30, అక్టోబర్ 2021, శనివారం

రామాయణం‌ 108 ప్రశ్నలు

 *🙏🏻 రామాయణం‌ 108 ప్రశ్నలు –జవాబులతో ... రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి. 🙏🏻*


*1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు? = వాల్మీకి.*


*2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?= నారదుడు.*


*3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు? = తమసా నది.*


*4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి? =24,000.*


*5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు? = కుశలవులు.*


*6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? = సరయూ నది.*


*7. అయోధ్య ఏ దేశానికి రాజధాని? = కోసల రాజ్యం.*


*8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు? = సుమంత్రుడు.*


*9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి? =కౌసల్య, సుమిత్ర, కైకేయి.*


*10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు? = పుత్ర కామేష్ఠి.*


*11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను? = కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.*


*12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు? = జాంబవంతుడు.*


*13. వాలి ఎవరి అంశతో జన్మించెను? = దేవేంద్రుడు.*


*14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు? = హనుమంతుడు.*


*15. కౌసల్య కుమారుని పేరేమిటి? = శ్రీ రాముడు.*


*16. భరతుని తల్లి పేరేమిటి? = కైకేయి.*


*17. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి? = లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.*


*18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు? = వసిష్ఠుడు.*


*19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు? =16 సంవత్సరములు.*


*20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు? = మారీచ, సుబాహులు.*


*21. రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి? = బల-అతిబల.*


*22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు? = సిద్ధాశ్రమం.*


*23. తాటక భర్త పేరేమిటి? = సుందుడు.*


*24. తాటకను శపించిన మహర్షి ఎవరు? = అగస్త్యుడు.*


*25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు? = భగీరథుడు.*


*26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను? = జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.*


*27. అహల్య భర్త ఎవరు? = గౌతమ మహర్షి.*


*28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు? = శతానందుడు.*


*29. సీత ఎవరికి జన్మించెను? = నాగటి చాలున జనకునికి దొరికెను.*


*30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను? = దేవరాతుడు.*


*31. శివధనుస్సును తయారు చేసినదెవరు? = విశ్వకర్మ.*


*32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు? = మాండవి, శృతకీర్తి.*


*33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు? = జనకుడు.*


*34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి? =కుశ ధ్వజుడు.*


*35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి? = వైష్ణవ ధనుస్సు.*


*36. భరతుని మేనమామ పేరు ఏమిటి? = యుధాజిత్తు.*


*37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు? = మంధర.*


*38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను? = గిరివ్రజపురం, మేనమామ యింట.*


*39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది? = శృంగిబేరపురం.*


*40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను? = గారచెట్టు.*


*41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?= భారద్వాజ ముని.*


*42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి? = మాల్యవతీ.*


*43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు? = తైల ద్రోణములో.*


*44. శ్రీరామునితో నాస్తిక వాదన చేసినదెవరు? = జాబాలి.*


*45. భరతుడు రాముని పాదుకల నుంచిన పట్టణమేది? = నంది గ్రామము.*


*46. అత్రిమహాముని భార్య ఎవరు? = అనసూయ.*


*47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు? = విరాధుడు.*


*48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు? = అగస్త్యుడు.*


*49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది? = గోదావరి.*


*50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను? = శూర్ఫణఖ.*


*51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను? = జన స్థానము.*


*52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను? = మారీచుడు.*


*53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది? = బంగారు లేడి.*


*54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు? = జటాయువు.*


*55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను? = దక్షిణపు దిక్కు.*


*56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను? = కబంధుని.*


*57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది? = మతంగ వనం, పంపానదీ.*


*58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను? = ఋష్యమూక పర్వతం.*


*59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారి వద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను? = హనుమంతుడు.*


*60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?= అగ్ని సాక్షిగా.*


*61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను? = కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.*


*62. సుగ్రీవుని భార్య పేరు? = రుమ.*


*63. వాలి భార్యపేరు? = తార.*


*64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి? = కిష్కింధ.*


*65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి? = మాయావి.*


*66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు? = దుందుభి.*


*67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను? = మతంగ ముని.*


*68. వాలి కుమారుని పేరేమిటి? = అంగదుడు.*


*69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను? = ఏడు.*


*70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను? = ప్రసవణ గిరి.*


*71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు? = వినతుడు.*


*72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు? = అంగదుడు.*


*73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి? = మామగారు, తార తండ్రి.*


*74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు? = శతబలుడు.*


*75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను? = మాసం (ఒక నెల).*


*76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను? = దక్షిణ దిక్కు.*


*77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను? = తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.*


*78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి? = స్వయంప్రభ.*


*79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి? = సంపాతి.*


*80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు? =పుంజిక స్థల.*


*81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి? = మహేంద్ర పర్వతము.*


*82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు? = మైనాకుడు.*


*83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి? = సురస.*


*84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి? = సింహిక.*


*85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత? = నూరు యోజనములు.*


*86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి? = లంబ పర్వతం.*


*87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి? = అశోక వనం.*


*88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను? = పన్నెండు*


*89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు? = త్రిజట.*


*90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను? =రామ కథ.*


*91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి? = చూడామణి.*


*92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను? = ఎనభై వేలమంది.*


*93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను? = ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.*


*94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు? = విభీషణుడు.*


*95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి? = మధు వనం.*


*96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు? = మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.*


*97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి? = ఆలింగన సౌభాగ్యం.*


*98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి? = నలుడు*


*99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను? = నికుంభిల.*


*100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు? = అగస్త్యుడు.*


*101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు? = ఇంద్రుడు.*


*102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు? = మాతలి.*


*103. రావణ వధానంతరం లంక నుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పక విమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరి కోసం ఆగుతుంది? = కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!*


*104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీ రాముడు ఎవరిని ముందుగా పంపెను? = హనుమంతుడు.*


*105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి? = శత్రుంజయం.*


*106. శ్రీ రాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను? = స్వయంగా తన భవనమునే యిచ్చెను.*


*107. పట్టాభిషేక సమయంలో శ్రీ రామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది? = బ్రహ్మ.*


*108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి? = తన మెడలోని ముత్యాల హారం.*

కామెంట్‌లు లేవు: