16, జూన్ 2021, బుధవారం

*ఆట పెట్టిన మంట- మాట తెచ్చిన తంటా!*


*ఆట పెట్టిన మంట- మాట తెచ్చిన తంటా!*     

       (హాస్యకథ...??!) 


పెళ్ళివారి విడిదిలో స్నాతకం అలా అవ్వడమేంటి, ఇలా చాపలు, వాటిమీద పేకలూ పరిచేసారు. ఆడపెళ్ళివారు బాధ్యతలన్నీ ఈవెంట్ల వాళ్ళకప్పచెప్పేసి....నిష్పూచీగా బహుముఖ పారాయణ మొదలుపెట్టారు! ( చతుర్ముఖ పారాయణల్లా పదిమంది చేరి బహుముఖంగా విస్తరింప చేసారన్నమాట) ! పేకాట మా ఇంటావంటా లేదంటూనే మగపెళ్ళివారి నుండి కొందరు ఘనులు ముసుగేసుకుని మందలో చేరిపోయారు! 


       ముందు ముక్తసరిగా మొదలుబెట్టిన క్రీడాకారులు... మెల్లమెల్లగా తమ గానగాంధర్వాన్ని బయటపెట్టడం మొదలుబెట్టారు. సాక్షాత్తు కాబోయే కన్యాదాతే...గళమెత్తి గాభరాపెట్టాడు! 


“ పేకలో నారాజు తొంగిచూసేను నాడు... ఆటలో ఆ రాజు  సెట్టు చేసెను నేడు”.... అంటూ ప్రఫుల్లహృదయుడై....”యువర్ మేజస్టీ “అంటూ డైమండ్ కింగ్ గారిని కళ్ళకద్దుకున్నాడు! 


మావగారు పడేసిన మరో రాజుగారిని భుజస్కంధాలపై మోస్తూ.....


“ రాజశేఖరా నీపై మోజు తీరలేదురా!”... అంటూ ఠక్కున ఇస్పేట్ రాజును  అందుకుని...” రాణీ రాణమ్మా! ఆనాటి నవ్వులు ఏవమ్మా! నీ వేడుక చూడాలనీ..ఎన్నెన్నో ఆశలతో నీరాజును తెచ్చానమ్మా...!”.... అంటూ ఆనందంగా పాటకు పేరడీనీ, పేకలో సెట్టునీ కట్టేసాడు పెద్దల్లుడు! 


ఇంతలో జోకరు తగిలిందో ఏమో... పెళ్ళికొడుకు పెద్దక్క...”సుందరి నీవంటి దివ్యస్వరూపం ఎందెందు వెతికిన లేదు కదా!”... అంటూ టకటకా పేకలో ముక్క నేర్పుగా సర్దేసుకుని , ఓ చెత్తముక్క పడేయగానే.....పెళ్ళికొడుకు చిన్న మేనత్తకు ఉడుకుమోత్తనంతో కళ్ళూముక్కులూ ఎర్రబడ్డాయి. అది చూసి ఆమె భర్త.....

“ రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే

రాని ముక్కల కోసం శోకాలెందుకే

ఫుల్లుకౌంటులే నీ అకౌంటులో...”.... అంటూ ఓ ఖూనీరాగం అందుకుని, భార్యచూపులకు భస్మమ్ అవ్వకుండా పేకముక్కలు అడ్డుపెట్టుకున్నాడు! 


ఈ విధంగా “ఆడుతూ పాడుతూ ఆటాడేస్తే అలుపూసొలుపేమున్నది”......అంటూ ఒకరు,


“ఏవండోయ్ బావగారూ! ఒక చిన్న ముక్క! “..... అంటూ వియ్యంకులవారూ


“...విన్నపాలు వినవలే వింతవింతలూ! తిన్ననయిన ఒక్క ఆట మాకీయ వేమయ్యా! “.... అంటూ మరొక పినమావగారూ......


బ్రహ్మాండమయిన క్రీడాస్ఫూర్తితో , భీభత్సమయిన పేకపేరడీలతో.....ఒలింపిక్స్ లెవెల్ లో సాగుతున్న చీట్లపేకాటలో .... పత్తాలో కరిపేపాకు పత్తాలా, పానకంలో పేకపుడకలా దూరాడు పెళ్ళికొడుకు! కాలక్షేపానికి వచ్చినవాడు ఆటచూసి ఆనందించకుండా.... ఓ కూత కూసాడు... కూతవేటు వరకూ వినిపించేలా! 


“ రేఖ ఆడదా!”..... అంటూ! 


పేకాటలో పెనువిస్ఫోటనంలా ఉలిక్కి పడ్డారంతా! 

అంతటా ఒక్కసారి అలుముకున్న ఆ నిశ్శబ్దంలో... ఖంగున మ్రోగింది పెద్దల్లుడి గొంతుకు!


“ ఈ ప్రశ్నకు బదులేది? ఈ సృష్టికి మొదలేది?”... అంటూ! ... గాన గార్ధభంలా! 


“ సృష్టికి మొదలు “ఆడదే” కదా సోదరా! మా రేఖ కూడా “ఆడదే”! ఆ ఆడదాని మాయలో పడకూడదనే కదా, ఆ జన్మలో ,అర్ధరాత్రి భార్యాబిడ్డలను వదిలి అర్ధాంతరంగా అడవులకు వెడలినావు! .”.... అన్నాడు అక్కినేనిలా ముక్కు దిబ్బడచేసుకుని! పెళ్ళికొడుకు పేరు “గౌతమ్” లెండి! 

అందరూ ఆ హాస్యవిస్సాటానికి గొల్లుమన్నారు! 


తలకొట్టుకుని, ఏదో చెప్పబోయాడుగౌతమ్! ఇంతలో....


“ అవును నాయనా! మొన్నటి దాకా రేఖ ఈడదే! ఎప్పుడయితే నీకు తాంబూలంలో పోకనూ, రేఖనూ ప్రదానం చేసానో ... అప్పుడే తను “ ఆడది” అయిపోయింది బాబూ! అయిపోయింది! అంటూ... గుండెపట్టుకుని... గుమ్మడిలా గద్గదమయ్యారు మాంగారు! ఒకప్పటి “రంగస్థల భీభత్స” బిరుదాంకితుడు! 


   నేనేనా తక్కువ తిన్నానని...భార్యాబాధితుడైన పెద్దమావగారి కొడుకు... గొంతు సవరించేసుకుని...

 “ బావా! ఆడదె ఆధారం! మన కధ ఆడనె ఆరంభం! ఆడదె సంతోషం! మనిషికి ఆడదె సంతాపం”....అంటూ... శోభన్ బాబు రింగొకటి నుదుటి మీద తిప్పుకుంటూ క్రిష్ణలా మొహాన్ని మూడుతిప్పులు తిప్పి ...ముక్కుతో పాడాడు. 


అప్పటికే ఆ గానాబజానాకు విరక్తి, విరసం వచ్చిన గౌతమ్ ....“ ఆపండి మహాప్రభో ఆపండి! మీతో పెట్టుకున్నాను చూడండి! నా చెప్పెట్టుకు నేను కొట్టుకోవాలి! నేను అడిగింది...” నా కాబోయే భార్య రేఖారాణి పేకాట ఆడదా?”... అని. అంతే కానీ ఆడదా, మగాడా? మధ్యస్థమా? తటస్థమా?”.... అని కాదండి”.... అంటూ ఎర్రబారిన మొహంతో ఒక్కరుపు అరిచాడు! 


     “ మరంతే తమ్ముడూ! ఏరు దాటొచ్చి మా పిల్లను ఇమ్మనడం కాదు. ఏటికి ఎదురీదడం కూడా నేర్చుకోవాలి. “ ఎదురీతకు అంతము లేదు! ఏ దరికి తేలతామో అసలే తెలీదు! “

“ పెళ్ళంటే నూరేళ్ళ వంట

అది తెలిసుంటే ఉండదు మంట”.... అంటూ ఆ క్రిష్ణాజిల్లా పెళ్ళికొడుక్కు కమ్మకట్టడం మొదలుపెట్టారు గోదారి బామ్మర్దులు! 


ఇవన్నీ వింటూ కూడా, కిమ్మనకుండా ముసిముసి నవ్వులు నవ్వుతున్న తండ్రితో....” నాన్నగారు! మీకు పౌరుషం లేదా! శతృపక్షంలో చేరి పేకాడుతున్నారా?”... అంటూ రోషపడ్డాడు గౌతమ్! 


“ ఏట్లో దిగినవాడూ

రోట్లో తలపెట్టినవాడు

నోట్లోనాలుక లేని నా బోటివాడు

చీట్లపేకలో కూర్చున్నవాడూ..... 

నిమిత్తమాత్రుడు నాయనా! 

ఎన్నాళ్ళకో దొరికిన ఈ స్వేచ్ఛ నేను దుర్వినియోగం చెయ్యలేను! 

ఈ గోదారోళ్ళ వెటకారాలను వేటాడలేను!

క్షమించు మైసన్! క్షమించు”...... అంటూ పేకలో తలదూర్చాడా పెద్దమనిషి! 


         ఇంతలో అవ్వాలిసిన డేమేజ్ అవ్వనే అయ్యింది. ఆ పక్కనే ...వాడేసిన పేకలు వాటంగా ఏరుకుంటున్న ఓ గూఢచారి కమ్ రాయబారి...కుర్రపిశాచి, వాచాలకాపాలి ఒకతి .... ఈ వార్తకు యెల్లోజర్నలిజమ్ హోదానిచ్చి.... నీలిరంగు పూసి మరీ ...పెళ్ళికూతురి  చెవిన వేసింది!....” రేఖక్కా! బావ ... అసలు నువ్వు ఆడదానివేనా? అసలు ఆడపిల్ల లక్షణాలు రవ్వంతేనా ఉన్నాయా? మగరాయుడిలా ఆ బట్టలేంటి? పెళ్ళికూతురి వేషంలో నువ్వు ఆడామగా కాకుండా మధ్యస్థంగా ఉన్నావని అంటున్నాడే!”..... అంటూ ఊరంతా వినేట్టు చెవులు కొరికి....అగ్గిరాజేసి...సారె బుట్టలోంచి అరిసెకొటి లాఘవంగా లాగి... కొరుక్కుంటూ...సాగిపోయింది! 


      చూడాలి... ఈ అగ్గి...రేఖాగౌతమ్ లను అగ్నిసాక్షిగా ఏడడుగులు వేయిస్తుందో ?లేక బడబాగ్ని రాజేస్తుందో! 


ఒకవేళ వేయించినా.... గౌతముడికి  “వేయింపో, వాయింపో? సరసాల పూయింపో?”! “ నూరేళ్ళ పంటో? నూరేళ్ళ మంటో!”.... ముందుముందు!😃😊😢😲😂😍  


ధన్యవాదాలతో

ఓలేటి శశికళ!

జంధ్యాల గారి సరళిలో తిట్లల్లో

 🏵 జంధ్యాల గారి సరళిలో తిట్లల్లో కొత్తదనం 🏵

😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😂😃

1.atm లో pan card పెట్టే తింగరి సన్నాసి….😜

2.AC కోసం atm కి వెళ్లి బాలన్స్ enquiry చేసే కక్కుర్తి ఎదవ…😁

3.# 108 vehicle ని ఆపి లిఫ్ట్ అడిగి తిట్లు తినే తింగరి ఎదవ😂

4.రెండో floor లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసిన ఫేసూ.😟

5.తిని పాడేసిన విస్తరాకులు కడిగి అమ్మే కక్కుర్తి ఎదవా..😛

6.బూట్ పాలిష్ కుర్రాడితో బేరాలాడి 50 % డిస్కౌంట్ కి చేయించుకునే పీనాసి నాయాల

7.విమానంలో kerchief వేసి seat book చేసుకోటానికి parachute వేసుకెళ్ళే పిచ్చి వెధవ.😨

8.Saturday night PUB కి వెళ్ళి వేడిగా ఉప్మా ఉందా అని అడిగే ఏబ్రాసి.😫

9.కుక్క వెంటపడుతుంటే పరిగెత్తకుండా vodofone sim తీసి పడేసే అక్కుపక్షి.😉

10.ఎర్రసైన్యం R.narayana murthy దగ్గర break dance నేర్చుకొనే ఎదవా..😭

11.ఎండ్రిన్ డబ్బాలో ఏరుసెన్నక్కాయలు దాచుకుని తినే ఎర్రి పీనుగా.😜

12.మంచుతో చేసేదే మంచురియ అనుకునే మొహం..😛

13.పిచుకల గూట్లో పీసుమిఠాయి వెతికే పింజారెదవా.😳

14.TVలో వచ్చే సినిమాను కూడా రివ్యూ చదివి చూసే మొహం.😊

15.వినాయక చవితి రోజు గణేష్ బీడిలమ్మే గలీజ్*గా😂😂

ఎందుకు

 *👽 50 ఏళ్ళ క్రితం ఇటలీ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన ఇటలీ బార్ వైరస్ గురించి తెలుసుకుందాం 👽*

*♦️1. రాజీవ్‌గాంధీ మొత్తం 181 పబ్లిక్ మీటింగ్ లలో పాల్గొన్నారు. అందులో నుండి సోనియా గాంధీ 180లలో పాలుపంచుకున్నారు. (శ్రీపెరంబుదూర్ మీటింగ్ తప్ప) రాజీవ్ గాంధీ చివరి మీటింగ్‌లో ఆవిడ పాల్గొనలేదు. అదే రోజు ఆయన మానవబాంబ్ ద్వారా హాత్య చేయబడ్డారు.*

*♦️2. రాజీవ్‌గాంధీ హత్యలో మరో 14 మంది సామాన్యులు చనిపోయారు. అందులో కాంగ్రెస్‌కి చెందిన ఒక్క లీడరు కూడా లేడు ! ఇది ఆశ్చర్యంగా, అనుమానాస్పదంగా అనిపించడం లేదా ఒక మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి కాండిడేట్ వ్యక్తి ప్రసంగించే మీటింగ్‌లో ఒక్క సీనియర్ కాంగ్రెస్ లీడర్ లేకపోవడం,*

*♦️3. రాజీవ్‌గాంధీ హత్యలో పెద్ద లీడర్ కానీ, మధ్యస్థ లీడర్ కానీ, చిన్న లీడర్ కానీ చనిపోలేదు. సోనియా లేరు, ఎప్పుడూ రాజీవ్ వెంట ఉంటూ అనుసరించే వ్యక్తి తల నొప్పి కారణంగా ఆవిడ ఆ ర్యాలీకి ఆరోజు హాజరు  కాలేదు. చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే పోయే తల నొప్పిని ఆమె సాకుగా చెబుతోంది. ఆ తరువాత భారత న్యాయస్థానానికి ప్రియాంకగాంధీ ద్వారా హంతకులకు శిక్ష అవసరం లేకుండా క్షమాభిక్ష పెట్టమని ఆమె అప్లికేషన్ దాఖలు చేయించింది.*

*♦️4. సోనియా ప్రస్థానం నెహ్రౄ కుటుంబంలో ఒక కొడలుగా మొదలయ్యాక అప్పటినుండి ఇప్పటివరకు ఒక్కటి కూడా సాధారణ మరణం నమోదు కాలేదు, అన్నీ కూడా అసాధారణమైనవే, రహస్యమైనవే. మీకేం అర్ధమైంది ❓*

*♦️5. ఇందిరా గాంధీ కుమారుడు అయిన సంజయ్‌గాంధీ మామ అయినటువంటి కల్నల్ ఆనంద్ ఆయన తన ఫామ్ హౌస్ కి ఎదురుగా చంపబడ్డాడు.*

*♦️6. సంజయ్‌గాంధీ కూడా ఒక ప్రైవేట్ ప్లేన్ ప్రమాదంలో చనిపోయాడు. ఇందిరాగాంధీ తన సొంత రక్షకుడి చేతిలోనే హత్య చేయబడ్డారు. తరువాత రాజీవ్ గాంధీ కూడా అలాగే చనిపోవడం జరిగింది.*

*♦️7. సోనియా తన దగ్గరి మిత్రురాలు, తనతో పాటు బార్‌లో డాన్స్ చేసిన కొలీగ్ డ్యాన్సర్ కొడుకు అయిన రాబర్ట్ వాద్రాకు ప్రియాంకను ఇచ్చి వివాహం జరిపించారు.*

*♦️8. ప్రియాంక గాంధీ మామ రాజేంద్ర వాద్రా ఢిల్లీలోని ఒక గెస్ట్ హౌస్‌లో చనిపోయి కనిపించడం జరిగింది.*

*♦️9. ప్రియాంక బావగారి భార్య అంటే ప్రియాంక తోడి కోడలు హైవే రోడ్డు ప్రమాదం లో చనిపోయారు.*

*♦️10. ప్రియాంక గాంధీ బావ మొరాదబాద్ హోటల్‌లో చనిపోయి కనిపించడం జరిగింది.*

*♦️11. రాజీవ్‌గాంధీకి దగ్గరి మిత్రులు అయిన రాజేష్‌ పైలట్, మాధవరావు సిందియాలు రాజీవ్‌తో కలిసి ఇటలీలోని సోనియా డ్యాన్స్ చేసే ఆ బార్‌కి వెళ్లేవారు. రాజేష్ పైలట్ రోడ్డు ప్రమాదంలో, మాధవరావు సింధియా విమాన ప్రమాదంలో చనిపోయారు.*

*♦️12. ఏ రోజైతే పార్లమెంట్ మీద అఫ్జల్‌గురు దాడి చేసాడో ఆరోజు రాహుల్, సోనియా ఇద్దరూ పార్లమెంట్‌కి వెళ్ళలేదు. ఇది కూడా కాకతాళీయమేనా. ❓*

*♦️13. ముంబాయి తాజ్ హోటల్ (26/11) దాడి ముందు రోజే రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళిపోయాడు. మీకేం అర్థమైంది. ❓*

*👿 ఇండియాలో హిందువులకు ఇప్పటికి మీడియా దాచేసిన, సమాధానం తెలియని ప్రశ్నలు ❓👿*

*♦️1. పాకిస్తాన్, భారతదేశం మతం ఆధారంగా విడిపోయినప్పుడు, పాకిస్తాన్ ముస్లిం దేశంగా ప్రకటించినప్పుడు, భారతదేశం హిందూ దేశంగా ఎందుకు ప్రకటించ బడలేదు (ప్రపంచంలో ఇంకో హిందూ దేశం కూడాలేదు.) ❓*

*❓2. పాకిస్తాన్ నుండి హిందువుల, సిక్కుల శవాలు వస్తే రానీ, ఇక్కడ ఒక ముస్లిం రక్తం కూడా పార కూడదని జాతిపితగా ప్రచారమైన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఎందుకన్నారు ❓*

*♦️3. గాంధీ అనుకుంటే భగత్ సింగ్ ను కాపాడగలిగే వారు. కానీ ఎందుకు కాపాడ లేదు ❓*

*♦️4. భారత్ లో  ముస్లింల లబ్ది కోసం రకరకాల చట్టాలు ఎందుకు ఉన్నాయి ❓*

*♦️5.  భారత్ నుండి విడిపోయిన దేశాలు అన్నీ  ముస్లిం దేశాలుగనే  ఎందుకు మారాయి ❓*

*♦️6.  కేరళ లో రిక్షావాళ్లు, డ్రైవర్లు అయిన హిందువులు శ్రీ కృష్ణ, జై హనుమాన్ అని ఎందుకు రాసుకోకూడదు ❓*

*♦️7.  రాజ్యాంగం ప్రకారం 10 శాతం కంటే తక్కువ ఉన్న వారినే  అల్ప సంఖ్యాకులు అంటారు. భారత్లో 18 శాతం ఉన్న ముస్లింలు ఇంకా అల్ప సంఖ్యాకులుగా ఎందుకు సౌకర్యాలు పొందుతున్నారు ❓*

*♦️8.  కాశ్మీర్ హిందూ దేశంలో భాగం అయినప్పటికీ, అక్కడినుండి హిందువులను ఎందుకు వెళ్ల గొట్టారు ❓*

*♦️9. ముస్లింలు ఎక్కడైతే 30 - 40 శాతం అవుతారో అప్పుడు వారి కోసం ప్రత్యేక ముస్లిం దేశం కావాలని డిమాండ్ మొదలవుతుంది. ఇతర మతస్తులను వ్యతిరేకిస్తారు ❓ ఎందుకు ♦️*

*♦️10. ఇస్లామిక్ ఉగ్రవాదులకు, ఇస్లాంకు సంబంధం అంట కట్టొద్దని కోరుకుంటారు. కానీ హిందుత్వాన్ని మతతత్వం అని ఎందుకంటారు ❓*

*♦️11. ప్రపంచంలో హజ్ యాత్రకు  సబ్సీడీ ఇచ్చే ఏకైక దేశం భారత దేశం. 60 సంవత్సరాలుగా ప్రభుత్వం దీని కొరకు వేల కోట్లు ఖర్చు చేశారు. ఎందుకు ❓*

*♦️12. హిందూ మందిరాలలో ఆదాయాన్ని మదరసాలకు ఎందుకు ఖర్చు పెడతారు ❓*

*♦️13. కాశ్మీర్లో భగవద్గీత బోధించటానికి చట్టపరమైన ఆంక్షలు ఎందుకు ❓*

*♦️14. ఒకసారి జుమ్మా మసీద్ ఇమామ్ సయ్యద్ అబ్దుల్ బుఖారీ  "నేను ఒసామా బిన్ లాడెన్ ను సమర్పిస్తానని, ఐఎస్ఐఎస్ యొక్క ఏజెంటును"  అని అన్నారు. అయినా భారత ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేయలేదు. ఎందుకు ❓*

*♦️15. పాకిస్తాన్ లో 1947లో 22.4 5 శాతం హిందువులు ఉండేవారు 1.12 శాతం మాత్రమే ఉన్నారు. అందరూ ఎక్కడికి పోయారు ❓*

*♦️16. మొగలుల ద్వారా ధ్వంసం చేయబడిన సోమనాథ్ మందిర్ పునరుద్దరించాలన్న సమయంలో ఇది ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడమే అని గాంధీ ఎందుకన్నారు ❓*

*♦️17. అదే గాందీ జుమ్మా మసీదు పునరుద్దరణకు నిరాహార దీక్షకు కూర్చుని ప్రభుత్వం పై వత్తిడి ఎందుకు తెచ్చారు ❓*

*♦️18.  భారత్లో 1947లో 7.8 8 శాతం ముస్లింలు మాత్రమే ఉండే వారు. ప్రస్తుతం వారు 18.8 శాతం ఉన్నారు. ఇంత జనాభా ఎలా పెరిగింది ❓*

*♦️19. భారతదేశంలోని మీడియా హిందువులకు, సంఘ్ కు  వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతుంది ❓*

*♦️20. అక్బర్ జనానా లో  4878 మంది హిందూ మహిళలు ఉండేవారు. జోధా అక్బర్  సినిమాలో కాని, పాఠశాల చరిత్ర పాఠ్యాంశాలలో ఇది ఎందుకు ముద్రించ బడ లేదు ❓*

*♦️21. బాబర్ లక్షల హిందువులను హత్య చేశాడు.అయినా మనం ఎందుకు అతని మసీదును  చూడాలను కుంటాము ❓*


21. భారత్ లో 80 శాతం హిందువులు ఉన్నారు. అయినా శ్రీరాముని మందిరం2020 దాక ఎందుకు కట్టలేకపోయాము? 

*♦️23‌. కాంగ్రెస్ పాలనలో 645 దాడులు జరిగాయి. అందులో 32, 427 మంది చనిపోయారు. ఇవేవీ మీడియాకు కనపడవా ❓*

*♦️24. కానీ గుజరాత్ లో  ప్రతీకార దాడులలో రెండు వేల మంది చనిపోతే మీడియా ఇంత హంగామా ఎందుకు చేసింది ❓*

*♦️24. గోద్రా లో  67 మంది కరసేవకులు సజీవంగా దహనం చేశారు మీడియా దాని గురించి ఎందుకు మాట్లాడదు ❓*

*♦️25. జవహర్లాల్ నెహ్రూ తాత ఒక ముస్లిం (ఘియాషుద్దీన్ గాజీ)  కానీ మనకు చరిత్రలో తప్పుగా ఎందుకు చూపించారు. ❓*B

*🤝 ప్రతి ఒక్కరూ రాబోయే తరాలను ఎటు వైపు తీసుకెళ్తున్నారో ఆలోచించాలి. ఇది మనందరి బాధ్యత. 🤝*

దీన్ని ప్రతీ హిందువు చదవాలి

దయచేసి మీకు తెలిసిన ప్రతీ

హిదువుకు ఫార్వార్డ్ చెయ్యండి

*🚩 జై హింద్ 🚩*

🚩భరత్ మాతకీ జై🚩

ఒక్కటే మార్గం.

 మనం డబ్బు ఎంత సంపాదించినా మనం చనిపోయిన తరువాత మనతోబాటు తీసుకొని వెళ్ళలేము. అలా వెళ్ళు సమయంలో మనతో బాటు మన సంపదలు కూడా రావాలంటే ఒక్కటే మార్గం. 


ఉదాహరణకు మనం అమెరికా వెళ్తున్నప్పుడు అక్కడి ఖర్చుల కొనుగోళ్ళ నిమిత్తం మన భారతదేశ రూపాయలు తీసుకెళ్తే ప్రయోజనముండదు. ఎందుకనగా మన రూపాయలు అక్కడ చెల్లవు కాబట్టి. అంటే మనం బయలుదేరే ముందే మన అమెరికా ఖర్చులకోసం బ్యాంకుల నుండి ప్రభుత్వ గరిష్ట అనుమతి ప్రకారం మన భారతదేశ ద్రవ్యమైన రూపాయలను యిచ్చి వాటికి ఆరోజుటి మారకపు విలువాధారంగా అమెరికా ద్రవ్యమైన డాలర్లను పొంది మనతో బాటు తీసుకువెళ్ళాలి. ఆ డాలర్ల ద్వారానే మనం అక్కడ ఖర్చులు చేయగలం.   


యిలా అమెరికా ఒక్కటే కదా ఏ దేశానికి వెళ్ళాలన్నా మన ద్రవ్యాన్ని బ్యాంకుల ద్వారా ఆదేశపు ద్రవ్యంగా మార్పిడి చేసి మనతోబాటు తీసుకొని వెళ్ళాలి. 


మన భౌతిక ప్రపంచ ప్రయాణానికే యిన్ని సన్నాహాలు చేస్తున్నప్పుడు మనం మళ్ళీ తిరిగిరాని ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు మన సంపదలను మార్పిడి చేసి తీసుకొని వెళ్ళగలం కదా. 


మనం చనిపోయిన తర్వాత మనతోబాటు మన సంపదలను స్వర్గానికి తీసుకొని వెళ్ళడానికి ఒకటే మార్గం వాటిని స్వర్గలోకానికి తగ్గట్టు మార్పిడి చేయడమే. 


మన సంపదలతో భూలోకంలో దానధర్మాలు గాని , అభ్యాగతులను ఆదుకోవడం గాని , మానవ సమాజ శ్రేయస్సు నిమిత్తం వెచ్చించడంలాంటి కార్యక్రమాలలో పూనుకున్నట్లయితే మన ఖాతాలో పుణ్యం జమకాగలదు. యిలా ఎన్ని కార్యక్రమాలు చేపట్టినట్లయితే అంత పుణ్యం మన ఖాతాలో అలాఅలా పేరుకుపోగలదు. మన సంపదనంతా వెచ్చించి ఎంత పుణ్యం సంపాదించగలమో అవే మనకు మనతోబాటు రాగలవు. అలాంటి పుణ్యాలే మన తదనంతర గమ్యానికి దారిచూపగలవు. 


అందువలన మనం వీలైనంతవరకు ఎన్ని మానవసేవ కార్యాలను చేపట్టగలమో అవే మన స్వర్ఖలోకం చేరుకోవడానికి ద్రవ్యమార్పిడి. 


మనందరి తక్షణ కర్తవ్యం యిదే మరి.

నామాలలో ఉన్న అద్భుత మహిమ🌸

 🌸అచ్యుత, అనంత, గోవింద నామాలలో ఉన్న అద్భుత మహిమ🌸


సాధు పరిత్రాణం కొరకు,దుష్టవినాశం కొరకు, ధర్మసంస్థాపన కొరకు పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తు ఉంటానని చెప్పాడు. భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమఉంది. అందునా కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి. అట్టి విశిష్ట నామాలలో మరీ విశిష్ట నామాలు అచ్యుత, అనంత, గోవింద ఉన్నవి.


సంధ్యావందనం మెుదలుకొని ఏ వైదీక కర్మ చేసినా ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః అని ఆచమించి ఆరంభిస్తాం.


క్షీరార్ణవ మథన సమయంలో అవతరించిన మహా మహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేద వైద్య విద్యకు రాయనే ప్రధమ స్థానం.


*🌹అచ్యుతానంత గోవింద*

*నామెాచ్ఛారణ భేషజాత్*

*నశ్యంతి సకలారోగాః*

*సత్యం సత్యం వదామ్యహ "".*


ఈ నామాలను పలకటం అనే మందు చేత సర్వరోగాలు నశించి తీరుతాయి. ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను". ఇలా రెండు మార్లు సత్యం అని చెప్పటం ద్వారా శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్న మాట. వైద్యవిద్యా గురువైన ధన్వంతరి వచనం కంటే ఇంకొక ప్రమాణం అవసరమా" !.ఇది పరమ ప్రమాణం. పద్మపురాణంలో ఈ నామ

మహిమ మిక్కలి గొప్పగా వర్ణించబడింది.


పార్వతీదేవి అడుగగా శంకరులవారు శ్రీమన్నారయణుని లీలలను వివరిస్తుా, కుార్మావతార సందర్భంలో క్షీరసాగరమథన గాథ వినిపిస్తుా ఇలా అన్నారు. పార్వతీ! పాలకడలిలో లక్ష్మీ దేవి అవతరించింది. దేవతలు, మునులు లక్ష్మీనారాయణుని స్తుతింస్తున్నారు. ఆ సందర్భంలోనే భయంక రమైన హాలాహలం పాలకడలి నుంచి ఉద్భవించింది.ఆ హాలాహలం చుాసి దేవతలు ,దానవులు భయపడి తలో దిక్కుకి పారిపోయారు. పారిపోతున్న దేవతలను, దానవులను ఆపి, భయపడవద్దని చెప్పి, ఆ కాలకుాటాన్ని నేను మ్రింగుతానని ధైర్యం చెప్పాను. అందరుా నా పాదాలపై బడి నన్ను పుాజించి స్తుతించసాగారు. అపుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వదుఃఖహరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకుని ఆయన నామాల్లో ప్రధానమైన ముాడు నామాల్ని -- అచ్యుత, అనంత, గోవింద అన్న మహా ముాడు మంత్రాల్ని స్మరించుకుంటుా ఆ మహా భయంకరమైన కాలకుాట విషాన్ని త్రాగివేశాను. సర్వవ్యాపి అయిన విష్ణుభగవానుని యెుక్క ఆ నామత్రయం యెుక్క మహిమ వల్ల సర్వలోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా త్రాగేశాను. ఆ విషం నన్నేమి చెయ్యలేక పోయింది.


కనుక ఈ మంత్రములతో ఆచమించేటపుడు

ఈ మహిమంతా జ్ఞాపకముంచుకుని, విశ్వాసం పెంచుకుని అందరుా భగవత్ కృపకు పాత్రులగుదురు గాక !.


ఓం నమో భగవతే వాసుదేవాయ

(సేకరణ)

ప్ర:శుభకార్యం జరిగిన

 ప్ర:శుభకార్యం జరిగిన ఇంట్లోని వారు అశుభం జరిగిన వారి ఇంటికి పరామర్శకు వెళ్లరాదా?


జ:వివాహమైన పదహారు రోజులలోపు కంకణం కట్టుకున్నవారు ఎటువంటి అశుభకార్యాలకు వెళ్లరాదని శాస్త్రం. పదహారు రోజులు దాటితే ఈ నియమం వర్తించదు.


కన్యాదానం చేసినవారు,కన్యను స్వీకరించిన వారు ఆరు నెలల వరకు పరామర్శకు వెళ్లరాదని లోకవ్యవహారం కలదు. కానీ సొంత అన్నదమ్ములు అంటే జ్ఞాతులు, అక్కాచెల్లెళ్లు, మేన మామలు, మేనత్తలు అయినప్పుడు వారికి సూతకం ఉంటుంది. కావున వెళ్లి తీరాలి.


 సానుభూతికి, సంతాపానికి, పరామర్శకు, ఓదార్పుకు ఏ నియమాలు వర్తించవు. హృదయం ఉన్నవారు కష్టం వచ్చిన వారిని ఓదార్చడం కనీస ధర్మం. శుభకార్యం జరిగిందన్న సాకుతో ఆప్తులను, రక్తసంబంధం కలవారిని పరామర్శించక పోవడం సమంజసం కాదు. ఇది తప్పించుకోవడమే తప్ప ఆచారం కాదు.

మొగలిచెర్ల-- ఆఖరి ప్రయత్నం

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..


*ఆఖరి ప్రయత్నం.. బోధ..పర్యవసానం..*


*(అరవై వ రోజు)*


తాను కబురు పెట్టేదాకా ఆశ్రమానికి రావొద్దని శ్రీధరరావు దంపతుల తో శ్రీ స్వామివారు చెప్పిన తరువాత..శ్రీ స్వామివారు కఠోర తపస్సు చేయనారంభించారు..ఆహారం దాదాపుగా విసర్జించారు..ఏ రెండు మూడు రోజులకో ఒకసారి కొద్దిగా ఆహారాన్ని స్వీకరిస్తూ తిరిగి తపస్సు లోకి వెళ్లిపోయేవారు..ఏప్రిల్ నెల 1976 వ సంవత్సరం..చివరి వారం లో ఒకసారి శ్రీధరరావు గారిని రమ్మని కబురు పంపించారు..


అంతకుముందు శ్రీ స్వామివారు తనకు దోసకాయలు కావాలని అడిగిన విషయం గుర్తుకువచ్చి ప్రభావతి గారు దోసకాయల కోసం మొగలిచెర్ల అంతా వాకబు చేశారు..చిత్రంగా ఆ ఊర్లో ఒక్క దోసకాయా దొరకలేదు..సరే..ప్రాప్తంలేదు..ఆమాటే చెపుదాము అని శ్రీధరరావు గారు అనుకోని..గూడు బండి ఎక్కబోతున్నారు..ఇంతలో నెత్తిన గంప పెట్టుకొని ఒక ఆడమనిషి నేరుగా వచ్చింది..తాను లింగసముద్రం నుంచి వస్తున్నాననీ..దోసకాయలు అమ్మడానికి తెచ్చాననీ..చెప్పి..కొన్ని మంచి కాయలను తానే ఏరి..చేతికిచ్చింది..శ్రీధరరావు గారు ఆశ్చర్యపోతూ..వాటిని తీసుకొని బండి తోలే బాలయ్య చేతికిచ్చి..బండిలో పెట్టించారు..


ఆరోజు శ్రీధరరావు గారు ప్రభావతి గార్లు ఆశ్రమానికి చేరేసరికి..శ్రీ స్వామివారు అత్యంత ఉత్సాహంగా వున్నారు..వీళ్ళను చూడగానే.."రండి!..రండి!!..మీ కోసమే ఎదురు చూస్తున్నాను.." అన్నారు..


"అమ్మా..శ్రద్ధగా వినండి..కేవలం కొద్దీ రోజులు మాత్రమే మిగిలివుంది..మీకు మళ్లీ మళ్లీ బోధ చేసేవారు ఇంకొకరు లభ్యం కావడం దుర్లభం..నేను చెప్పే మాటలు ఆకళింపు చేసుకోండి..నా తపస్సుకు మీరు ఎంతగానో సహకరించారు..నేను చేసిన ఈ సాధన ఫలించే రోజు దగ్గరలోనే ఉంది..ఈ ఆశ్రమానికి ఉత్తరాధికారం మీ చేతుల్లోనే ఉండబోతోంది..క్షేత్రంగా మారుతుంది.."


"అపార జ్ఞానానికి ప్రతీకలు అవధూతలు..వారి సహచర్యమూ సేవా అత్యంత పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయి..నిరంతరం తనను తాను శోధించుకుంటూ..దైవదత్తమైన జ్ఞానాన్ని నలుగురికీ పంచుతూ..తనను తాను ఉద్ధరించుకుంటూ..తన చుట్టూ వున్న సంఘాన్ని కూడా ఉద్ధరించేవాడే అవధూత..శ్రీధరరావు గారూ మీరు ఒకటి రెండుసార్లు..నాగురించి ప్రస్తావిస్తూ.."బాలోన్మత్త పిశాచ వేషాయ.." అన్నారు..పైకి పిచ్చి వాడిలా..పసిపిల్లల చేష్టలతో..శుచీ శుభ్రత లేని వారిలా ప్రవర్తించినా..వారి ప్రతి చర్యలోనూ ఒక పరమార్ధం దాగివుంటుంది..అవధూత అనగానే..పిచ్చివాడు..మద్యం మాంసం స్వీకరిస్తూ వుండేవాడు అనుకోవడం ఒక అపోహ మాత్రమే..అలా ఉన్న వాళ్ళందరూ అవధూతలు కారు..అవధూత మూర్తీభవించిన జ్ఞాన స్వరూపం అని గుర్తించండి..పొట్టకూటికోసం గారడీలు  చేసేవాడినో..మాటలతో కోటలు కట్టేవారినో ఆశ్రయించి..విలువైన సమయాన్ని..ధనాన్ని కోల్పోతారు కొందరు..వాళ్ళ అజ్ఞానం వల్ల..అవతలివాడు సుఖాలు పొందుతారే కానీ..వీళ్లకు ఒరిగేదేమీ లేదు.."


"గృహస్థులు మీరు..ఎన్నో బాధ్యతలుంటాయి..కొన్ని కష్టాలుంటాయి..కొన్ని సుఖాలూ వెంటనే ఉంటాయి..సమదృష్టి తో చూడండి..బండి చక్రం లోని ఆకుల వలె.. ఒకటి పైకి వచ్చిన తరువాత..మరొకటి క్రింద ఉంటుంది..మళ్లీ కొద్దిసేపటికే పరిస్థితి తారుమారు అవుతుంది..సంసారపు ప్రయాణం సాగుతూ ఉంటుంది..ఎటువంటి పరిస్థితులలోనూ సంయమనం పాటించండి!..మీరు చేసిన ఈ సేవ ఫలితం ఊరికే మాత్రం పోదు!..మీరు ఎందరో పండితులను నా వద్దకు తీసుకువచ్చారు..కొందరు నా పాండిత్యాన్ని పరీక్షించారు..మరికొందరు నాలోని వేదాంత సారాన్ని వెలికితీయాలని భావించారు..నాకున్న ఈ పాండిత్యం కానీ..మరోటి కానీ..అన్నీ ఆ దత్తుడి అనుగ్రహం తోనే వచ్చాయి..మరో విధంగా రాలేదు.."


"నేనే కాదు..ఏ సాధకుడైనా ఎక్కువ మౌనాన్ని ఆశ్రయిస్తాము..మౌనమే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది..క్లుప్తంగా మాట్లాడటం సాధన లోని మొదటి మెట్టు అయితే..సంపూర్ణ మౌనం చివరి మెట్టు..అవసరం ఉన్నంతవరకే వాక్కును ఉపయోగించాలి..నిర్మోహత్వం నుంచి నిశ్చలస్థితి..అక్కడినుంచి జీవన్ముక్తి పొందుతామని ఆది శంకరులు చెప్పింది తెలుసుకదా..అక్షర సత్యమది.."


అద్భుతమైన కంఠస్వరంతో శ్రీ స్వామివారు చేస్తున్న బోధను.. పరిసరాలు మర్చిపోయి విన్నారా దంపతులు..తమకు ఈ బోధ చేయడానికి పిలిపించారని అర్ధమయింది వాళ్లకు..ఇక ఈ యోగిపుంగవుడు ఎక్కువ కాలం తమతో కలిసివుండడు అని రూఢీ అయిపోయింది..మనసు స్థిర పరచడానికే ఈరోజు శ్రీ స్వామివారు ఇలా బోధ చేశారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు.."నాయనా!..మీ నిర్ణయం లో మార్పు లేదా?.." అని చివరిగా అడిగారు..


"లేదమ్మా!..లేదు!..నాకు సమయం ముంచుకొస్తున్నది..మీరు వ్యాకులపడొద్దు..శ్రీధరరావు గారూ మరో నాలుగు రోజుల తరువాత ఇక్కడికి రండి..మీతో కొన్ని విషయాలు చెప్పాలి.." అన్నారు..


ఆ దంపతుల అంతరంగంలో ఇంతకుముందు ఉన్నంత భారం ఇప్పుడు లేదు..మనసంతా తేలిక గా ఉంది..ఆ మార్పు ఆ దంపతులకు తెలిసివచ్చింది..శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకొని తిరిగి ఇంటికి వచ్చేసారు..


అంతుపట్టని అంతరంగం..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

చరక సంహిత ఒక పరిశీలన

చరక సంహిత ఒక పరిశీలన 

దైవానుగ్రము వలన ఇటీవల నేను  అగ్నివేశ మహర్షి కృతము, చరక ప్రతి సంస్కృతము అయినట్టి చరక సంహిత అను ఆయుర్వేద గ్రంథ రాజమును తిలకించ తటస్తించింది. ఇదే నాకు మునుపు లభించిన ఈ సరికి ఆ గ్రంథ పఠనము, అవగాహనను కలిగి వుండేడి వాడను. నేను చూసిన కొంత మటుకు అందరితో పంచుకొన తలంచి ఇది లిఖించుచున్నాను. 

మన మహర్షుల మేథా శక్తిని మనం యెంత స్తుతించినా తక్కువే అవుతుంది. సంస్కృత భాషలోని మూల ప్రతిని తెలుగులో సర్వులకు అర్ధమగు రీతిలో బ్రహ్మ శ్రీ పండిత నుదురుపాటి విశ్వనాధ శాస్త్రి గారు అనువాకము చేసినారు. వారు ఈ గ్రంథ పరిచయము గూర్చి విఫులముగా 13 పేజీల ఉపోధ్గాతాము వ్రాయటం విశేషము.  అందు గ్రంథ పరిచయం చేయుటయే కాక విశేషించి ఆయుర్వేద శాస్త్రము ఈ భువిపైకి వచ్చిన, తెచ్చిన వైనం దాని పరిణామ క్రమము నిశిత విశ్లేషణ గావించినారనుటలో అతిశయోక్తి లేదు. 

స్వర్గ లోకమున ఇంద్రునికడ యున్న ఆయుర్వేద శాస్త్రమును భూలోకమునందు మానవాళికి చేతుర్విధ పురుషార్ధముల సాధనకు శరీరారోగ్యము కాపాడుకొనుటకు ఆయుర్వేదము దక్క వేరొండువడి లేదని తలంచి అంగీరసుడు, జమదగ్ని, వసిష్ఠుడు, మొన్నగు దేవ, బ్రహ్మ ఋషివర్యులు నొక సభ యొనర్చి స్వర్గమున నున్న ఇంద్రుని నుంచి ఇలకు తే సమర్థునిగా భరద్వాజ మహర్షిని పంప  తా వెళ్లి సహస్రాక్షుని వేడ ఆ శతక్రతువు మహర్షి ప్రతిభా విశేషములను గ్రహించి హేతు, లక్షణ, ఔషధ స్కంద త్రయాత్మకనైనట్టి  అద్దానిని ఉపదేశించుటయు జరుగగా  భరద్వాజ మహర్షి ఆయుర్వేద సుశిక్షితుడై భువికి వచ్చెను. దానిని అమ్మహర్షి అంగిరసాది ఋషులకు సమర్మముగా ఉపదేశించ అద్దానిని అనుసరించి ఋషులు తమ ఆరోగ్యములను కాపాడుకొనుచు తమ తమ తపస్సులకు అంతరాయము కలుగక దీర్గాయువు నొందిరి. 

అట్టి తరి తపోధనుడైన యాత్రేయుడు అద్దానిని భూలోకమున బహుళ వ్యాపకమొనరింప అగ్నివేశుడు, ఖేలుడు, జాతకర్ణుడు, పరాశరుడు, హారీతుడు, క్షార పాణి అను నలుగురు శిస్యులకు సాంగముగా నుపదేశించెను. కాగా వారు నల్గురు వారి వారి పేర్ల వేరు వేరు తంత్రముల రచించిరి. తొట్ట తొలుతగా అగ్నివేశుడు అగ్నివేశతంత్రము యను ఆయుర్వేద తంత్రమును రచించెను. నయ్యది నూట ఇరువది అధ్యాయముల పరిమితిలో నుండెను. ఆ తంతంత్రమున " ఇత్యాధ్యయ శతం వింశమ్ ఆత్రేయ ముని వాగ్మయం హితార్థం ప్రాణినాం ప్రోక్తం అగ్ని వేసేన న ధీమతః " అని చెప్పబడినది. అగ్నివేశ కృతమైనట్టి ఆయుర్వేదమును చెరకుడు పునరసంస్కారము చేసెను.  అట్టిదే చెరక సంహిత. కాగా కాలాంతరమున పతంజలి మహర్షి అద్దానిని పునసంస్కారమొనర్చినట్లు చరక వాక్యత యగు చెక్రపాణి వ్యాఖ్యాన ఆరంభమున నాంది శ్లోకమున నుడివినట్లు తెలియుచున్నది. 

ఇవ్విధముగా వివరణలిస్తూ వ్యాఖ్యాత 13 పేజీల విశేష విశ్లేషణాత్మక వివరణలు సోదాహరణగా ఆయుర్వేద శాస్త్ర యుత్పత్తి గూర్చి వివరించి వున్నారు. 

ఈ గ్రంధము 1481 పేజీల నిడివి కలిగి యున్నది. అంతేకాదు అనేక రోగ విశేషములు తత్ నివారణలు తెలుపు తంత్రముల విషయ సూచిక 34 పేజీల నిడివి కలిగి ఉన్నదన్న ఈ గ్రంధములో ఎన్ని రోగ విశేషములు, తత్ నివారణ తంత్రములు ఉన్నవో చెప్పకనే చెప్పుచున్నవి. 

ఈ ప్రాచీన గ్రంథ రాజమును  బ్రహ్మ శ్రీ పండిత నుదురుపాటి విశ్వనాధ శాస్త్రి గారు ప్రతి శ్లోకమును తత్ తాత్పర్యమును అత్యంత నిశితముగా పేర్కొన్నారనుట ఈ గ్రంధము చదివిన వారనక మానరు. 

ఆనతి కాలములోనే ఈ గ్రంథ పఠన మొనర్చి సర్వులకు ఆ గ్రంథ గందమును పంచ ప్రయత్నించెదను. తత్ ద్వారా అనేక రోగముల బాపు తంత్రములను తెలియ చేయ మనస్సువిళ్లూరుతున్నది 

ఇట్లు 

బుధ జన విధేయుడు 

భార్గవ శర్మ 


వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 8 🌹*

 *🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 8 🌹* 

 📚. ప్రసాద్ భరద్వాజ


పంచభూతాల కలయికతోనే ”నేను” అనే భావన ఏర్పడుతుంది. ఈ సమస్త చరాచర ప్రకృతిని అర్ధం చేసుకునేందుకు మనకు చెవి, కన్ను, ముక్కు వంటి జ్ఞానేంద్రియాల వల్ల సాధ్యమౌతుంది. 


వీటి ద్వారా వివిధ రకాల పద్ధతులు, మార్గాల ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం. అయితే వీటన్నిటినీ సమగ్రంగా అర్ధం చేసుకోడానికి ఉపయోగపడే తత్వమే నేను లేదా అహం. మనం సంపాదించే విషయ పరిజ్ఞానాన్ని మొత్తాన్ని మన మేధస్సు కు ఆర్దమవడానికి కారణం తత్వమే.


ఈ పంచాంశాల వల్ల కామ, క్రోధ, మోహాలు కలుగుతాయి.ఇవి ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు ఆ జీవుడు లేదా బుద్ధి ఆ దిశగా చలిస్తూ ఉంటుంది. ఆత్మ అనేది నిమిత్తమాత్రంగా ఉంటూ అన్నిటినీ గమనిస్తూ ఉంటుంది.


ఏది మంచిదో, ఏది చెడ్డదో చెప్పడం వరకే దాని బాధ్యత. అంతే కానీ తప్పనిసరిగా ‘నువ్వు ఈ దిశలో వెళ్ళు’ అని ఆదేశించదు. ఆ విషయం బుద్ధి అధీనంలో ఉంటుంది. బుద్ధి, కర్మ అధీనంలో ప్రవర్తిస్తుంది. అందుకే ”బుద్ధీ కర్మానుసారిణీ” అని పెద్దలు చెప్తారు.


భౌతికంగా ఎంతటి గోప్పవాడయినా కర్మ నుండి తప్పించుకోలేదు. శ్రీకృష్ణుడు అంతటి మహాయోగి చివరికి ఒక బోయవాని బాణపు దెబ్బకు అడవిలో మరణించాడు. 


ఈ విషయాన్ని ఎవరు గ్రహిస్తారో, పరబ్రహ్మను ఎవరు ధ్యానిస్తారో వార్కికి దుఃఖం తగ్గుతుంది” – అని తల్లి౮కి వివరించాదు


వీరబ్రహ్మేంద్రస్వామి. తర్వాత ఈ జనన మరణ చక్రాన్ని శాస్వతంగా వీడిపోయేందుకు, మోక్షాన్ని సాధించేందుకు పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గం అని చెప్పాడు పోతులూరి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

మహాసౌరం అణువు

 మహాసౌరం  అణువు  దాని వ్యాప్తిని, లక్షణము, గురించి సప్త వ్యాహృతులలో 4 ప్రధానమైనవిగా తెలుపుచున్నవి.అవి ప్రత్యక్షంగా శక్తిని ప్రకృతిని నుండి గ్రహించవలెనని తెలుపుచున్నవి. *సు కేషు మే హరి మ అణం, *హరి మ అణం చ న ఆశయః *, హరిమాణం ని దథ్ మ అసి, *రో పణ క సు దథ్ మ అసి,* దధిక్రావ ణ్ణో అకారిషం*జిష్ణోః విశ్వ్యస్య వాజినః* జీన్ విష్ణు తత్వము. అణువు యెుక్క వ్యాప్తం, పాలు పెరుగు అయ్యే లక్షణమనే సూత్రము ఏలాగునో అట్టి సూత్రమే అణు రూపమైన విష్ణు వ్యాప్తమని తెలుపుచున్నది.పాలు ఎన్నైనా వక చుక్క పెరుగు వలన మెుత్తం పెరుగు లక్షణముగా మారు చున్నది.పాల లక్షణము ముందు వక రకంగా, పెరుగుగా మారిన వేరు లక్షణముగా, తెలియుచున్నది. అదే శక్తి యెుక్క విశ్వ శక్తి వ్యాప్తిని కూడా ముందు విషు లక్షణము కలిగి ఆపై జీవ లక్షణముగా మార్పు ద్వారా తెలియుచున్నది.పాలల్లో పెరుగు వుంది అని చెబితే, దానిలో పెరుగు తత్వం ఎలా  తెలియదో విషు యనే కాంతిని కూడా అదే సూత్రమని తెలుయుట. విష్ణు తత్వం విశ్వ వ్యాప్తంగా మారి ఆత్మగా మారు చున్నది.పై సూత్రమే ఆత్మ లక్షణము  దేహము గల జీవుడుగా మారుట. అంతకు ముందు పాల వలె మాత్రమే వున్నది. తరువాత పెరుగు తత్వం. పై సూత్రము ద్వారా 

హరి తత్వమే అణువుగా తెలియుచున్నది.సమస్త వస్తు తత్వ వ్యాప్తికి మూలం శక్తియని గ్రహించవలెను. దీనికి  కారణము *అదృశ్యం అస్య కేతవోవిః అశ్మయెూ జనాగ్ం అణు.* అనే సూత్రంలో కూడా జీవ అణు లక్షణము కేతు శక్తియని, అది విష్ణు తత్వమని స్పష్టంగా తెలుపుచున్నది.పదార్ధ వ్యాప్తమైన గాని శక్తి యెుక్క వస్తు తత్వం తెలియనట్లు, శక్తి లక్షణము కూడా  విష్ణువుయెుక్క  అనంతమైన శక్తి వ్యాప్తి వలననే తెలియును. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

నానా పటేకర్-- చేదు నిజాలు

 *నానా పటేకర్ పేల్చిన రాజకీయ తూటాలు*


*బోల్ ఇండియా బోల్ - చేదు నిజాలు*


రైతులు పొలంలో - రైతుల కొడుకులు సైన్యంలో మరణిస్తారు,

కానీ

నాయకులు దేశంలో, వారి సంతానం విదేశాల్లో, సౌఖ్యాలు పొందుతారు.


*చేదు నిజం ఏమంటే*, ఈ దేశ వాసులమైన మనం ఇక్కడ  పి.హెచ్.డి, గ్రాడ్యుయేషన్,  మెడిసిన్, ఇంజనీరింగ్ చదివిన వాళ్లం,

టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకు ఓటు వేసి, నేతలుగా ఎన్నుకొని, వారి నుండి మన బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటుంటాం. *ఆలోచించండి*.


రాజకీయ నేతలు కావాలనుకొనే వాళ్ళు ఐదు సంవత్సరాలు సైన్యంలో ఖచ్చితంగా పనిచేసి  తీరాలన్న నిబంధన పెడితే,

దేశంలో 80 శాతం ఉత్పాతాలు (దరిద్రాలు) వాటంతట అవే సర్దుకుంటాయి.


ఏ రోజు ప్రత్యర్థిపై దాడుల్లో నాయకులు ఛస్తారో

నేతల పంటలకు అగ్గి తగులుతుందో ఆరోజు నుంచే దేశంలో రాజకీయ దాడి- ప్రతి దాడులు అదృశ్యమవుతాయి.


*25 - 30 సంవత్సరాల పాటు ఉద్యోగాలు  చేసిన వాళ్లకు పెన్షన్ఉండదు*.

కానీ,

ఐదేళ్లు రాజకీయ నేతగా పదవి వెలగబెడితే మాత్రం *జీవితాంతం పెన్షన్, ఇతర సదుపాయాలు* ఇస్తున్నారు.

ఇలా ఎందుకు ఇవ్వాలి? 


నాయకులపైకి చెప్పులో, కోడి గుడ్లో, నల్ల సిరానో, విసిరితే ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేస్తారు.

కానీ,

భారతీయ సైన్యం పై రాళ్ల దాడి చేసే వాళ్లకు మాత్రం మినహాయింపు ఇస్తారు. ఎందుకు?


రైతుల సరుకుల వాహనాలపై తోలు వలిచి టోల్ వసూలు చేస్తున్నారు.

కాని,

మంత్రి మహాశయుల వాహనాలకు అదేమీ ఉండదు.

*రైతు తినేది దొంగ సొమ్మా?*

 *నేతలు తినేది కష్టార్జితమా?* ఇదేమి న్యాయం.


*విద్యలో రాజకీయం 100%*

*రాజకీయంలో విద్య 00%*

ఆహా ఎంత గొప్ప విధానం మన ఈ దేశంలో.

ఇందుకేనేమో *రాజకీయం అంతా చెత్త తో నిండిపోయింది*.


దేశంలోని ప్రతిభావంతులేమో

వలస పక్షులు అవుతున్నారు.


దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, ధర్మాసుపత్రుల్లో పరిస్థితులు మారాలంటే, నేతల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి -

వారి రోగాలకు చికిత్సలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి.

అప్పుడే పరిస్థితులలో మార్పు చూస్తాం.


*₹399 కి అపరిమిత కాల్స్* డేటా దొరుకుతుంటే ప్రజాప్రతినిధులకు నెలసరి *₹15000 టెలిఫోన్ బత్తా ఎందుకు?*


*ప్రజల చర్మం వలిచి పన్నులు వసూలు చేసే కోట్ల రూపాయలను ఇలా వృధాగా ఖర్చుచేయడం అవసరమా?*7

అందరూ ఆలోచించాలి. 


దయచేసి మన దేశంలోని ఇలాంటి *దరిద్ర వ్యవస్థ* గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయండి. 

            Nana pateker

చికిత్సా పద్ధతులు - గండూషము

 అయుర్వేదము నందలి మరికొన్ని చికిత్సా పద్ధతులు  - 


*  గండూషము  - 


     ఏదేని వస్తువులను నానబెట్టిన జలముతో పుక్కిలించుట  . 


 *  వస్తి శోధనము  - 


     నాళము ద్వారా జలమును గుదస్థానము నందు ప్రవేశింపచేసి మలశోధనము చేయుట . ఇందువలన మలకోశము శుద్ది అగును.  పొత్తికడుపు పలచన అగును. ఇది హఠయోగుల యొక్క షట్కర్మములలో ఒకటై ఉన్నది . ఆంగ్లము నందు దీనికి "ఎనిమా " అని పేరుతో పిలుస్తారు . 


 *  నాళికా శోధనము  - 


      చిమ్మనగ్రోవి ( సన్నటి పైప్ ) ద్వారా జలమును యోనిస్థానము , కర్ణ రంధ్రము యందు ప్రవేశింపచేసి మలినమును వెలికిదీసి శుద్ధిచేయుట . ఇది వస్తి శోధనము యందలి ఒకరకం . దీనికి వస్తిపీడనము అనే పేరుతో వ్యవహరిస్తారు . 


 *  ముఖనిక్షిప్తము  - 


       అతిమధురం , కరక్కాయ బెరడు మొదలగు వస్తువులను పుక్కిట యందు ఉంచుకుని ఆ రసమును మింగుట . 


 *  నిబంధనము  - 


        గడ్డలు మొదలగు వానికి బియ్యపు పిండి లేక మూలికలు ఉడకబెట్టి కట్టుట . 


 *  బంధము  - 


       గాయములు కలిగినపుడు లేక అవయవములు స్థానము తప్పినను విరిగినను బద్ధపెట్టి కట్టుట . దీనిని ఆంగ్లము యందు "బ్యాండేజి " అని పిలుస్తారు . 


 *  మర్దనము  - 


       తైలాదులను వ్యాధి గల స్థలము నందు లేపనము చేసి చేతితో పట్టుట . 


 *  తాపనము  - 


        వ్యాధి బాధ కలిగినచోట ఇసుక , తవుడు ఆకులు  మొదలైన వానిని వేయించి గుడ్డలో మూటకట్టి గాని లేక వేడినీళ్లను గాజు పాత్ర యందు ఉంచి కాపడం పెట్టటం . 


 *  లేపనము  -  


         తలనొప్పి , గడ్డ మొదలగు వానికి పట్టు వేయుట . పంచకర్మలలో స్నేహన పద్దతి దీనిలోకి వచ్చును. 


 *  అభ్యంగనము  - 


        తైలము , మూలికల రసము , జంబీర ఫల రసము ఇత్యాది స్నేహ వస్తువును తలకు వాడుకొని స్నానము చేయుట . 


          తరవాతి పోస్టులో ఆయుర్వేదము నందు ఉపయోగించు ఔషధాలలోని రకాల గురించి వివరిస్తాను . 


   


   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి.  పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

హిందూ ధర్మం

 ▼

హిందూ ధర్మం అంటే ఏమిటి? నేను హిందువుని ఎందుకు అయ్యాను?


మిగిలిన మతాలవలే కాకుండా, హిందు ధర్మం స్వర్గం/నరకం అనే మూఢ విశ్వాసం మీద ఆధారపడిలేదు. కొన్ని మూఢవిశ్వాసాలను ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మమని చెప్పేది కాదు హిందు ధర్మం ! హిందు ధర్మం దేనిని గుడ్డిగా నమ్మమని చెప్పదు, దేనిలో అయినా సత్యాన్ని పరిశోధించి తెలుసుకోమని బోధిస్తుంది. ఈ ప్రపంచంతరువాత స్వర్గం/నరకం అనేవి లేవు. కేవలం మన కర్మలే జీవితాన్ని స్వర్గం/నరకం అయ్యేలా చేస్తాయి.


హిందువు యొక్క ధర్మం ఏమిటంటే ప్రకృతిని, చుట్టూ ఉండే తోటి ప్రాణులను కాపాడడం !ఈ ప్రపంచంలో చెడు అనేది ఏమి లేదు, అంతా దైవత్వమే ! మన శరీరంలానే ఈ విశ్వం కూడా పంచభూతాలతో సృష్టింపబడినది. అంటే మన శరీరం కూడా చిన్న విశ్వంలాంటిదే! మన లోపల ఎలాగైతే తెలివి, జ్ఞానం, ఆత్మ ఉంటాయో అలానే ఈ విశ్వం లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు !


దేవుడు అనేవాడు ఒక వ్యక్తి/జీవం కాదు. దేవుడు అంటే పవిత్రమైన, అనంతమైన శక్తి. శివుదు(పరమాత్మ), గౌరీ మాత( శక్తి) కలయిక వలనే ఈ విశ్వం సృష్టిపబడుతూ ఉంటుంది. పరమాత్మను తెలుసుకుని మన ఆత్మను ఐక్యం చేయడమే ఆత్మ సాక్షాత్కారం ! అదే మన జీవిత గమ్యం మరియు ఇదే సులభమైన/ఉత్తమమైన మార్గం !


హిందు ధర్మం లొ శాస్త్రీయత/విజ్ఞానం ఉంది ! హిందు ధర్మం ద్వారా మీకు సత్యం తెలుసుకోవాలని లేకపోతే ఇతరులను బాధపెట్టకుండా మీకు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. దానినే ధర్మం అంటారు. 


మతం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది ఎందుకంటే అది మూఢ విశ్వాసలపై ఆధారపడి ఉంటుంది.


ధర్మం ప్రపంచాన్ని కాపాడుతుంది ఎందుకంటే అది జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది.


హిందు ధర్మం లోకి అందరికి స్వాగతం: సత్యాన్ని పరమాత్మను తెలుసుకోండి !


" లొకా సమస్తా సుఖినో భవంతు !"