31, మార్చి 2022, గురువారం

పాదాభివందనం

 * పాదాభివందనం :-  "భారతీయ  సాంప్రదాయము"

"జ్ఞాన వృద్ధులైన వారి పాదాలకు, మనకంటే పెద్ద వారి పాదాలకు చేసే నమస్కారమే "పాదాభివందనం".


అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవినః !

చత్వారితస్యవర్ధంతే ఆయుర్విధ్యా యశోబలం !!


అంటే వయసువల్ల కాని , విద్యవల్ల కాని అధికులైనవారికి ఎదురుగా వెళ్ళి నమస్కరిస్తే , మనకి ఆయువు, విద్య, కీర్తి, బలం, ఐశ్వార్యాభివృద్ధి లభిస్తాయని మనుధర్మశాస్త్రంలో మనువు చెప్పిన మాట ఇది.


'నమస్కారం' మన సంస్కారానికి చక్కని పురస్కారం. ఇక యోగభ్యాసంలో మొదటి భంగిమ "నమస్తే." వినయానికి ప్రతీక నమస్తే. రెండు చేతులు జోడించి నమస్తే చెప్పడం మంచిది. 'నమస్తే ' భార్య భర్తల ఆదర్శ దాంపత్యానికి కూడా ప్రతీకగా నిలిచే విధంగా "పాణిగ్రహణం " చేయిస్తున్నాము. దీనినే "కరచాలనం" అని కొందరంటారు."కరచాలనం" ఒక విధమైన నమస్కార పద్ధతి. కరచాలనం భారతీయ సంస్కృతికి సంబంధించినది కాకపోయినా, అతి సులువుగా, సౌకర్యాంతంగా చేసే నమస్కారంగా, మన జీవితంలో భాగమయిపోయింది. అయితే, పెద్దలకు, గురువులకు "ఏకహస్తాభివందనం" చెయ్యకూడదని హితవచనం. 


ఇటువంటి వారికి కరచాలనం చేసే సంధర్భం వచ్చినపుడు, వారి చేతులను , మన రెండు చేతులలోకి తీసుకొని, నమస్కరించడం ఉత్తమం. అయితే, అసలు శరీరంలో ఏ ఇతర అవయవాలకీ కాకుండా కేవలం పాదాలకు మాత్రమే ఎందుకు నమస్కరించాలి? అన్న విషయానికి వస్తే, యోగులలోను, మహాత్ములలోను, మన మంచిని కోరే పెద్దలలోను అభివృద్ధిని కోరే సద్గుణం ఉంటుంది. 


అటువంటి సాత్వికాభివృద్ధి యొక్క భావనాశక్తి, వారి శరీరంలో ప్రవహించి, వారి అరచేతులలోనూ, పాదాలలోను నిలిచి ఉంటుంది. అందుకే వారి పాదాలకు నమస్కరిస్తే, 

తమ అరచేయిని మన శిరస్సుపై ఉంచి ఆశీర్వదిస్తే , వారి సాత్విక శక్తి మనలో ప్రవేశించి, మనకు ప్రతిస్పందన కలుగుతుంది. ఇది అనుభవించిన వారికి తెలుస్తుంది.!

బంధువు

 🌸🕉️ *సుభాషితమ్* 🕉️🌸


శ్లో.

*ఉత్సవే వ్యసనే చైవ దుర్భిక్షే శత్రునిగ్రహే౹*

*రాజద్వారే శ్మశానే చ య స్తిష్ఠతి స బాన్ధవః॥*


తా.

ఉత్సవాల సమయంలోను, *కష్టాలు వచ్చినప్పుడు, దుర్భిక్షంలోను*, శత్రువులతో విరోధం వచ్చినప్పుడూ, రాజద్వారంలోను 

(రాజగౌరవం పొందుతున్నప్పుడు)

*శ్మశానంలోను ఎవడు విడవకుండా ఉంటాడో వాడే*

*బంధువు*.... అట్లు కానివారు నిజమైన బంధువులు కారని అర్థం...

అప్రియవాక్యం

 🌹🌹 *సుభాషితమ్* 🌹🌹

---------------------------------------------


శ్లోకం:

*అప్రియముక్తాః పురుషాః ప్రయతస్తే ద్విగుణమప్రియం వక్తుమ్।*

*తస్మాదవాచ్యమప్రియమన్యప్రియవాక్యకామేనll*

               ~సుభాషితరత్నావళి


తాత్పర్యం:

"ఎవరి విషయంలోనైనా అప్రియవాక్యం పలికితే వాళ్లు రెట్టింపు అప్రియంగా ఉండే పరుషవాక్యం పలుకుతారు. అందుచేత ఇతరుల తనతో ప్రియవాక్యాలు పలకాలని కోరుకునేవాడు తానెప్పుడూ అప్రియం పలకకూడదు".

30, మార్చి 2022, బుధవారం

పండితుడు

 🕉️ *సుభాషితమ్* 🕉️

--------------------------------------------


శ్లోకం:

*అర్థం మహాన్తమాసాద్య*

*విద్యామైశ్వర్యమేవ వాl*

*విచరత్యసమున్నద్ధః*

*యః స పణ్డిత ఉచ్యతేll*

                    ~సుభాషితరత్నావళి


తాత్పర్యం:

"చాలా ధనాన్ని, చదువునూ, అధికారాన్ని పొందికూడా మిడిసిపాటు లేకుండా సంచరించేవాడు పండితుడు అనబడతాడు".

సుభాషితమ్

 🪔 *ॐ卐_ ॐ*💎

సుభాషితమ్

శ్లో|| ధనం తావదసులభం లుబ్ధం కృచ్ఛ్రేణ రక్ష్యతే।

లబ్ధానాశో తథా మృత్యుః తస్మాదేతన్న చిన్తయేత్॥


తా|| "ధనసంపాదన చాలా కష్టము. సంపాదించిన దానిని రక్షించుట మరీ కష్టము. లభించిన ధనము పోనూవచ్చు. లేదా తానే మృతినొందవచ్చు. కావునా *ధనముగూర్చి అంతగా వ్యసనపడుట మంచిది కాదు*."

చమత్కార పద్యం

 చమత్కార పద్యం


ఇది ఒక అజ్ఞాతకవి వ్రాసిన కంద పద్యం


*అంచిత చతుర్ధ జాతుడు*

*పంచమ మార్గమున నేగి ప్రధమ తనూజన్*

*గాంచి, తృతీయం బక్కడ*

*నుంచి, ద్వితీయంబు దాటి నొప్పుగ వచ్చెన్!!*


*భావం:*

గొప్పవాడైన నాల్గవ వాని కుమారుడు ఐదవమార్గంలో వెళ్ళి మొదటికుమార్తెను చూసి, మూడవదానిని అక్కడ ఉంచి, రెండవ దానిని దాటి వచ్చెను.... 


ఏమీ అర్థం కాలేదు కదా!? ఈ పద్యం అర్థం కావాలంటే పంచ భూతాలతో అన్వయించి చెప్పుకోవాలి. పంచభూతాలు

1) భూమి

2) నీరు

3) అగ్ని

4) వాయువు

5) ఆకాశం. 


ఇప్పుడు పద్యం చాలా సులభంగా అర్థం అవుతుంది చూడండి. 

చతుర్థ జాతుడు అంటే *వాయు నందనుడు,*

 పంచమ మార్గము అంటే *ఆకాశ మార్గము,*

ప్రధమ తనూజ అంటే *భూమిపుత్రి సీత,*

 తృతీయము అంటే *అగ్ని ,*

 ద్వితీయము దాటి అంటే *సముద్రం దాటి* ఇప్పుడు భావం చూడండి.... 


*హనుమంతుడు ఆకాశమార్గాన వెళ్ళి సీతను చూసి లంకకు నిప్పు పెట్టి సముద్రం దాటివచ్చాడని భావం* 


ఇటువంటి పద్యాలే తెలుగుభాష గొప్పతనం నిలబెట్టేవి. వ్రాసిన కవికి నమస్సుమాంజలి.!!! 🙏🙏🙏

ఓ కథ

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

     *   ఓ కథ*               

పట్టుచీర కట్టించాడు తల్లికి. ‘చూశారా ఉద్యోగం వచ్చాక గాని, పెళ్ళికి గాని నాకు ఒక మంచి పట్టుచీర పెట్టనేలేదు నా కొడుకు’ అని మధనపడుతోంటే ‘పిచ్చిదానా నీకేం లోటు. నేనున్నానుగా. నీకు ఎంత ఖరీదైన చీర కావాలో చెప్పు. క్షణాల్లో తెస్తాను’ అనేవాడు మూర్తి చాలాసార్లు.


ముఖమంతా పసుపు పూసి నుదురులో నాలుగో వంతు కుంకుమ బొట్టు పెట్టారు. కళ్ళకు కాటుక పెట్టారు. పట్టుచీర అలంకరణలో దేవకి ముఖం వెలిగిపోతోంది. సుమంగళిగా వెళ్ళిపోవడం హైందవ స్త్రీలు ఎప్పుడూ కోరుకుంటూంటారు ఇందుకేనేమో. 


దేవకి ఒక్కసారి కళ్ళు తెరిస్తే చూడాలని మూర్తి మనసు ఉవ్విళ్ళూరింది.


పెద్ద పూల మండపం తయారు చేయించారు. ఘనంగా మేళం పెట్టి ఊరేగింపుతో మరుభూమికి తీసుకెళ్ళారు. 


సువాసిని పూజలో ముత్తయిదువులు అందరికీ ఇత్తడి చేటలు, వెండి కుంకుమ భరిణెలు తాంబూలాల్లో పెట్టిచ్చారు. ఘనంగా భోజనాలు ఏర్పాటు చేశారు. భోక్తలకు పంచెల చాపులు, పెద్ద రాగి చెంబులు, కర్మకాండలకు వచ్చిన వారందరికీ పెద్ద స్టీలు పళ్ళాలు ఇచ్చారు.


పత్రికల్లో సగం పేజీలలో రంగులలో అశ్రునివాళి ప్రకటనలు ప్రచురించారు. మునిసిపాలిటీలో పర్మిషన్ తీసుకొని పాలరాతి సమాధి కట్టించారు. ఈ అతి ఖరీదైన సమాధి దేవకి చూసుకుంటుందా?    ఏమిటో!


ఈ తతంగమంతా కొడుకు, కోడలు కలిసే చేశారు. మూర్తి కూతురు కనీసం ఒక్క చెయ్యి కూడా వెయ్యలేదు. మరి అది తన పని కాదని భావించిందేమో!


