: అమ్మవారికి కుంకుమపూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి.


చవితి: కార్తీక శుద్ధ చవితి: నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి పుట్టలో పాలు పోయాలి.


పంచమి: దీనికి జ్ఞానపంచమి అని పేరు. ఈ రోజు సుబ్ర హ్మణ్య ప్రీత్యర్థం ఆర్చనలు చేయించుకున్నవారికి జ్ఞానవృద్ధి కలుగుతుంది.


షష్టి: నేడు బ్రహ్మచారికి ఎర్రగ కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. 


సప్తమి: ఈరోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్షు వృద్ధి అవుతుంది. 


అష్టమి: ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలనిస్తుంది.


నవమి: నేటి నుంచి మూడు రోజులపాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.


దశమి ఈ రోజు రాత్రి విష్ణుపూజ చేయాలి.


ఏకాదశి: ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు. ఈ రోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. 


ద్వాదశి: ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి. నేటి సాయంకాలం ఉసిరి మొక్క. తులసి మొక్కల వద్ద దామోదరుని ఉంచి పూజ చేసి, దీపాలు వెలిగించడం సర్వపాపాలనూ నశింపచేస్తుంది.


త్రయోదశి: ఈరోజు సాలగ్రామ దానం చేయడం వల్ల సర్వకష్టాలూ దూరమవుతాయి.


చతుర్దశి: పాషాణ చతుర్ధశి వ్రతం చేసుకునేందుకు మంచిది.


కార్తీక పూర్ణిమ: మహా పవిత్రమైన ఈ రోజు నదీస్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వపాపాలూ ప్రక్షాళనమవుతాయి.


కార్తీక బహుళ పాడ్యమి: ఈ రోజు ఆకుకూర దానం చేస్తే శుభం.


విదియ: వనభోజనం చేయడం విశేష ఫలాలనిస్తుంది. 


తదియ: పండితులకు, గురువులకు తులసి మాలను సమర్పించడం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి.


చవితి: పగలంతా ఉపవసించి, సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించి, ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పడుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సకల సంపదలూ కలుగుతాయి.


పంచమి: చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం తినిపించడం శుభఫలితాలనిస్తుంది.


షష్ఠి: గ్రామదేవతలకు పూజ జరిపించడం మంచిది.


సప్తమి: జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి అవుతాయి.


అష్టమి: కాలభైరవాష్టకం చదివి గారెలతో దండచేసి, కాల భైరవానికి (కుక్కకు) సమర్పించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.


నవమి: వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు.


దశమి: ఈ రోజు అన్న సంతర్పణ చేస్తే విష్ణు వుకు ప్రీతిపాత్రులై, కోరికలు తీరతాయి.


ఏకాదశి: విష్ణ్వాలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ విశేషఫల ప్రదం.


ద్వాదశి: అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించడం శుభప్రదం.


త్రయోదశి నవగ్రహారాధన చేయడం వల్ల గ్రహదోషాలు తొలగుతాయి.


చతుర్దశి: ఈ మాస శివరాత్రినాడు చేసే ఈశ్వరార్చన, అభిషేకం అపమృత్యుదోషాలను, గ్రహబాధలను తొలగిస్తాయి.


అమావాస్య: నేడు పితృదేవతల పేరిట అన్నదానం లేదా ఉప్పు పప్పుతో కూడిన సమస్త సంబారాలను దానం చేయడం వల్ల పెద్దలకు నరక బాధ తొలగి, స్వర్గసుఖాలు కలుగుతాయి.


ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ లేదా కనీసం ఒక్క సోమవారం నాడయినా సరే నియమ నిష్టలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం తనవల్ల కాదని బ్రహ్మ చెప్పాడు. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలూ భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతివృత్తాలు, ఉపకథలను బట్టి తెలుస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, సత్యనారాయణస్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలు.


గడపదాటి వెళ్లనివారు సైతం కార్తీక మాసంలో వన సమా రాధనలో వనసమారాధనలో ఉసిరిగ చెట్టు నీడన సాలగ్రామ రూపంలో శ్రీహరిని పూజించి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధన చేసిన వారిని యముడు కన్నెత్తి కూడా చూడలేడని కార్తీక పురాణం బోధిస్తోంది. వనభోజనం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి విష్ణుసాయుజ్యం పొందుతారు. కార్తీకమాసంలో వనభోజనం ఎవరు చేస్తారో, పురాణం ఎవరు వింటారో వారికి ఉత్తమ గతులు కలగడంతో పాటు హోమం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు, దేవతార్చన సమయంలో, పితృతర్పణ సమయంలో, భ్రష్టులు, చండాలురు, సూతకం ఉన్న వాళ్ల మాటలు వినడం వల్ల కలిగే పాపాలు తొలగుతాయి.


కార్తీకమాసం విష్ణుస్వరూపమని విష్ణు భక్తులు, కాదు, ఈశ్వరార్చనే ప్రశస్తమని శివభక్తులు భావిస్తారు. ఒకరకంగా ఆ ఇరువురిదీ వాదనా సరైనదే. ఎలాగంటే ఈ మాసం శివకేశవులకిరువురికీ ప్రీతిపాత్రమైనదే.


తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోరాదు. ఎవ్వరికీ ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవదూషణ తగదు. దీపారాధనలకు తప్ప నువ్వులనూనెను ఇతరత్రా అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు. నలుగు పెట్టుకుని స్నానం చేయరాదు. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు.


ఈ మాసంలో చేసే ఉపవాసం, జాగరణ, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్నిస్తాయి. విష్ణువును తులసి దళాలు, మల్లి, కమలం జాజి, అవి సెపువ్వు, గరిక. దర్భలతోను, శివుని బిల్వదళాలతోనూ, జిల్లేడుపూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమ గతులు కలుగుతాయి. శక్తి లేని వారు ఉదయం స్నానం, జపం, దేవతారాధన యధావిధిగా చేసి మధ్యాహ్న భోజనం చేసి, రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు, పళ్లు తీసుకోవచ్చు.

బహుముఖ శివలింగం -

 బహుముఖ శివలింగం - 360 శివ ముఖాలతో శివలింగం

 కుడల్ సంగమేశ్వర్, షోలాపూర్, కర్ణాటక


 శ్రీ హరిహరేశ్వర్ ఆలయ త్రవ్వకాల్లో లభించిన అసాధారణ శిల్పం ఇది. ఇది లింగ ఆకారంలో ఉంటుంది మరియు నాలుగు మీటర్ల చుట్టుకొలత మరియు నాలుగున్నర టన్నుల బరువు ఉంటుంది.

శిల్పం పై నుండి కింది వరకు ఎత్తు 117 సెం.మీ. ఈ లింగంపై 359 శివ విగ్రహాలు మరియు ఒక ఎక్లింగ్ సహా 360 శివ విగ్రహాలు చెక్కబడ్డాయి. శివుని విగ్రహం తలపై కోబ్రా కిరీటం మరియు చేతిలో త్రిశూలం మరియు డమ్రూ ఉన్నాయి. కొన్ని విగ్రహాలు కూర్చుని కొన్ని నిలబడి ఉన్నాయి.,🙏🌿🙏🌿🙏🌿🙏🌿🙏🌿🙏

*దాసో-హం*

 *దాసో-హం* 

💫🌻💫🌻💫🌹🌈🌹🌻💫🌻💫


💫 *దాసోహం* అన్న పదంలో *అహం* ఒక భాగం. విడదీయరాని అక్షర సమాహారం. 


💫 *అహం* అంటే నేను. నేను నీ దాసుణ్ని అని మనసా, వాచా చెప్పగలగాలి.


💫 *'దాసోహం'* అన్నమాటను ఒక మంత్రంగా స్మరించడం, గుణాత్మకంగా మరీమరీ గుర్తు చేసుకోవడం, మనసును ఏకాగ్రం చేసి అక్కడే నిలపడం - చెప్పినంత తేలిక కాదు.


💫 *శ్రవణం,* *మననం,* *ధ్యానం,* అనేవి *భక్తియోగ* సాధన కు కలిసివచ్చే *భౌతిక,* *మానసిక,* *ఆంతరంగిక* ప్రక్రియలు. *దాసోహానికి* *దారిదీపాలు.*


💫 ఒకరికి తలవంచి నమస్కరించడం బానిసత్వానికి నిదర్శనం. 


💫 ఒకరి గొప్పతనాన్ని బేషరతుగా ఒప్పుకొని శరణాగతి కోరడం భక్తి పరాకాష్ఠకు సంకేతం.


💫 ప్రతి నిమిషం, ప్రతి విషయంలోనూ బయటపడి అడ్డుకునేది *'అహం'.* 


💫 ‘నన్ను అడిగావా?’ అని నిలదీయడం, ‘నాకు తెలియదే!’ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించడం... అదే *అహంకారం* !


💫 *పూర్ణ దాసత్వం* ఆషామాషీ కాదు. 


💫 *నవవిధ భక్తి మార్గాల* లో *దాస్యానికి* సముచితమైన స్థానం ఉంది. 


💫 నమ్రతా భావంతో కూడిన వినయ విధేయతల త్రివేణీ సంగమంతో సమానమైనది *దాస్య భక్తి.* 


💫 నిజమైన హరిదాసుడు *దాసోహం* అనడానికి, అలా కావడానికి ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటాడు. తన అస్తిత్వాన్ని పోగొట్టుకుని పరతత్త్వంలో లీనం కావడానికి - పాలలో పంచదారగా మారాలి. దాసుడికి అది ఒకరకమైన జీవన్ముక్త దశ. 


💫 అహంకారం బండరాయిలా ఎప్పటికప్పుడు అడ్డుతూ, చాపకింద నీరులా తెలియకుండా తడిగట్టి పడగొట్టుతుంది.


💫 *హరిదాసు* అనగానే... సంక్రాంతి పండుగ రోజుల్లో తలపైన పాత్ర, చేత చిడతలు, భుజాన తంబురా వేసుకుని *'హరిలో రంగ హరి'* అంటూ చిందులు వేసే ఆసామీ కళ్లకు కడతాడు. 


💫 *హరిదాసు* అన్న బిరుదు బ్రహ్మ మానసపుత్రుడైన నారద మహర్షికే చెల్లుతుంది. సదా నారాయణ నామస్మరణలో కాలంగడిపే నారదుడి కన్నా మిన్న అయిన విష్ణుభక్తుడు ఎవరైనా ఉన్నారా? 


💫 *రామదాసు* అన్న పేరు మన దేశంలో మిక్కిలి జనప్రియమైన నామం. *రామదాసు* అంటే *రామబంటు* - హనుమంతుడు. ఈ పేరులో రాముడు తప్ప మనకు హనుమంతుడు కనిపించడు. ఆ పదాన్ని విడదీసి శల్యపరీక్ష చేస్తేగాని అందులో దాగిన *దాసుడు- ఆంజనేయుడు* బయటికి రాడు. 


💫 *తులసీదాసు* - *తులసికి దాసుడు* శ్రీమహావిష్ణువు. తులసిలో కలిసి ఉన్న ఆ పరమాత్మను స్మరించడానికి, మనోనేత్రంతో దర్శించడానికి *'కృష్ణ తులసి'* అన్న ప్రయోగం మనకు ప్రయోజనకరంగా కలిసి వస్తుంది. రుక్మిణి ఒక్క తులసిదళంతో కృష్ణ తులాభారంలో నెగ్గింది.


💫 మనల్ని మనం *దాసుడిగా* గుర్తించడానికి ముందుగా *మోహనిద్ర* నుంచి మేలుకుని బయటపడాలి. 


💫 చెలికాడు, శిష్యుడు, బావమరిది అయిన అర్జునుడికి తాను *కృష్ణదాసుడిని* అని తెలుసుకోవడానికి, పద్దెనిమిది అధ్యాయాలు, ఏడువందల శ్లోకాలు అవసరమయ్యాయి. 


💫 చిట్టచివరికిగాని, ‘ఓ అచ్యుతా! నువ్వు చెప్పినట్లే చేస్తాను’ అన్న సమాధానం కిరీటి నోటంట రాలేదు. 


💫 *దాస* సంప్రదాయంలో సర్వోత్తమమైన భక్తి నివేదనా గరిమకు ఉదాహరణ *దాసకూటం* పేరు చెప్పగానే మన తలపులో మెరుపులా *కనకదాసు* కనిపిస్తాడు. 


💫 ఆ భక్త శిఖామణి కోసం ఉడుపిలోని బాలకృష్ణుడు తన దిశను మార్చుకుని, కనకదాసు దశను మార్చాడు. క్షణంలో భక్తుడికి మోక్షం ప్రసాదించాడు. 


💫 *పురందరదాసు* శ్రీకృష్ణ దేవరాయల రాజధాని హంపీ క్షేత్రంలో తన కీర్తనలు వినిపించి, స్వర సేవకులందరికీ ఆదర్శంగా స్ఫూర్తిమన్మూర్తిగా ఈనాటికీ సంప్రదాయ భక్తి సంగీతపు మెరుపులు కురిపిస్తున్నాడు. 


💫 బద్ధ జీవులను *భక్తిసేవ* లతో తన అక్కున చేర్చుకోవడానికి భగవంతుడు సర్వదా సిద్ధంగా ఉంటాడు. ఆయన *దాసులకు దాసుడు* !



*సేకరణ:* 

💫🌻💫🌻💫🌹🌈🌹🌻💫🌻💫

తాంత్రిక పూజలు

 తాంత్రిక పూజలు..............!!


తంత్ర పూజలు 5 విధములు అవి:

1.సూర్య 2.గణపతి 3.విష్ణువు

4.శివుడు 5.శక్తి పూజ లనునవి.

ప్రతి శక్తికి 5 రూపములు 5 సాధనలు గలవు.


ఉపాసకుని శక్తి సామర్థ్య,భావముల ననుసరించి సాధనలు 4 విధములుగా పేర్కొనబడినవి.

అవి:

1.పూజ 2. జపము 3.ధ్యానము

4.బ్రహ్మత్వము అనునవి. 

వీనిలో సాధకుని భావములు 

మూడు తెగలుగా విభజింపబడినవి.

అవి:

1.పశుభావము 2.వీరభావము

3.దివ్యభావము


1.పశుభావము:

లజ్జ,కామ,క్రోధాది అరిషడ్వర్గములచే కట్టబడిన వారు పశ్వాచారులు.


2.వీరభావము:

పశుపాశములను విడిపించుకొనిన జితేంద్రియులు వీరాచారులు


3.దివ్యభావము:

బ్రహ్మజ్ఞానులైనవారు

దివ్యాచారులనదగిన వారు. 

వివిధ సాధనా విధానములను గమ్యమును చేరుకొను అంతస్థులను,ఆచారములనినారు.

కులార్ణవతంత్రము ఈ ఆచారములను

ఆరునొక్కటి (7)గా పేర్కొనినది.


అవి:

1.వేదాచారము:

బహిః పూజాపద్ధతి దీనిలోనిది క్రియామార్గమై స్థూలదేహము వంటిది.


2.వైష్ణవాచారము:

భక్తి యోగ ప్రాధాన్యమై హృదయ సాధనకు దోహదమిచ్చును.


3.శైవాచారము:

జప యోగముతోకూడి

ధర్మస్థాపన కుపక్రమించినది.


4.దక్షిణాచారము:

దక్షిణ కాళిక పూజా పూర్వకమైనది.

ఈ తెగవారికి సమయాచారులని మరియొక పేరు గలదు. వీరికి దేవి గాయత్రీ మంత్ర ముపదేశింపబడును.

త్రిశక్తుల కావ్యశక్తి బ్రహ్మశక్తి యగుటవలన బ్రాహ్మణత్వ సాధనకిది నాందియై శక్తి పూజార్హత్వము లభించును.

ఈ ఆచారములో ధ్యాన యోగ ప్రాప్తియై ప్రవృత్తి మార్గమునుండి నివృత్తికి,

తన్మూలమున యోగసిద్ధి కలుగుటకు

ప్రారంభమగును.


