6, అక్టోబర్ 2021, బుధవారం

కరోన మూడో ముప్పు

 *బిగ్ బ్రేకింగ్......*



_*కరోన మూడో ముప్పు మొదలైంది!!*_



*- 2022 జనవరి-ఏప్రిల్ మధ్య ఉధృతి పెరిగి తీవ్రస్థాయికి*


*- జాగ్రత్తలు లేకుంటే ఈసారి అల్లకల్లోలం*


*- మా లెక్కలు తప్పవు*


*- ఎయిమ్స్ వెల్లడి*



_అక్టోబర్ నెల నుంచి క్రమంగా కేసులు పెరిగి, 2022 జనవరి - ఏప్రిల్ మధ్య కట్టడి చేయలేనంత తీవ్ర స్థాయికి కరోనా చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో కచ్చితంగా ప్రజలు సూచనలు పాటించాలని ఎయిమ్స్ ఆరోగ్య గణాంక నిపుణులు హెచ్చరించారు. టూరిస్ట్‌ల సంఖ్య పెరగడం, సభలు, సమావేశాలతో ప్రజలు గుమిగూడటం మూడో ఉద్ధృతికి దారి తీయొచ్చని తెలిపారు. ఇటీవల టూరిస్ట్ లు పెరిగిన మనాలి, డార్జిలింగ్‌ ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు పెరిగాయని పేర్కొన్నారు._


_రాష్ట్రాలు ఆంక్షలను పాటించకపోతే మూడో ఉద్ధృతి ఆటోమేటిక్‌గా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. భారత్‌లో మూడో వేవ్‌లో కొన్ని ప్రాంతాల్లో రోజువారీ కేసులు 103శాతం వరకూ ఉండొచ్చనే అంచనా వేశారు. ఇక కొవిడ్‌ ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేసినా, పర్యాటకుల తాకిడి లేకపోతే మూడో ఉద్ధృతి తీవ్రత కొంతమేర తగ్గుతుందని తెలిపారు. ఆంక్షల ఎత్తివేతతో పాటు సెలవు రోజుల్లో పర్యాటకుల సంఖ్య పెరిగితే మాత్రం మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్నారు._


_సోషల్ డిస్టెన్స్‌ పాటించకపోతే కరోనా వంటి శ్వాసకోశ సంబంధ రోగాలు విస్తృతంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. హోటళ్లు, కేఫ్‌లలో కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుకోవడం.. షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం వంటి పనులతో కరోనా ముప్పు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. పర్యాటకులు పెరిగి స్థానిక వ్యాపారులకు లబ్ధి చేకూరుతుంది కానీ... టూరిస్ట్‌లు, స్థానికులు, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కరోనా వ్యాప్తి పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని... అప్పుడే అందరి సంక్షేమాన్ని కాపాడుకుంటూ ముందడుగు వేయడం సాధ్యమవుతుందన్నారు._


_దేశానికి మూడో ఉద్ధృతి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ సూచించారు. కోవిడ్ అంశంపై తమ నిపుణులు పేర్కొన్న గణాంకాలు ఇప్పటివరకు తప్పలేదని హెచ్చరించారు._


_ముఖ్యంగా ప్రస్తుత పండగల సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కనీసం మరో 6-8 వారాల పాటు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశముందని చెప్పారు._

శ్రీమద్భాగవతము

 *06.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2283(౨౨౮౩)*


*10.1-1411-వ.*

*10.1-1412-*


*శా. వేదశ్రేణియు నంగకంబులు ధనుర్వేదంబుఁ దంత్రంబు మ*

*న్వాదివ్యాహృత ధర్మశాస్త్రములు నుద్యన్న్యాయముం దర్కవి*

*ద్యాదక్షత్వము రాజనీతియును శబ్దప్రక్రియం జెప్పె నా*

*భూదేవాగ్రణి రామకృష్ణులకు సంభూతప్రమోదంబునన్.* 🌺



*_భావము: బలరామ కృష్ణులు గొప్ప వైభవములకు ఉనికిపట్టైన కాశీ పట్టణము చేరారు. అక్కడ గంగా తీరమున అవంతీ పుర నివాసి, సకల విద్యా పారంగతుడగు సాందీపుడు అనే పండితోత్తముని దర్శనము చేసికొని పవిత్రభావనతో, భక్తి శ్రద్ధలతో గురు శుశ్రూష చేశారు._*   

*_వీరి ప్రవర్తనకు సంతుష్టులైనగురువుగారు చతుర్వేదములను, వేదాంగములను (శిక్ష, వ్యాకరణము, చంధస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము), ధనుర్వేదమును (విలువిద్య), తంత్రశాస్త్రము, మను ధర్మ శాస్త్రము, ఇతర నీతిశాస్త్రములు, తర్కశాస్త్ర పాండిత్యాన్ని, రాజనీతిశాస్త్రమును, శబ్దలక్షణ శాస్త్రమును సమగ్రముగా బోధించారు._* 🙏



*_Meaning: Balarama and Sri Krishna reached Kasi town, which was well known for its greatness, glory and piety. There they approached Sage Sandeepa, vaidic scholar, prostrated before him and were serving him with diligence, devotion and reverence. Pleased with their assiduous service, he comprehensively taught them Four Vedas, Vedangas, Dhanurveda, Tantra Sastra, Manu dharama sastra and other Sastras like Neethi, Tarka, Rajaneethi and SabdaLakshana._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

Chickpet, Bangalore

 *I AM NOT SURPRISED TO READ THIS MESSAGE*    


Chickpet, Bangalore is known as the business hub of Bangalore City with more than 1000 shops in the locality. 


This place is always crowed as people throng to buy clothes, furniture, toys etc. at a wholesale price. 


Yesterday, I had been there as part of my educational research to talk to a few shop keepers to understand how they do business and what education has to do to them, with regards to their business. 


During my interaction with many shop keepers in Chickpet, I found that, most of them were from Rajasthan. 


One more interesting thing that I found was that, most of them were in their teenage. 


Out of all, meeting a young 10th dropout who runs a clothes shop, was very interesting. 


His name is Bramhadev, from Rajasthan. I thought I should share a few our discussions here.

 

I went into the crowded shop as a customer, he greeted me with a great smile saying, "Anna banni, en bekithu". (Meaning : Brother, what do you want) (The conversation was in Kannada. I have translated it below)

 

Me : I wanted to check for some nice shirt and pant piece.

 

Bramhadev : Tell me Sir, what is the range you are looking for ?

 

Me : You first show me all the clothes, let me choose out of those.

 

Bramhadev : Sure sir and started showing me all his collections. (Meanwhile during the selection time, I thought I should ask him a few questions, which was my only intention)

 

Me : How did you learn Kannada ?

 

Bramhadev : Sir, obviously by talking to people.

 

Me : But, your Kannada is very fluent !

 

Bramhadev : Sir, initially I found it difficult, but, when I continued to speak to customers, I learnt it on the fly. Now, I speak better than Bangalore Kanndigas.

 

Me : Superb. When did you start this business ?

 

Bramhadev : It’s almost 10 years now. I started it when I failed in my 10th. My uncle got me into this business.

 

Me : How many languages can you speak ?

 

Brahmadev : I can speak, Hindi, English, Kannada, Marathi, Tamil, Telugu & Malayalam.

 

Me : Oh my God ! How did you learn so many ?

 

Brahmadev : I told you Sir, Customers taught me.

 

Me : Sorry to ask you, but still out of curiosity, I just wanted to know what would be your monthly turnover ?

 

Brahmadev : Ummmm, it depends on the festival season. Normally, the turnover would be around 8 - 9 lakhs per month, and during festivals it will shoot up to 15 lakhs. Profit upto Rs. 4 lakh per month.

 

Me : What ? Oh my God ! That’s a super number ! Great, man !

 

Brahmadev : What great Sir ? In Chickpet, this is very less. Others make double than what I do.

 

Me : Didn't you feel like completing your education, by studying further ?

 

Brahmadev : Sir, to be honest, none of our family members have completed their education. To complete my education it might take another 5 - 6 years which I feel is a big waste of time and money. I invested both of these, in my business. Today, I can challenge that not even n one of the educated persons with a work experience of 10 years experience will earn as much as I do. What do you say Sir ?

 

Me : Hmmm....Yes. True. But still, education would have helped you grow more than what you are earning today.

 

Brahmadev : Seriously No Sir. Education would give us fear and make us feel that, one has to work under someone to earn their livelihood. Education does not teach us to live independently. I also have many friends who studied along with me and completed graduation. None are into business. Almost all of them are working in some private firm.

 

Me : Hmmmm....So you don't regret to have not completed Ur education ?

 

Bramhadev : Definitely No Sir. I am very happy. (In between our conversation, another customer had purchased around 20 pairs of shirts and pants and few sarees. Without using a calculator Bramhadev calculated the total cost of the purchase and told the customer the total cost including 10% discount in just 15 - 20 seconds).

 

Me : Boss, you don't even use a calculator ?

 

Bramhadev : Sir, educated people need the calculator and mobile phones, to calculate. Not me !

 

Me : Started smiling and put my head down (because I was using a calculator to calculate the cost of my purchase).

 

Bramhadev : I continuously practiced calculating. I am doing this since 10 years and I have become perfect. I am sure, I will never err in my calculation.

 

After this, I made a purchase and the whole of the next whole day, I was thinking about our conversation over and over. I would like to infer what I learnt....

 

After thought or moral of the story :

 

1. Without higher education, Bramhadev is not jobless. Whereas our today's graduates with distinction, are still in search of a job.

 

2. Without higher education, Bramhadev has good communication skills. But, today's corporate world complains about our graduates for having no communication skills.

 

3. Without higher education, Bramhadev earns in lakhs, where as our current generation graduates complains of not having enough salary to pay their EMIs.

 

4. Without higher education, Bramhadev's mathematical mind works faster than today's graduates who has cleared different levels of mathematics papers with high scores. Today's graduates need Mobile Phones to perform simple calculations.

 

5. Without higher education, Bramhadev has no fear of losing his job, but today's graduate employees are always in the fear of getting fired from the company they are working in.

 

*Now, just thinking aloud*... 


Thanks and Regards,

Pradeep Joshi

Kwality Business Initiatives

PGDM Bajaj Mumbai

Six Sigma Consultant.

మహాలయామావాస్య

 *ఈరోజు మహాలయామావాస్య*

    ********************


    అమావాస్య రోజున మీ కుటుంబ సభ్యులందరూ ఈ సంకల్పం చెప్పుకుంటే మంచిది.


🌻🌻🌻🌻🌻🌻 🌻

------------------------


మీ గోత్రం ..


మీ పేరు చెప్పుకొని...


నా జన్మకు మూల కారణమైన నా తల్లి - దండ్రులకు నా యొక్క అనంతకోటి నమస్కారములు. అలాగే నా తల్లి - దండ్రులకు మూలమైన తాతలకు, ముత్తాతలకు అనంత కోటి ప్రణామములు. 


సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకూ ఈ వంశ పరంపరల్లో జన్మించిన పూర్వీకులైన వారందరికీ అనంతకోటి నమస్కారములు. 


   ఎందరో యోగులు, మహాత్ములు, పుణ్యాత్ములైన మీ అందరి యొక్క సంస్కార బలం నాలో ప్రవేశించి, నేను ఇంతటి గొప్ప జ్ఞానంతో కూడిన జీవితాన్ని పొందియున్నాను. ఈ వంశంలో జన్మించినందుకు నేను ఎంతగానో గర్వించు చున్నాను. మీలో ఉన్న సద్భావాలు నాలో ప్రవేశించి లోక హిత కార్యాలు చేసేటటువంటి శక్తిని ప్రసాదించండి. ఈ వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆ చంద్రార్కము అవనిలో విలసిల్లునట్లుగా ఆశీర్వదించండి..

నాలోనూ, నా కుటుంబ సభ్యుల లందరిలోనూ ఉన్నటువంటి దోషాలను తొలగించి, క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయుః, ఆరోగ్య, ఐశ్వర్య ముల నొసగి, ధర్మార్ద, కామ, మోక్ష ముల నొసగి, అహం పదార్ద రహిత స్తితి కలిగేటట్లుగా దీవించి నా జన్మ ధన్యత చేకూర్చగలరని కోరుతూ..


అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, త్రిమూర్తులు, త్రిమాతలు, అష్ట దిక్పాలకులు, నవ గ్రహాలు, సమస్త సద్గురువులు మరియు సమస్త దేవతా మూర్తుల యొక్క ఆశీస్సులను కోరుతూ నా యొక్క అనంత కోటి నమస్కారములు సమర్పించుచూ మనసా, వాచా, కర్మణా, త్రికరణ శుద్ధిగా, ఈ మహాలయ అమావాస్య రోజున సంకల్పం చేసి పెద్దలందరికీ నమస్కరించుచున్నాను.


        💐🕉 *సర్వం పరమాత్మ పాదార విందార్పణమస్తు..* 💐🕉


🙏🙏🙏🙏🙏🙏

స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు

 

*స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు, జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారు?*


*ఇప్పుడు అంటే ఫ్యాషన్ పేరిట జుత్తుని వదలివేయటం ఎక్కువ అయింది కానీ ఒకప్పుడు అందరు మహిళలు వయసుతో సంబంధం లేకుండా జడ వేసుకునేవారు. ఈ జడ కూడా మూడు విధములుగా వేసుకుంటారు.*


✔️ *రెండు జడలు వేసుకోవడం* (రెండు జడలు వేసుకుంటే ఆమె ఇంకా *చిన్నపిల్ల* అని, *పెళ్లికాలేదని అర్ధం.* అంటే ఆ అమ్మాయిలో *జీవ + ఈశ్వర* సంబంధం విడివిడిగా ఉందని అర్ధము).


✔️ *ఒక జడ వేసుకోవడం* (పెళ్లి అయ్యిన ఆడపిల్లలు మొత్తం జుట్టుని కలిపివేసి ఒకటే జడగా వేసుకునేవారు. అంటే ఆమె తన జీవేశ్వరుడినిచేరి వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటోందని అర్ధం).


✔️ *ముడి పెట్టుకోవడం* (జుట్టుని ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుంది అంటే ఆమెకు సంతానంకూడా ఉందని, అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుంది అర్ధం).


✔️ అయితే *ఒక జడ వేసుకున్నా, రెండు జడలు వేసుకున్నా చివరకు కొప్పు పెట్టుకున్నా* కూడా *జుట్టుని మూడు పాయలుగా విడతీసి త్రివేణీసంగమంలాగ కలుపుతూ అల్లీవారు.* ఈ మూడు పాయలకు అర్ధాలు ఏందిరా అంటే!!


1. *తానూ, భర్త, తన సంతానం* అని ఈ మూడు పాయలకు అర్ధం.


2. *సత్వ, రజ, తమో గుణాలు,*


3. *జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి* అని అర్ధములు.