చివరగా ఆశీర్వచనాలలో పురోహితులు ‘నాయనా ! ఇన్నాళ్ళూ మీ అమ్మ గారు, నాన్నగారు పార్వతీ, పరమేశ్వరుల లాగా కలిసిమెలిసి ఒకరి యోగక్షేమాలు మరొకరు చూసుకున్నారు. కాని ప్రస్తుత పరిస్థితి అలా కాదు. మీ నాన్నగారు ఒంటరి వారైపోయారు. మీరు ఆయన్ను తన శ్రీమతి లేదనే దిగులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇక నుండి కంటికి రెప్పలాగా చూస్తామని పెద్దల ఎదుట ప్రమాణం చెయ్యండి’ అనగానే ‘అలాగే’ అన్నాడు కొడుకు.


అశుభ కార్యక్రమం కాబట్టి వచ్చిన వారందరూ చెప్పకుండానే ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు.


దిగాలుగా కూర్చున్న మూర్తి దగ్గరకు కూతురు వచ్చింది. ఒక క్షణం ఆగి ‘నాన్నగారు ఉన్నపళంగా ఏమిటి ఇలా అయిపోయింది మన ఇల్లు నిశ్శబ్దంగా’ అంటూ తండ్రిని ప్రేమగా దగ్గరకు పొదువుకుంది. 


కూతురి ఆప్యాయతతో నిండిన ఓదార్పు మూర్తి మనసును ఎంతగానో ఉపశమింపచేసింది. ఆ మరు క్షణంలోనే ‘నాన్నగారూ ఈ విచార సమయంలో నేను ఈ మాట మాట్లాడకూడదు. కాని ఎప్పుడు మాట్లడాల్సింది అప్పుడు మాట్లాడకపోతే సమయం మించి పోతుంది’ అంటూ ఆమె వెనకాడుతోంటే ‘చెప్పు తల్లీ’ అని అడిగాడు మూర్తి.


‘ఈ ఇల్లంటే, అమ్మ తిరిగిన ఈ పరిసరాలంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. అన్నయ్యకు ఏమిస్తారో నాకు తెలీదు గాని, నాకు మాత్రం ఈ ఇల్లు బహుమానంగా ఇవ్వండి నాన్నగారు’ అంది గోముగా.


మూర్తి హృదయంలో ధమనులు, సిరలు ఒక్కసారిగా చిట్లిపోయి రక్తం ముఖంలోకి చిమ్మింది. ఇంకా తను బ్రతికే ఉన్నాడుగా అప్పుడే ఆస్తులు అడిగేస్తున్నారా? 


ఒక్కక్షణం తేరుకుని మూర్తి ‘పిచ్చి తల్లీ నువ్వంటే మాకు ఎంతో ఇష్టం. నువ్వు ఈ మాట అడగకుండా ఉంటే ఎంతో బావుండేదిరా. కాని అడిగేశావ్. మీ అమ్మ కోరిక ఏమిటంటే మా తదనంతరం ఈ ఇంటిని ఒక వద్ధాశ్రమానికి ఇచ్చేద్దామని. అది పక్కన పెట్టేసెయ్. కాని అమ్మ అంతిమ సంస్కారాలు, తదితర కార్యక్రమాలు అన్నయ్య, వదిన ఎంతో డబ్బు ఖర్చు చేసి క్షణం విశ్రాంతి తీసుకోకుండా ఒళ్ళు గుల్ల చేసుకుని నిర్వహిస్తోంటే కనీసం కొంత డబ్బు ఖర్చు చేస్తానని గాని, ఏదో ఒక పని సాయం చేస్తానని గాని ఎందుకు నువ్వు ముందుకు రాలేదు ? ఇలా అంటున్నందుకు క్షమించు తల్లీ’ అంటూ భుజం మీదున్న కండువాను ముఖం మీద కప్పుకుని భోరుమన్నాడు మూర్తి. 


కూతురు నింగి, నేల చూస్తోంది అయోమయంగా. చిటికెలో తండ్రి చూపులకు అందకుండా మాయమైపోవాలనుంది ఆమెకు.


దాదాపు యాభై సంవత్సరాల అన్యోన్య దాంపత్యంలో తనను అన్ని విధాలుగా ఆదుకుని, చేదోడువాదోడుగా ఉండి, తన తలపుల నిండా కమ్ముకున్న భార్య దేవకి ఉన్నపళంగా మాయమై పోయిందే ! ఆమె లేకుండా ఎలా జీవితం కొనసాగించడమా అని ఏడుస్తూ ఉంటే కూతురు ఇల్లు కావాలంటోంది. 


మనిషి తన సుఖం కోసం సంపాదించుకున్నవి తిరిగి అతన్నే వేధిస్తాయన్న మాట. ఇప్పటికే అబ్బాయికి రెండిళ్లు, అల్లుడికి ఒక మేడ, ఖాళీ స్థలం ఉన్నాయి మరి!


రెండు, మూడు రోజుల్లో పిల్లలు వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నారు. సామాన్లు సర్దుకుంటున్నారు. తాను మోజు పడిన దేవకి చీరలు కొన్ని కూతురికి ఇచ్చేశాడు. వాటిని చూస్తోంటే మరింత వేదన కలుగుతుందనే ఆలోచనతో.


తరువాత కోడలికి ఇవ్వాలి. వీళ్ళేం చేస్తున్నారోనని కొడుకు గది వైపు వెళ్ళబోతుంటే గట్టిగా కేకలు, అరుపులు వినిపించసాగాయి మూర్తికి. 


తలుపు దగ్గరే చాటుగా నిలబడి ఉండిపోయాడు.


‘ఏమిటి పిచ్చి వేషాలు వేస్తున్నావ్ ? నాన్నగారిని ఇల్లు అడిగేస్తున్నావేం?’ అంటున్నాడు చెల్లితో చాలా కోపంగా. 


‘ఏం నేను అడగకూడదా ? నాకూ హక్కు ఉంది’ అంటోంది కూతురు అంతే కోపంతో.


‘లక్షలు ఖర్చుపెట్టి అమ్మకు సంస్కారాలన్నీ చేసి నాన్నగారిని సంతోషపెట్టాను. ఇంకా నాతో కూడా తీసుకెళ్ళి నాతో పాటే ఉంచుకుని ఆయన యోగక్షేమాలన్నీ చూసుకుని ఈ ఆస్తంతా నా పేరున రాయించుకుందామనుకుంటున్నాను ఆయన బ్రతికుండగానే. అర్థమైందా ? ‘ఇక్కడ్నించి వెంటనే నీ మొగుణ్ణి, పిల్లలను తీసుకుని వెళ్లిపో. పిచ్చి వేషాలు వెయ్యకుండా’ కోపంతో అరుస్తున్నాడు. 


ఆమె వెంటనే ఆ గదిలోంచి బయటకు వెళ్ళకపోతే చేయి చేసుకుంటాడేమో.


కూతురు వెక్కి వెక్కి ఏడుస్తోంది. మూర్తికి ఈ సంభాషణంతా విన్నాక గుండెల్లో మందుపాతరలు పేలినట్లుగా, ప్రాణం కడతేరుతున్నట్లుగా ఉంది.


‘దేవకీ నీ ముద్దుల కొడుకు, కూతురంటే ప్రేమతో పడి చచ్చేదానివి. నువ్వు బ్రతికుండగా ఈ మాటలు వినుంటే చచ్చిపోయేదానివి. కాని చచ్చిపోయి బ్రతికిపోయావ్. అదష్టవంతురాలివి. అయినా నువ్వు బ్రతికుండగా ఈ మాటలు అనే అగత్యం లేదుగా. ఇప్పుడు నేనేం చెయ్యాలి?’ అనుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ తమ పడకగదిలో చేరి కర్మకాండల కోసం చేయించిన దేవకి ఫొటో ఎదురుగా నిలబడ్డాడు కళ్ళ నిండా నీటి చెలమతో.


విరక్తిగా నవ్వుతోంది దేవకి ఫొటోలో ఎప్పటి లాగే. కంట్లో నీరు నిండిపోయి కనురెప్పలు మూసి తెరిచేటప్పటికి ‘ఇవన్నీ మనకెందుకండి నా దగ్గరకు వచ్చేయండి’ అన్నట్లుగా రెండు చేతులు చాపి పిలుస్తున్నట్లుగా భ్రమ చెందాడు మూర్తి. 


కళ్లు నులుముకుని మళ్ళీ చూశాడు. ఎప్పటిలాగే చిద్విలాసంగా నవ్వుతోంది దేవకి. తదేకంగా చూస్తూనే ఉన్నాడు మూర్తి భార్య ఫొటోను ‘ఎప్పుడు రాగలను నీ వద్దకు’ అన్నట్లుగా.


‘ఎందరో తల్లుల ప్రేమ కలిపితే దైవం. ఎందరో దైవాల ప్రేమ కలిపితే అమ్మ’ అన్నారు ఓ కవి. 


కాని అప్పుడే ఆ తల్లిని మర్చిపోయి తండ్రి బ్రతికుండగానే సంపదలపై మోహాలు కలుగుతున్నాయి సంతానానికి.


‘నాన్నగారూ మీరు ఒంటరిగా ఎలా ఉంటారు. మా దగ్గరకు వచ్చి ఉండండి’ అని అబ్బాయి గాని, అమ్మాయి గాని అన్నారా?


ఇల్లు కావాలని ఒకరు. మొత్తం అస్తి కావాలని మరొకరు. అసలు ఆస్తులు సంపాదించడం ఎందుకో? ఏమిటో?


‘అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం. అంతా ఒక నాటకం. ఎవరు తండ్రి ? ఎవరు కొడుకు ?’ టెలివిజన్లో డాక్టర్ సి. నారాయణరెడ్డి గారికి నివాళి సమర్పిస్తున్నారు ఆయన రచించిన పాటలతో.


‘అవును ఈ జీవితమంతా ఒక నాటకం. అయితే మానవ జీవితంలో తమ పాత్రలలో కడదాకా జీవించేవారు భార్యాభర్తలు మాత్రమే అని ఎంత మందికి తెలుసు ? ఇంకా ఎన్నాళ్ళు జీవించాలి ఈ ఒంటరి జీవితం?’ మూర్తి ఆలోచనలు అవధులు దాటి ఎటో పయనిస్తున్నాయి.✍️

             – కాకరపర్తి భగవాన్ కృష్ణ.


             సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

అరుంధతి నక్షత్రం*.

 . అరుంధతి నక్షత్రం*.🌟


*అరుంధతి*


🌟వశిష్ట మహర్షి గురించి వినే ఉంటారు. ఆయన పెళ్లి చేసుకోవాలని అంతటా తిరుగుతూ ఉంటాడు. 


⭐ఒకసారి ఒక గ్రామంలో కన్నెలంతా అతన్ని చూడడానికి వచ్చారు. వసిష్టుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు. ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చెయ్యగలరా అని అడిగాడు. అయితే ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవ్వరూ అది సాధ్యం కాదని చెప్పారు.


⭐పక్క గ్రామమైన మాల పల్లె నుంచి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలపడుతుంది. నేను చేస్తానండి అని అంటుంది.


⭐వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది. ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో ఇసుక వేసింది. ధ్యానం చేస్తూ వంట వడింది. ఇసుక అన్నంగా మారింది.

వశిష్టుడికి కుండలోని అన్నం చూపించింది.


⭐ఆయనకు కూడా ఈ విషయం బోధపడలేదు ఆమెనే అరుంధతి. తర్వాత ఆ అన్నం తినమంటూ అరుంధతి వశిష్టుడికి వడ్డిస్తుంది. కానీ ఆయన తినడు. నన్ను పెళ్లి చేసుకుంటేనే తింటాను అంటాడు. తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడుతాడు వశిష్టుడు. వాళ్లను ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు.


🌟ఇక అరుంధతికి ఎంతో ఏకాగ్రత ఉంటుంది.ఒకసారి వశిష్టుడు తన కమండలం ఆమెకు ఇచ్చి బయటకు వెళ్తాడు. తాను వచ్చే వరకు కమండలం వైపే చూస్తూ ఉండమని చెబుతాడు. అరుంధతి తన భర్త వచ్చేవరకు దాన్నే చూస్తూ ఉంటుంది. చాలా ఏళ్లు గడిచినా వశిష్టుడు రాడు.


⭐అయితే అరుంధతి మాత్రం దాని వంకే చూస్తూ ఉంటుంది. పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత. అయితే ఈ విషయాన్ని గ్రహించిన కొందరు దేవతలు అమ్మా అరుంధతి మీ ఆయన ఇన్నేళ్లు అయినా తిరిగిరాలేదు. కాస్త ఇటు చూడమ్మా అంటారు.


అయినా ఆమె చూపు మరల్చదు. కొన్ని ఏళ్ల తర్వాత వశిష్టుడు వచ్చి అరుంధతీ.. అని పిలిస్తే అప్పుడు ఆయన వైపు చూస్తుంది.


🌟తన భర్తను తప్ప పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత అరుంధతి.


🌟ఒకసారి అగ్ని దేవుడి ఎదుట సప్త ఋషులు యజ్ఞం చేపడుతారు.ఆ. ఋషుల భార్యలపై అగ్ని దేవుడు మోజు పడతాడు. ఈ విషయాన్ని అగ్ని దేవుడి భార్య అయిన స్వాహాదేవి గ్రహిస్తుంది. ఆ ఏడుగురి భార్యల మాదిరిగా తానే రోజు కొక రూపం ధరించాలనుకుంటుంది. రోజు కొక ఋషి భార్య రూపం లోకి మారి తన భర్త అగ్ని దేవుడి కోరిక తీరుస్తుంది.


⭐ఇక చివరి రోజు తాను అరుంధతిని అనుభవించబోతున్నాననే ఆనందంలో ఉంటాడు అగ్నిదేవుడు. కానీ స్వాహాదేవి ఎంత ప్రయత్నించినా అరుంధతి అవతారంలోకి మారలేదు. అరుంధతి పెద్ద పతివ్రత కావడమే ఇందుకు కారణం.


🌟అందుకే ఆమె అరుంధతి నక్షత్రంగా మారి జగత్తుకు ఆందర్శంగా నిలిచింది. అరుంధతికి శక్తి అనే కుమారుడున్నాడు. శక్తి కుమారుడే పరాశరుడు. పరాశరుడి కుమారుడే వ్యాసుడు.


⭐అలా ఎంతో గొప్ప చరిత్ర కలిగింది అరుంధతి నక్షత్రం. అందుకే నూతన వధూవరులకు అరుంధతి  నక్షత్రం చూపించి అంతటి మహా పతివ్రతగా జీవించమని ఆశీర్వదిస్తారు...


🌟🌟🌟🌟🌟🌟

మర్కటం - మాటలు

 మర్కటం - మాటలు


వేసవి కాలంలోని ఒక సాయింత్రం. పరమాచార్య స్వామివారు మేనాలో కూర్చుని భక్తులకు దర్శనం ఇస్తున్నారు. స్వామివారి దర్శనానికి చాలామంది వచ్చారు. భక్తులు సమర్పించిన పళ్ళబుట్టలు, ఎండుద్రాక్ష, కలకండ, తేనె సీసాలు మొదలైనవన్నీ మేనా ముందు నేలపైన ఉన్నాయి. 


హఠాత్తుగా కోతుల దండు ఒకటి దాడికి దిగింది. పళ్ళని తిని మొత్తం చిందరవందర చేసి తేనెసీసాలను తోసి కిష్కింద చేస్తున్నాయి. అవి మహాస్వామి వద్దకు వెళ్ళి వారికి హాని చేస్తాయి అని శిష్యులు భయపడ్డారు. 


కాని మహాస్వామివారి ముఖపద్మంలో రేఖామాత్రమైనా విరక్తి లేదు. వాటిని ఏమీ చెయ్యవద్దని చేతి సైగలద్వారా ఆజ్ఞాపించారు. స్వామివారిని కాపాడుకోవాలని చేతులలో కర్రలు పట్టుకుని వస్తున్నవారల్లా ఆ కర్రల్లాగే స్థాణువులై నిలబడిపోయారు. 


కొద్దిసేపటి తరువాత ఆ కోతులన్నీ వచ్చిన పని ముగించుకుని రామకార్యార్థమై వెళ్ళిపోయాయి. అవి వెళ్ళగానే స్వామివారు భక్తులకి ఒక సంఘటనను చెప్పారు. 


తంజావూరు జిల్లాలో ఒక గ్రామంలోని ప్రజలు ఈ కోతుల బాధ భరించలేకపోయేవారు. అనుకోకుండా దొరికిన ఒక కోతిని ఒకతను కర్రతో కొట్టాడు. దానికి తగిలిన దెబ్బలవల్ల అది కొన్ని రోజులకి మరణించింది. తరువాత తనకి కలిగిన ఆడపిల్లకి మాటలు సరిగ్గా వచ్చేవి కాదు. ఆ పిల్లకి వివాహం చెయ్యవలసిన వయసు వచ్చింది. అతను మహాస్వామివారి వద్దకు వచ్చి అతను చేసిన పాపాన్ని చెప్పుకుని బాధపడ్డాడు.


“మట్టితో కోతిబొమ్మను తయారుచేసి మీ ఊరి గ్రామదేవత గుళ్ళో ఇవ్వు. మనఃస్పూర్తిగా ఒప్పుకున్నవాడికే మీ అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చెయ్యి” అని చెప్పారు. స్వామివారు చెప్పినట్లే జరిగింది. తరువాత ఆ అమ్మాయికి చక్కగా మాట్లాడగలిగే పిల్లలు పుట్టారు.


కోతులను ఎప్పుడు కొట్టరాదు. వాటి మీద జాలి చూపించాలి. అవి రామణ్ణి సేవించుకున్న కోతుల పరంపరలో నుండి వచ్చాయి. అవి మనకు ఇబ్బంది కలిగించినా ‘ఆంజనేయుడు’ అని తలచి వాటిని వదిలిపెట్టాలి.


ఈ కథనంతా విని భక్తులు కరిగిపోయారు. పరమాచార్య స్వామివారే బోధించినందుకు ఆనందపడ్డారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కథ

 *ఒక కథ!* 


*Amma Katha*


కొన్ని నెలల క్రితం, కొత్తగా ఒక పనిమనిషి చేరింది, నాకు పనిమనిషి అన్న పదం పలకడం ఇష్టం ఉండదు, మీకందరికి అర్థం కావటానికి ఇలా రాశా, ఇక ఈ వ్యాసంలో ఈ పదాన్ని ఊయోగించను. ఆవిడ పేరు.......


మూడు నాలుగు రోజుల తరువాత అడిగా.. 

అమ్మా! ఎక్కడ మీ ఇల్లు, ఎంత మంది పిల్లలు అని.

ముగ్గురు అమ్మాయిలు అండి, 


పెళ్లిళ్లు అయ్యాయా, లేదండి ఇంకా చదువుకుంటున్నారు. 


O.K, ఏం చదువు కుంటున్నారు అని క్యాజువల్ గా అడిగా, పెద్ద అమ్మాయి M.Sc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజ్ లో కాంట్రాక్ట్ లెక్చరర్ గా చేస్తోంది, 

ఆ అంటూ నోరు తెరిచా, 


రెండో అమ్మాయి M.Sc Computers మొదటి సంవత్సరం, 


మూడో అమ్మాయి ఎంబీబీస్ రెండో సంవత్సరం. 


ఆ అని నోరు వెళ్ల బెట్టా. నర్సింగా అన్నా, 

కాదు సార్ M.B.B.S అంది. 


నాకు అర్థం కావటం లేదు, ఈవిడ ఏమంటోంది, 

ఏం మాట్లాడుతోంది. ఈవిడకు ఏం మాట్లాడుతోందో అర్థం అవుతోందా? 


మళ్ళీ అడిగా, అవే సమాధానాలు, 


M.B.B.S ఫ్రీ సీటా అని అడిగా, అవును సార్, 

ఫ్రీ సీట్ యే, 

అదేదో బిల్డింగ్ ఫీజ్ అంటా, దానికే తంటాలు పడుతున్నా కట్టడానికి.


ఏ స్కూలులో చదువుకున్నారు అమ్మా మీ పిల్లలు అని అడిగా?


ఇక్కడే, మన  ఊరి బడి లొనే  10 వ తరగతి వరకు. 


లాంగ్ టర్మ్ గట్రా వెళ్లిందా ఎంబీబీస్ అమ్మాయి అని అడిగా, ఏం లేదయ్యా, మన ఊరి  కాలేజ్ యే, నాకు ఈ చదువుల గోల ఏం తెలీదయ్యా, ఇప్పుడు ఇప్పుడే కాస్త నోరు తిరుగుతోంది. 


ఏం చదువుకున్నావు అమ్మా నువ్వు అని అడిగా,

రెండులో మానేశానయ్యా, నాకు కూడికలు, తీసి వేతలు కూడా రావు. చాలా కష్టాలు పడ్డాను పిల్లలను ఈ స్థాయికి తీసుకు రావటానికి.


మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగా,


ఆయనా అందరి లాగే, ఇంటి విషయాలు ఏం పట్టవు. 


ఆయన త్రాగుతాడు, 

100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇంట్లో ఇవ్వడం కూడా గగనం. ఇప్పుడు ఇప్పుడు కొంచం మారుతున్నడు, పాప డాక్టర్ కోర్స్ లో చేరిన తరువాత.