5.వామాచారము:

దక్షిణాచారములో పుట్టిన మానవుడు గురువులచేత దీక్షనందుకొని (తంత్ర దీక్ష) వామాచారుడగును.వామమనగా వ్యతిరేక పక్షము,విప్లవ మార్గము అని పేరు. ఇచ్చట సాధకుడు ప్రవృత్తి మార్గమును పూర్తిగా వదలి నివృత్తి పదములో నిమగ్నుడగుటయే ప్రత్యేకత.అనగా సంసార బంధ విముక్తుడై యోగిగా నుండు స్థితి.

వీరినే వీరాచారులని,హఠయోగులని పిల్తురు.


6.సిద్ధాంతాచారము:

లజ్జ,భయ,మోహాది అరిషణ్మార్గములకుకుల శీలాలకు నతీతులుగా వీరు స్మశాన వాసులై 

శివ స్థితి నొందినవారు.

వీరికి యోగ రహస్యములు కరతలామరకములు.

మనో నిగ్రహము,ప్రాణవాయు 

సంచార సమస్థితి, 

వాని గతులయొక్క జ్ఞానము

వీరికి అనుభవ సిద్ధము.

వీరికి గురువులు వేదాచార

రహస్య ముల నుపదేశించి దీక్షయొసంగుదురు.

అష్టాంగయోగ సాధనచే 

వీరు తురీయులై కాలాచార పరాయణులగుటకు

అర్హతను బడయుదురు.

వీరినే అఘోరయోగాచారులని,

దివ్యాచారులని వ్యవహరింతురు.

(శివుని వామ పార్శ్వమగు శక్తిని పూజించువారుగూడా వామాచారులనబడుదురు.)


7.కౌలాచారులు:

ఇచట శత్రు మిత్రత్వము,శీతోష్ణ సుఖ దుఃఖ స్థితి కతీతమైన స్థిత ప్రజ్ఞత్వము కలిగి బ్రహ్మీభూతులగుదురు.ఇచటి వారు లాభ నష్టముల (మన్ను-పొన్ను) భేదము లెరుంగని ద్వందాతీతులైనారు.వీరికి సర్వము బ్రహ్మమయమే.బేధభావన యుండదు. భగవద్గీతలో చెప్పబడిన బ్రహ్మభావము నంది,సమతా భావము గలవారు వీరు. అప్పుడప్పుడు భ్రష్టులవలె,ఉన్మత్తులవలె,శిశువులవలె,భూత,ప్రేత,పిశాచవర్తనులై 

కాన నగుదురు. 

ఏకాంత స్థలములలో

శ్మశాన వాటికలో నుండి 

నిర్వికల్ప సమాధి స్థితి

నందుకొనెడివారు. 

వీరిని జీవన్ముక్తులు,పూర్ణమానవులు, పరమహంసలని పిల్తురు.


ఈ పై పేర్కొనిన వివిధ తంత్ర శాస్త్ర మార్గములలో సామాన్యులు మొదటి నుండి ప్రారంభించి జన్మజన్మల సంస్కారమునొంది చివరకు కౌలాచారమున సిద్ధులగుదురు. 

కాని పూర్వజన్మ సంస్కారము కలవారు మాత్రము సిద్ధాంతాచారము 

నుండియే సాధనచేసి పరమహంస లగుదురు.దీనికి తార్కాణముగా రామకృష్ణపరమహంస ,

తురీయాచారములైన సిద్ధాంత కౌలాచారముల సాధనతో మహా భావన కలిగి వామాచార పరాయణులుగానే సిద్ధినొందిరి.

వీరికి జగజ్జనని పిలిచిన వెంటనే సాక్షాత్కరించెడిదట.

అంతటి మహనీయులు వారు కనుకనే పరమహంసయని పిలువబడిరి.


ఇట్టి తంత్ర రహస్యములను మన దేశములోని హిందువులేగాక హేతువాద ప్రధానముగా గల ఆంగ్లదేశములో పుట్టి, పెరిగి, ఉన్నతవిద్యనభ్యసించి,క్రైస్తవ మత

సిద్ధాంతాచారము కలిగిన వంగదేశ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, పనిచేసిన ప్రఖ్యాత న్యాయశాస్త్రజ్ఞులు,

మేధావులునైన, సర్ జాన్ ఉడ్ రాఫ్ దొర గారు చక్కటి కృషిచేసి కొన్ని విషయములలో భారతదేశము తంత్ర శాస్త్రమునకు ఎంతయో ఋణపడి యున్నదని వాక్రుచ్చినారు.

వైద్య నిపుణులకు కూడ నయముకాని మొండి వ్యాధులు కేవలము మంత్రములచేత నయమగుటను 

వారు స్వయముగా చూచి,పరీక్షించి 

ఏ తన్మాహాత్మ్యమునకు కచ్చెరువంది సంస్కృతభాష నభ్యసించి తంత్ర శాస్త్రములో చక్కని కృషిచేసి,

ఈ గ్రంథములను ఆంగ్లభాషలో వివరించి వ్రాసి,తంత్ర శాస్త్రమును పునరుజ్జీవింపజేసినారు.శరీరము,

ప్రాణము,మనస్సు,బుద్ధి, నాడి,జ్యోతిష, వైద్య,రసాయన, శాస్త్రముల కెంతయో తంత్ర శాస్త్రము దోహదమిచ్చి మహత్తర సేవ గావించినదని వీరు చాటినారు.

శ్రీ మాక్సుముల్లర్ దొరగారు

వేదములకెట్టి సేవ చేసినారో అట్టి సేవనే వీరు తంత్ర శాస్త్రమునకుచేసి,యందు గల శాస్త్రీయ విజ్ఞానమును బయట పెట్టిరి.తంత్ర శాస్త్రముల విలువ ఎట్టిదో

వాని ప్రాధాన్య మెట్టిదో మనకిపుడు బోధపడినది గదా!


మరియు నింకొక విషయము.ఆత్మజ్ఞాన గ్రంథములు రహస్య గ్రంథములని పెద్ద లనినారు.అందువలన రహస్య భాషలోనే ఈ తంత్ర శాస్త్రములను రచియించినారు.దీనినే సంధ్యాభాష యని గూడ యందురు.సంధ్యలో చీకటి వెలుగులున్నట్లు వీనిలో వాడిన పదములకు కూడా రెండర్థములు గలవు.అనగా సామాన్యులకు సామాన్యర్థము,సాధకులకు విశేషార్థములందు బోధపడును.

దీనిచే నివి గోప్యమైనవని చెప్పబడినవి.రహస్యముగా నుంచబడుటచే వీని పవిత్రత చెడకుండా మహిమతో నొప్పియుండుటయైనది.

దీనినే గీతాచార్యుడు

 "జ్ఞాన మాఖ్యాంతం గుహ్యాద్గుహ్యంతరం" అని నుడివియున్నాడు.

ఇట్లు తంత్ర శాస్త్రములు నిగూఢమైన శక్తులతో నిండి సాధకులకు పరమార్థ మార్గదర్శకములై విలసిల్లినవి.

*కార్తీక మాసంలో

 *కార్తీక మాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి.*

దీపావళి మరుసటి రోజు నుంచి మొదలయ్యే *కార్తీక_మాసం *అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి..

న కార్తీక సమో మాసో 

న శాస్త్రం నిగమాత్పరమ్

నారోగ్య సమముత్సాహం 

న దేవః కేశవాత్పరః 

అంటే *కార్తీక_మాసం* లోని ప్రతీ రోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది.. ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం...

*కార్తీక శుద్ధ పాడ్యమి :* తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి గుడికి వెళ్లాలి.. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి.

*విదియ :* సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు.

*తదియ :* అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి.

*చవితి :* నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి.

*పంచమి :* దీనిని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది.

*షష్ఠి :* ఈరోజున బ్రహ్మచారి అర్చకునికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది.

*సప్తమి :* ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి అర్చకునికి దానం ఇస్తే ఆయుఃవృద్ధి ప్రాప్తిస్తుంది.

*అష్టమి :* ఈరోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు.

*నవమి :* నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.

*దశమి :* నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.

*ఏకాదశి :* దీన్నే బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణుపూజ చేస్తే సద్గతులు కలుగుతాయి.

*ద్వాదశి :* ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది.

*త్రయోదశి :* సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.

*చతుర్దశి :* పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.

*కార్తీక పూర్ణిమ :* కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈరోజున నదీస్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.

*కార్తీక బహుళ పాడ్యమి :* ఆకుకూర దానం చేస్తే మంచిది.

*విదియ :* వనభోజనాలు చేయడానికి అనువైన రోజు.

*తదియ :* పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి.

*చవితి :* రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి.

*పంచమి :* చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది.

*షష్ఠి :* గ్రామదేవతలకు పూజ చేయాలి.

*సప్తమి :* జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి.

*అష్టమి :* కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.

*నవమి :* వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు.

*దశమి :* అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి.

*ఏకాదశి :* విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.

*ద్వాదశి :* అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం.

*త్రయోదశి :* ఈరోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.

*చతుర్దశి :* ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.

*అమావాస్య :* పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి.

(సేకరణ)

న్యాయవాది వృత్తి గొప్పతనాన్ని

 *న్యాయవాది వృత్తి గొప్పతనాన్ని చిహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు*

46 మంది దోషులను మరణశిక్ష (ఉరి) నుండి రక్షించాలని సీనియర్ న్యాయవాది వాదించారు.

 అప్పుడు అతని సహాయకుడు వచ్చి అతనికి ఒక చిన్న కాగితం ఇచ్చాడు. న్యాయవాది దాన్ని చదివి జేబులో పెట్టుకుని తన వాదనను కొనసాగించాడు


భోజన విరామ సమయంలో న్యాయమూర్తి అతనిని స్లిప్‌లో మీకు ఏ సమాచారం వచ్చింది అని అడిగారు. న్యాయవాది నా భార్య చనిపోయింది అని అన్నారు. న్యాయమూర్తి ఆశ్చర్యపోయాడు మరియు అప్పుడు మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు?" ఎందుకు మీరు మీ ఇంటికి వెళ్ళలేదు న్యాయవాది ఇలా అన్నార నేను నా భార్య జీవితాన్ని తిరిగి తీసుకురాలేను, కాని ఈ 46 స్వాతంత్య్ర సమరయోధులకు జీవితాన్ని ఇవ్వడానికి మరియు వారు చనిపోకుండా నిరోధించడంలో నేను సహాయపడగలను. 


దీంతో ఆంగ్లేయుడైన న్యాయమూర్తి మొత్తం 46 మందిని విడుదల చేయాలని ఆదేశించారు. 

న్యాయవాది మరెవరో కాదు, 

*సర్దార్ వల్లభాయ్ పటేల్*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

సంస్కృత మహాభాగవతం

 *31.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఇరువదియవ అధ్యాయము*


*జ్ఞాన, కర్మ, భక్తి యోగములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*20.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*యది కుర్యాత్ప్రమాదేన యోగీ కర్మ విగర్హితమ్|*


*యోగేనైవ దహేదంహో నాన్యత్తత్ర కదాచన॥13030॥*


యోగి ఎట్టి నిషిద్ధకర్మలను చేయడు. ఒకవేళ ప్రమాదవశమున (మోహకారణముగా) ఏదైనను అపరాధము జరిగినచో యోగము ద్వారానే తొలగించుకొనుటకు ప్రయత్నింపవలెను. కాని, ఇతర ఉపాయముల జోలికి పోరాదు.


*20.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*స్వే స్వేఽధికారే యా నిష్ఠా స గుణః పరికీర్తితః|*


*కర్మణాం జాత్యశుద్ధానామనేన నియమః కృతః|*


*గుణదోషవిధానేన సంగానాం త్యాజనేచ్ఛయా॥13031॥*


సాధకులు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి, ఆయా కర్మలను ఆచరించుటయే గుణము. అట్లుగాక, అందులకు విరుద్ధముగా పరధర్మములను ఆచరించుట దోషము. ఏలనన, పుట్టుకచేతనే (స్వభావరీత్యా) కర్మలు అనర్థహేతువులు. కావున కర్మలపట్ల విషయాసక్తిని తొలగించుటకే శాస్త్రములు గలవు. ఇట్టి శాస్త్రములద్వారా కర్మలయొక్క గుణదోషములు, విధినిషేధములు వివరింపబడినవి. వీటిద్వారా కర్మలయందలి ప్రవృత్తిని విడనాడి, నివృత్తిమార్గమును అనుసరింపవలెను.


*20.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*జాతశ్రద్ధో మత్కథాసు నిర్విణ్ణః సర్వకర్మసు|*


*వేదదుఃఖాత్మకాన్ కామాన్ పరిత్యాగేఽప్యనీశ్వరః॥13032॥*


*20.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*తతో భజేత మాం ప్రీతః శ్రద్ధాలుర్దృఢనిశ్చయః|*


*జుషమాణశ్చ తాన్ కామాన్ దుఃఖోదర్కాంశ్చ గర్హయన్॥13033॥*


*20.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*ప్రోక్తేన భక్తియోగేన భజతో మాసకృన్మునేః|*


*కామా హృదయ్యా నశ్యంతి సర్వే మయి హృది స్థితే॥13034॥*


నా కథలయందు శ్రద్ధ గలిగినవాడు సర్వకర్మలయందు విరక్తిని పొందినవాడు. సమస్త భోగములకు - భోగ్యవిషయములు, కామ్యములు - కామ్యకర్మలు దుఃఖమయములు అని తెలిసికూడా వాటిని త్యజించుటకు అసమర్థుడైనచో, నా పట్ల శ్రద్ధాళువై దృఢనిశ్చయమును గలిగి అత్యంత ప్రేమభావముతో నన్ను భజింపవలెను. ఆ విధముగా నాయందు భక్తితత్పరుడై భోగములను అనుభవించుచూ, అవి దుఃఖహేతువులని, నిందనీయములు అని మానసికముగా చింతించుచు, వాటిని విడిచిపెట్టలేని దుఃస్థితికి లోలోన నొచ్చుకొనుచుండవలెను. ఈ విధమగా చెప్పబడిన భక్తియోగముద్వారా నిత్యనిరంతరము నన్నే భజించెడు ఆ మునియొక్క హృదయమునందు నేను స్వయంగావచ్చి నిలిచెదను. నిలిచినవెంటనే అతనిలోగల సమస్తభోగవాసనలు నశించిపోవును.


*20.30 (ముప్పదియవ శ్లోకము)*


*భిద్యతే హృదయగ్రంథిశ్ఛిద్యంతే సర్వసంశయాః|*


*క్షీయంతే చాస్య కర్మాణి మయి దృష్టేఽఖిలాత్మని॥13035॥*


సర్వాత్మస్వరూపుడనైన నేను, నా భక్తుని హృదయములో సాక్షాత్కరించిన ఉత్తరక్షణముననే అతని హృదయమునందు గల అనుమానపు ముడులు విడిపోవును. సమస్త సందేహములు తీరిపోవును. అతనిలోగల వాసనలన్నియును సంస్కారములతో సహా సమసిపోవును.


*20.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*తస్మాన్మద్భక్తియుక్తస్య యోగినో వై మదాత్మనః|*


*న జ్ఞానం న చ వైరాగ్యం ప్రాయః శ్రేయో భవేదిహ॥13036॥*


అందువలన నా భక్తియుక్తుడైన యోగి నాయందే చిత్తమును నిలుపుటవలన నాకు ఆత్మీయుడైపోవును. కావున అతనికి జ్ఞానవైరాగ్యములు లేకపోయిననూ, కేవలము నా భక్తివల్లనే అతడు శ్రేయస్సును పొందును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*484వ నామ మంత్రము* 31.10.2021


*ఓం డాకినీశ్వర్యై నమః* 


విశుద్ధి చక్ర అధిష్ఠానదేవత అయిన డాకినీ స్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *డాకినీశ్వరీ* యను అయిదక్షరముల నామ మంత్రమును *ఓం డాకినీశ్వర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ తల్లికరుణచే ఆయురారోగ్యములు, శాంతిసౌఖ్యములు, భోగభాగ్యములు, కీర్తిప్రతిష్టలు సంప్రాప్తమగును.


*విశుద్ధిచక్రనిలయా* యను 475వ నామ మంత్రము నుండి *అమృతాది మహాశక్తి సంవృతా* యను 483వ నామ మంత్రము వరకూ, విశుద్ధిచక్రాధిష్ఠానదేవతయైన డాకినీశ్వరియొక్క విశేషణములు (లక్షణములు) చెప్పబడినవి.


ఈ డాకినీశ్వరి *ఆరక్తవర్ణా* (476వ) యను నామ మంత్రములో) పాటలవర్ణముతో (ఎఱుపు, తెలుపుల మిశ్రమవర్ణముతో) భాసిల్లుచున్నదని చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *త్రిలోచనా* (477వ) యను నామ మంత్రములో మూడునేత్రములు కలిగినదిగా చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *ఖట్వాంగాదిప్రహరణా* (478వ) యను నామ మంత్రములో నాలుగు చేతులందు కపాలము గ్రుచ్చబడిన కర్ర (ఖట్వాంగము), ఖడ్గము, త్రిశూలము, మహాచర్మము ధరించినదిగా చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *వదనైక సమన్వితా* (479వ) యను నామ మంత్రములో ఒకే శిరస్సు గలిగినదిగా చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *పాయసాన్నప్రియా* (480వ) యను నామ మంత్రములో పాయసాన్నమనిన ప్రీతిగలిగినదిగా చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *త్వక్ స్థా* (481వ) యను నామ మంత్రములో చర్మధాతువునందు ఉండి, చర్మమును రక్షించునదిగా చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *పశులోకభయంకరీ* (482వ) యను నామ మంత్రములో అజ్ఞానులై పశుప్రాయులుగా ఉండు సమూహమునకు భయంకరిగా గోచరిస్తుందని చెప్పబడినది.


ఈ డాకినీశ్వరి *అమృతాది మహాశక్తి సంవృతా* (483వ) యను నామ మంత్రములో విశుద్ధి పద్మమునందలి పదహారు దళములందు పదహారుమంది అమృతాది మహాశక్తులచే డాకినీశ్వరి పరివేష్ఠింపబడినది అని చెప్పబడినది.


డాకినీ స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం డాకినీశ్వర్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*483వ నామ మంత్రము* 31.10.2021


*ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః*


అమృతా మొదలైన పదహారుమంది మహాశక్తులచే పరివేష్ఠింపబడి ఉన్న పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అమృతాది మహాశక్తి సంవృతా* యను పదునొకండక్షరముల నామ మంత్రమును *ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి ఆత్మానందానుభూతితోబాటు, అంతఃకరణశుద్ధి మరియు భౌతికపరమైన శాంతిసౌఖ్యములు అనుగ్రహించును.


విశుద్ధిపద్మమునకు పదునారు దళములు గలవు. వానిలో *అ* కారాది *అః* వరకు గల బీజాక్షరములు ఉండును. ంఅదేవిధంగా ఒక్కొక్క బీజాక్షరమునకు ఒక్కొక్క మహాశక్తి చొప్పున పదహారు మహాశక్తులు ఉండును. ఆ శక్తులే అమృతాది మహాశక్తులు. మధ్యలో విశుద్ధిచక్రాధిష్ఠానదేవత అయిన డాకినీశ్వరి ఉంటుంది. ఈ డాకినీశ్వరినే వజ్రేశ్వరియందురు. ఈ వజ్రేశ్వరీదేవి మంత్రమునకు బీజము, శక్తి, కీలకము అన్నియును డ కార సంకేతమగుటచే వజ్రేశ్వరీదేవి డాకినీశ్వరి అయినది. ఈ వజ్రేశ్వరీదేవికి అమృతాది పదహారు మహాశక్తులు చుట్టూ ఉండును గనుక వజ్రేశ్వరీ స్వరూపిణియైన అమ్మవారు *అమృతాది మహాశక్తి సంవృతా* యని అనబడినది. 'అనాహత చక్రమునకు పైన పదునారు అక్షరములుగల విశుద్ధచక్రము గలదు. దాని మధ్య కర్ణికయందు డాకినీదేవి గలదు. విశుద్ధ పద్మదళమునందు అమృత మొదలు అక్షర వఱకు గల పదునారు దేవతలు గలరు. వీరే స్వరరూపలు. విశుద్ధమునకు పైన చంద్రబింబము గలదు' అని స్వచ్చంద్ర తంత్రమునందు గలదు. 


*అమృతాది మహాశక్తుల పేర్లు:*


1. అమృతా, 2. ఆకర్షిణి, 3. ఇంద్రాణి, 4. ఈశాని, 5. ఉషఃకేసి, 6. ఊర్ధ్వ, 7. ఋద్ధిత, 8. ౠకార, 9. కార, 10. షా, 11. ఏకపదా, 12. ఐశ్వర్యా, 13. ఓంకారి, 14. ఔషధి, 15. అంబికా, 16. అఃక్షరా.


పైనుదహరించిన పదహారు మహాశక్తులు వజ్రేశ్వరీస్వరూపిణియైన పరమేశ్వరిని చుట్టి ఉండుటచే *అమృతాది మహాశక్తి సంవృతా* యని అనబడినది.


అమ్మవారికి నమస్కరించునపుడు *ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంస్కృత మహాభాగవతం

 *30.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఇరువదియవ అధ్యాయము*


*జ్ఞాన, కర్మ, భక్తి యోగములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*20.17 (పదిహేడవ శ్లోకము)*


*నృదేహమాద్యం సులభం సుదుర్లభమ్ ప్లవం సుకల్పం గురుకర్ణధారమ్|*


*మయానుకూలేన నభస్వతేరితం పుమాన్ భవాబ్ధిం న తరేత్స ఆత్మహా॥13022॥*


(ఆద్యమ్) మొదటగా మానవదేహము అత్యంత దుర్లభమైనదని గ్రహింపవలెను. అయితే భగవంతుని అపారమైన కృపచేత అది ఎంతయో సులభమైనది. సకలశ్రేయఃఫలములను పొందుటకు ఇదియే ముఖ్యసాధనము. అగాధమైన సంసారసాగరమును సులభముగా దాటిపోవుటకు ఇదియే దృఢమైన నౌక. ఈ నావకు గురువే కర్ణధారుడు. అనుకూలవాయువుగా తోడ్పడుటకు స్వయంగా భగవంతుడే సిద్ధంగా ఉన్నాడు. దైవకృపచే సకలసౌకర్యములు లభించుచున్నవి. కావున వెంటనే - ఏమాత్రమూ జాగు సేయకుండా భవసాగరమును దాటిపోవుటకు సాధకుడు ఉద్యమింపవలెను. ఇంతటి సువర్ణావకాశమును వదిలిపెట్టి చేతులు ముడుచుకొని యుండువాడు ముమ్మాటికీ ఆత్మఘాతకుడే.


*20.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*యదాఽఽరంభేషు నిర్విణ్ణో విరక్తః సంయతేంద్రియః|*


*అభ్యాసేనాఽత్మనో యోగీ ధారయేదచలం మనః॥13023॥*


పురుషుడు కామ్యకర్మల ఫలముగా దుఃఖములకు లోనై వాటియెడ విరక్తుడైనప్పుడు బాహ్యాభ్యంతర ఇంద్రియములను జయించి (జితేంద్రియుడై) యోగమునందు స్థితుడు కావలెను. క్రమముగా అభ్యాసముద్వారా మనస్సును నిశ్చలముగా నాయందే లగ్నముచేయవలెను.


*20.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*ధార్యమాణం మనో యర్హి భ్రామ్యదాశ్వనవస్థితమ్|*


*అతంద్రితోఽనురోధేన మార్గేణాత్మవశం నయేత్॥13024॥*


సాధకుడు మనస్సును స్థిరముగా నిలుపుటకు ప్రయత్నించుచున్నను అది చంచలమై ఇటునిటు పరుగెత్తుచుండును. అప్పుడు అతడు వెంటనే అప్రమత్తుడై ఆ మనస్సును బుజ్జగింపువంటి తగిన ఉపాయములద్వారా వశపఱచుకొనవలెను.


*20.20 (ఇరువదియవ శ్లోకము)*


*మనోగతిం న విసృజేజ్జితప్రాణో జితేంద్రియః|*


*సత్త్వసంపన్నయా బుద్ధ్యా మన ఆత్మవశం నయేత్॥13025॥*


ఇంద్రియములను, ప్రాణములను వశమునందు ఉంచుకొని, మనస్సుయొక్క విశృంఖలత్వమును అదుపు చేయవలెను. అందులకై సాత్త్వికాహారములను స్వీకరించుట మొదలగు ఉపాయముల ద్వారా సత్త్వసంపన్నమొనర్చిన బుద్ధితో మనస్సును వశపరచుకొనవలెను.


*20.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*ఏష వై పరమో యోగో మనసః సంగ్రహః స్మృతః|*


*హృదయజ్ఞత్వమన్విచ్ఛన్ దమ్యస్యేవార్వతో ముహుః॥13026॥*


మొండికేసి దారికిరాని గుర్రమును రౌతు తన మనోభావములకు అనుగుణముగా తిన్నతిన్నగా బుజ్జగించుచు సరియైన దారికి మళ్ళించినట్లు అటునిటు పోవుచున్న మనస్సును మెల్లమెల్లగా సంయమనమొనర్చి భగవత్పరము గావించుటయే పరమయోగము.


*20.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*సాంఖ్యేన సర్వభావానాం ప్రతిలోమానులోమతః|*


*భవాప్యయావనుధ్యాయేన్మనో యావత్ప్రసీదతి॥13027॥*


సాంఖ్యశాస్త్రమునందు తెలిపినరీతిగా ప్రకృతినుండి శరీరపర్యంతము జరుగు సృష్టిక్రమమును మరియు శరీరమునుండి ప్రకృతివరకు జరుగు లయక్రమమునుగూర్చి (అనులోమ ప్రతిలోమ క్రమముగా) చక్కగా మనస్సునందు తర్కించుకొనవలెను. మనస్సు ప్రశాంతమై స్థిరత్వమును పొందువరకును ఈ ప్రక్రియను కొనసాగించుచునే యుండవలెను.


*20.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*నిర్విణ్ణస్య విరక్తస్య పురుషస్యోక్తవేదినః|*


*మనస్త్యజతి దౌరాత్మ్యం చింతితస్యానుచింతయా॥13028॥*


సాంసారిక విషయములవలన దుఃఖముల పాలైనవాడు విసుగు చెంది క్రమముగా వాటియందు విరక్తుడగును. అప్పుడు అతడు తన గురుజనుల ఉపదేశములను చక్కగా అవగాహన చేసికొని పదేపదే తన ఆత్మస్వరూప ధ్యానమనందే నిమగ్నుడగును. ఇట్లు అభ్యసించుటద్వారా మనస్సుయొక్క చంచలత్వము దూరమగును.


*20.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*యమాదిభిర్యోగపథైరాన్వీక్షిక్యా చ విద్యయా|*


*మమార్చోపాసనాభిర్వా నాన్యైర్యోగ్యం స్మరేన్మనః॥13029॥*


'యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు' అను అష్టాంగయోగ మార్గములద్వారాను, తత్త్వవిమర్శనాత్మక విద్యద్వారాను, నన్ను అనన్యభక్తితో ఉపాసింపవలెను. అట్లు ఒనర్చుట వలన మనస్సు చాంచల్యమును వీడి ప్రశాంతమై పరమాత్మయందు లగ్నమగును. అంతేగాని, మనస్సు నిశ్చలమగుటకు మఱియొక ఉపాయములేదు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

స్వామి వివేకానంద


స్వామి వివేకానంద యూనివెర్సిటీలో Law చదువుకునేటప్పుడు..

ఒక తెల్ల ప్రొఫెస్సర్ కి వివేకానందుడు అంటే ఎందుకో నచ్చేది కాదు...!!


ఒక రోజు, డైనింగ్ రూమ్ లో ప్రొఫెస్సర్ లంచ్ చేస్తుండగా..


వివేకానందుడు వచ్చి ప్రొఫెస్సర్ పక్కనే కూర్చోని తన బాక్స్ ఓపెన్ చేస్తుండగా...


ప్రోఫెసర్ ఇలా అన్నాడు..!!

" పంది, పావురం పక్క పక్కన కూర్చోని భోజనం చెయ్యవు అది నువ్వు తెలుసుకోవాలి"


దానికి వివేకానందుడు..!!

ప్రొఫెసర్ తో గొడవెందుకు అనుకుని ( చమత్కారంగా) :

" మీరు దిగులు పడకండి సార్, నేను ఎగిరిపొతా" అని వేరే టేబుల్ దగ్గరకెళ్లిపోయాడు.

(1St Punch👊)


ప్రోఫెసర్ మొహం ఎర్రటి కందగడ్డలా కందిపోయింది...!!

ఎలాగైనా వివేకానంద మీద ప్రతీకారం తీర్చుకోవాలుకున్నాడు..!!


ఆ తరువాత ఒకరోజు క్లాస్ రూమ్ లో...

వివేకానందని ప్రోఫెసర్ ఓ ప్రశ్న వేసారు...!!

"వివేకానందా..!!

నువ్వు రోడ్ మీద నడుస్తున్నప్పుడు..

నీకు రెండు బాగ్ లు రొరికాయి అనుకుందాం...!!

ఒక దానిలో జ్ణానం, ఇంకో బాగ్ లో డబ్బు వున్నాయి. నువ్వు దేనిని తీసుకుంటావు?"


వివేకానందుడు (సందేహించకుండా)...

"అనుమానమెందుకు సర్,డబ్బులున్న బ్యాగ్ నే తీసుకుంటాను" ఆన్నారు..!!


ప్రోఫెసర్ వంకరగా నవ్వుతూ..వ్యంగ్యంగా..

"అనుకున్నా...నీ సమాదానం అదేనని...!!

నేనే నీ ప్లేస్ లో వుంటే, జ్ణానమున్న బ్యాగ్ నే తీసుకుంటా" అన్నాడు..!!


దానికి వివేకానందుడు..!! 

" నిజమే. ... సహజంగా.... ఎవరికి ఏది తక్కువో అదే తీసుకుంటారు కదా సర్..!!"

(2nd Punch👊)


ప్రొఫెసర్ కి తిక్కరేగిపోయింది..!!

అవకాశం, టైమ్ కలిసి వచ్చినప్పుడు...

వివేకానందని వదలకూడదు అని మనసులో ప్రతిజ్ణ పూనాడు..!!


టైము, అవకాశం రెండు కిలిసి రానే వచ్చాయి ప్రొఫెసర్ కి...!!

ఆ రోజు, దిద్దిన ఆన్సర్ పేపర్ లు, క్లాస్ లో ఇవ్వలి..!!


కోపంతో రగిలిపోయు వున్న ప్రొఫెసర్..

వివేకానంద ఆన్సర్ పేపర్ మీద ఈడియట్ అని వ్రాసి వివేకానందకి ఇచ్చాడు..!!


ఆన్సర్ షీట్ అందుకున్న వివేకానంద...

తన సీట్లో కూర్చొని ప్రొఫెసర్ రాసిన " ఈడియట్" అనే Word చూసి...తనని తాను శాంత పరచుకోవడానికి చాలాసేపు పట్టింది

కోపం తగ్గిన తరువాత హుందాగా.. 

ప్రొఫెసర్ టేబుల్ దగ్గరకెళ్ళి...

గౌరవప్రదంగా...

వినమ్రమయిన శాంత స్వరంతో...

"సర్...!! తమరు నా అన్సర్ షీట్ లోసంతకం చేసి మార్కులు వేయడం మరిచారు... (లాస్ట్ పంచ్👊)

my mother .

 *Thanks to the writer, who posted this*…💐🙏🙏


1) *My first restaurant* => * my mother's breast *

2) *My first toilet* => * my mother's laps *

3) *My first school* => * Mother’s kitchen *

4) *My first teacher* => * my mother *

5) *My first doctor* => * it's my mother*

6) *My first thermometer* => * my mother's fingers *

7) *My first friend* => * it's my mother*

8) * My first dresser* => * it's my mother*

9) *My first vehicle* => * my mother's back *

10) My first lawyer => * it's my mother . *


Thank you mom for all you did for giving me life💐🙏🙏


* Long live all mothers*💐🙏🙏


*A mother can easily maintain 6 children*, but 

Unfortunately it would be difficult for children to maintain a *mother*?!?!


*Submitted To all the moms and Children of the world*.

మననాత్రాయతే

 మననాత్రాయతే ఇతి మంత్ర: అంటారు.


నా సందేహమేమిటంటే, మననం అంటే బయటకు వినపడకుండా చేయడమా? (లేక) బయటకు వినపడేటట్లు చేయడమా?


ఈ సందేహానికి కారణం, మంత్రంలోని ఉదాత్త అనుదాత్తాలను పాటించాలంటే, స్వరం వినపడాలికద!

గాజులు

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*స్త్రీలు గాజులు దభరించవలసిన విధి విధానాలు*


🌳🕉️🦚🍁📿🛕🌳🕉️🦚🍁📿🛕


📿చేతికి గాజులందము...చెంపకు సిగ్గులందము’ అంటారు నిజమే...లేత తామరతూడులాంటి కన్నెపిల్ల చేతికి గాజులిచ్చే అందము మరేది ఇవ్వదు. కేవలం అందం కోసమే గాజులయొక్క ప్రయోజనం.. అని అనుకోవడం పొరపాటు.


📿 గాజులు..స్త్రీకి రక్షాకంకణం వంటిది. ఈ గాజులు ధరించడం వెనుక సాంప్రదాయబద్ధమైన ఎన్నో ప్రయోజనాలు దాగివున్నాయి. 


📿 అప్పుడే పుట్టిన పసిబిడ్డలకు దిష్టి తగలకుండా ఉండడానికి నల్లగాజులు వేస్తారు. ఆ పసిబిడ్డ మెలుకువగా ఉన్నప్పుడు చేతులు ఆడిస్తూంటే.. ఆ చేతులకు ఉండే గాజులు..లయబద్ధంగా చేసే చిరుసవ్వడులు..ఆ పసివాణ్ణి పలకరిస్తాయి. అవి వింటూ..ఆ చిన్నారి ఆడుకుంటాడు. 


📿ఇలా ప్రారంభమైన గాజుల ప్రస్థానం..జీవితం చివరి వరకూ కొనసాగుతూనే ఉంటుంది. ప్రాచీనకాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ గాజులు ధరించేవారు. 


📿వీటిని ధరించడం వల్ల మనకు తెలియకుండానే నడకలో ఒక లాలిత్యం, లయ ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు చాలా చిన్నతనంనుంచే ఈ గాజుల వాడకాన్ని అలవాటు చేస్తారు.


📿 ‘జీవితం చాలా విలువైనది..ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. గాజులాగే ఫగిలిపోతుంది’ అనే జీవన సత్యాన్ని చిన్నతనం నుంచే తెలిసేలా చెయ్యడం కోసమే.. ఆడపిల్లలకు ఈ గాజులు ధరింపజేసే ఆచారాన్ని అలవాటు చేసారు.


📿అయితే..‘ఆడపిల్లకే ఈ జాగ్రత్త అవసరమా..మగవాడికి అవసరం లేదా’ అనే సందేహం నేటి ఆధునిక స్త్రీలకు కలగడం తప్పు కాదు.


📿 కానీ..ప్రాచీనకాలం నుంచీ, నేటి వరకూ..స్త్రీని ‘గృహలక్ష్మి’ అని గౌరవించారేగానీ.. పురుషుని ‘గృహవిష్ణువు’ అని గౌరవించిన దాఖలాలు ఎక్కడా లేవు. అందుకే.. ఇల్లాలిని చూసి ఇంటిని చూడమన్నారు...పెద్దలు.


📿 మగవాడు..దుబారా మనిషి అయినా.. ఆ ఇంటి ఆడది జాగ్రత్తపరురాలైతే..ఆ ఇంట్లో ఏ లోటు ఉండదు. అందుకే చిన్నతనం నుంచీ ఆడపిల్లకు జాగ్రత్త అలవాటు చెయ్యడం కోసమే..గాజులు వేసేవారు. రెండు చేతుల నిండా గాజులేసుకుని, పట్టుపరికిణీ కట్టుకుని.,సాక్షాత్తు లక్ష్మీదేవిలా..ఆడపిల్ల నట్టింటిలో తిరుగుతూంటే..చూడడానికి శోభాయమానంగా ఉంటుంది


📿 కానీ... బోసి చేతులేసుకుని..నడకలో ఓ లాలిత్యం లేకుండా పెద్ద పెద్ద అడుగులేస్తూ, రాక్షసిలా ఆడపిల్ల తిరిగితే ఏం బావుంటుంది చెప్పండి.


📿 సరే...గాజుల విషయానికొద్దాం. గాజులు అందానికే కాదు.,సౌభాగ్యానికి కూడా చిహ్నం. గాజులు...తమ రంగునుబట్టి రకరకాల అర్థాలను తెలియచేస్తాయి.


*గాజుల రంగులు ఫలితాలు*


📿ఎరుపురంగు గాజులు శక్తిని,పితృదోష నివారణకు


 నీలంరంగు గాజులు విఙ్ఞానాన్ని,భయ నివారణ


 ఊదారంగు గాజులు స్వేచ్ఛను,ధైర్యాన్ని


 ఆకుపచ్చరంగు గాజులు అదృష్టాన్ని,సద్బుద్ధినీ


పసుపురంగు గాజులు సంతోషాన్ని,సంతానాన్ని


 నారింజరంగు గాజులు విజయాన్ని,రుణ రోగ శత్రు నివారణకు


 తెల్లరంగు గాజులు ప్రశాంతతను,దంపతుల అనుకులన్ని


 నలుపురంగు గాజులు అధికారాన్ని,


 వెండి గాజులు బలాన్ని


బంగారు గాజులు ఐశ్వర్యాన్ని

 సూచిస్తాయి. 


📿పెళ్లయిన ఆడపిల్ల...కడుపు పండి, పురిటికని పుట్టింటికి వచ్చిన వేళ.. ఐదోనెలలో గాని, ఏడోనెలలో గాని, సీమంతం చేస్తారు. 


📿ఈ కాలంలో తొమ్మిదో నెలలో కూడా చేస్తున్నారనుకోండి. అది వేరే సంగతి. 

ఈ సీమంతోత్సవంలో..పేరంటానికి వచ్చిన ప్రతి ముత్తయిదువు...ఆ సీమంతవధువు చేతులకు తలో జత మట్టిగాజులు తొడగడం అనాదినుంచి వస్తున్న ఆచారం. ఇలా గాజులు తొడగడం ఎందుకు అంటే... ఐదో నెలలోనే గర్భస్థ పిండానికి ప్రాణం వస్తుంది. అప్పటినుంచి ఆ స్త్రీ మరింత జాగ్రత్తగా ఉండాలి.


📿 గాజులేస్తే జాగ్రత్త వస్తుందా.? వస్తుంది. గాజులు ఫగలడాన్ని అమంగళంగా, అశుభంగా భావిస్తారు మన భారత స్త్రీలు. అందుకే గాజులు ఫగలడాన్ని ఇష్టపడరు. గాజులు ఫగలకుండా నడవడం కోసమే.. సీమంతంలో గాజులువేసే సాంప్రదాయాన్ని ప్రతిపాదించింది మన శాస్త్రం. 


📿ధనవంతులు రెండు చేతులనిండా ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా..ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టి (గాజు)గాజులు వేసుకోవాలని శాస్త్రం చెప్తోంది.


📿 అమ్మవారి పూజల్లో పసుపు, కుంకుమలతోపాటు గాజులను కూడా ఉంచి పూజించడం మన ఆచారం. ముత్తయిదువులకు గాజులిచ్చి గౌరవించే సాంప్రదాయం మనది. 


🛕ఎంత పేదింటి అన్నయినా..చెల్లెలిని చూడడానికి వచ్చి, తిరిగి వెడుతున్నప్పుడు..ఓ పదో, పరకో చేతిలోపెట్టి..‘గాజులేయించకోమ్మా’ అంటాడు. ఇలా స్త్రీ జీవితంలో గాజులు చోటుచేసుకుని, వారికి అందాన్నిస్తూ, జాగ్రత్తలు నేర్పుతూ, తాము ఫగలకుండా, మన సాంప్రదాయాలు ఫగలకుండా కాపాడుతూ వస్తున్న గాజులను గౌరవిస్తే మన సాంప్రదాయాలను గౌరవించినట్టే.


🦚🦚🦚🦚🦚🦚🦚🦚

శ్రీమద్వాల్మీకి రామాయణం

ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 

(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే పత్రంలోని ఒక అంశం) 


               ----------------------- 


          10. వైద్యశాస్త్రం 


       విదేశీ వైద్య విజ్ఞానం ప్రస్తుత కాలంలో బహుళ వ్యాప్తి చెందియుంది. కానీ దానిని సంపూర్ణ జ్ఞానంగా పరిగణించలేము. ఆ విధానంలో 

  - ఇప్పుడున్న వ్యాధులకూ చికిత్సా విధానం సంపూర్ణంగా గానీ, కొన్నిటికి అసలు చికిత్సేగానీ లేకుండా ఉంది. 

  - క్రొత్త వ్యాధులకు చికిత్స సంగతి సరేసరి. 

    ఈ రెండు సందర్భాలలోనూ, నిరంతర పరిశోధన జరిగినా, ఫలితం సంపూర్ణతను అందివ్వడం జరుగదు. 


      శ్రీమద్రామయణంలో కొన్ని సంఘటనలు, ఆ కాలంలో వైద్యవిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందిందో తెలుస్తుంది. 


సంజీవని 


      ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రామలక్ష్మణులు మూర్ఛిల్లుతారు. 

      అప్పుడు జాంబవంతుడు హనుమంతునితో హిమవత్పర్వతాలకి వెళ్ళాలని సూచిస్తూ, నాలుగు ఓషధులను గూర్చి తెలిపాడు. అవి 

1. మరణించినవారిని బ్రతికించే "మృత సంజీవని", 

2. శరీరంలో ఉన్న ములుకులు తొలగించే "విశల్యకరణి", 

3. విరిగిన శరీరభాగాలని అతికించే "సంధానకరణి", 

4. దేహానికి మంచిరంగు కలిగించే "సువర్ణకరణి". 


    సంధానకరణికి ఈ కాలంనాటి ఉదాహరణ: 

    అవిభక్త ఖమ్మం జిల్లాలో భాగమైన చర్ల సమీపాన ఒక గిరిజన గ్రామంలో 

    పరదేశీ అనే ఒక గిరిజనుడు ఒక పసరును కోడి ఈకతో రాస్తే, విరిగిన ఎముక వెంటనే అతుక్కునేదట. 

    కొలది కాలం క్రాతమే అతను మరణించాడు. 

    అతను ప్రదర్శనగా, 

    మాంసం కోసం చంపిన మేకని, దాని ముక్కలను చేర్చి, ఆ పసరు రాసి విరిగిన ఎముకలు కలవడం చూపేవాడట. 

    అతనినీ, అతని చికిత్సనీ ప్రత్యక్షంగా చూసినవాళ్ళు ఇప్పటికీ సాక్ష్యంగా ఉన్నారు. 

    ఇతరులు ఆ వైద్యం నేర్చుకోవటానికి ఉత్సాహం చూపనందువలన అది అతనితోనే అంతమైపోయింది.

     

 సువర్ణకరణి: 

     హనుమ తెచ్చిన పర్వత ఓషధుల వాసనను ఆఘ్రాణించగానే, రామలక్ష్మణుల దేహంలోని శల్యాలూ తొలగిపోయాయి. 

    రుగ్మత మాయమైంది. 

    మరణించిన వానరులందఱూ ప్రాణాలతో లేచారు. 


    బాలరాజు మహర్షి హిమాలయాలకి వెళ్ళి, మూలికా వైద్యశాస్త్రాన్ని పొంది తెలియజేశారు. 

    దానిని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యరూపంలోకి తీసుకువచ్చింది. అది ఒక సమగ్ర పుస్తకరూపంలో లభించడం గొప్ప విశేషం. 


బాధోపశమనం 


    ఇంద్రజిత్తు వధానంతరం లక్ష్మణునికి సుషేణుడు చికిత్స చేశాడు. 

    లక్ష్మణుడు నాసిక ద్వారా ఉత్తమ ఓషధిని పీల్చగానే, 

    శరీరంలోని శల్యాలన్నీ తొలగిపోయి, 

    గాయాలు మాని, 

    అలసట తగ్గి, 

    స్వస్థతపొంది, 

    క్షణకాలంలోనే బాధోపశమనంతో సంతసించాడట. 

    ప్రస్తుత విదేశీ వైద్యపద్ధతిలో మందులవలె ముందుగా తాత్కాలికోపశమనం పొందే విధానంగా కాకుండా, 

    క్షణంలో తగ్గి, శరీరం పూర్వపు ఆరోగ్యస్థితికి వెంటనే రావడం విశేషం. 


శస్త్ర చికిత్స 


    సీతామాత లంకలో తనలోతనే బాధపడుతూ, 

   "శస్త్ర చికిత్సకుడు గర్భస్థప్రాణిని ఛేదించినట్లు, ఆ రావణుడు తన అవయవాలని శస్త్రంతో ముక్కలు చేస్తాడ"ని అనుకుంటుంది. 

    తద్వారా ఆనాటి శస్త్రచికిత్సా విధానాన్ని సూచనప్రాయంగా తెలియజేసింది. 


అవయవ మార్పిడి 


    కైక దశరథునితో మాట్లాడుతూ, 

    గతంలో అలర్క మహారాజును ఒక వేదపండితుడైన బ్రాహ్మణుడు యాచిస్తే, 

    ఆ రాజు తన నేత్రములను పెకలించి, ఆ బ్రాహ్మణునికి దానం చేశాడని ఉదహరిస్తుంది. 

    తద్వారా అవయవ మార్పిడి చికిత్స ఆ రోజులలోనే ఉండేదని స్పష్టమౌతుంది.


ఆయుర్వేదం 


    ఆయుర్వేదం అద్భుతమైన భారతీయ వైద్యశాస్త్రానికి వేద ప్రామాణికమైనది. 

    అద్భుత చికిత్సలు చేసిన, చరకుడు - శుశ్రుతుడు వంటి ఆయుర్వేద వైద్యులు, 

    అందుబాటులో ఉన్న ఇప్పటి చరిత్ర కాలానికి చెందినవారే కదా!

    భారతీయ వైద్య విధానం ఆయుర్వేద వైద్యపద్ధతికి చెందినది. 


    మనం ఇప్పటిదాకా పరిశీలించిన

శ్రీమద్రామాయణంలోని వైద్యవిధానం ఆ భారతీయ వైద్య ప్రామాణికమైనదని తెలుస్తుంది కదా! 

    అభివృద్ధిచెందిన ఆ సంప్రదాయ వైద్యవిధానాన్ని మనం స్వీకరిస్తే, 

    - ఏ రుగ్మతలకైనా ప్రామాణికమైన చికిత్స, 

    - ఆర్థిక పరమైన అవుసరాలులేక 

    (ఒళ్ళూ ఇల్లూ గుల్లవకుండా) 

    వ్యాధులనుండీ బయటపడే అవకాశం ఉంటుంది కదా!


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

30, అక్టోబర్ 2021, శనివారం

శ్రీమద్భాగవతము

 *30.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2307(౨౩౦౭)*


*10.1-1446*


*క. పెనిమిటి బిడ్డని గుణములు*

*వినిపింప యశోద ప్రేమవిహ్వలమతియై*

*చనుమొనలఁ బాలు గురియఁగఁ*

*గనుఁగొనలను జలము లొలుకఁగా బెగ్గిలియెన్.* 🌺



*_భావము: నందుడు అలా తన ముద్దుల కుమారుడు కృష్ణుని లీలలను గురించి వర్ణిస్తుంటే, యశోదాదేవి ప్రేమాతిరేకముతో చలించిపోయి శోకించగా, ఆమె స్తనములనుండి చనుబాలు, కన్నులనుండి ధారాపాతముగా కన్నీరు ప్రవహించింది._* 🙏



*_Meaning: As Nanda was narrating the mystic deeds of Sri Krishna , Yashodadevi was overwhelmed with intense emotion and profound fondness and thinking of her son, milk gushed from her breasts and tears flowed from her eyes._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

రామాయణం‌ 108 ప్రశ్నలు

 *🙏🏻 రామాయణం‌ 108 ప్రశ్నలు –జవాబులతో ... రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి. 🙏🏻*


*1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు? = వాల్మీకి.*


*2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?= నారదుడు.*


*3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు? = తమసా నది.*


*4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి? =24,000.*


*5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు? = కుశలవులు.*


*6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? = సరయూ నది.*


*7. అయోధ్య ఏ దేశానికి రాజధాని? = కోసల రాజ్యం.*


*8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు? = సుమంత్రుడు.*


*9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి? =కౌసల్య, సుమిత్ర, కైకేయి.*


*10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు? = పుత్ర కామేష్ఠి.*


*11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను? = కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.*


*12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు? = జాంబవంతుడు.*


*13. వాలి ఎవరి అంశతో జన్మించెను? = దేవేంద్రుడు.*


*14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు? = హనుమంతుడు.*


*15. కౌసల్య కుమారుని పేరేమిటి? = శ్రీ రాముడు.*


*16. భరతుని తల్లి పేరేమిటి? = కైకేయి.*


*17. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి? = లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.*


*18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు? = వసిష్ఠుడు.*


*19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు? =16 సంవత్సరములు.*


*20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు? = మారీచ, సుబాహులు.*


*21. రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి? = బల-అతిబల.*


*22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు? = సిద్ధాశ్రమం.*


*23. తాటక భర్త పేరేమిటి? = సుందుడు.*


*24. తాటకను శపించిన మహర్షి ఎవరు? = అగస్త్యుడు.*


*25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు? = భగీరథుడు.*


*26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను? = జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.*


*27. అహల్య భర్త ఎవరు? = గౌతమ మహర్షి.*


*28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు? = శతానందుడు.*


*29. సీత ఎవరికి జన్మించెను? = నాగటి చాలున జనకునికి దొరికెను.*


*30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను? = దేవరాతుడు.*


*31. శివధనుస్సును తయారు చేసినదెవరు? = విశ్వకర్మ.*


*32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు? = మాండవి, శృతకీర్తి.*


*33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు? = జనకుడు.*


*34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి? =కుశ ధ్వజుడు.*


*35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి? = వైష్ణవ ధనుస్సు.*


*36. భరతుని మేనమామ పేరు ఏమిటి? = యుధాజిత్తు.*


*37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు? = మంధర.*


*38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను? = గిరివ్రజపురం, మేనమామ యింట.*


*39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది? = శృంగిబేరపురం.*


*40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను? = గారచెట్టు.*


*41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?= భారద్వాజ ముని.*


*42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి? = మాల్యవతీ.*


*43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు? = తైల ద్రోణములో.*


*44. శ్రీరామునితో నాస్తిక వాదన చేసినదెవరు? = జాబాలి.*


*45. భరతుడు రాముని పాదుకల నుంచిన పట్టణమేది? = నంది గ్రామము.*


*46. అత్రిమహాముని భార్య ఎవరు? = అనసూయ.*


*47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు? = విరాధుడు.*


*48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు? = అగస్త్యుడు.*


*49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది? = గోదావరి.*


*50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను? = శూర్ఫణఖ.*


*51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను? = జన స్థానము.*


*52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను? = మారీచుడు.*


*53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది? = బంగారు లేడి.*


*54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు? = జటాయువు.*


*55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను? = దక్షిణపు దిక్కు.*


*56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను? = కబంధుని.*


*57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది? = మతంగ వనం, పంపానదీ.*


*58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను? = ఋష్యమూక పర్వతం.*


*59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారి వద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను? = హనుమంతుడు.*


*60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?= అగ్ని సాక్షిగా.*


*61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను? = కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.*


*62. సుగ్రీవుని భార్య పేరు? = రుమ.*


*63. వాలి భార్యపేరు? = తార.*


*64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి? = కిష్కింధ.*


*65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి? = మాయావి.*


*66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు? = దుందుభి.*


*67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను? = మతంగ ముని.*


*68. వాలి కుమారుని పేరేమిటి? = అంగదుడు.*


*69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను? = ఏడు.*


*70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను? = ప్రసవణ గిరి.*


*71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు? = వినతుడు.*


*72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు? = అంగదుడు.*


*73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి? = మామగారు, తార తండ్రి.*


*74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు? = శతబలుడు.*


*75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను? = మాసం (ఒక నెల).*


*76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను? = దక్షిణ దిక్కు.*


*77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను? = తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.*


*78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి? = స్వయంప్రభ.*


*79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి? = సంపాతి.*


*80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు? =పుంజిక స్థల.*


*81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి? = మహేంద్ర పర్వతము.*


*82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు? = మైనాకుడు.*


*83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి? = సురస.*


*84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి? = సింహిక.*


*85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత? = నూరు యోజనములు.*


*86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి? = లంబ పర్వతం.*


*87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి? = అశోక వనం.*


*88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను? = పన్నెండు*


*89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు? = త్రిజట.*


*90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను? =రామ కథ.*


*91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి? = చూడామణి.*


*92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను? = ఎనభై వేలమంది.*


*93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను? = ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.*


*94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు? = విభీషణుడు.*


*95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి? = మధు వనం.*


*96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు? = మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.*


*97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి? = ఆలింగన సౌభాగ్యం.*


*98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి? = నలుడు*


*99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను? = నికుంభిల.*


*100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు? = అగస్త్యుడు.*


*101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు? = ఇంద్రుడు.*


*102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు? = మాతలి.*


*103. రావణ వధానంతరం లంక నుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పక విమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరి కోసం ఆగుతుంది? = కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!*


*104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీ రాముడు ఎవరిని ముందుగా పంపెను? = హనుమంతుడు.*


*105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి? = శత్రుంజయం.*


*106. శ్రీ రాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను? = స్వయంగా తన భవనమునే యిచ్చెను.*


*107. పట్టాభిషేక సమయంలో శ్రీ రామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది? = బ్రహ్మ.*


*108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి? = తన మెడలోని ముత్యాల హారం.*

Btahmin


 

సంస్కృత మహాభాగవతం

 *28.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పందొమ్మిదవ అధ్యాయము*


*జ్ఞాన-భక్తి-యమనియమాది సాధనముల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీభగవానువాచ*


*19.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*అహింసా సత్యమస్తేయమసంగో హ్రీరసంచయః|*


*ఆస్తిక్యం బ్రహ్మచర్యం చ మౌనం స్థైర్యం క్షమాభయమ్॥12993॥*


*శ్రీకృష్ణభగవానుడు నుడివెను* ఉద్ధవా! అహింస (ప్రాణులయెడ ఎట్టి ద్రోహచింత లేకుండుట), సత్యము (భూతహితమైన భాషణము), అస్తేయము (మనస్సునందు ఇతరుల సొత్తును అపహరించు ధోరణి లేకుండుట), అసంగము (ఎట్టి లౌకిక విషయములయందును ఆసక్తి లేకుండుట), లజ్జ (సిగ్గు), అసంచయము (అవసరమునకు మించి ధనాదికమును కూడబెట్టకుండుట), ఆస్తిక్యము (వేదశాస్త్రముల యందు విశ్వాసము), బ్రహ్మచర్యము (స్త్రీసంగరాహిత్యము), మౌనము (వృథాలాపవర్జనము, భగవన్నామస్మరణము), స్థిరత (నిశ్చలత్వము), క్షమ (తితిక్ష-సహనము), అభయము (నిర్భయత్వము) అను ఈ పన్నెండును యమములు అనబడును.


*19.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*శౌచం జపస్తపో హోమః శ్రద్ధాఽఽతిథ్యం మదర్చనమ్|*


*తీర్థాటనం పరార్థేహా తుష్టిరాచార్యసేవనమ్॥12994॥*


శౌచము - బాహ్య శౌచము, అభ్యంతర శౌచము (బాహ్యాభ్యంతర పవిత్రత), జపము (మంత్రమును జపించుట), తపస్సు (శాస్త్రీయ కాయక్లేశము), హోమము (అగ్నికార్యమునందు ఆహుతి సమర్పించుట), శ్రద్ధ (సత్కార్యములయందు పట్టుదల), ఆతిథ్యము (అతిథిసేవ), భగవదారాధనము, తీర్థయాత్ర, పరోపకారబుద్ధి, తుష్టి (దైవికముగా లభించినదానితో తృప్తిచెందుట), గురుసేవ అను ఈ పన్నెండును 'నియమములు' అని యనబడును.


*19.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*ఏతే యమాః సనియమా ఉభయోర్ద్వాదశ స్మృతాః|*


*పుంసాముపాసితాస్తాత యథాకామం దుహంతి హి॥12995॥*


ఈ యమ, నియమములు రెండును పన్నెండేసి విధములు. ఇవి సకామ, నిష్కామసాధకులకు మిగుల ఉపయుక్తములు. నాయనా! వీటిని అనుష్ఠించినవారికి సకలకార్యములు నెరవేరును.


*19.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*శమో మన్నిష్ఠతా బుద్ధేర్దమ ఇంద్రియసంయమః|*


*తితిక్షా దుఃఖసమ్మర్షో జిహ్వోపస్థజయో ధృతిః॥12996॥*


*19.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*దండన్యాసః పరం దానం కామత్యాగస్తపః స్మృతమ్|*


*స్వభావవిజయః శౌర్యం సత్యం చ సమదర్శనమ్॥12997॥*


*శమము* అనగా శాంతి మాత్రమేగాదు. భగవత్పరమైన నిష్ఠతోగూడిన బుద్ధి. *దమము* అనగా బాహ్యేంద్రియ నియమనము. *తితిక్ష* అనగా దుఃఖములను సహించుట. *ధృతి* అనగా జిహ్వ మరియు జననేంద్రియములను జయించుట (వాటి ఉద్వేగమును అణచుట). *దండన్యాసము* అనగా ఏ ప్రాణి యెడలను ద్రోహచింతన లేకుండుట (ఏ ప్రాణినీ దండింపకుండుట). *దానము* అనగా ధనమును అర్హులకు ఇచ్చుటయేగాక, ఇతరులకు (ఆపన్నులకు) అభయమిచ్చుట, *తపస్సు* అనగా భోగములయెడ అపేక్ష లేకుండుట. *శౌర్యము* అనగా కేవలము శత్రువులను జయించుట మాత్రమేగాదు, వాసనలను అన్నింటిని జయించుట. *సత్యము* అనగా కేవలము యదార్థభాషణమేగాదు. సకల ప్రాణులలోను పరమాత్మను దర్శించుట.


*19.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*ఋతం చ సూనృతా వాణీ కవిభిః పరికీర్తితా|*


*కర్మస్వసంగమః శౌచం త్యాగః సన్న్యాస ఉచ్యతే॥12998॥*


*ఋతము* అనగా సత్యము మరియు హితభాషణము అని మహాత్ములు పేర్కొనిరి. *శౌచము* అనగా కర్మలయందు ఆసక్తి లేకుండుట. *సన్న్యాసము* అనగా కోరికలను త్యజించుట.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పందొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

ఉబ్బసవ్యాధి నివారణ కొరకు అద్బుత యోగం -

 ఉబ్బసవ్యాధి నివారణ కొరకు అద్బుత యోగం -


 

      చక్కగా పెద్దగా ఎదిగిన కలబంద మట్టని మొదలకి కొసి తెచ్చుకోవాలి . దీన్ని అడ్డంగా వెదురుబద్ధ చీల్చినట్టు రెండుగా చీల్చుకొని అందులో నవాసారం పొడిని తగినంతగా చల్లి తిరిగి రెండింటిని యధాప్రకారం చేర్చి దారంతో చక్కగా కట్టి ఎండలో వేలాడదీసి దీనికింద ఒక గాజు లేక పింగాణి పాత్రని ఉంచాలి. ఎండవేడికి కరిగి రెండు గంటల్లో పాత్రలోకి కలబంద ద్రావణం దిగుతుంది. పూర్తిగా దిగినతరువాత దీనిని ఒక గాజుసీసాలో పోసి మూత గట్టిగా బిగించాలి.


           తరువాత ఒక పాత్రలో నీళ్లు తీసుకుని బాగా మరిగేలా కాచి దించి ఆ పాత్రలో నీటిలో ఈ గట్టిగా బిగించిన సీసాని ఉంచాలి . సీసాతోపాటు ద్రావకం కూడా వేడెక్కుతుంది . అలా వేడెక్కిన తరువాత సీసాని తీసి భద్రం చేయాలి . 


  వాడే విధానం - 


      ఉదయం , సాయంత్రం రెండుపూటలా అరకప్పు నీటిలో అయిదు చుక్కలు ఈ ద్రావకం కలుపుకుని సేవించాలి . వారం రోజుల్లో మీకు ఫలితం కనిపిస్తుంది. 


  గమనిక - 


      ఈ ఔషదం వాడే సమయంలో చేప , ఎండుచేప , కోడి మాంసం నిషేధం .


          నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది. 


       


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

మా పాఠశాలలు ఎలా మూతపడ్డాయో

 *🙏🙏🙏🙏🙏🙏🙏🙏* 


*మా పాఠశాలలు ఎలా మూతపడ్డాయో తెలుసుకోండి.* 


🙏🙏🙏🙏🙏🙏🙏🙏 


*మనం ఎదుగుతున్నప్పుడు సైన్స్, ఆర్ట్స్, కామర్స్ అనే 3 బ్రాంచ్‌లు మాత్రమే తెలుసు.* 


*1978లో కళాశాలలకు ఐదు శాఖలు ఉండేవి.* 


సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ మరియు ఎలక్ట్రానిక్స్. 


కానీ *మీకు తెలుసా మన భారతీయ పాఠశాలలు 1858కి ముందు 50-72 రకాల విద్యలను బోధించేవి.* 


భారతీయ పాఠశాలల వ్యవస్థను బ్రిటిష్ దార్శనికులు నాశనం చేశారు. 


*ఇంగ్లండ్‌లో మొదటి పాఠశాల 1811లో ప్రారంభించబడింది.  ఆ సమయంలో భారతదేశంలో 732000 భారతీయ పాఠశాలలు ఉన్నాయి.* 


మా పాఠశాలలు ఎలా మూతపడ్డాయో తెలుసుకోండి.  ఇండియన్ స్కూల్ లెర్నింగ్ ఎలా ముగిసింది.

ముందుగా భారతీయ సంస్కృతిలో ఏయే విభాగాలు బోధించబడ్డాయో చెబుతాను! 


చాలా భారతీయ పాఠశాలలు ఈ క్రింది విషయాలను బోధించాయి. 


01 అగ్ని విద్య (మెటలర్జీ)

02 వాయు విద్య (గాలి)

03 జల విద్య (నీరు)

04 అంతిక్ష్ విద్యా (అంతరిక్ష శాస్త్రం)

05 పృథ్వీ విద్య (పర్యావరణం)

06 సూర్య విద్య (సోలార్ స్టడీ)

07 చంద్ర మరియు లోక్ విద్య (చంద్రుని అధ్యయనం)

08 మేఘ్ విద్యా (వాతావరణ సూచన)

09 ధాతు ఊర్జ విద్య (బ్యాటరీ శక్తి)

10 దిన్ ఔర్ రాత్ విద్య.