*అమ్మాయిలు వేసుకున్న జడనిబట్టి వారు వివాహితులా, అవివాహితులా, పిల్లలు ఉన్నవారా, లేని వారా అన్న విషయం తెలిసిపోయేది. ఇంత అర్ధం ఉంది కాబట్టే, మన సంస్కృతి సంప్రదాయాలు నేటికీ పూజించబడుతున్నాయి. పాశ్చాత్య సంస్కృతి పేరిట మనమే వాటిని పాడుచేసుకుంటున్నాం.*


జుత్తు విరబోసుకుని ఉండటం అరిష్టం జ్యేష్టాదేవికి ఆహ్వానం. .. *MPB*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

 *6.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పండ్రెండవ అధ్యాయము*


*సత్సంగముయొక్క మహాత్మ్యము - కర్మవిధి - కర్మత్యాగవిధి*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీభగవానువాచ*


*12.1 (ప్రథమ శ్లోకము)*


*న రోధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మ ఏవ చ|*


*న స్వాధ్యాయస్తపస్త్యాగో నేష్టాపూర్తం న దక్షిణా॥12663॥*


*12.2 (రెండవ శ్లోకము)*


*వ్రతాని యజ్ఞశ్ఛాందాంసి తీర్థాని నియమా యమాః|*


*యథావరుంధే సత్సంగః సర్వసంగాపహో హి మామ్॥12664॥*


*శ్రీభగవానుడు నుడివెను* ఉద్ధవా! వర్ణాశ్రమోచిత కర్మయోగములు, ప్రాణాయామయోగము, ప్రకృతి పురుషులకు సంబంధించిన సాంఖ్యయోగము, అహింసాది ధర్మములు, వేదాధ్యయనము, అనశనాది (ఉపవాసాది) తపశ్చర్యలు, దానధర్మములు, యాగాదివైదిక కర్మలు, వాపీ, కూప, తటాకాది నిర్మాణములు, యజ్ఞయాగాదుల పరిసమాప్తియందు ఇయ్యబడు సాద్గుణ్య దక్షిణలు *(హతో యజ్ఞస్త్వదక్షిణః - సాద్గుణ్య దక్షిణలు లేని యజ్ఞము యజ్ఞమే కాదు -నీతి శాస్త్రము)*, ఏకాదశి - ఉపవాసాది వ్రతములు, పంచమహా యజ్ఞములు (1. బ్రహ్మయజ్ఞము - అధ్యాపనము, 2. పితృయజ్ఞము - తర్పణము, 3. దేవయజ్ఞము - హోమము, 4. భూతయజ్ఞము - బలి 5. నృయజ్ఞము - అతిథిపూజ మరియు 1.. మాతాపితృభక్తి, 2. పాత్రివత్యము, 3. సమత, 4. మిత్రులను ద్వేషించకుండుట, 5. విష్ణుభక్తి - అనునవి పంచామహా యజ్ఞములు), గోప్యములగు మంత్రములు, గంగాది తీర్థముల యందలి పవిత్రస్నానములు, శౌచ-అశౌచ-ఆచమనాది నియమములు, బాహ్యాభ్యంతర మనోనిగ్రహాదులు మొదలగునవి ఎవ్వియును సత్సంగముతో సాటిరావు. ఏలయన సత్సంగము సకల లౌకిక బంధములను దూరమొనర్చును. మీదుమిక్కిలి, అది తన (సాధకుని) హృదయమున నన్ను (భగవానుని) పదిలపరచుకొనుటలో ప్రముఖ సాధనము (శ్లో. *సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వమ్| నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః॥* క్రమముగా జీవన్ముక్తికి సాధనమైన సత్సంగత్వమును వర్ణించుట జగద్గురు శంకరాచార్యస్వామికే సాధ్యము)


*12.3 (మూడవ శ్లోకము)*


*సత్సంగేన హి దైతేయా యాతుధానా మృగాః ఖగాః|*


*గంధర్వాప్సరసో నాగాః సిద్ధాశ్చారణగుహ్యకాః॥12665॥*


*12.4 (నాలుగవ శ్లోకము)*


*విద్యాధరా మనుష్యేషు వైశ్యాః శూద్రాః స్త్రియోఽన్త్యజాః|*


*రజస్తమఃప్రకృతయస్తస్మింస్తస్మిన్ యుగేఽనఘ॥12666॥*


*12.5 (ఐదవ శ్లోకము)*


*బహవో మత్పదం ప్రాప్తాస్త్వాష్ట్రకాయాధవాదయః|*


*వృషపర్వా బలిర్బాణో మయశ్చాథ విభీషణః॥12667॥*


*12.6 (ఆరవ శ్లోకము)*


*సుగ్రీవో హనుమాన్ ఋక్షో గజో గృధ్రో వణిక్పథః|*


*వ్యాధః కుబ్జా వ్రజే గోప్యో యజ్ఞపత్న్యస్తథాపరే॥12668॥*


సత్సంగము యొక్క ప్రభావము అపారమైనది, నిరుపమానమైనది. ఆయా యుగములయందు సత్సంగము ద్వారా దైత్యులు, రాక్షసులు, మృగములు, పక్షులు, గంధర్వులు,అప్సరసలు, నాగులు, సిద్ధులు, చారణులు, గుహ్యకులు (యక్షులు), విద్యాధరులు మున్నగువారు నా సేవలలో తరించిరి. మానవులలో వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, నిమ్నజాతులవారు మొదలగు రజస్తమోగుణ స్వభావములు గలవారు ఈ సత్సంగముద్వారా నన్నుభజించి, నా అనుగ్రహమునకు పాత్రులైరి. అట్లే వృత్రాసురుడు, ప్రహ్లాదుడు, వృషపర్వుడు, బలిచక్రవర్తి, బాణుడు, మయుడు, విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, గజేంద్రుడు, జటాయువు, తులాధారుడను వైశ్యుడు, ధర్మవ్యాధుడు, కుబ్జ, వ్రజాంగనలు (గోపికలు), యజ్ఞాచరణమునందు నిమగ్నులైన బ్రాహ్మణుల యొక్క పత్నులు, ఇంకను పెక్కుమంది ఈసత్సంగముద్వారా నన్ను సేవించి కృతార్థులైరి. 


*12.7 (ఏడవ శ్లోకము)*


*తే నాధీతశ్రుతిగణా నోపాసితమహత్తమాః|*


*అవ్రతాఽతప్తతపసః సత్సంగాన్మాముపాగతాః॥12669॥*


వీరు అందరును వేదాధ్యయనపరులుగారు, మహాత్ములను ఉపాసించినవారు (మహాత్ములను ఆశ్రయించి దైవోపాసనలను ఒనర్చినవారు) కారు. ఏ విధమైన వ్రతములను, తపస్సులను ఆచరించి యుండలేదు. వీరు ఎల్లరును కేవలము సత్సంగప్రభావముననే నా కృపకు పాత్రులై పరమపదమును పొందిరి.


*12.8 (ఎనిమిదవ శ్లోకము)*


*కేవలేన హి భావేన గోప్యో గావో నగా మృగాః|*


*యేఽన్యే మూఢధియో నాగాః సిద్ధా మామీయురంజసా॥12670॥*


గోపికలు, గోవులు, యమళార్జునాది వృక్షములు, వ్రజభూమియందలి మృగములు, తమోగుణ ప్రధానులైన కాళియుడు మొదలగువారు కేవలము నన్నే ఆశ్రయించి, స్మరించి ముక్తిని పొందిరి. అట్లే కొందరు సిద్ధులు ఈ భక్తిమార్గమున నన్ను సేవించి, కృతార్థులైరి.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పండ్రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*438వ నామ మంత్రము* 6.10.2021


*ఓం కురుకుళ్ళాయై నమః*


కురుకుళ్ళయను దేవతాస్వరూపురాలు అయిన అమ్మవారికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కురుకుళ్ళా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం కురుకుళ్ళాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు సాధకులు ఆత్మానందానుభూతితో విలసిల్లుదురు.