మా పెద్ద అమ్మాయిని ఏడో తరగతిలో చదువు మానిపించేసా, కానీ వాళ్ల టీచర్ ఇంటికి వచ్చి, నన్ను మందలించి, మంచి తెలివి గల అమ్మాయి, చక్కగా చదువు కొంటోంది అని చెప్పి బడికి తీసుకొని వెళ్ళింది. అప్పటికి అర్థం అయ్యింది నాకు, నా పిల్లలు తెలివి గల వాళ్ళు అని, నా పిల్లల చదువులు ఆగ కూడదు అని ఇంకో రెండు ఇల్లులు ఎక్కువ ఒప్పుకోవటం మొదలు పెట్టా. 


ఇంట్లో సరిగ్గా కరెంట్ కూడా ఉండేది కాదు, మూడు మూడు నెలలు బిల్ కట్టలేక పోయే దాన్ని, పిల్లలు ఆలాగే బుడ్డి దీపాల్లో చదువుకున్నారు. 


ఇప్పుడు కాస్త పర్వాలేదు, పెద్ద అమ్మాయి కాస్త సంపాదిస్తోంది. ఎలాగో కిందా మీదా పడుతున్నాను అంది. 


నాకు నోట మాట రాలేదు. ఒక చదువుకోని మహిళ,

భర్త త్రాగుబోతు, ఇంతగా కష్టపడి పిల్లలను ఇంతగా వృద్ధిలోకి తెచ్చిందా. 


లక్షలు, లక్షలు ఫీజులు పోస్తుంటే నాపిల్లలు అస్సలు చదవట్లేదు. నా పిల్లలు వీళ్ళలో సగం చదువుకున్నా చాలు అనుకున్నా. 


అంతే, నాకు అర్జంట్ గా వీళ్ళ ముగ్గురు పిల్లలని కలవాలి అనిపించింది.

నేను మీ ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడాలి, నాకు పరిచయం చేయ్యాలి అని అడిగా, అలా మా పిల్లలను చూపించినట్లు ఉంటుంది అన్నా. 


నేను ఆడిగినట్లే, ముగ్గురిని తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చింది ........ 


ముగ్గురు వాళ్ళ అమ్మతో పాటు నేలపై కూర్చున్నారు. నా మనస్సు చివుక్కుమంది. ఎంతగానో బ్రతిమాలితే  గాని, కుర్చీలపై కూర్చో లేదు. 


ఆమె  నేల పైనే. నాకు అలవాటే సారూ అంది, 


నా పిల్లలు నాలా మిగిలి పోకూడదు అనే ఈ నా శ్రమ అంతా. మీలాంటి గొప్ప వాళ్ళతో పాటు సరి సమానంగా కూర్చున్నారు చూడండి, ఇది చాలు, అంది కళ్ళ నీళ్లతో..... 


నేను కాదు,  వీళ్లు కాదు, 

నువ్వూ ... గొప్ప దానివి అన్నా. 


మొదటి పది నిమిషాలు ముగ్గరు ముడుచుకు కూర్చున్నారు, తరువాత కొంచం కొంచం మాట్లాడ్డం మొదలు పెట్టారు. 

తాము పడిన కష్టాలు, పడుతున్న కష్టాలు, ఎలా సీట్లు తెచ్చుకొంది, ఎంతో కొంత స్కాలర్షిప్ లు రావటం, అవి సహాయ పడ్డం. నిజంగా ఇలాంటి వారే పథకాలకు అర్హులు.


వీళ్లకు ఏదన్నా సహాయం చేద్దాం అని గట్టిగా మనసులో అనుకున్నా. 

ఏం కావాలి అని అడిగా, 

ఎంత అనుకువగా ఉన్నారో, అంత ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం మెండుగా ఉన్నాయి. ఏమి అడిగినా, ఆహా వద్దు అనే సమాధానం. 


నేను, నా అర్ధాంగి అడగంగా, అడగంగా,  ఒక Two వీలర్ ఇప్పించండి, ముగ్గరము కలిసి ఊయోగించు కుంటాం, మీకు నెల నెలా ఇస్తాం, మేము లోన్లో తీసుకోలేము, అనవసరమైన వడ్డీ అన్నారు. Two వీలర్ ఉంటే, కాస్త సౌలభ్యoగా ఉంటుంది, సగం డబ్బులు ఆటోలకు అయి పోతున్నాయి, మా ఏరియా దగ్గర షేర్ ఆటోలు దొరకవు, దొరికే స్టాప్ వరకు నడచి అలిసిపోవటం, సమయం కూడా వ్యర్థం అవుతున్నాయి. Two వీలర్ ఉంటే అలిసిపోము, మిగిలిన సమయాన్ని చదువు కునేందుకు ఉపయోగించు కుంటాము అన్నారు. 


Two వీలర్  ఇప్పించా డబ్బులు కట్టి, 


ఒక తొమ్మిది నెలల్లో నాకు ఒక పైసా వదలకుండా మొత్తం తీర్చేశారు, ఒక పది వేలు ఉంచుకోండి అని అన్నా వినకుండా. 


పెద్ద అమ్మాయి ఇద్దరిని డ్రాప్ చేసిన తరువాత తన కాలేజ్ కు వెళ్లి పోతుంది. మళ్ళీ ఇద్దరని పికప్.

పెద్ద అమ్మాయి J.L పోస్టులకు సన్నద్ధం అవుతోంది. రెండో అమ్మాయి Software ఫీల్డ్ వైపు వెళ్ళాలి అని.


చెప్పటం మరిచా ఇప్పుడు పెద్ద అమ్మాయి మా పిల్లలకు హోమ్ ట్యూటర్. ప్రతి రోజు రెండు గంటలు.

 

ఏదో సినిమాలో అమ్మకంటే పెద్ద యోధురాలు ఎవరు ఉండరు అంటాడు హీరో, మనకు తెలియని ఈ తల్లి లాంటి యోధురాళ్లు ఎందరో..


ఒకసారి  ఆమె తో  అన్నా, ఇంకో రెండు సంవత్సరాలు కష్టం మీకు, తరువాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని అని, 


ఏం సారూ నన్ను పనిలో నుంచి తీసేయ్యాలి అనుకుంటున్నారా, నా ఒంట్లో శక్తి ఉన్నoత వరకు నేను నా పని మానను.


ఆమెను  అడిగా, మీ ఆయన మీద కోపం లేదా అని, 


లేదు అన్నది, పిల్లలకు ఉంది, అయినా వీళ్లు  తమ చదువులు అయిపోయి, పెళ్లిళ్లు చేసుకొని వెళ్లి పోతే తను నేనే కదండి, కోపాలు, తాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం. చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడి పోతున్న జంటలకు ఈమె పెద్ద సమాధానం.


ఒక సారి పెద్ద అమ్మాయి అంది, మా నాన్న తన స్నేహితుల ముందర మా గురుంచి గొప్పగా చెబుతుంటాడు, అక్కడే ఆయన మొహం ముందరే వారికి చెబుతాం, ఇదంతా మా అమ్మ కష్టం అని......


ఎందరో అమ్మల నిజమైన కథ..!!!


🌼🌺🏵️🌻🌸🥀💐🌹🌷🏵️🌺


అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే మాటకు .


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


కుదిరితే ఈ వ్యాసం అందరికి పంపండి.  కనీసం చదువు కున్న వాళ్లకు అర్థం అవుతుంది. Copy

నేను, నాది, నాకు

 నేను, నాది, నాకు అనే ఈ మూడు పదాలు మనం సర్వసాధారణంగా ప్రతి రోజు అనేక సందర్భాలలో ఉపయోగిస్తున్నాము. ఈ పదాలు వాడేటప్పుడు కొన్ని సార్లు సంతోషం, ఆనందం,కలుగుతుంది అలాగే కొన్ని సందర్భాలలో విచారం, దుఃఖం కూడా కలగటం కద్దు. ఈ వాడుకల గూర్చి ఒక చిన్న పరిశీలన చేద్దాం. 

నేను: ఇంతమంచి ఇల్లు ఎవరు కట్టించారండి.  నేను కట్టించానండి ఆ జవాబు చెప్పేటప్పుడు ఒక రకపు గర్వం  తొణికిసలాడుతుంది . అంతటితో ఆగి పోడు మా అన్నదమ్ములల్లో ఇంతపెద్ద ఇల్లు నా ఒక్కడికే వుంది.  మా అన్నయ్య రెవెన్యూ డిపార్టుమెంటులో పెద్ద ఉద్యోగం చేసాడు కానీ ఇప్పటివరకు ఒక గుడిశ కూడా కొనలేక పోయాడు, ఇక మా తమ్ముడు ఇటీవలే ఒక చిన్న ఇల్లు కొన్నాడు. నిజానికి నీవు అతని అన్నదమ్ముగూర్చి ఏమి అడగలేదు కానీ చెప్పాడు ఎందుకంటె ఆలా చెప్పటంలో తన ఉన్నతస్థితిని చెప్పటానికి. నిజానికి అతని అన్నగారు నిజాయితిగా యుద్యోగం చేయటం వలన ఎక్కువగా సంపాదించలేక పోయాడు అందుకే ఇల్లు సమకూర్చుకోలేక పోయాడు. మరి తాను అడ్డమైన గడ్డి తిని అందరిని ముంచి బాగా సంపాదించి ఇంతపెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ప్రజలకి నీవు ఎలా జీవిస్తున్నావు అన్నది అవసరంలేదు నీవు యెంత సంపాదించావు అన్నది ఉంటే చాలు. తమ్ముడు పొదుపుగా జీవనం చేస్తూ తన ఆర్జనకు తగినట్లుగా అప్పులు లేకుండా చిన్న ఇల్లు కట్టుకున్నాడు.  ఇప్పుడు సమాజంలో నీతి, నిజాయితీకి విలువలు రోజు రోజుకు సన్నగిలుతున్నాయి. 

నాది: సమాజంలో పలుకుబడి, ఉన్నత స్తానం నాది అని ప్రతివారు ఏంటో సంతోషంగా చెప్పుకోవటం మనం చూస్తున్నాం. 

నాకు: ఎక్కడ ఎది వున్న కూడా అది నాకే దక్కాలి అనే ఆలోచనలు ప్రతివారిలో ఉంటున్నాయి. 

ఇలా మనం రోజు వాడే ఈ పదాలే కాక వీటికి అనుబంధంగా మాకు, మనం, మాది లాంటివికూడా వీటి కోవకే చందుతాయి. ఇంతకూ ఈ నేను, నాది, నాకు అనే పాదాలను ఎవరికి ఉపయోగిస్తున్నాము అంటే వెంటనే నాకే ఉపయోగిస్తున్నాం అని సమాధానం చెపుతాము. ఇంతకూ ఆ నేను ఎవరు అంటే అది నా దేహం అని మనం అందరమూ ముక్తకంట్టంగా చెపుతాము అందులో సందేహం లేదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే దేహం అని చెప్పే నా దేహం నిజంగా నాదేనా లేక వేరే ఎవరిదైనన. దీనికి .వివరణ క్రింద చుడండి. 