12 సృష్టి విద్య (అంతరిక్ష పరిశోధన)

13 ఖగోల్ విజ్ఞాన్ (ఖగోళ శాస్త్రం)

14 భుగోల్ విద్యా (భూగోళశాస్త్రం)

15 కాల విద్య (సమయ అధ్యయనాలు)

16 భూగర్భ్ విద్యా (జియాలజీ & మైనింగ్)

17 రత్నాలు మరియు లోహాలు (రత్నాలు & లోహాలు)

18 ఆకర్షణ విద్య (గురుత్వాకర్షణ)

19 ప్రకాష్ విద్య (శక్తి)

20 సంచార్ విద్య (కమ్యూనికేషన్)

21 విమాన విద్య (విమానం)

22 జలయన్ విద్య (నీటి నాళాలు)

23 ఆగ్నేయ అస్త్ర విద్య (ఆయుధాలు & మందుగుండు సామగ్రి)

24 జీవవిజ్ఞాన విద్య (జీవశాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం)

25 యజ్ఞ విద్య (మెటీరియల్ సిక్)

* ఇదీ వైజ్ఞానిక విద్య గురించిన చర్చ.  ఇప్పుడు కవర్ చేయబడిన వృత్తిపరమైన మరియు సాంకేతిక విభాగాల గురించి మాట్లాడుకుందాం!*

26 వ్యాపార విద్యా (కామర్స్)

27 కృషి విద్య (వ్యవసాయం)

28 పశు పాలన్ విద్య (పశుసంవర్ధక)

29 పక్షి పాలన్ (పక్షి సంరక్షణ)

30 యాన్ విద్య (మెకానిక్స్)

32 వాహన రూపకల్పన

33 రతంకర్ (రత్నాలు & ఆభరణాల రూపకల్పన)

36 కుమ్హార్ విద్యా (కుమ్మరి)

37 లఘు (మెటలర్జీ & కమ్మరి)

38 టక్కాలు

39 రంగ్ విద్య (డైయింగ్)

40 ఖట్వాకర్

41 రజ్జుకర్ (లాజిస్టిక్స్)

42 వాస్తుకార్ విద్య (వాస్తుశిల్పం)

43 ఖానా బనానే కి విద్య (వంట)

44 వాహన విద్య (డ్రైవింగ్)

45 జలమార్గాల నిర్వహణ

46 సూచికలు (డేటా ఎంట్రీ)

47 గౌశాల మేనేజర్ (పశు సంవర్ధక)

48 బాగ్వాణి (హార్టికల్చర్)

49 వాన్ విద్య (అటవీ శాస్త్రం)

50 సహయోగీ (కవరింగ్ పారామెడిక్స్) 


ఈ విద్య అంతా బడిలో బోధించబడింది, కానీ కాలక్రమేణా, పాఠశాల అదృశ్యమైనప్పుడు, ఈ జ్ఞానం బ్రిటిష్ వారు కనుమరుగయ్యేలా చేసారు!  ఇది మెకాలేతో ప్రారంభమైంది.  నేడు మెకాలే పద్ధతిలో మన దేశ యువత భవిష్యత్తు నాశనం అవుతోంది. 


భారతదేశంలో పాఠశాల సంస్కృతి ఎలా ముగిసింది?

కాన్వెంట్ విద్య శిథిలమైన పాఠశాలల ప్రవేశం భారతీయ విద్యా చట్టం 1835లో ఏర్పడింది (1858లో సవరించబడింది).  దీనిని 'లార్డ్ మెకాలే' రూపొందించారు. 


చాలా మంది బ్రిటీషర్లు భారతదేశ విద్యా వ్యవస్థ గురించి తమ నివేదికలను అందించినప్పుడు మెకాలే ఇక్కడ విద్యా వ్యవస్థపై సర్వే నిర్వహించారు.  బ్రిటిష్ అధికారి ఒకరు జి.డబ్ల్యూ.  లూథర్ మరియు మరొకరు థామస్ మన్రో!  వీరిద్దరూ వేర్వేరు సమయాల్లో వేర్వేరు ప్రాంతాల్లో సర్వే చేశారు.  ఉత్తర భారతదేశాన్ని (ఉత్తరభారత్) సర్వే చేసిన లూథర్ ఇక్కడ 97% అక్షరాస్యత ఉందని మరియు దక్షిణ భారతదేశాన్ని (దక్షిణభారత్) సర్వే చేసిన మన్రో ఇక్కడ 100% అక్షరాస్యత ఉందని రాశారు. 


భారతదేశం (భారత్) శాశ్వతంగా బానిసలుగా ఉండాలంటే, దాని ′′*స్వదేశీ మరియు సాంస్కృతిక విద్యా వ్యవస్థ*′′ని పూర్తిగా కూల్చివేసి, దాని స్థానంలో "ఇంగ్లీషు విద్యావిధానం′′" తీసుకురావాలి, అప్పుడే భారతీయులు భౌతికంగా భారతీయులు అవుతారని మెకాలే స్పష్టంగా చెప్పాడు.  , కానీ మానసికంగా ఇంగ్లీష్ మారింది.  వారు కాన్వెంట్ పాఠశాలలు లేదా ఆంగ్ల విశ్వవిద్యాలయాలను విడిచిపెట్టినప్పుడు, వారు బ్రిటిష్ వారి ప్రయోజనాలకు అనుగుణంగా పని చేస్తారు. 


మెకాలే ఒక యాసను వాడుతున్నాడు - ′′ పంట వేయకముందే పొలాన్ని పూర్తిగా దున్నినట్లే, దానిని దున్నేసి ఆంగ్ల విద్యా విధానంలోకి తీసుకురావాలి.  "అందుకే అతను పాఠశాలలను చట్టవిరుద్ధమని మొదట ప్రకటించాడు.  ఆ తర్వాత సంస్కృతం చట్టవిరుద్ధమని ప్రకటించి పాఠశాలలకు నిప్పంటించి, అందులోని ఉపాధ్యాయులను కొట్టి జైల్లో పెట్టాడు.

1850 వరకు భారతదేశంలో '7 లక్షల 32 వేల' పాఠశాలలు & 7,50,000 గ్రామాలు ఉన్నాయి.  అంటే దాదాపు ప్రతి గ్రామంలో ఒక పాఠశాల ఉండేది మరియు ఈ పాఠశాలలన్నీ నేటి భాషలో 'ఉన్నత అభ్యాస సంస్థలు'గా ఉండేవి.  వాటన్నింటిలో 18 సబ్జెక్టులు బోధించబడ్డాయి మరియు ఈ పాఠశాలల ప్రజలు రాజుచే కాకుండా కలిసి వీటిని నడిపేవారు.

విద్యను ఉచితంగా అందించారు.

పాఠశాలలు రద్దు చేయబడ్డాయి మరియు ఆంగ్ల విద్య చట్టబద్ధం చేయబడింది మరియు కలకత్తాలో మొదటి కాన్వెంట్ పాఠశాల ప్రారంభించబడింది.  అప్పట్లో 'ఉచిత పాఠశాల' అనేవారు.  ఈ చట్టం ప్రకారం కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం & మద్రాసు విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి.  ఈ మూడు బానిసత్వ కాలం నాటి విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ దేశంలో ఉన్నాయి!

మెకాలే తన తండ్రికి ఒక లేఖ రాశాడు.  ఇది చాలా ప్రసిద్ధ లేఖ, అందులో అతను ఇలా వ్రాశాడు: ′′ ఈ కాన్వెంట్ పాఠశాలలు భారతీయులలా కనిపిస్తున్నప్పటికీ మెదడులో ఆంగ్లంలో ఉన్న పిల్లలను బయటకు తీసుకువస్తాయి మరియు వారికి వారి దేశం గురించి ఏమీ తెలియదు.  వీరికి వారి సంస్కృతి గురించి ఏమీ తెలియదు, వారి సంప్రదాయాల గురించి వారికి తెలియదు, వారి యాసలు తెలియవు, ఇలాంటి పిల్లలు ఈ దేశంలో ఉన్నప్పుడు, బ్రిటీష్ వారు పోయినా, ఇంగ్లీష్ ఈ దేశాన్ని విడిచిపెట్టదు.  .′′ అప్పట్లో రాసిన లేఖలోని నిజం నేటికీ మన దేశంలో స్పష్టంగా కనిపిస్తోంది.  ఈ చట్టం సృష్టించిన దుస్థితిని చూడండి.  మన స్వంత భాష మాట్లాడటానికి మరియు మన స్వంత సంస్కృతిని గుర్తించడానికి సిగ్గుపడే మనకంటే మనం తక్కువగా భావిస్తున్నాము. 


మాతృభాషతో తెగతెంపులు చేసుకున్న సమాజం ఎప్పటికీ వర్ధిల్లదు, ఇది మెకాలే వ్యూహం!  ఇక్కడి నేటి యువతకు భారతదేశం కంటే యూరప్ గురించి ఎక్కువ తెలుసు.  భారతీయ సంస్కృతి అంత చల్లదనాన్ని పరిగణిస్తుంది, కానీ పాశ్చాత్య దేశాన్ని అనుకరిస్తుంది. 


ఎంత పాపం.  మనమందరం మేల్కొలపడానికి మరియు మన గొప్ప సంస్కృతి & వారసత్వాన్ని తిరిగి పొందేందుకు ఇది సరైన సమయం. 


                           ఇట్లు 

                             మీ

            అవధానుల శ్రీనివాస శాస్త్రి

మంచి ఆలోచనలు, మంచి పనులు

 నీకు ఎలా తెలుసు

మీరు ధనవంతులు?


అద్భుతమైన సమాధానం

IIT విద్యార్థి ద్వారా.


నేను బి టెక్ చేస్తున్నప్పుడు మాకు ‘మెకానిక్స్’ నేర్పించే ఒక ప్రొఫెసర్ ఉండేవారు.


అతను బోధించడానికి మరియు వివరించడానికి ఆసక్తికరమైన మార్గం ఉన్నందున అతని ఉపన్యాసాలు చాలా ఆసక్తికరంగా ఉండేవి

భావనలు.


ఒకరోజు క్లాసులో ఈ క్రింది ప్రశ్నలు అడిగాడు.


1. ZERO అంటే ఏమిటి?

2. అనంతం అంటే ఏమిటి?

3. ZERO మరియు INFINITY ఒకేలా ఉండవచ్చా?


మాకు సమాధానాలు తెలుసునని మేమంతా భావించాము మరియు మేము ఈ క్రింది విధంగా ప్రత్యుత్తరం ఇచ్చాము:


ZERO అంటే ఏమీ లేదు.

INFINITY అంటే

ఏదైనా లెక్కించదగిన సంఖ్య కంటే పెద్ద సంఖ్య.


ZERO మరియు INFINITY వ్యతిరేకం మరియు అవి ఎప్పుడూ ఒకేలా ఉండవు.


అతను మొదట అనంతం గురించి మాట్లాడటం ద్వారా మమ్మల్ని ఎదుర్కొన్నాడు మరియు లెక్కించదగిన సంఖ్య కంటే ఎక్కువ సంఖ్య ఎలా ఉంటుంది?


మా దగ్గర సమాధానాలు లేవు.


35 ఏళ్ల తర్వాత కూడా నాకు గుర్తున్న అనంతం అనే కాన్సెప్ట్‌ని చాలా ఆసక్తికరంగా వివరించారు.


నిరక్షరాస్యుడైన గొర్రెల కాపరి ఉన్నాడని ఊహించుకోమని ఆయన అన్నారు

20 వరకు.


ఇప్పుడు, అతని వద్ద ఉన్న గొర్రెల సంఖ్య 20 కంటే తక్కువ మరియు అతని వద్ద ఎన్ని గొర్రెలు ఉన్నాయని మీరు అతనిని అడిగితే, అతను మీకు ఖచ్చితమైన సంఖ్యను చెప్పగలడు (3, 5 14 మొదలైనవి).


అయితే, సంఖ్య 20 కంటే ఎక్కువ ఉంటే, అతను "చాలా ఎక్కువ" అని చెప్పే అవకాశం ఉంది.


సైన్స్‌లో అనంతం అంటే 'చాలా ఎక్కువ' (మరియు లెక్కించలేనిది కాదు) మరియు అదే విధంగా సున్నా అంటే 'చాలా తక్కువ' (మరియు ఏమీ కాదు) అని ఆయన వివరించారు.


ఉదాహరణగా, భూమి మరియు సూర్యుని మధ్య దూరంతో పోలిస్తే భూమి యొక్క వ్యాసాన్ని తీసుకుంటే, భూమి యొక్క వ్యాసం చాలా చిన్నది కనుక సున్నా అని చెప్పవచ్చు.


అయితే, భూమి యొక్క అదే వ్యాసాన్ని ఒక గింజ పరిమాణంతో పోల్చినప్పుడు, భూమి యొక్క వ్యాసం అనంతం అని చెప్పవచ్చు.


అందువల్ల, సందర్భాన్ని బట్టి లేదా మీ పోలిక మాతృకను బట్టి అదే విషయం ఒకే సమయంలో ZERO మరియు అనంతం కావచ్చునని అతను నిర్ధారించాడు.


ఐశ్వర్యం మరియు పేదరికం మధ్య సంబంధం అనంతం మధ్య సంబంధాన్ని పోలి ఉంటుంది

మరియు సున్నా.


ఇది మీ కోరికలతో పోలిక స్థాయిపై ఆధారపడి ఉంటుంది.


మీ ఆదాయం మీ కోరికల కంటే ఎక్కువగా ఉంటే,

మీరు ధనవంతులు.

మీ కోరికలు మీ ఆదాయం కంటే ఎక్కువగా ఉంటే,

మీరు పేదవారు.


నా సంపాదన కంటే నా కోరికలు చాలా తక్కువ కాబట్టి నన్ను నేను ధనవంతుడిగా భావిస్తాను.


నేను చాలా డబ్బు సంపాదించడం ద్వారా చాలా ధనవంతుడిని అయ్యాను, కానీ క్రమంగా నా కోరికలను తగ్గించుకోవడం ద్వారా.


మీరు మీ కోరికలను తగ్గించుకోగలిగితే, మీరు కూడా ఈ క్షణంలో ధనవంతులు కావచ్చు.


మంచి ఆలోచనలు, మంచి పనులు, మీ చుట్టూ ఉండే మంచి వ్యక్తులతో మీ జీవితాలు ఎల్లప్పుడూ సంపన్నం కావాలి.🙏🏽

పాలు.. వాటి కథ..

 పాలు.. వాటి కథ..


పొద్దున్నే వచ్చాడు మిత్రుడు. కీటో డైటింగ్ చేస్తున్నాడుకాబట్టి కాస్త సన్నబడ్డాడు. సరే! కాఫీ తాగుతావా అని అడిగాను, అప్పుడే ఇంట్లోంచి ఘుమఘుమ కాఫీ వొసన వస్తోంది. వేడి వేడి కాఫీ రెడీ ఔతోంది. "అయ్యబాబోయ్!! నేను కాఫీ తాగను" అని అన్నాడు, కాఫీ తాగితే పున్నామ నరకానికి పోతామనేంత ముఖం చిట్లిస్తూ...


సరే పోనీ పాలు!?


పాలు తాగుతాను కానీ!. పాకెట్ పాలైతే తాగను. మీ ఇంట్లో గేదె పాలు ఉంటే ఇవ్వండి‌. అన్నాడు.


నీ కోరిక సింగారం గానూ!. గేదెల్ని నేనెక్కడ నుంచి తీసుకురావాలి సామీ!. ఐనా ప్యాకెట్ పాలు ఏం పాపం చేశాయట?. తాగనంటున్నావ్!? అని అడిగాను.


"నేను అంతా ప్రకృతి సహజమైన పాలే తాగుతాను. ఈ ఇంగ్లీష్ వాళ్ళు పాలల్లో ఏవో కెమికల్స్ కలిపి ఈ పాకెట్ పాల సిస్టం తీసుకొచ్చారు. ఇవి ఆరోగ్యానికసలు మంచిదే కాదు. చాలా డేంజర్!. ఈ రోజు మనకొచ్చే జబ్బులకన్నింటికీ ఈ ప్యాకెట్ పాలే కారణం..." అన్నాడు. ఇంత గ్యానం ఎక్కడిదీ సారుకు అని ఆశ్చర్యంగా చూసే లోపల అతడే అన్నాడు...

"ఇంత జ్ఞానం నాకెక్కడిది అనుకున్నావా?. మొన్ననే ఒక ప్రోగ్రాం అటెండయ్యా!. ఆయన మీ ఆధునిక డాక్టర్ల బండారం మొత్తం బయట పెట్టేశాడు. ప్రపంచమంతా సహజత్వం వైపు ప్రకృతి వైపు ఆరోగ్యం వైపు పయనిస్తుంటే మీ డాక్టర్లు మాత్రమే ఆ ఇంగ్లీషోడు పాశ్చర్ చెప్పినట్టు పాలను పాశ్చరైజేషన్ కు గురిచేసి వాటిని పసలేని పాలుగా మార్చి వాటిని తాగమని అడ్వైజ్ చేస్తున్నారు...అవి తాగటం వలననే సకల జబ్బులూ వస్తున్నాయి" అన్నాడు. ఆవేశంగా.. కాసేపు బుర్ర గిర్రున తిరిగింది. వీళ్ళు ప్రాబ్లం పాశ్చరైజేషన్ తోనా లేక ఇంగ్లీష్ వాళ్ళతోనా అనుకున్నాను. ఈ రేంజ్ గ్యానం అందించిన ఆ సహజ ప్రకృతి అడ్వైజర్ ఎవరో చూడాలని అనుకున్నా. నేను నోట మాట రాక ఆశ్చర్యం పోతుంటే..." నోట మాట రావట్లేదు కదూ!. మీ బండారం బయట పడింది కదూ!" అన్నాడు. ఓర్నీ వీడి దుంపతెగ!. "సరేనబ్బా...! ఇంతకీ గేదె పాలు డైరెక్ట్ గా తాగితే ఏంటంట బెనిఫిట్టు!?'" అనడిగిను.


"అసలే జబ్బులూ రావు. చిన్న పిల్లలకు కూడా ఆ పాలే ఇవ్వాలి. తల్లి పాలు లేకపోతే స్వచ్ఛమైన దేశీ ఆవు పాలు ఇవ్వాలి'" అన్నాడు ఖరాఖండీగా!


నాయనా! ఇటువంటి పిచ్చి పనులు మీరు చేయాలనుకుంటే చేయండి, కానీ పిల్లలకు పాశ్చరైజ్డ్ ఆవు పాలే ఇవ్వండి. పాశ్చరైజేషన్ వలన హాని కారక బ్యాక్టీరియాలు ఎన్నో చంపబడతాయి. ముఖ్యంగా ఈ.కోలై, కాంపైలోబ్యాక్టర్, లిస్టీరియా, సాల్మోనెల్లా, బ్రూసెల్లా, ట్యూబర్క్యులోసిస్, స్ట్రెప్టోకోకస్ వంటివి చంపబడతాయి. పాలను పితికేటపుడు ఆ పశుల కొట్టంలో ఉండే సకల బ్యాక్టీరియాలు పాలలో కలుస్తాయి. కింద ఆ నేలమీద ఉండేటటువంటి పేడ, అక్కడ ముసురుకున్న ఈగలు, పశువుల మూత్రం, గడ్డి, పాలు పిండుతున్న వాడి చేతులు( పొద్దున్నే పిండుతాడు మరి...నైట్ చేతులు ఎక్కడైనా పెట్టుకోచ్చుగాక!) పిండే ఆ బకీట! ఇవన్నీ పరమ పవిత్రంగా ఉన్నాయని నీవనుకుంటే అట్టాగే కానీయ్! కానీ పాలు ఇంతటి unhygienic conditions లో పితకబడతాయి. ఆవు పొదుగుకు ఉండే ఇన్ఫెక్షన్( mastitis)వలన ఆ బ్యాక్టీరియా కూడా అందులో చేరుతాయి. ఈ సకల బ్యాక్టీరియా లనూ వాటి స్పోర్లనూ ఒక్క పాశ్చరైజేషన్ ద్వారా చంపి పడేయొచ్చు. పాశ్చరైజేషన్ లో ఏమీ కెమికల్స్ ని కలపరు. వాటిని ఒక ఉష్ణోగ్రత వద్ద వేడిచేసి కొంత సేపు అదే ఉష్ణోగ్రత వద్ద ఉంచి ఫాస్ట్ గా కూల్ చేస్తారు. ఇలా చేయడం వలన ఎన్నో బ్యాక్టీరియాలు చనిపోతాయని లూయీ పాశ్చర్ కనుగొన్నాడు" అని చెప్పాను. " ఇంకో విషయం ఏమిటంటే un pasturized milk తాగటం వలన ఇటువంటి milk born diseases ఎన్నో విజృంభించిన సందర్భాలు రికార్డై ఉన్నాయి. పెద్దలకే ఈ పాలు హానికరం అంటుంటే చిన్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టకూడదు.


అదేం కాదు. పాలల్లో మనిషికి ఉపయోగపడే బ్యాక్టీరియా కూడా ఉంటాయట అవి చనిపోవడం వలన నష్టమే కదా!?. అడిగాడు.


"'మనిషికి ఉపయోగపడే బ్యాక్టీరియా లు మనిషి కడుపులోనే ఉంటాయి. ఈ పాలలో ఎందుకుంటై?. ఆవు లేదా గేదె కడుపులో దానికి అవసరమైన బ్యాక్టీరియాలు ఉంటై, అవి పాలలోకి రావు. ఉదాహరణకు బైఫిడో బ్యాక్టీరియాలు మనిషికీ గేదెకీ కడుపులో ఉంటాయి. ఇపుడు గేదె పాలలో బైఫిడో బ్యాక్టీరియా ఉంటే ఏమని అర్థం!?" సీరియస్ గా అడిగాను. భృకుటి ముడి పెట్టి చూశాడు ..అంతే సీరియస్ గా. సమాధానం రాకపోయేసరికి నేనే చెప్పాను.


" అరే సామీ! మనిషి కడుపులో, గేదె కడుపులో ఉండే ఆ బ్యాక్టీరియా గేదె పాలలోకి ఎలా వస్తాయి!?.. కేవలం ఫీకల్ మ్యాటర్ వలననే కదా బయటకు రావాలి!. అంటే ఆ గేదె పెండతో ఆ పాలు కంటామినేట్ ఐవుండాలి. లేదా ఆ పాలు పితికేవాడు పొద్దున్నే తన వామ హస్తముతో......"'


ఛీ!... నిజమా?...రామ రామా!!"'


"'కృష్ణ కృష్ణా!. అందుకే నీకు సహజత్వమని సొల్లేసినోడెవడో మహా ఘటికుడు. చదువుకున్న నిన్నే బోల్తా కొట్టించాడు చూశావూ!?"" అన్నాను.


మరి పాశ్చరైజేషన్ వలన పాలల్లో శక్తి తగ్గుతుందని, ఆ పాలు వలన ఎముకలు పలుచనవుతాయనీ చెప్పాడే!?. 


వాడి బొంద!. పాలను వేడి చేస్తే పాల ప్రొటీన్ "కేసిన్"' కి ఏమీ కాదు. అలాగే పాలలో ఉండే కాల్షియం ఏమీ ముక్కలైపోదు. కాబట్టి మామూలు పాలలో ఎంత ప్రొటీన్ ఉంటుందో ఎంత కాల్షియం ఉంటుందో పాశ్చరైజ్డ్ పాలల్లో అంతే ఉంటుంది. ఇక పాలలో ఉండే ల్యాక్టోజ్ అనే షుగర్ కొంతమందికి పడదు. అది పాకెట్ పాలా గేదె పాలా అని కాకుండా లాక్టోజ్ ఎక్కడున్నా పడదు. లాక్టేజ్ అనే ఎంజైమ్ కడుపులో లేకపోవడం వలన పాలు అరగక ఇబ్బందులు పడుతూంటారు. దీనిని లాక్టోజ్ ఇంటోలరెన్స్ అంటారు. చిన్న పిల్లల్లో ఇది ఉంటే వాళ్ళ ఎదుగుదల ఉండదు. 


ఔనౌను. దీని గురించి కూడా చెప్పాడు. ఐతే ప్యాకెట్ పాలవలననే ఇది వస్తుందనీ, ఆవు పాలు తాగితే రాదనీ చెప్పాడు. ఇంకా ప్యాకెట్ పాలు తాగితే ఆస్తమా వస్తుందనీ చెప్పాడు.


ఇదీ అబద్దమే! ఆస్త్మా అనేది కొన్ని ప్రోటీన్ లకు రియాక్షన్ గా వస్తుంది. పాలలో కేసీన్ ఉంటుంది. పాశ్చరైజేషన్ వలన కేసిన్ ప్రోటీన్ స్ట్రక్చర్ లో మార్పు ఏమీ ఉండదు. కాబట్టి ఒక వ్యక్తికి కేసీన్ ప్రొటీన్ పడలేదంటే అది ప్యాకెట్ పాలైనా గేదె పాలైనా ఒకటే!. కేవలం ప్యాకెట్ పాలకు మాత్రమే ఆస్తమా వస్తుంది గేదె పాలకు రాదు అని చెప్పడంలో ఏ సైన్సూ లేదు.

29, అక్టోబర్ 2021, శుక్రవారం

బ్రాహ్మీముహూర్తంలో

 బ్రాహ్మీముహూర్తంలో లేస్తే ఏంటట!


ఉదయాన్నే నిద్రలేవాలని మన పెద్దవాళ్లు తెగ పోరేవారు. అలా చెప్పీ చెప్పీ చాలా తరాలు వెళ్లిపోయాయి. తరం మారుతున్న కొద్దీ జీవవనశైలి మారిపోతోంది. నిద్రలేచే సమయాలూ, పనిచేసే వేళలూ మారిపోతున్నాయి. కొన్నాళ్ల తరువాత పని చేయడానికీ, నిద్రపోవడానికీ రాత్రీపగలుతో సంబంధమే లేకపోవచ్చు. కానీ ఇప్పటికీ బ్రాహ్మీముహూర్తం` అన్న మాట అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది. ఇంతకీ ఆ బ్రాహ్మీముహూర్తం అంటే ఖచ్చితంగా ఏ సమయంలో వస్తుంది. ఆ సమయంలో నిద్రలేవడం వల్ల ప్రయోజనం ఏంటి!


సూర్యోదయానికి 96 నిమిషాల ముందున్న కాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. అయితే రుతువుని బట్టి సూర్యోదయ వేళలు మారిపోతూ ఉంటాయి కాబట్టి, 4:00 -4:30 a.mని బ్రాహ్మీముహూర్తంగా అనుకోవచ్చు. బ్రాహ్మీ అంటేనే సరస్వతి అని అర్థం. మన పెద్దలు చాలా ఆలోచించే ఆ పేరు పెట్టారేమో అనిపిస్తుంది. ఈ సమయంలో నిద్రలేవడం వల్ల ఉపయోగం ఏంటి అని అడిగే ప్రశ్నకు చాలానే జవాబులు వినిపిస్తాయి.


ఆ సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా, నిద్రలోని ఆఖరి జామును గడుపుతూ ఉంటుంది. సూర్యుని వేడి భూమిని కాస్త తాకుతూ ఉంటుంది, కానీ వెలుతురు ఇంకా మనల్ని చేరుకోదు. అంటే రాత్రివేళ చల్లదనాన్నీ, పగటివేళ చురుకుదనాన్నీ ఏకైక కాలంలో కలిగిఉండే సమయం ఇదన్నమాట! అందుకే ఈ సమయంలో మనుషులు సత్వగుణం ప్రధానంగా ఉంటారట. లేలేత కిరణాలు శరీరాన్ని తాకడం చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు కాబట్టి, ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్యనమస్కారాలు చేయడమో, వ్యాహ్యాళికి వెళ్లడమో చేస్తే ఆరోగ్యానికి మంచిది.


మనలో జీవగడియారం అనేది ఒకటి ఉంటుంది. అది మనం ఏర్పరుచుకున్న అలవాట్లను బట్టీ, ప్రకృతిని బట్టీ నడుచుకుంటూ ఉంటుంది. నిద్రపోవడం, లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం… ఇవన్నీ సమయానికి అనుకూలంగా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. సాక్షాత్తూ ఆయుర్వేదమే `తన ఆరోగ్యాన్నీ, ఆయుష్షునూ కాపాడుకోవాలని అనుకునేవాడు బ్రాహ్మీముహూర్తంలో లేవాలి` అని చెబుతోంది. పైగా ఆయుర్వేదం ప్రకారం ఈ సమయం `వాత` ప్రధానంగా ఉంటుంది. శరీరంలో కదలికలనీ, ఆలోచనలనీ, రక్తప్రసరణనీ ప్రభావితం చేసేది ఈ `వాత` లక్షణం. ఈ లక్షణం మన శరీరంలో ప్రముఖంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పనినైనా చురుగ్గా చేయగలం; ప్రశాంతంగా ఉండగలం; మంచి ఆలోచనలు చేయగలం; చదివినదానిని ఆకళించు చేసుకుని దీర్ఘకాలం జ్ఞప్తికి ఉంచుకోగలం.


ధ్యానం చేయాలనుకునేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలమని యోగశాస్త్రం చెబుతోంది. మన శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఉంటాయిని యోగుల నమ్మకం. బ్రాహ్మీముహూర్తంలో సుషుమ్న నాడి చాలా ఉత్తేజితంగా ఉండి… ధ్యానం చాలా సులువుగానూ, ప్రభావవంతంగానూ సాగే అవకాశం ఉంటుందట.


ఉదయాన్నే మన శరీరంలోనూ, చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ ఉండే ప్రశాంతత వల్ల యోగా, ధ్యానం, చదువు… చాలా తేలికగా ప్రభావవంతంగా సాగుతాయి. రోజువారీ చేయాల్సిన విధులకు (ఉద్యోగం, కాలేజ్‌, వంటావార్పూ…) ముందు కాస్త సమయం చేజిక్కుతుంది. అలా కాకుండా ఆలస్యంగా లేచి ఒక్కసారిగా మన పనులలో చేరేందుకు పరిగెత్తడం వల్ల… మన మనసు, శరీరం విపరీతమైన ఒత్తిడికి లోనవుతాయి.


గుండెజబ్బులు ఉన్నవారికి తెల్లవారుజామునే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనీ, పైగా అలా వచ్చే గుండెపోటు చాలా తీవ్రంగా ఉంటుందనీ వైద్య గణాంకాలన్నీ సూచిస్తున్నాయి. గుండెల్లో రక్తనాళాలను గడ్డకట్టించే `థ్రోంబస్‌` అనే సమస్య ఉదయం వేళల్లోనే ఎక్కువగా ఉంటుందట. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి ఖచ్చితమైన కారణాలు ఏవీ చెప్పలేకపోతున్నారు వైద్యులు. పైగా ఇదే సమయంలో మనం హడావుడిగా లేచి విధుల్లోకి చేరాలనే టెన్షన్‌లో మనలోని రక్తపోటు మరింత ఎక్కువై అది గుండెపోటుకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే బ్రాహ్మీముహూర్తంలోనే నిద్రలేచి, వీలైతే కాసేపు ధ్యానం చేసుకుని… స్థిమితంగా రోజువారీ పనులకి సిద్ధపడితే మన రక్తపోటు కూడా సాధారణంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ని చదివిని తరువాత బ్రాహ్మీముహూర్తంలో లేవడాన్ని ఛాదస్తం అని ఎలా అనుకోగలం చెప్పండి!



To see more posts like this and join ALL INDIA BRAHMIN FEDERATION, click here 👇👇


https://kutumbapp.page.link/fMV3yzqM6gr6Y3UHA

28, అక్టోబర్ 2021, గురువారం

శ్రీమద్భాగవతము

 *28.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2305(౨౩౦౫)*


*10.1-1444-*


*క. అంకిలి గలుగక మా కక*

*లంకేందుని పగిదిఁ గాంతిలలితంబగు న*

*ప్పంకజనయనుని నెమ్మొగ*

*మింక విలోకింపఁ గలదె యీ జన్మమునన్?"* 🌺



*_భావము: ఏ అవరోధము లేకుండా, మచ్చలేని చంద్రుడిలా ప్రకాశించే కమలనయనుడు, ఆ శ్రీకృష్ణుని ముఖపద్మమును దర్శించే భాగ్యము మాకు ఈ జన్మలో కలుగుతుందా??_* 🙏



*_Meaning: "Are we fortunate enough to have darshan of the spotless Lotus-eyed Sri Krishna without any obstacle or impediment in this birth?"_*🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం

 పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి, అడవుల్లోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నాడు. గెలిచిన రాజు ఆ ఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు. అనుకోకుండా, అక్కడ యాగధేనువు మరణించింది. అది అశుభ సూచన. యజ్ఞాన్ని ఎలా పూర్తిచేయాలో తెలియక ఆ రాజు తికమక పడ్డాడు. నగర పురోహితుల్ని సంప్రతిస్తే- ఆ ధర్మసూక్ష్మం తెలిసినవాడు ఓడిపోయిన రాజేనని తేలింది. ధర్మసంకటం నుంచి గట్టెక్కించగలవాడు ఆయనేనని నిశ్చయమైంది.


గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు వద్దకు వెళ్లి, యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు. ఆయనా ఏ శషభిషలకూ తావు లేకుండా ధర్మనిర్ణయం కోసం ముందుకొచ్చాడు. శత్రువుకు సహకరించాడు.


ఆ ఇద్దరు రాజులూ ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్ని త్యజించారు. వారి కథే- శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’లోని ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’ సారాంశం. సమాజం అనే ధర్మసౌధం పటిష్ఠంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగా తోడ్పడిందో, ఈ ఉదాహరణ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఈ కథలో ఓడిన రాజు ఖాండిక్యుడు; గెలిచినవాడు కేశిధ్వజుడు. కథ చివర గొప్ప మలుపు ఒకటుంది.


తన యజ్ఞ సంపూర్తికి సహకరించిన ఖాండిక్యుడికి గురుదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేశిధ్వజుడు ప్రకటిస్తాడు. అది సంప్రదాయం. ఓడిన రాజుకు ఓర్మి ఎంత ప్రధానమో- గెలిచిన రాజుకు సంయమనం, ధర్మ సంప్రదాయ పరిరక్షణ అంతే అవసరం. ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న ఖాండిక్యుడు తాను కోల్పోయిన రాజ్యం తిరిగి గురుదక్షిణగా కావాలన్నా ఇచ్చేయడానికి కేశిధ్వజుడు సిద్ధపడతాడు. ఇక్కడే ఓ చిత్రం చోటుచేసుకుంటుంది. రాజ్యసంపద అయాచితంగా వచ్చిపడుతున్నా ఖాండిక్యుడు కాదంటాడు! తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని, అదే కేశిధ్వజుడి నుంచి తాను కోరుకునే గురుదక్షిణ అని ప్రకటిస్తాడు.


ఖాండిక్యుడి నిర్ణయం కేశిధ్వజుణ్ని విస్మయానికి గురిచేస్తుంది. ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు ఖాండిక్యుడు అంటాడు- ‘రాజ్యభోగాలు కేవలం భౌతిక సంపదలు. వాటిని కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాలి. అంతేగాని, అవి అయాచితంగా లభించాలని కోరుకోకూడదు. కష్టపడి సాధిస్తేనే, వాటి విలువ తెలుస్తుంది. నా కంటే బలవంతుడి చేతిలో ఓడిపోయాను. అందులో సిగ్గు పడాల్సింది ఏముంటుంది? తిరిగి పుంజుకొని ధర్మమార్గంలో, క్షాత్రంతో నా రాజ్యాన్ని నేను తిరిగి చేజిక్కించుకోవాలి. అది ఒప్పుతుంది గాని, దొడ్డిదారిన పొందితే పాపమవుతుంది’ అని బదులిస్తాడు ఖాండిక్యుడు!


ఇలాంటి కథల్ని పిల్లలకు పాఠ్యాంశాలుగా నిర్ణయిస్తే, వారి బాల్యాన్ని అవి ధార్మిక పథంలోకి నడిపిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. ఉచితాల కోసం తాపత్రయపడకుండా ఆపుతాయి. ఉచితానుచిత జ్ఞానాన్ని వారికి అలవరుస్తాయి.


*ఆముక్తమాల్యదలోని ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం- ఆ కావ్యానికి గుండెకాయ వంటిదని ప్రశస్తి రావడానికి ముఖ్య కారణాలేమిటి? ఆ కథలోని ధార్మిక నేపథ్యం, ప్రబోధ గుణం. గెలుపు ఓటముల విషయంలో, కర్తవ్య నిర్వహణలో, అయాచిత అవకాశాల తిరస్కరణలో ప్రతిఫలించిన ధర్మస్వరూపమే- భారతీయతకు వన్నెలద్దుతూ వచ్చింది.*


*లోకంలో ఇలాంటి కథలు ఒళ్లు మరిపించడమే కాదు, కళ్లు తెరుచుకొనేలా చేస్తాయి. దీనికి మన ప్రాచీన సాహిత్యమే గొప్ప ఆదరువు.*


🙏దయచేసి ఇలాంటి నీతికధలను తప్పకుండ ముందుతరాలకు పంచండి

యోగీశ్వరుడైన "శ్రీకృష్ణుడు….

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*యోగీశ్వరుడైన "శ్రీకృష్ణుడు….”*


     *భగవద్గీత లో ఇలా అన్నాడు...*

                ➖➖➖✍️


         *పత్రం పుష్పం ఫలం తోయం*

         *యోమే భక్త్యా ప్రయచ్ఛతి*

         *తదహం భక్త్యుపహృతం*

         *అశ్నామి ప్రియతాత్మనః*


*"ఎవరైతే నాకు పత్రమైనను., పుష్పమైనను., ఫలమైనను., చివరకు ఉదకమైనను భక్తితో సమర్పిస్తారో..., వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తాను’ అది పై శ్లోకం తాత్పర్యం!*


*భగవంతుడికి మనం చేసే చిన్న పాటి సేవ కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.*


*ధూప, దీప, పుష్ప, గంధాలతో మనం పరమాత్మకు ప్రతిరోజూ చేసే పూజ కూడా ఎంతో గొప్ప భగవద్ అనుగ్రహాన్ని వర్షిస్తుంది.*


*తెలిసి చేసినా, తెలియక చేసినా సరే మనం చేసే చిన్నపాటి సేవకి పరమాత్మ విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు.*


*జగద్గురు శ్రీ ప్రభుపాదాచార్యుల వారిని ఒకసారి ఒక శిష్యుడు ఒక ప్రశ్న అడిగాడు....*


*“మీరు ప్రతిరోజూ కృష్ణుడి పాదాలమీద పువ్వుల తో పూజ చేస్తున్నారు కదా, ఒకరోజు తర్వాత వాడిపోతుంది. మరి ఆ పువ్వు పొందే ప్రయోజనం ఏమిటి?”*


*దానికి జగద్గురువులు ఇలా సమాధానం ఇచ్చారు...*


*“ఈ పువ్వు ఏ మొక్క నుంచి వచ్చిందో, ఆ మొక్కలోనున్న జీవుడు వచ్చే జన్మలో ఉత్కృష్టమైన మానవ జన్మని పొందుతుంది".*


*దీనికి పురాణంలో ఒక కథ కూడా ఉంది.*


*ఒక వూరిలో పాడుబడ్డ దేవాలయం మీద ఒక పక్షి ఎగురుతూ వెళ్ళింది. అది అలా ఎగిరి వెళ్లడంలో దాని రెక్కల నుంచి వచ్చిన గాలికి గోపురం మీద ఉన్న ధూళి తొలిగి శుభ్రపడింది.*


*తెలియక చేసినా కూడా అదొక గొప్ప భగవద్ సేవ. తర్వాతి జన్మలో ఆ పక్షి లోని జీవుడు ఒక రాజకుమారుడిగా జన్మించాడు.*


*ఎప్పుడో ఒక్కసారి చేస్తేనే పరమాత్మ అంత అనుగ్రహిస్తే, అదే మనం నిరంతరం శ్రీమన్నారాయణుడి పాద పద్మములను సేవిస్తే మనల్ని రక్షించడా స్వామి?*


*తప్పక అనుగ్రహిస్తాడు. జీవరాసులలో మానవజన్మ పరమోత్కృష్టమైన జన్మ. మోక్ష సాధనకి మానవ జన్మే చిట్టచివరి జన్మ అవుతుంది.*✍️


                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సూర్యకాంతం

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

సూర్యకాంతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న తన తల్లితండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. ఆరేళ్ళ చిన్న వయసులోనే పాడటం, నాట్యమాడటం నేర్చుకొంది. పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి. సినిమాల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకొంది.

సినీమాలలో

మొదట జెమిని స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూ. జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియబరచిన మీదట 75 రూపాయలు చేశారు. తరువాత ధర్మాంగద (1949)లో ఆమెది మూగవేషం. ధర్మాంగద టైములో చిన్నా చితకా వేషాలువేసినా తరువాత లీలా కుమారి సాయంతో మొదటిసారిగా నారద నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. మనసులో బొంబాయికి వెళదామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించు కొంది.

ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తరువాత తన కల అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తరువాత సంసారం చిత్రంలో మొట్టమొదటి సారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించింది.

అసలు సంసారం చిత్రం తరువాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాక ముందే ఇంకొక హీరోయిన్ ను పెట్టుకొని తీశేసారని తెలియడంతో, "ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను" అని ఆ సినిమాను నిరాకరించింది. కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి.నాగిరెడ్డి, చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు.

ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి - సూర్యకాంతం, రమణారెడ్డి - సూర్యకాంతం, ఎస్.వి.రంగారావు - సూర్యకాంతం- జంటలు, వాళ్ల దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం కద్దు. కొత్త సినిమా వస్తూంటే అందులో సూర్యకాంతం వుందా? అని ప్రేక్షకులూ, తారాగణంలో సూర్యకాంతం వున్నట్టేగదా? అని సినిమా డిస్ట్రిబ్యూటర్లూ - ఎదురు చూసేవారు. చక్రపాణి (1954), దొంగరాముడు (1955), చిరంజీవులు (1956), తోడికోడళ్లు (1957), అత్తా ఒకింటి కోడలే (1958), ఇల్లరికం (1959), భార్యాభర్తలు (1961), గుండమ్మకథ (1962), కులగోత్రాలు (1962), దాగుడుమూతలు (1964), అత్తగారు-కొత్తకోడలు, మూహూర్తబలం (1969) లాంటి మరపురాని ఎన్నో సినిమాలలో నటించింది.

సూర్యకాంతాన్ని హాస్యనటీమణిగా ముద్ర వెయ్యడానికి లేదు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు, నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. సహాయ నటి అనే అనాలి. గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఓర చూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసుర్తూ కుడిచెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణా చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కల్లకబుర్లతో బొల్లిడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు.

వ్యక్తిగా సూర్యకాంతం గయ్యాళి కానేకాదు - మామూలు మనిషే. ఏ సమావేశాలకో, సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్లినప్పుడు ఆటోగ్రాపులకోసం వెళ్లే స్త్రీలు సూర్యకాంతం దగ్గరకి వెళ్లడానికి భయపడేవారు. ఐతే ఆమె నికార్సయిన మనిషి, కచ్చితమైన మనిషి, సహృదయం గల మనిషి, సహాయపడే మనిషి. ఆమె శుభ్రంగా కడుపునిండా తినేది, పదిమందికీ పెట్టేది. షూటింగ్‌కి వచ్చినప్పుడల్లా - తనతో ఏవో తినుబండారాలు తీసుకురావడం, అందరికీ పెట్టడం అలవాటు. ఇలాంటి అలవాటు సావిత్రి, కృష్ణకుమారి, జానకి వంటి నటీమణులకీ వుండేది. విశేష దినాలూ, పండగపబ్బాలూవస్తే సరేసరి!

షూటింగుల్లో జోకులు చెప్పడం, సూర్యకాంతం సరదాల్లో ఒకటి. ఒక షూటింగులో బయట కేకలు వినిపిస్తున్నాయని ‘సైలెన్స్‌! అవుట్‌సైడ్‌’ అని ప్రొడక్షన్‌ మేనేజర్‌ గట్టిగా అరిచాడు. ఫ్లోర్‌లో వున్న సూర్యకాంతం ‘ఓ!’ అని అంతకన్నా గట్టిగా అరిచింది. ‘ఏమిటమ్మా?’ అని అడిగితే, ‘సైలెన్స్‌ అవుట్‌ సైడ్‌ - అని గదా అన్నారు!’ అందామె నవ్విస్తూ. అలాంటి అల్లరి వుండేది ఆమెలో. ఓ సినిమాలో నాగయ్యను నానామాటలూ అని, నోటికొచ్చిన తిట్లు తిట్టాలి. షాట్‌ అయిపోయాక ఆయన కాళ్లమీద పడి ‘అపరాధం - క్షమించండి!’ అని వేడుకుంది. ‘పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావూ? లే!-’ అని నాగయ్య లేవనెత్తితే, కన్నీళ్లు తుడుచుకున్న భక్తీ, సెంటిమెంటూ ఆమెవి. దబాయింపూ, కచ్చితత్వమూ ఉన్న మనిషే అయినా, మనసు మాత్రం వెన్న, సున్నితం. అవసరమైన వాళ్లకి ఆర్థికసహాయం చేసేదిగాని అనవసరం అనిపిస్తే మాత్రం ‘పూచికపుల్ల’ కూడా విదిలించేది కాదు.

మొహమాటపడకుండా తనకి రావాల్సిన పారితోషకాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేది. ఆమె అందర్నీ నమ్మేది కాదు. తన కారు రిపేరుకొస్తే ఎంత పెద్ద రిపేరైనా, మెకానిక్‌ ఇంటికొచ్చి తన కళ్లముందు చెయ్యవలసిందే - ఎంత ‘ఎక్స్‌ట్రా మనీ’ అయినా తీసుకోనీగాక! చివరి దశలో వేషాలు తగ్గిపోయినా, చివరిదాకా నటిస్తూ ఉండాలనే కోరుకునేది. తన ఆరోగ్యం బాగులేకపోయినా, ‘నటిస్తాను’ అని ధైర్యంగా చెప్పేది.

17డిసెంబరు 1996న స్వర్గస్తులైనారు. 

 ప్రముఖ నటీమణి సూర్యకాంతంగారి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తూ...💐💐💐🙏🙏🙏

మహాభారత కాలంలోనే ....

 🌹🌿🍃🍁🍁🍃🌿🌹


        మహాభారత కాలంలోనే ....

                                  టేప్ రికార్డర్...!

                       ➖➖➖✍️️


    *విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది?* 🌹🙏🙏🌹



       భీష్మపితామహుడు. 'విష్ణు సహస్ర నామం' పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు- కృష్ణుడు, ధర్మరాజుతో సహా, కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన... విష్ణు సహస్రనామం ?


        అది 1940వ సంవత్సరం! శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు... ఆ వ్యక్తిని, అక్కడున్న వారినందరినీ ఉద్దేశించి., "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది?" అని అడిగారు.


        ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?" అని అడిగారు.


ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"


     స్వామివారు, "మరి భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"


   మళ్ళీ నిశబ్దం!


          స్వామివారు చెప్పడం మొదలు పెట్టారు. " భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు.

అప్పుడు యుధిష్టురుడన్నాడు.... "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు.ఇపుడు ఎలా కృష్ణా?" అని!


 "అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్ర నామాలు మాకందరికీ కావాలి!" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.


     అపుడు శ్రీ కృష్ణుడన్నాడు. "అది... కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.


   "అదెలా" అని అందరూ అడిగారు.


    శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం... వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం! దీని ప్రత్యేకతేంటంటే.... వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు.


      శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్ర నామ శబ్దతరంగాలు వచ్చిన చోట అనగా .... భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రీప్లే అవుతూంటే వ్యాస మహర్షి వ్రాసి పెట్టాడు!"


  ఆవిధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వారా మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం॥




#KanchiParamacharyaVaibhavam

*# కంచి పరమాచర్య స్వామి వైభవం#*


                   🌷🙏🌷


   🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు*🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