మణిద్వీపమునందు శ్రీపురము గలదు. ఆ శ్రీపురము అనేక ప్రాకారములు గలవు. ఆ ప్రాకారములలో అహంకారమయ ప్రాకారమునకును, చిత్తమయప్రాకారమునకును నడుమ విమర్శమయమగు దిగుడు బావిగలదు. ఆ బావికి అధినేత్రి *కురుకుళ్ళ* యను దేవి గలదు. ఆ కురుకుళ్ళాదేవి స్వరూపంతో అమ్మవారు తేజరిల్లుచున్నది గనుక, శ్రీమాత *కురుకుళ్ళా* యని అనబడినది. ఈ విషయము లలితా స్తవరత్నమునందు ఈ శ్లోకంలో వివరింపబడినది:


*కురువిందమణినిలయాం కులాచలస్ఫర్థికుచనమన్మధ్యామ్|*


*కుంకుమవిలప్తగాత్రీం కురుకుళ్ళాం మనసి కుర్మహే సతతమ్॥*


'పద్మరాగమణులచే నిర్మితమైన నౌకయందు ఉన్నది. కులపర్వతములను బోలిన కుచయుగళముతోను, సన్ననైన నడుముతోను, కుంకుమలేపన గావించబడిన దేహముతోను భాసిల్లు కురుకుళ్ళాదేవిని మనస్సున ఎల్లప్పుడూ ధ్యానింతును' అని లలితా స్తవరత్నమందు గలదు. అటువంటి కురుకుళ్ళా స్వరూపము గలిగిన పరమేశ్వరి *కురుకుళ్ళా* యని అనబడినది.


అమ్మవారిని చతుష్షష్టి కోటి యోగినీ గణదేవతలు సేవిస్తున్నారు. వారందరి స్వరూపంతో అమ్మవారు తేజరిల్లుచూ, ఆ చతుష్షష్టి కోటి యోగినీ గణముల స్వరూపము తనదై విరాజిల్లుచున్నది. శ్రీచక్రము నందు ప్రతీ ఆవరణమునందు గల యోగినీ గణముల నామములతో అమ్మవారు ఈ విధంగా స్తుతింపబడుచున్నది:-


*శ్రీ దేవీ సంబోధనము.*

ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమస్త్రిపురసుందరీ,


*న్యాసాంగదేవతలు*

హృదయదేవీ, శిరోదేవీ, శిఖాదేవీ, కవచదేవీ, నేత్రదేవీ, అస్త్రదేవీ,


*తిథినిత్యాదేవతలు*

కామేశ్వరీ, భగమాలినీ, నిత్యక్లిన్నే, భేరుండే, వహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, శివదూతీ, త్వరితే, కులసుందరీ, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలినీ, చిత్రే, మహానిత్యే,


*శ్రీచక్ర ప్రథమావరణదేవతలు*


అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ, సర్వమహాంకుశే, సర్వఖేచరీ, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ,


*శ్రీచక్ర ద్వితీయావరణదేవతలు*


కామాకర్షిణీ, బుద్ధ్యాకర్షిణీ, అహంకారాకర్షిణీ, శబ్దాకర్షిణీ, స్పర్శాకర్షిణీ, రూపాకర్షిణీ, రసాకర్షిణీ, గంధాకర్షిణీ, చిత్తాకర్షిణీ, ధైర్యాకర్షిణీ, స్మృత్యాకర్షిణీ, నామాకర్షిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ, అమృతాకర్షిణీ, శరీరాకర్షిణీ, సర్వాశాపరిపూరక చక్రస్వామినీ, గుప్తయోగినీ,


*శ్రీచక్ర తృతీయావరణదేవతలు*


అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగినీ, అనంగాంకుశే, అనంగమాలినీ, సర్వసంక్షోభణచక్రస్వామినీ, గుప్తతరయోగినీ,


*శ్రీచక్ర చతుర్థావరణదేవతలు*


సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరిణీ, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరీ, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సంప్రదాయయోగినీ,


*శ్రీచక్ర పంచమావరణదేవతలు*


సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ,


*శ్రీచక్ర షష్టావరణదేవతలు*


సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ, నిగర్భయోగినీ,


*శ్రీచక్ర సప్తమావరణదేవతలు*


వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, అరుణే, జయినీ, సర్వేశ్వరీ, కౌళిని, సర్వరోగహరచక్రస్వామినీ, రహస్యయోగినీ,


*శ్రీచక్ర అష్టమావరణదేవతలు*


బాణినీ, చాపినీ, పాశినీ, అంకుశినీ, మహాకామేశ్వరీ, మహావజ్రేశ్వరీ, మహాభగమాలినీ, సర్వసిద్ధిప్రదచక్రస్వామినీ, అతిరహస్యయోగినీ,


*శ్రీచక్ర నవమావరణదేవతలు*


శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయచక్రస్వామినీ, పరాపరరహస్యయోగినీ,


నవచక్రేశ్వరీ నామాని

త్రిపురే, త్రిపురేశీ, త్రిపురసుందరీ, త్రిపురవాసినీ, త్రిపురాశ్రీః, త్రిపురమాలినీ, త్రిపురసిద్ధే, త్రిపురాంబా, మహాత్రిపురసుందరీ, మహామహేశ్వరీ, మహామహారాజ్ఞీ, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే, మహామహానందే, మహామహాస్కంధే, మహామహాశయే, మహామహా శ్రీచక్రనగరసామ్రాజ్ఞీ, నమస్తే నమస్తే నమస్తే నమః' అని అంతమంది దేవతలు, ఆయా దేవతల ఉపదేవతలు ఇలా మొత్తం చతుష్షష్టికోటి యోగినీ గణదేవతల రూపంలో అమ్మవారు అలరారుతున్నది. 


అదేవిధంగా ఇంకను చెప్పవలెనంటే మూలాధారం నుండి సహస్రారం వరకూ గల సుషుమ్నా మార్గంలో కురుకుళ్ళా దేవత యను పేరుతో ఒక ముఖ్యమైన నాడి గలదు. ఈ కురుకుళ్ళా యను దేవతను *శ్యామ* అని కూడా అంటారు. అటువంటి *కురుకుళ్ళా* స్వరూపిణియైన పరమేశ్వరి *కురుకుళ్ళా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు 

*ఓం కురుకుళ్ళాయై నమః* అని యనవలెను

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*శ్రీలలితా సహస్రనామ భాష్యము

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*437వ నామ మంత్రము* 6.10.2021


*ఓం కోమలాకారాయై నమః*


సుకుమారమైన అవయవముల కూర్పుగల జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కోమలాకారా* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం కోమలాకారాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధన చేయుభక్తులను ఆ తల్లి వారిని స్ఫురద్రూపులుగను పలువురిలో ఆకర్షితులుగను, కీర్తిప్రతిష్టలతోబాటు, వస్తువాహన సమృద్ధితో జీవనము గడపునట్లు అనుగ్రహించును.


*కుశలా* యను నామ మంత్రంలో ఆ పరమేశ్వరి ఆరోగ్యవంతముగా ఉంటుందని చెప్పుటచే, ఈ నామ మంత్రము ప్రకారం అమ్మవారు కోమలమైన (మృదువైన) అవయవముల కూర్పుతో కామేశ్వరునికి అత్యంత ప్రియమైనదిగా విలసిల్లుచున్నది. *కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితా* (లలితా సహస్ర నామావళి యందలి 39వ నామ మంత్రము) అని శ్రీమాత స్తుతింపబడినది. అనగా కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్య మృదుత్వాలతో కూడిన ఊరుద్వయం గలిగినది శ్రీమాత. అమ్మవారి జానువులు (మోకాటి చిప్పలు, జంఘలు (పిక్కలు) మొదలైన అవయవములు అత్యంత మృదువుగా ఉన్నవని కూడా ఆ తల్లి స్తుతింపబడినది. అమ్మవారి పాదములు పద్మములను సైతము తిరస్కరించే టంతటి మృదువుగా ఉన్నవని *పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా* యని లలితా సహస్ర నామావళి యందలి నలుబది ఐదవ (45వ) నామ మంత్రంలో ప్రస్తుతింపబడినది. అంతకోమలమైన అవయవ సంపదతో త్రిభువన సుందరియైన శ్రీమాత మహిషాసురాది రాక్షసులను సైతము సమ్మోహింపజేసినది. ఆ తల్లి రూపము సకలజన వశీకరణము. అందుకనే వాడవాడలా, కొండలలో, కోనలలో ఆ తల్లి నామస్తోత్రపఠనము మారు మ్రోగుచున్నది. అందానికి గాని, కోమలత్వమునకు గాని, చక్కని దంతపంక్తులకు గాని, మృదువైన చెక్కిళ్ళకు గాని, మీనద్వయమును బోలిన నయనములకు గాని, సుమసౌరభములను సైతము ధిక్కరించే శిరోజసౌరభమునకుగాని ఆ అమ్మకు ఆ అమ్మయే సాటి. అందుకేమాత్రము తీసిపోని కామేశ్వరునికి అర్ధాంగి (వామ భాగం తనదిగా చేసుకున్నది) అయినది.


*కోమలః సుకుమారః ఆకారో అవయవవిన్యాసో యస్యా* అని భాస్కరరాయలువారు తమ సౌభాగ్యభాస్కరంలో వ్యాఖ్యానించారు. మనం కూడా అ తల్లిని *ఓం కోమలాకారాయై నమః* అని యనుచూ నమస్కరించి ఆ తల్లి అనుగ్రహపాత్రులము అగుదాము. *ఓం శ్రీమాత్రే నమః*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

గజాననుడు

 శుభమస్తు, శుభోదయం, సకల విఘ్న నివారకుడు, విఘ్ననాయకుడు ! సకల లోక గణాధిపతి, మన గణపతి ! పార్వతీపరమేశ్వరుల ప్రియ పుత్రుడు, గజాననుడు ! విశ్వ సంక్షేమార్ధం, సకల లోక సుస్థిర శాంతికై ఆరాధిద్దామందరం ఆ గణేశుని ! సకల సంకటములు పారద్రోలి, విశ్వ జీవ ప్రశాంత జీవనార్ధం ఆ విఘ్నేశ రక్ష సదా సర్వదా వెన్నంటి ఉండాలని ఆ స్వామిని కోరుతూ.......... 🙏🙏🙏🙏🙏 గుళ్లపల్లి ఆంజనేయులు 

ఆశ్వయుజ మాసం విశిష్టత*_

 _*రేపటి నుండి ఆశ్వయుజ మాసం ప్రారంభం , ఆశ్వయుజ మాసం విశిష్టత*_



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️



త్రిముర్తులైన బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల దేవేరులైన సరస్వతి , మహాలక్ష్మీ , పార్వతిదేవిలకు అత్యంత ప్రీతికరమైన......వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఆశ్వయుజం !


జగన్మాత అయిన పార్వతిదేవి దుష్ట శిక్షణ , శిష్ట రక్షణార్ధం , తొమ్మిది అవతారలను ధరించిన మాసం...ఆయుర్వేద దేవుడు అయిన ' ధన్వంతరీ , త్రిమతాచార్యులలో ద్వైత సిద్ధాంత ప్రవక్త శ్రీ మధ్వాచార్యులు జన్మించిన మాసం. దుష్ట దానవుడైన నరకాసురుడు అంతమొందింపబడి ప్రజలందరికి ఆనందాల వెలుగులను పంచిన దివ్య మాసము ఇది !


ఈ మాసం లోని తొలి తొమ్మిది రోజులు *"దేవి నవరాత్రులు."* సంప్రదాయబద్ధంగా పూజలు చెయ్యాలి అనుకున్న భక్తులు కలశాన్ని స్థాపించి , ముగ్గురు అమ్మల మూలపుటమ్మను ఈ నాటి నుండి తొమ్మిది రోజుల పాటు నియమముగా ఆరాధించాలి. దేవి పూజను ఆశ్వీయుజ మాసం అష్టమి , నవమిలలో పూజించిన భక్తులకు ఎటువంటి శోకాలు దరిచేరవు. దేవి పూజకు ఉత్కృష్టమైన ఈ రోజులలో అమ్మవారిని పూజించి రోజుకొక నైవేద్యం చొప్పున సమర్పించడం మంచిది. కలశ స్థాపనాదులతో పూజించలేని వారు , అమ్మవారి పటానికి గాని , విగ్రహానికి గాని , పుస్తకాలను గాని పూజిస్తూ స్తోత్ర , నామ పారాయణలను చేయవచ్చు.


ఈ విధముగ దేవి నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించడం వల్ల ఆ దేవి సంతృప్తురాలు అవుతుంది. అంతే కాకుండా దుష్ట , గ్రహ పీడలు నశించి అమ్మవారి కృప కటాక్షలు కలుగుతాయని చెప్పబడుతోంది. 


అలాగే , ఈ మాసం లో సప్తమి రోజున గోపూజ చెయ్యవలెను. కపిల గోవును పూజించాలని , కేవలం పంచగవ్యములను మాత్రం స్వీకరించి ఉపవాసము ఉండవలెను. 


పూర్ణిమ నాడు  *"నారదీయ పురాణము"* ను పండితులకు తాంబూలములో వుంచి దానము ఇవ్వవలేను.


పూర్ణిమ నాడు స్త్రీలు జాగరణ చెయ్యటం వలన లక్ష్మిదేవి సంతోషించి , అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది అని శాస్త్ర వచనం.


ఈ నెలలోని బహుళ పక్షములో చతుర్దశి , అమావాస్య తిధులలో దీపాలను దేవాలయం , మఠము ప్రాకారాల్లోను , వీధులు , ఇంటి ముందు సాయంత్రము సమయములో వెలిగించుకోవడంవల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారని చెప్పబడుతోంది. 


ఈ విధముగ ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న మాసం *ఆశ్వయుజ మాసం.*


ఈ మాసం లో చేసే పూజలు , విధుల ఆచరణ వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి. అనంత రూపాలలో విలసిల్లే శక్తిస్వరూపిణి అయిన ఆ తల్లి ఏ రూపములోనైనా , ఏ నామంతోనైనా ఆరాధించవచ్చు. *ఆ తల్లి అమ్మలగన్న అమ్మ !.*


*తనను నమ్మిన భక్తులను ఎట్టి పరిస్థితులలో విడవకుండా కాపాడే కల్పవల్లి  కరుణామయి..ఆ తల్లి !*


*శ్రీ దుర్గా దేవ్యై నమో నమః !* 🙏🙏

లేఖ

 *ఒక తండ్రి తన పిల్లలకు వ్రాసిన ఒక లేఖ....*


నేను ఈ లేఖ రాయడానికి మూడు కారణాలు:

1. జీవితం, అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు.

2. నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ నీకు చెప్పరు.

3. నేను రాస్తున్నదంతా నేను జీవితంలో అనుభవించినవి. నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో 

నీ గుండె గాయపడకుండా ఉంటుందని.


*ఈ క్రింద విషయాలు అతి జాగ్రత్తగా గుర్తుంచుకో....


1)నీతో సఖ్యముగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోకు. నేను, మీ అమ్మ తప్ప నీకు తప్పనిసరిగా మంచే చేయాలన్న బాధ్యత ఎవరికీ ఉండదని బాగా గుర్తెరిగి మసలుకో.

నీతో మంచిగా ఉన్నవారిపట్ల కృతజ్ఞుడివై వుండు. అలాగే జాగ్రత్తగా గమనించు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రతి పనికీ ఒక ఉద్దేశం ఉంటుంది.  నీతో ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ అలానే ఉండాలని లేదు, జాగ్రత్త,  గుడ్డిగా వారిని ఆత్మీయులు అనుకొని, నమ్మి నీ మనసు గాయపరచుకునేవు సుమా!


2)ఏ ఒక్కరూ తప్పనిసరి కాదు, తప్పక కలిగి ఉండితీరవలసినది ఏదీ లేదని మరచిపోకు.

ఇది నీవు సరిగా అర్థం చేసుకున్న రోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా, నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా నీ మనసు పెద్దగా గాయపడదు.


3)జీవితం బహు చిన్నది.

ఒక్క రోజు వ్యర్థమైనా చక్కగా అనుభవిం చాల్సిన, మళ్ళీ తిరిగిరాని ఒక రోజుని కోల్పోయావన్న విషయం గుర్తించుకో.


4) ప్రేమ అనేది ఒక నిలకడలేని, చంచలమైన ఒక భావన. కాలాన్ని, మూడ్ని బట్టి వెలసిపోయే ఒక ఎమోషన్. నువ్వు బాగా ప్రేమించానను కున్నవారు దూరమైనపుడు కుంగిపోకు, ఓపిక పట్టు. కాలం నీగాయాలను, బాధలను అన్నింటినీ కడిగేస్తుంది, కావాలంటే నీ చుట్టూ ఉన్నవారి జీవితాల్ని గమనించు.

ప్రేమ సౌందర్యాన్ని , అలాగే ప్రేమ విఫలమవడాన్ని అతిగా ఊహించుకోకు. ఏమంత పెద్ద విషయాలు కావని కాలం గడిచే కొద్దీ తెలుసుకుంటావని తెలుసుకో  ( Damn crazy movies! )


5)చాలామంది బాగా చదువుకోకుండానే జీవితంలో  పెద్ద స్థాయికి వెళ్లుండచ్చు, కానీ దానర్థం నువ్వు కష్టపడి చదవకుండానే గొప్పవాడయిపోతావని కాదు. నువ్వు సంపాదించే జ్ఞానమంతా 

నీకు గొప్ప ఆయుధాలని గ్రహించు.

దీవాళా తీసిన స్థితి నుండి తిరిగి ఉన్నతమైన స్థానం చేరడం సాద్యమే, కానీ దీవాళా తీసినప్పటి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుందని మరచిపోకు.


6)నేను వృద్ధాప్యంలో ఆర్థికంగా నీమీద ఆధారపడను. 

అలాగే జీవితాంతం ఆర్థికంగా నీకు ఆసరా ఇవ్వలేను. నువ్వు పెద్దవాడవుతూనే నా బాధ్యత తీరిపోతుంది. తర్వాత సైకిల్ మీద తిరుగుతావా, బస్సులో తిరుగుతావా, నీ సొంత లగ్జరీ కారులోనా? రిచ్ గానా మామూలు జీవితమా? అన్నది నీవే నిర్ణయించుకోవాలి.


7) ఇచ్చిన  మాటను ఎంత కష్టమైనా నిలబెట్టుకో.

మనస్సు లో

ఆలోచించే ఆలోచన,

మాట్లాడే మాట,

చేసే పని 

సత్యము, 

న్యాయము ,

ధర్మము కలిగి యుండాలి

ఇతరులనుంచి ఇది ఆశించకు. నువ్వు అందరితో మంచిగా ఉండు, అందరూ నీతో మంచిగా ఉంటారని అనుకోకు. ఇది నువ్వు సరిగా అర్ధం చేసుకోకపోతే  నీకు అనవసర సమస్యలు వస్తాయి.


8. లెక్కలేనన్ని లాటరీ టికెట్లు చాలా కాలం కొన్నా, ఒక చెప్పుకోదగ్గ పెద్ద ప్రైజ్ ఎప్పుడూ రాలేదు. కష్టపడితేనే(స్మార్ట్ గా) ధనవంతులవుతాము అన్నదానికి ఉదాహరణమిదే. విజయానికి షార్ట్ కట్స్ లేవని బలంగా నమ్ము.


9)దేవుని మీద పరిపూర్ణ విశ్వాసము,నిరీక్షణ కలిగి యుండు.


10)అది ఎంతకాలమైనా సరే, మనం కలసివున్న కాలాన్ని జాగ్రత్తగా మనస్సు లో దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్లీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా కన్నా .

(సమజము పట్ల ఆరోగ్యవంతమైన భయము ఉన్న ఒక తండ్రి).

 తెలుగుభాషలో మొదటి పి.హెచ్ డి పొందినదెవరు ?

________________________


(1) తెలుగుభాషలో మొదటి PhD పొందిన మహవ్యక్తి ఎవరు ?


(2) వసుచరిత్రను వ్రాసిన భట్టుమూర్తి, నరస భూపాలీయం వ్రాసిన రామరాజభూషనుడు వేరువేరుకాదు ఒక్కడేనని నిరూపించిన కవి విమర్శకుడెవరు ?


(3) హైదరాబాదు, తెలంగాణాలలో తెలుగు భాషాభివృద్ధికిగాను 1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపకుడెవరు ?


(4) ఆముక్తమాల్యద గ్రంథాన్ని పెద్దనామాత్యుడే శ్రీకృష్ణదేవరాయల పేరున వ్రాసాడన్న అపప్రధను పోగొట్టినదెవరు ? దత్త మండలాలకు రాయలసీమనే పేరును ప్రతిపాదించింది కూడా ఇతనే.


(5)  తెలుగులో మొదటి నవల రాజశేఖరచరిత్రం, గ్రంథకర్త వీరేశలింగంపంతులుగారు, కాని రాజశేఖరచరిత్రం కాదు, శ్రీరంగరాజు చరిత్రే మొదటి నవలని ఆరుద్రగారు చెప్పారు. శ్రీరంగరాజుచరిత్ర నవలా రచయిత ఎవరు ?