దేహః కిమన్నదాతుః స్వం నిషేక్తుర్మాతురేవ చ మాతుః పితుర్వా బలినః క్రేతురగ్నేః శునోపి వా. ఏవం సాధారణం దేహమవ్యక్త ప్రభవాప్యయమ్ కో విద్వానాత్మసాత్ కృత్వా హన్తి జన్తూనృతే సతః. 

(భాగవతము 10-10-11,12)

ఈ దేహము ఎవరిది? అన్నము పెట్టి పోషించువానిదా? పుట్టించిన తండ్రిదా? తొమ్మిది నెలలు మోసిన తల్లిదా? తల్లిని కనినట్టి తాత అమ్ముమ్మలదా? దీనిచేత పనిచేయించు బలవంతునిదా? శ్మశానములో దీనిని కాల్చివేయు అగ్నిదా? రుధ్ర భూమియందు దీనిని కొరికి కొరికి తినివేయు కుక్కలదా? అని భాగవత కారుడు నిలదీసి ప్రశ్నించెను. భాగవతము దశమస్కంధములో నారదుడు నలికూబర, మణిగ్రీవులను దేవపుత్రులకు గావించిన హితోపదేశ సందర్భమున ఈప్రశ్న గావింపబడెను. ఆ ప్రశ్నకు నారదులే ఈ ప్రకారముగ సమాధానము ఒసంగివైచిరి –

'నాయనలారా! ఈ దేహము ఎవరిదీ కాదు. ఇది యొక సామాన్యమైన జడవస్తువు. మృత్తికానిర్మిత మగు ఘటమువంటిది. ప్రకృతి నుండి పుట్టి ప్రకృతిలో లయమైపోవుచున్నది. ఇట్టి అల్పవస్తువును 'నేను' అని తలంచి ఇతరులకు కీడు చేయదలంచువారు ఎంత అవివేకులు?' కావున నశ్వరమై, పాంచభౌతిక మైనట్టి ఈ శరీరము తాను కాదనియు, శాశ్వతమగు చిన్మయ ఆత్మయే తాననియు బాగుగ నిశ్చయించుకొని, సర్వప్రాణులు తన స్వరూపమే యని భావించు కొని, ఎవరికిని అపకారము చేయక జీవితమును గడుపవలయును.

మానవునికి కలుగుచున్న దుఃఖమంతటికిని కారణము ఈ దేహాభిమానమే. దేహముపైనను, దేహమునకు బయట గల పదార్థములపైనను గల మమత్వమే దుఃఖమునకు హేతువు. జీవుడు ఉపాధిని ధరించి లోకమున వ్యవహరించు ఉపాధి వస్తువుగా మాత్రమే ఈ దేహమును తెలుసుకొనవలెను. అంతేకాని నశ్వరము, అనిశ్చితము క్షయము అగునట్టి ఈ దేహము మీద వ్యామోహము కల్పించుకొన వలదు.. ప్రతి మానవుడు నిత్యమూ దేహసౌందర్యముకొరకు, దేహాభిమానము కొరకు, దేహవృద్ది కొరకు మాత్రమే తమ అమూల్య మైన కాలాన్ని వెచ్చిస్తున్నాడు. నిజానికి కాలప్రవాహంలో పుట్టి కాలప్రవాహంలో కలిసిపోయే ఈ దేహము నాది కాదని కేవలము సాధకుడు మాత్రమే తెలుసుకొనగలడు. ఈ దేహము జరామరణాలకు లోబడి వున్నది కాబట్టి శరీరములో సత్తువ ఉన్నపుడే శరీరాన్ని అంటిపెట్టుకొన్న ఆ జీవుడిని (ఆత్మ) ఉద్ధరింపచేయ వలెను నిత్యము తప్పసును చేసి మోక్ష ప్రాప్తిని పొందవలెను. సమయము నీచేతిలో లేదు ఈ క్షణమే మేలుకో జీవన్ముక్తికి సాధన ఆరంభించు. 

ప్రపంచం: ఈ ప్రపంచము చాలా విచిత్రమైనది ప్రతివారు ఈ ప్రపంచము తనగూర్చి తలచిస్తుందని అనుకుంటారు.  నిజానికి ప్రపంచానికి నీవు ఎలా వున్నావు అనేది సంబంధము కలిగి ఉండదు. ఎప్పుడు ప్రపంచం కోసం బ్రతకకు నీకోసం మాత్రమే బ్రతకటం అలవాటు చేసుకో. 

ధర్మం: ధర్మ బద్దంగా జీవిస్తూ భగవంతుడు నీకిచ్చిన దానితో తృప్తి చెంది దినములో అధిక కాలము భగవంతుని చింతన చేయటమే సాధకుని పని. మానవులుగా మనం కేవలము సాధన చేయటము మాత్రమే ఫలితాన్ని ఇవ్వటం భగవదానుగ్రహం. 

దేహము మీద యెంత మమకారము పెంచుకొనినను ఇది ఏదో ఒక రోజున రాలిపోక  తప్పదు. కాబట్టి దేహాన్ని సరైన పద్దతిలో వాడుకొని మోక్ష ప్రాప్తి పొందటమే మానవుని కర్తవ్యము. 

దీపమున్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకో: 

దేహమనే ఇంట్లో జీవుడు అనే దీపం ఉన్నప్పుడే నీ ఇంటిని చక్కదిద్దుకో ఎప్పుడైతే దీపం ఆరి పోతుందే అప్పుడు దేహమనే నీ ఇల్లు దేనికి పనికి రాదు కేవలం కట్టెలలో కాల్చి బూడిద అవ్వటం తప్ప.  ఎవరో నన్ను చూసి ఏమనుకుంటారో అనే భావనను విడనాడి ఇప్పుడే మన మహర్షులు నిర్దేశించిన ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించు. 

ఓం తత్సత్

శాంతి శాంతి శాంతిః 

జ్ఞానయోగసాధన

 18వ అధ్యా.)


జ్ఞానయోగసాధన


453


1


దేహః కిమన్నదాతుః స్వం నిషేక్తుర్మాతురేవ చ మాతుః పితుర్వా బలినః క్రేతురగ్నేః శునోపి వా. ఏవం సాధారణం దేహమవ్యక్త ప్రభవాప్యయమ్ కో విద్వానాత్మసాత్ కృత్వా హన్తి జన్తూనృతే సతః.


2


(భాగవతము 10-10-11,12)


ఈ దేహము ఎవరిది? అన్నము పెట్టి పోషించువానిదా? పుట్టించిన తండ్రిదా? తొమ్మిది నెలలు మోసిన తల్లిదా? తల్లిని కనినట్టి తాతదా? దీనిచేత పనిచేయించు బలవంతునిదా? శ్మశానములో దీనిని కాల్చివేయు అగ్నిదా? రుధ్ర భూమియందు దీనిని కొటికి కొటికి తినివేయు కుక్కలదా? అని భాగవత కారుడు నిలదీసి ప్రశ్నించెను. భాగవతము దశమస్కంధములో నారదుడు నలికూబర, మణిగ్రీవులను దేవపుత్రులకు గావించిన హితోపదేశ సందర్భమున ఈప్రశ్న గావింపబడెను. ఆ ప్రశ్నకు నారదులే ఈ ప్రకారముగ సమాధానము ఒసంగివైచిరి –


'నాయనలారా! ఈ దేహము ఎవరిదీ కాదు. ఇది యొక సామాన్యమైన జడవస్తువు. మృత్తి కానిర్మిమగు ఘటమువంటిది. ప్రకృతి నుండి పుట్టి ప్రకృతిలో లయమైపోవుచున్నది. ఇట్టి అల్పవస్తువును 'నేను' అని తలంచి ఇతరులకు కీడు చేయదలంచువారు ఎంత అవివేకులు?' కావున నశ్వరమై, పాంచభౌతిక మైనట్టి ఈ శరీరము తాను కాదనియు, శాశ్వతమగు చిన్మయ ఆత్మయే తాననియు బాగుగ నిశ్చయించుకొని, సర్వప్రాణులు తన స్వరూపమే యని భావించు కొని, ఎవరికిని అపకారము చేయక జీవితమును గడుపవలయును.


మానవునికి కలుగుచున్న దుఃఖమంతటికిని కారణము ఈ దేహాభిమానమే. దేహముపైనను, దేహమునకు బయట గల పదార్థములపైనను గల మమత్వమే దుఃఖమునకు హేతువు. జీవుడు ఉపాధిని ధరించి లోకమున వ్యవహరించు

నీటిలో ఉప్పు

 శ్లోకం:☝️

*సలిలే సైంధవం యద్వత్‌*

 *సామ్యం భవతి యోగతః |*

*తదాత్మమనసోరైక్యం*

    *సమాధి రభిధీయతే ||*


భావం: నీటిలో ఉప్పు కరిగిపోయి తన రూపాన్ని పోగొట్టుకున్నట్లే, యోగి ధ్యానమందు మనోవృత్తులు నశించి బ్రహ్మాకారమై యుండు స్థితియే సమాధి యనబడును.

🙏 *యోగస్చిత్తవృత్తి నిరోధః* 🙏

భాషా చమత్కారాలు

 భాషా చమత్కారాలు

    *********

నక్షత్రము గల చిన్నది

నక్షత్రము చేతబట్టి నక్షత్రప్రభున్

నక్షత్రమునకు రమ్మని

నక్షత్రము పైనవేసి నాథుని పిలిచెన్


ఇందులో నాలుగు నక్షత్రాలు దాగి ఉన్నాయి. పదే పదే చదివితేనే కానీ అంతసులువుగా అర్థమయేవికావు. 


ఇటువంటి ప్రహేళికలను'ప్రముషితా' ప్రహేళికలని అంటారని కవి దండి తన'కావ్యాదర్శం' లో చెప్పాడు.


ఇప్పుడు వివరణ చూద్దాం!

మహాభారతంలో విరాటపర్వం చదువనివారుండరు. విరాటరాజు కుమార్తె "ఉత్తర" (నక్షత్రం పేరు ) ఆమె అభిమన్యుని భార్య.

నక్షత్రము చేతబట్టి అంటే కుంకుమ పాత్ర "భరణిని" ( నక్షత్రం పేరు ) చేతిలో పట్టుకొని ; నక్షత్రప్రభున్ నక్షత్రాలకు ప్రభువైన చంద్రుని వంశపు ( చంద్రవంశము ) అభిమన్యుని; నక్షత్రమునకు రమ్మని అంటే ఒక "మూల" ( నక్షత్రం పేరు ) కు రమ్మని పిలిచి;

నక్షత్రము పైనవేసి అంటే "హస్త" (నక్షత్రం పేరు ) మును అతని మీదవేసి; నాథుని పిలిచెన్ అంటే పతియైన అభిమన్యుని ప్రేమగా పిలిచిందట.