॥సేకరణ॥

_________________________________

జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

మతిమరుపు మనిషి

 🛕🦚 *knvr* 🦚🛕

************************

        *శుభోదయం* 

        *బుధవారం* 

************************


🔥 ఒకానొక గ్రామం లో ఒక మతిమరుపు మనిషి ఉండేవాడు . అతనికి సంస్కృతం చదువుకోవాలని ఎంతో కోరికగా ఉండేది . కానీ ఏమి చదువుకున్నా వెంటనే మర్చిపోయేవాడు . ఇలా ఎన్నో రోజులు కష్టపడ్డ తరువాత అతనికి ఒక ఉపాయం తట్టింది . అతను రెండు సారకాయ బుర్రలను తీసుకున్నాడు . ఒక దాంట్లో నిండుగా నువ్వులను నింపుకున్నాడు . ఒక్కో సంస్కృత పదం నేర్చుకుని ఆ పదానికి గుర్తుగా పక్కనున్న ఖాళీ సొరకాయ బుర్రలో ఒక్కో నువ్వు గింజ వేయడం మొదలు పెట్టాడు . కొద్దిరోజులలో ఆ ఖాళీ సొరకాయ బుర్ర నువ్వులతో నిండిపోయింది . ఒక్కో నువ్వుగింజకు గుర్తుగా అతను నేర్చుకున్న ఒక్కో పదం అతనికి గుర్తురాసాగింది . అతను పట్టుదలగా ఎన్నోపదాలను నేర్చుకున్నాడు . ఇదే పద్ధతిలో ఎన్నో విషయాలను నేర్చుకున్నాడు . మతిమరుపు మనిషి అని వెక్కిరించినవారే అతని విద్యకు ఆశ్చర్యపోయారు . మహా మహా పండితులు కూడా అతనిముందు ఓడిపోయారు . అతని వద్ద చదువుకోడానికి ఎంతోమంది వచ్చి చేరారు . పండిత చర్చలలో అతనిదే పైచేయిగా ఉండేది . అతనిని అందరూ నువ్వుగింజ పండితుడు అనేవారు . అతని కష్టం వృదా పోలేదు లేదు . ఈ కథ మనకు నేర్పే నీతి కేవలం తెలివైనవారే చదువులో ముందుంటారన్న అపోహను అతను తుడిచిపెట్టేశాడు . ఏదైనా నేర్చుకోడానికి వయసుతోనూ , తెలివి తేటలతోనూ సంబంధం లేదని అతను నిరూపించాడు . 

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

ॐ శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రరత్నమ్*

 *ॐ శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రరత్నమ్*


*1. శ్రీదేవీ సంబోధనమ్*


    ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః - ఓం నమస్త్రిపురసుందరి! 


*2. న్యాసాంగదేవతాః*


    హృదయదేవి! - శిరోదేవి! - శిఖాదేవి! - కవచదేవి! - నేత్రదేవి! - అస్త్రదేవి! 


*3. తిథినిత్యాదేవతాః* 


    కామేశ్వరి! - భగమాలిని - నిత్యక్లిన్నే! - భేరుండే! - వహ్నివాసిని!- మహావజ్రేశ్వరి! - శివదూతి! - త్వరితే! - కులసుందరి! - నిత్యే! - నీలపతాకే! - విజయే! - సర్వమంగళే! - జ్వాలామాలాని! - చిత్రే! - మహానిత్యే! 


*4. దివ్యౌఘ(gha)గురవః* 


    పరమేశ్వరపరమేశ్వరి! - మిత్రేశమయి! - షష్ఠీశమయి! - ఉద్దీశమయి! - చర్యానాథమయి! - లోపాముద్రామయి! - అగస్త్యమయి! 


*5. సిద్ధౌఘ(gha)గురవః* 


    కాలతాపనమయి! - ధర్మాచార్యమయి! - ముక్తకేశీశ్వరమయి! - దీపకళానాథమయి! 


*6. మానవౌఘ(gha)గురవః* 


    విష్ణుదేవమయి! - ప్రభాకరదేవమయి! - తేజోదేవమయి! - మనోజదేవమయి - కల్యాణదేవమయి! - వామదేవమయి! - వాసుదేవమయి! - రత్నదేవమయి! - శ్రీరామానందమయి! 


*7. శ్రీచక్ర ప్రథమావరణదేవతాః*  


    అణిమాసిద్ధే! - లఘిమాసిద్ధే! - గరిమాసిద్ధే! - మహిమాసిద్ధే! - ఈశిత్వసిద్ధే! - వశిత్వసిద్ధే! - ప్రాకామ్యసిద్ధే! - భుక్తిసిద్ధే! - ఇచ్ఛాసిద్ధే! - ప్రాప్తిసిద్ధే! - సర్వకామసిద్ధే! 

    (ఇతి భూపుర ప్రథమ రేఖాయామ్) 


    బ్రాహ్మి! - మాహేశ్వరి! - కౌమారి! - వైష్ణవి! - వారాహి! - మాహేంద్రి! - చాముండే! - మహాలక్ష్మి! 

    (ఇతి భూపుర ద్వితీయ రేఖాయామ్) 


    సర్వసంక్షోభిణి! - సర్వవిద్రావిణి! - సర్వాకర్షిణి - సర్వవశంకరి! - సర్వోన్మాదిని! - సర్వమహాంకుశే! - సర్వఖేచరి! - సర్వబీజే! - సర్వయోనే! - సర్వత్రిఖండే! 

    (ఇతి భూపుర తృతీయ రేఖాయామ్) 


    త్రైలోక్యమోహనచక్రస్వామిని! - ప్రకటయోగిని! 


*8. శ్రీచక్ర ద్వితీయావరణ దేవతాః* 


    కామాకర్షిణి! - బుద్ధ్యాకర్షిణి! - అహంకారాకర్షిణి! - శబ్దాకర్షిణి! - స్పర్శాకర్షిణి! - రూపాకర్షిణి! - రసాకర్షిణి! - గంధాకర్షిణి! - చిత్తాకర్షిణి! - ధైర్యాకర్షిణి! - స్మృత్యాకర్షిణి! - నామాకర్షిణి - బీజాకర్షిణి - ఆత్మాకర్షిణి - అమృతాకర్షిణి - శరీరాకర్షిణి! 


    సర్వాశాపరిపూరకచక్రస్వామిని! - గుప్తయోగిని! 


*9. శ్రీచక్ర తృతీయావరణ దేవతాః* 


    అనంగకుసుమే! - అనంగమేఖలే! - అనంగమదనే! - అనంగమదనాతురే! - అనంగరేఖే! - అనంగవేగిని! - అనంగాంకుశే! - అనంగమాలిని! 


    సర్వసంక్షోభణచక్రస్వామిని! - గుప్తతరయోగిని! 


*10. శ్రీచక్ర చతుర్థావరణ దేవతాః* 


    సర్వసంక్షోభిణి! - సర్వవిద్రావిణి! - సర్వాకర్షిణి! - సర్వాహ్లాదిని! - సర్వసమ్మోహిని! - సర్వస్తంభిని! - సర్వజృంభిణి! - సర్వవశంకరి! - సర్వరంజని! - సర్వోన్మాదిని! - సర్వార్థసాధికే! - సర్వసంపత్తిపూరణి! - సర్వమంత్రమయి!సర్వద్వంద్వక్షయంకరి! 


    సర్వసౌభాగ్యదాయకచక్రస్వామిని! - సంప్రదాయయోగిని! 


*11. శ్రీచక్ర పంచమావరణ దేవతాః* 


    సర్వసిద్ధిప్రదే! - సర్వసంపత్ప్రదే! - సర్వప్రియంకరి! - సర్వమంగళకారిణి! - సర్వకామప్రదే! - సర్వదుఃఖవిమోచని! - సర్వమృత్యుప్రశమని! - సర్వవిఘ్న(ghna)నివారిణి! - సర్వాంగసుందరి! - సర్వసౌభాగ్యదాయిని! 

    

    సర్వార్దసాధకచక్రస్వామిని! - కుళోత్తీర్ణయోగిని! 