అమ్మో! ఈ పద్యం అర్థంకాకుంటే మీకు నిజంగానే నక్షత్రాలు కనిపించేవి కదూ! అదీ మరి కవి చమత్కారమంటే!

తెలుగు భాషాభిమానులందరికి...

29, మార్చి 2022, మంగళవారం

శివార్పణ ఫలితం!*

 *శివార్పణ ఫలితం!*

              ➖➖➖✍️


*తమిళనాడు దగ్గర సముద్ర తీరంలో ‘నాగపట్నం’ అనే ఊరు ఉన్నది.                       అక్కడ జాలరి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ కుటుంబాలలో ఒక జాలరివాడు మహాశివభక్తుడు.*


*ఆ జాలరివాడి పేరున ఇప్పటికీ నాగపట్నంలో ఒకరోజున ఉత్సవం చేస్తారు.*


*ఈ జాలరి వాడికి ఒక దినచర్య…అందరూ కలిసి వెళ్ళి చేపలు పట్టేవాళ్ళు. ఈయనకి అలవాటు ఏంటంటే వచ్చిన మొదటి చేపని ‘శివార్పణం!’ అని సముద్రంలో వేసేవాడు. మిగిలినవన్నీ తను తీసుకునే వాడు.*


*ఇప్పుడు మనం దుకాణాలలో చూసినా మొదటి ఇడ్లీ భగవంతుడి దగ్గర పెట్టి మిగిలిన ఇడ్లీలు జనాలకి పెడుతూ ఉంటారు.*


*ఇతను భక్తిగా చేశాడు. ఇతని బ్రతుకులో తెలిసినదంతా శివార్పణం.*


*నిజానికి భక్తి అంటేనే శివార్పణం. శివార్పణం అని మనసారా అనగలిగితే ఆ మాట చాలు ఆనందింపజేస్తుంది. శివుడితో కలిసిన ఏ మాటకైనా అందం వస్తుంది. శివభక్తి, శివప్రేమ, శివార్పణం ఇలాంటి మాటలు. ఇతనికి తెలిసిన ఒకే పదం శివార్పణం!*


*అటు తర్వాత చేపలు పట్టుకొనేవాడు. ఇతడు జాలరి వాళ్ళకు నాయకుడు. నాయకుడు ఏం చెప్తే మిగిలిన వాళ్ళు అదే. ఒక కట్టు ఉండాలి. ఒక పద్ధతి ఉండాలి గనుక ఒక నాయకుడిని పెట్టుకున్నారు. ఈనాయకుడిగా ఉంటూ ఉంటే అందరూ హాయిగా ఉన్నారు. మత్స్యసంపదతో సంపదలన్నీ సంపాదించుకుంటూ హాయిగా ఉన్నారు. *


*ఏం దౌర్భాగ్యమో కానీ కొంతకాలం వాళ్ళకి చేపలు పడలేదు. ఎన్నాళ్ళు సముద్రంలోకి ఎంతోదూరం వెళ్ళి వేటాడుతున్నా చేపలు పడలేదు. దరిద్రం వచ్చింది. ఉన్న నిల్వలన్నీ కూడా నిత్యభోజనాలకీ, కుటుంబపోషణలకీ అయిపోయాయి.*


*చివరికి తిండికి కటకటలాడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అందరికీ ఇదే పరిస్థితి. ఇళ్ళల్లో పొయ్యి వెలగట్లేదు.*


*ఒకసారి అందరూ గుంపుగా వెళ్ళినప్పుడు వల వేశారు. ఈ పెద్దాయన వల వేయగానే వలలో ఏదో బరువుగా పడింది. ఏమిటా అని తీసి చూస్తే ఎన్నడూ ఎవ్వరూ చూడని కనీవినీ ఎరుగని ఒక చేప వచ్చింది.*


*అది బంగారు రంగు పొలుసులు, రత్నాలు తాపినటువంటి చర్మంతో ఆశ్చర్యకరంగా ఉన్నది.* 


*దానిని వీళ్ళందరూ కష్టపడి పడవ మీదకి తీసుకువచ్చారు. ఈ చేపని కానీ తీసుకువెళ్ళి రాజుగారికి ఇస్తే ఆ రాజు దీనిని ఉంచుకొని వీళ్ళకి కావలసినంత సంపద ఇస్తాడు. లేదా ఎవరికైనా అమ్ముకున్నా దీనినుంచి వచ్చేది మరి ఎప్పుడూ చేపలు పట్టుకోవలసిన అవసరం లేనంత సంపద వచ్చేది.*


*కానీ ఇతనికున్న అలవాటు వచ్చిన మొదటి చేపని శివార్పణం అని వేయడం.*


*పోనీ దీనితోపాటు ఒక రెండు, మూడు చేపలు వస్తే అసలు బంగారు చేప ఉంచుకొని రెండోది పడేయచ్చు. కానీ ఈయనకి వచ్చింది ఒకటే చేప.*


*ఇక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరికీ భయం పట్టుకుంది. ఎందుకంటే ఈయన అలవాటు వాళ్ళందరికీ తెలుసు. మొదటిది శివార్పణం అని వేయడం అలవాటు. నాయకుడు కాబట్టి వద్దు అనలేరు. అప్పుడు ఏం చేస్తాడో అని ఆవేదన  కలిగినది,  వీళ్ళందరికీ. వచ్చింది శివార్పణం ఇవ్వకపోతే ఏమౌతుందో అని భయం లేదు. మిగిలిన వాళ్ళందరూ తిండికి లేదని ఏడిస్తే ఈయన రోజూ శివార్పణం చేయడానికి చేప లేదు అని ఏడ్చేవాడు.*


*అదీ భక్తి అంటే…!*


*ఇతని ఏడుపులో ఆ ప్రేమ ఉంది. మిగిలిన వారికి సంపద లేదే అని బాధ. ఇప్పుడు ఇతనికి ఇన్నాళ్ళకి నాకు శివుడికి అర్పించడానికి గొప్ప చేప దొరికింది అని ఆనందం కలిగింది. ఇంతకాలం మామూలు చేప ఇచ్చాను. శివుడికి అర్పించడం కోసం అద్భుతమైన చేప దొరికింది అని ఒళ్ళంతా పులకించిపోయింది. కళ్ళవెంట ఆనందాశ్రువులు రాలుతున్నాయి.*


*పైకి తీశాడు ఆ చేపని. వీళ్ళకి భయం వేసి కాళ్ళు పట్టుకున్నారు పారేయకు అని!*


*వీళ్ళెవరూ పట్టట్లేదు అతనికి.    ఆ శివుడికి అర్పిస్తున్నాను అని తీసుకొని ‘శివార్పణం’ అని సముద్రంలో వేశాడు.*


*వెంటనే ఒక్కసారిగా ఆకాశంలో మహాకాంతిపుంజం కనిపించి ఆ కాంతిపుంజమధ్యంలో వృషభవాహనారూఢుడై పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు దర్శనమిచ్చి “సంతోషించాను!” అని ఇతనితో పాటు అందరినీ తనలో ఐక్యం చేసుకొని వాళ్ళకి దివ్యమైన మోక్షాన్ని అనుగ్రహించాడు.* 


*’ఒక్క భక్తుడిని అంటిపెట్టుకున్నా చాలు తరించిపోతాం!’ అని చెప్పడం.* *‘స్వయం తీర్త్వా పరాన్ తారయతి’* 


*తాను తరించడమే కాకుండా ఎందరినో తరింపజేశాడు.*


*ఆ భక్తుడి పేరున ఇప్పటికీ అక్కడ ఉత్సవం జరుగుతుంది.*


*ఆ సమీపంలో ఉన్న శివుని ఉత్సవమూర్తియై ఇక్కడికి తెస్తారు.* 


*ఆ జాలరి వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఉత్సవం జరుగుతుంది.* 


*భారతదేశం అంతా ఈ దృష్టితో వెతకాలి, తిరగాలి. భగవంతుడిని చరిత్రలో చెప్పిన సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయి అని వెతికితే ఇప్పటికీ దొరుకుతాయి.* 


*ఇలా ఈ మహానుభావుని ‘శివార్పణం’ కథ చెప్పుకున్నాం. దీనిని భావించినట్లయితే ‘అర్పణ బుద్ధి’ అంటే ఏమిటో తెలుస్తున్నది.* 


*కొంతమంది భగవంతుడి దయవల్ల సంపాదించి మాటిమాటికీ అంటూ ఉంటారు భగవంతుడు ఇచ్చాడని. కానీ ఎంత ఉన్నా ఇచ్చింది ఏమౌతుందో అనే భయం వాళ్ళకి. ఒకళ్ళకి ఇవ్వడానికి, దానం చేయడానికి కూడా బుద్ధి పుట్టదు.*


*’అర్పణకి’ సిద్ధంగా ఉన్నవాడికే అన్నీ లభిస్తాయి.*


*కనుక అర్పించేదే నీది, దాచుకున్నది నీదికాదు. తరువాత ఎవడిదో అవుతుంది. ఇలాంటి కథలు వింటే స్వార్థరాహిత్యము, త్యాగనిరతి, ఏర్పడి నీతి, నిజాయితీ అభివృద్ధి చెందుతాయి.*


*ఇలాంటి  నిజ జీవిత గాధలను చిన్నప్పటినుంచీ తెలియజేసినట్లయితే పిల్లల్లో పవిత్రమైన సంస్కారాలు వస్తాయి.*


*భగవత్కథ వింటూ ఉంటే మనలో రజోగుణ తమోగుణాలు పోయి మంచి సంస్కారాలు మేల్కొంటాయి.* 


*భగవంతుడు ఒక తల్లిదండ్రులకంటే ఎక్కువగా కనురెప్పలా కాచుకుంటాడు అనడానికి చాలా అద్భుతమైన చరిత్రలు చాలా వున్నాయి.*

            *ఓం నమ:శ్శివాయ:  !!*


🌹🌼🌼🌼🌼🌹🌹🌼🌼🌼🌼🌹


*📮 ఈ మెసేజ్ చదివి ఊరుకోవడం కాకుండా మీకు వీలైనంత వరకు తప్పకుండా ఫార్వర్డ్ మరియు షేర్ చేయగలరు.*

పిల్లలు చెడిపోవడానికి

 *తల్లి తండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిషత్ పై ఆలోచించండి..*


*పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఉపాధ్యాయులు, ఫోన్లు, మీడియా 10 % , కానీ 90% మాత్రం తల్లిదండ్రులే..!*🙏


పిల్లల్ని గారాబం *శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది..*  పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢనమ్మకాలు, స్వార్థం, అతి  ప్రేమ వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తూ వారిని నాశనం చేస్తున్నారు. 


ఇప్పుటి తరం 70% పిల్లలు..

👉తల్లిదండ్రులు కారు, బండి తుడవమంటే తుడవరు..

👉మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు..

👉లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు..

👉కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు.

👉రాత్రి 10 గంటలలోపు పడుకుని, ఉదయం 6 లేదా 7 గంటలలోపు నిద్ర లేవరు...

👉గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెబుతారు..

👉తిడితే వస్తువులను విసిరి కొడతారు. ఎప్పుడయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ , నూడుల్స్, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు..

👉ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు..

👉ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..

👉అతిథులు వస్తే కనీసం గ్లాసేడు మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనలేని అమ్మాయిలు కూడా ఉన్నారు..

👉20 సంవత్సరాలు దాటినా చాలామంది ఆడపిల్లలకు వంట చేయడం రాదు..

👉బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడలేని కోపం వీరికి.. 

👉కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింత పోకడలు..

👉వారిస్తే వెర్రి పనులు..

👉మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు,

కానీ కారణం మనమే..

ఎందుకంటే *మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి..*


చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి. రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం..

గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..


*వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది*.. 

*కష్టం గురించి తెలిసేలా పెంచండి* 

కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం *విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు..*


ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరెట్స్, మందు, బెట్టింగ్, డ్రగ్స్, దొంగతనాలు, రేప్ లు, హత్యలు చేస్తున్నారు.. మరికొంతమంది సోమరిపోతులా తయారవుతున్నారు..


*అభినయాలు కనపడడం లేదు, అణకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..*

ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..


భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..


మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం.. కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం..


👉కాలేజీ పిల్లలయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫిన్, లంచ్ చిన్న బాక్సు రైస్.. చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు...


గర్భవతులైన తరువాత వారి బాధలు వర్ణనా తీతం. టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, *100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి..

అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..


03వ తరగతి పిల్లాడికి సోడాబుడ్డి లాంటి కళ్ళద్దాలు..

05వ తరగతి వారికి అల్సర్, బీపీలు..

10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలొస్తున్నాయి..

వీటన్నికి కారణం మనం. మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..అందుకే *తల్లిదండ్రులు మారాలి..*


*రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి...

*సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?*


కేవలం గుడికి వెళ్లి పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము. అది మాత్రమే కాదు.


సాంప్రదాయం అంటే అలా అనుకోవడం కొంత పొరపాటు..

పిల్లలకు..👇

👉  *బాధ్యత* 

👉  *మర్యాద*

👉  *గౌరవం* 

👉  *కష్టం* 

👉  *నష్టం* 

👉  *ఓర్పు*

👉  *సహనం*

👉  *దాతృత్వం*

👉  *ప్రేమ*

👉  *అనురాగం*

👉  *సహాయం*

👉  *సహకారం*

👉  *నాయకత్వం*

👉  *మానసిక ద్రృఢత్వం* 

👉  *కుటుంబ బంధాలు*

👉  *అనుబంధాలు*    

👉  *దైవ భక్తి*

👉  *దేశ భక్తి*


కొంచెం *కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి..* 

మంది కోసం బ్రతకద్దు మన ఆరోగ్యం, ఆనందం కోసం న్యాయంగా బ్రతుకుదాం.


ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, *ఉత్తమ జీవన విధానం* వారికి అందించిన వారమవుతాం..


భావితరాల పిల్లల కోసం ,




సూక్ష్మక్రిమి పరిజ్ఞానం

 ఆయుర్వేదం నందు గల సూక్ష్మక్రిమి పరిజ్ఞానం  - 


     ఇప్పటివరకు మనం అనుకుంటున్నట్టుగా సూక్ష్మక్రిములను కనుగొన్నది పాశ్చత్య శాస్త్రజ్ఞులు మాత్రం కాదు.  వారికంటే కొన్ని వేల సంవత్సరాల మునుపే మన పూర్వీకులకు సూక్ష్మక్రిముల పైన మరియు అవి కలుగచేసే వ్యాధుల పైన సంపూర్ణ అవగాహన కలదు. ఈ విషయాల గురించి నేను తెలుసుకొవడానికి కొన్ని అత్యంత పురాతన ఆయుర్వేద గ్రంథాలు పరిశీలిస్తున్నప్పుడు వాటిలో కొన్ని చోట్ల ఈ సూక్ష్మక్రిమి సంబంధమైన అనేక విషయాలు నేను తెలుసుకోవడం జరిగింది. ఆ విలువైన సమాచారాన్ని మీకు కూడా తెలియచేయుటకు ఈ పోస్టు పెడుతున్నాను .


         సుశ్రుతునకు సూక్ష్మక్రిములుకు సంబంధించిన పరిజ్ఞానం అపారంగా ఉన్నది అని చెప్పవచ్చు. రోగానికి కారణం అయ్యే సూక్ష్మక్రిములను గురించిన జ్ఞానమునకు "భూతవిద్య " అని పేరుకలదు . అష్టాంగహృదయములో ఇది ఒక ప్రత్యేక భాగముగా పరిగణించబడినది. భూతవిద్యా లక్షణమును చెప్పునప్పుడు దేవాసుర , గంధర్వ , యక్ష , రక్ష , పితృ , పిశాచ , నాగ అనే భూత గ్రహాలుగా సూక్ష్మజీవులను వర్ణించాడు. కొన్ని మంత్రగ్రంధాలలో పైన చెప్పిన పేర్లు కలవారు వేరే లోకమునకు సంభంధించినవారుగా దుష్టశక్తులుగా వర్ణించి వారు మానవులను పట్టి పీడించువారుగా ఉన్నది. కాని సుశృతుడు దీనికి ఒప్పుకోడు వారు దేవాసుర , గంధర్వులు ద్యులోక వాసులు వారు భూలోకమునకు వచ్చి మనుష్యులతో కలిసి ఎన్నటికీ నివసించరు అని ఆయన అభిప్రాయం .


       సుశ్రుతుడు సూక్ష్మజీవుల గురించి వివరిస్తూ వాటిని గ్రహములగా పిలుస్తూ ఈ విధముగా చెప్పుచున్నాడు. కోట్లకొలది అసంఖ్యాకముగా ఉన్న ఈ గ్రహములు రక్తము , మాంసములను భుజించి వృద్ది అగుచుండెను . అవి మహాపరాక్రమము కలిగినవి. అయినను అవి సూర్యుని వెలుగుకు జడిసి రాత్రుల యందు సంచరించుచుండును . చీకటి , నీడగల తావుల యందు పగలంతా ఉండును. ఈ సూక్ష్మక్రిములు నేలమీదను , అంతరిక్షము నందు , అన్ని దిక్కుల లోను పాడిపడిన చీకటి గృహముల యందు నివాసము ఉండును. ఈ సూక్ష్మక్రిములు ఒకొక్క కాలము నందు విజృంభించి జనులను పీడించునని సుశృతుడు తెలియచేసెను .


         వ్రణసంబంధ ఇన్ఫెక్షన్స్ గురించి సుశృతుడు వివరించుతూ ఈ సూక్ష్మక్రిములకు మాంస , రక్తం ప్రియం అగుటచేత గాయములలోకి తరచుగా ప్రవేశించి సమస్యలను కలుగచేయునని తెలుపుతూ ఈ రోగకారణమగు సూక్ష్మక్రిములను మూడు ప్రధాన గణములుగా గుర్తించారు. 


            ఇప్పుడు సుశృతుడు రోగహేతుకారణాలైన సూక్ష్మజీవులను మూడు రకాలుగా వర్గీకరించారు. వాటి గురించి మీకు వివరిస్తాను.  అవి 


 1 -  పశుపతి అనుచరులు .


 2 -  కుబేర అనుచరులు .


 3 -  కుమార అనుచరులు .


 *  పశుపతి అనుచరులు  -


      మనస్సు , ఇంద్రియములను వికలమొనర్చి  భ్రమ , ప్రలాప , ఉన్మాదములను కలిగించును. 


 *  కుబేర అనుచరులు  - 


       ఇవి యక్షరక్షో గణములకు చెందిన క్రిములు . శారీరక బాధలను మాత్రమే కలిగించును.


 *  కుమార అనుచరులు  -


       పసిపిల్లలను వశపరుచుకొని బాధించును . వీటినే బాలగ్రహములుగా పిలుస్తారు . 


         పైన చెప్పినవిధముగా సుశ్రుతుల వారు సూక్ష్మక్రిములను మూడు రకాలుగా వర్గీకరించారు . మలేరియా జ్వరమునకు రురుజ్వరం అని తక్ష్మ జ్వరం అనియు అధర్వణవేదములో వ్యవహరించబడినది. ఈ జ్వరమును కలిగించే సూక్ష్మక్రిములు ఉండు నివాసస్థలము గురించి చెప్పుతూ  గుడ్లగూబ , గబ్బిలము , కుక్క , తోడేలు , డేగ , గద్ద  ఈ జంతుపక్షి శరీరాల్లో మలేరియా క్రిములు ఎల్లప్పుడూ ఉండి వాటి మలముతో బయటకి వచ్చి జనులు తాగే నీటిలో కలిసి మనుష్యులకు సంక్రమించునని ఉన్నది.


           ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో కొన్నింటిలో ఈ విధముగా ఉన్నది. క్రిములు శరీరం నందు ప్రవేశించినంత మాత్రాన రోగము రాదు . శరీరము నందు ఓజస్సు మిక్కిలిగా అభివృద్ధిచెందిన ఊర్జశక్తి అన్ని రకముల క్రిములను జయించుచున్నది. ఇక్కడ మనశరీరములోని రోగనిరోధక శక్తి గురించి వివరణ ఇవ్వడం జరిగింది. శరీరానికి హితమైన ఆహారం సేవించకుండా విరుద్ద ఆహారాలను సేవించువారికి , ప్రకృతివిరుద్ధ నియమాలు పాటించువారికి క్రిములు బాధించును గాని  అగ్నిదీప్తి చక్కగా ఉండి యవ్వనంలో ఉన్నవారికి , స్నిగ్ధ శరీరులకు , వ్యాయమం చేయుచుండువారికి , శరీరబలం అధికంగా ఉన్నవారికి క్రిములు ఏమి చేయలేవు .