*12. శ్రీచక్ర షప్ఠావరణ దేవతాః* 


    సర్వజ్ఞే! - సర్వశక్తే! - సర్వైశ్వర్యప్రదాయిని! - సర్వజ్ఞానమయి! - సర్వవ్యాధివినాశిని! - సర్వాధారస్వరూపే! - సర్వపాపహరే! - సర్వానందమయి! - సర్వరక్షాస్వరూపిణి! సర్వేప్సితఫలప్రదే! 


    సర్వరక్షాకరచక్రస్వామిని! - నిగర్భయోగిని! 


*13. శ్రీచక్ర సప్తమావరణ దేవతాః*  


    వశిని! - కామేశ్వరి! - మోదిని! - విమలే! - అరుణే! - జయిని! - సర్వేశ్వరి! - కౌళిని! 


    సర్వరోగహరచక్రస్వామిని! - రహస్యయోగిని! 


*14. శ్రీచక్రాష్టమావరణ దేవతాః* 


    బాణిని! - చాపిని! - పాశిని! - అంకుశిని! - మహాకామేశ్వరి! - మహావజ్రేశ్వరి! - మహాభగమాలిని! - మహాశ్రీసుందరి! 


    సర్వసిద్ధిప్రదచక్రస్వామిని! - అతిరహస్యయోగిని! 


*15. శ్రీచక్ర నవమావరణ దేవతాః*  


    శ్రీశ్రీమహాభట్టారికే! 


    సర్వానందమయచక్రస్వామిని! పరాపరరహస్యయోగిని! 


*16. నవచక్రేశ్వరీ నామాని* 


    త్రిపురే! - త్రిపురేశి! - త్రిపురసుందరి! - త్రిపురవాసిని! - త్రిపురాశ్రీః! - త్రిపురమాలిని! - త్రిపురాసిద్ధే! - త్రిపురాంబ! - మహాత్రిపురసుందరి! 


*17. శ్రీదేవీవిశేషణాని - నమస్కారనవాక్షరీచ* 


    మహామహేశ్వరి! - మహామహారాజ్ఞి! - మహామహాశక్తే! - మహామహాగుప్తే! - మహామహాజ్ఞప్తే! - మహామహానందే! - మహామహాస్కంధే! - మహామహాశయే - మహామహా శ్రీచక్రనగరసామ్రాజ్ఞి! 


                 *నమస్తే - నమస్తే - నమస్తే - నమః* 


* *దేవీ నవరాత్రుల సందర్భంగా, రేపటి నుంచీ, శ్రీచక్రంలోని నవావరణలను గూర్చి ఒక్కొక్కరోజూ ఒక్కొక్క ఆవరణ గూర్చి తెలుసుకుంటూ, దానికి సంబంధించిన కీర్తనని ఆస్వాదిద్దాం.* 


https://youtu.be/djojAK_uheI 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

స్వామికిచ్చిన మాట..*

 *స్వామికిచ్చిన మాట..*


"మా తమ్ముడు వాళ్ళు వచ్చారు..పొంగలి పెట్టుకొని స్వామి దగ్గర పూజచేయించుకుంటాము"..అంటూ కందుకూరు నుండి క్రమం తప్పకుండా వచ్చే వెంకమ్మ గారు నా దగ్గరకు వచ్చి చెప్పారు...


ఆమెకు గానీ..ఆమెతో వచ్చే వారికి గానీ..మా అర్చకులు, సిబ్బంది ఎటువంటి అడ్డూ చెప్పరు...శ్రీ దత్తాత్రేయ స్వామి వారు సిద్ధిపొందిన నాటినుండి, నేటివరకూ ఆ స్వామినే నమ్ముకుని క్రమం తప్పకుండా గుడికి వచ్చే అతి కొద్దిమంది భక్తులలో ఆవిడ ఒకరు..


మధ్యాహ్నం హారతి వేళకు, వెంకమ్మ గారి తమ్ముడు, శ్రీ లేళ్ల వెంకట శ్రీనివాసరావు , వారి భార్య పద్మావతి, వారి సంతానంతో సహా పొంగలి గిన్నె తీసుకొని పూజకు వచ్చారు..


శ్రీ శ్రీనివాసరావు గారికి, 1981 మే నెలలో వివాహం అయింది..ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు కూతుళ్లు..మగపిల్లలిద్దరికీ తరచూ ఆరోగ్యం బాగలేకుండా ఉండటం, తనకూ కడుపులో విపరీతంగా నొప్పి రావడం..జరుగుతూ ఉండేది..తనకు ఆపరేషన్ చేయక తప్పదని, ఆరోజుల్లో కందుకూరు లో ఉన్న ప్రముఖ డాక్టర్ లు తేల్చి చెప్పారు..


ఒకసారి,మొగలిచెర్ల వచ్చి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమాధిని దర్శించి, మొక్కుకుంటే, మంచిదని వెంకమ్మ గారు పదే పదే చెప్పడంతో, ఆమె ప్రోద్బలంతో, శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి, పిల్లల ఆరోగ్యం గురించి మ్రొక్కుకున్నారు..త్వరలోనే, పిల్లలిద్దరూ ఆ అనారోగ్యపు ఛాయల నుంచి బయట పడ్డారు!..వారి మాటల్లోనే చెప్పాలంటే.."ఆరోజునుంచి, ఈరోజు దాకా దాదాపు 35 ఏళ్ల బట్టి, పిల్లలిద్దరూ లక్షణంగా ఉన్నారండీ..ఏ అనారోగ్యమూ లేదు..వివాహాలు కూడా అయ్యాయి..


"పిల్లల ఆరోగ్యం కుదుట బడిందని, స్వామి దగ్గర పొంగలి పెట్టుకుని, నా కడుపునొప్పి గురించి కూడా స్వామికి మొరపెట్టుకున్నాను..నాకు నయమైతే.. ప్రతి ఆదివారం మాంసం తినే నేను, అది మానేస్తానని మొక్కుకున్నాను..అంతే.. మళ్లీ ఈరోజు వరకు, కడుపునొప్పి ఎరుగనండీ..ఆపరేషన్ తప్పదని చెప్పిన డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారండీ!..ఇప్పటికీ ఎంతమందికి నేను ఈ విషయం చెప్పుకున్నానో లెక్కేలేదు..నేనూ పూర్తిగా శాఖాహారి గా మారిపోయానండీ..స్వామివారి సమాధిని దర్శించుకొని మన కష్టాలు ఆయనకు విన్నవించుకుని సంపూర్ణ శరణాగతి చెందితే చాలండీ..సమస్త బాధలూ మాయమైపోతాయి..మా కుటుంబమే ఇందుకు ఉదాహరణ.." అన్నారు..ఈ మాటలు చెప్పేటప్పుడు ఆయన కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి..


"ప్రస్తుతం పిల్లలందరూ..చక్కగా సెటిల్ అయ్యారు..అంతా ఇక్కడ సమాధిలో కూర్చున్న ఈ స్వామి దయ!..మా ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి...ఆ స్వామివారి పూజతో పాటు..ఈ మొగిలిచెర్ల స్వామి ని కూడా మనస్ఫూర్తిగా నమ్మి బాగుపడ్డాము!" అంటూ శ్రీ స్వామివారి చిత్రపటానికి నమస్కరించుకున్నారు..


శ్రీ శ్రీనివాసరావు గారు, ఒంగోలు లోని, గద్దలగుంటపాలెం, రాజరాజేశ్వరీ గుడివద్ద, స్వంత ఇంట్లో ఉంటారు..


సర్వం..

శ్రీ దత్తకృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699)