               క్రీ . శ 18 వ శతాబ్దములో మైక్రోస్కోప్ యంత్రము కనిపెట్టబడిన పిమ్మట సూక్ష్మజీవులను కనుగొన్నారు అని మన పాఠ్యపుస్తకాలలో చదువుతున్నాం .కాని కొన్నివేల సంవత్సరాలకు పూర్వమే మన మహర్షులు ఈ సూక్ష్మక్రిమి విజ్ఞానం సంపాదించారు. మన మహర్షులు దివ్యజ్ఞాన సంపన్నులు వారు తమ మనోనేత్రముతో అన్నింటిని దర్శించగలరు మరియు కనుగొనగలరు. మైక్రోస్కోప్ గురించి దానికి పాశ్చాత్యులు కనుగొన్నారు అని గొప్పగా చెప్పుకుంటాం కాని అధర్వణవేదము నాలుగోవ కాండ ఇరవైవ సూక్తములో పిశాచక్షయ మంత్రములో మైక్రోస్కోప్ వంటి "బిబిర్హిని " అను ఒక దివ్య ఔషధి లభించినట్టు కశ్యప మహాముని ఈ ఔషదీ సహయముతో భూమి మరియు అంతరిక్షంలో వ్యాపించి ఉన్న సర్వరోగ క్రిములను చూడగలిగెను అని ఈ మంత్రం చెప్పుచున్నది. క్రీ .శ  మూడొవ శతాబ్దములో బింబసారుని ఆస్థాన వైద్యుడు అయిన జీవకునికి ఇట్టి మహత్తర ఔషధి లభించెనని గ్రంధస్థం చేయబడి ఉన్నది. దీని సహాయముతో నేటి ఎక్సరే యంత్రము వలే శరీర అంతర్భాగము నందలి శరీరభాగాలను చూస్తూ పేగులలో చిక్కుకున్న రాళ్లను తీసివేశారు అని ఎన్నో పురాతన గ్రంథాలలో కలదు.


                           సమాప్తం 


    మరింత విలువైన సమాచారం నేను రాసిన గ్రంథముల యందు సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. 


      గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

సత్సంగం

 🦜 *తెలివైన చిలుక* 🦜


ఒక వ్యక్తి పట్టణంలో జరుగుతున్న సత్సంగానికి  ప్రతిరోజు వెళ్ళుతుండేవాడు.


ఆ వ్యక్తి ఒక చిలుకను పంజరములో ఉంచి పోషించేవాడు.


ఒక రోజు చిలుక తన యజమానిని అడిగింది, 'మీరు ఎక్కడకు రోజు వెళ్తున్నారు' అని?


అతను ఇలా అన్నాడు, "మంచి విషయాలు తెలుసుకోవడానికి నేను రోజూ సత్సంగానికి వెళతాను."


"మీరు నాకు ఒక సహాయం చేయగలరా?" అని అడిగింది ఆ చిట్టిచిలుక ఆ యజమానిని. "నేను ఎప్పుడు స్వేచ్ఛ పొందగలను అని మీ గురువు గారిని అడిగి చెప్పండి" అని.


మరుసటి రోజు, యజమాని సత్సంగానికి వెళ్ళాడు.


సత్సంగం ముగిసిన తర్వాత, అతను గురువు దగ్గరకు వెళ్లి, "మహారాజ్, నా ఇంటిలో ఒక చిలుక ఉంది, అది స్వేచ్ఛ ఎప్పుడు పొందగలదో మిమ్మలను అడిగి తెలుసుకోమని ప్రాధేయపడింది" అని.


అది విన్న వెంటనే, గురువుగారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.


ఇది చుాసిన చిలుక యజమాని భయపడి,నిశ్శబ్దంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు.


అతను ఇంటికి చేరుకొన్నాడు. అతని చిలుక అతనిని అడిగింది, 'మీరు నా ప్రశ్నను గురువుగారిని అడిగారా?' అని.


యజమాని బదులిచ్చాడు- 'నేను అడిగాను కానీ నీ అదృష్టం బాగాలేదు. నేను నీ ప్రశ్న అడిగిన వెంటనే, గురువుగారు అపస్మారక స్థితి లోకి వెళ్లిపోయారు' అని.


"సరే సరే, నేను అర్థం చేసుకున్నాను" అన్నది ఆ చిలుక.


మరుసటి రోజు సత్సంగానికి వెళ్తూ, యజమాని పంజరంలో ఉన్నచిలుక అపస్మారక స్థితిలో ఉండడాన్ని చూశాడు.


యజమాని పరీక్షగా చూసి చిలుక చనిపోయిందనుకుని  బయటకు తీసాడు. దానిని నేలమీద ఉంచాడు. వెంటనే ఆ చిలుక రివ్వుమంటూ ఎగిరిపోయింది. 


చేసేది లేక సత్సంగం కోసం మామూలుగా వెళ్లాడు ఆ యజమాని.


గురువు అతనిని చూసి, దగ్గరకు పిలిచి, "నీ చిలుక ఎక్కడ ఉంది?" అని అడిగాడు.


"నేను ఉదయం సత్సంగానికి వచ్చేటప్పుడు, నా చిలుక అపస్మారక స్థితికి గురై, పంజరంలో పడి ఉంది. దాని ఆరోగ్యం తనిఖీ చేయడానికి నేను పంజరం తెరిచి దానిని నేలమీద ఉంచినప్పుడు, అది పారిపోయింది" అని దిగులుగా చెప్పాడు.


గురువు నవ్వి, "మీ చిట్టిచిలుక మీ కన్నా ఎక్కువ తెలివిగలది. అది నేను ఇచ్చిన చిన్న సూచన అర్థం చేసుకుని ఆచరణలో పెట్టి స్వేచ్ఛను పొందగలిగింది.


కానీ మీరు చాలా రోజుల పాటు సత్సంగానికి వస్తూ కూడా సాధన చేయక, ఈ ప్రపంచంలోనే  భ్రమ అనే పంజరంలో చిక్కుకొని ఉన్నారు."


అని అన్నాడు.


యజమాని సిగ్గుతో తలదించు కొన్నాడు.


దూరం నుంచి చిలుక గురువుకు కృతజ్ఞతలు తెలుపుకుంది.


*నీతి :: సత్సంగం యొక్క ఉద్దేశం కేవలం భక్తికోసం కాదు, కాలక్షేపం కోసం కానే కాదు. అజ్ఞానం నుండి, అంధకారం నుండి, భ్రమ నుండి మనం బయటపడి స్వేచ్ఛగా విముక్తలమై దైవానికి చేరువకావడం కోసం అని గ్రహించాలి...☝️

సకాలసంధ్యావందనం

 🌸🌸🌸                       🌸🌸🌸

*సకాలసంధ్యావందనం ఎంతో ముఖ్యమైనది...*




                                                                        సంధ్యాసమయంలో భగవద్ధ్యానం మంచిదనీ అంటారు. సంధ్యాకాలం అంటే సరిగ్గా ఏ సమయం? 'సకాలం'లో సంధ్యావందనం చేయాలి కదా? ఆ 'సకాలం' ఏమిటి? 


      రోజుకి మూడు సంధ్యలు శాస్త్రంలో చెప్పబడ్డాయి. 1. ప్రాతఃసంధ్య, 2. మధ్యాహ్న సంధ్య, 3. సాయం సంధ్య. ఇవికాక కొన్ని ఉపాసనలకు చెప్పబడ్డ సంధ్య - తురీయ సంధ్య. ఇది నాలుగవది. దీని సమయం అర్ధరాత్రి. (కొందరు ఇది ఆచరిస్తుంటారు)


       ఉదయానికి ముందు వచ్చేకాలం 'ప్రాతఃసంధ్య'. రాత్రికి ముందు వచ్చేది ' 'సాయంసంధ్య', మధ్యాహ్నవేళ 'మధ్యాహ్నిక సంధ్య'. 


*ఉదయా ప్రాక్తనీ సంధ్యా*

*ఘటికా త్రయ ముచ్యతే ౹*

*సాయం సంధ్యా త్రిఘటికా*

*అస్తాదుపరి భాస్వతః ౹౹*


సూర్యోదయానికి ముందు దాదాపు 70 నిమిషాల కాలం ప్రాతః సంధ్యకు ముఖ్యకాలం. సూర్యుడస్తమించడానికి ముందు ఇరవై నిమిషాలు మొదలుకొని, సూర్యుడస్తమించిన తరువాత 30 నిమిషాల కాలం సాయంసంధ్యకు ముఖ్య కాలం. ఇందులోనూ ఉత్తమ, మధ్యమ, అధమ భేదాలున్నాయి. 


1. *ఉత్తమా తారకోపేతా*

    *మధ్యమా లుప్త తారకా ౹*

    *అధమా సూర్యసహితా*

    *ప్రాతఃసంధ్యా త్రిధామతా ౹౹*


తెల్లవారు ఝామున నక్షత్రాలుండగా ప్రాతః సంధ్యావందనానికి ముఖ్యకాలం. ఇదే సకాలం. తారకలు లేని ప్రాతఃకాలం మధ్య కాలం, సూర్యుడు ఉదయించిన తరువాత సంధ్యా వందనానికి అధమ కాలం, సకాలంలో చేయడమే సర్వశ్రేష్ఠం. అలా కుదరనప్పుడు, మానేయడం మంచిది కాదు కనుక, "ముఖ్య కాలాతిక్రమణ దోష పరిహారార్ధం" అధిక అర్ఘ్యప్రదానంతో సంధ్యోపాసన చేయాలి. 


2. *ఉత్తమా సూర్యసహితా*

    *మధ్యమా లుప్త భాస్కరా ౹*

    *అధమా తారకోపేతా*

    *సాయం సంధ్యా త్రిధామతా ౹౹*


సాయంవేళ సూర్యుడుండగా చేసే సంధ్యావందనం ముఖ్యకాలం, సకాలం. సూర్యుడస్త మించినప్పుడు మధ్యమం. నక్షత్రోదయం తరువాత చేయడం అధమం. కానీ 'సకాలం' దాటిపోతే, ప్రాతః సంధ్యకు లాగానే, 'ముఖ్య కాలాతిక్రమణ దోష పరిహారార్ధం' అధిక అర్ఘ్య ప్రదానం చేయాలి. 


'మధ్యాహ్న సంధ్య' అంటే మధ్యాహ్నం 11 గంటల తరువాత నుండి సాయంత్రం లోపల చేయాలి.......

సుభాషితం

 🕉️✡️ *సుభాషితమ్* ✡️🕉️

--------------------------------------------


శ్లోకం:

*అహో దుర్జనసంసర్గాత్*

*మానహానిః పదే పదే।*

*పావకో లోహసఙ్గేన*

*ముద్గరైరభిహన్యతే॥*

                  ~సుభాషితరత్నావళి


తాత్పర్యం:

దుర్జనులతో సహవాసము చేయడం వలన గౌరవానికి అడుగడుగునా భంగము కలుగును. ఇనుముతో సంబంధమువల్ల అగ్నిని సమ్మెటలతో కొడతారు.

------------------------------------------


🌸 *మరొక సుభాషితం* 🌸


శ్లో.

*న శరీరమలత్యాగాత్ నరో భవతి నిర్మలఃl*

*మానసే తు మలే త్యక్తే తతో భవతి నిర్మలఃll*


తా.

"శారీరకమాలిన్యమును తొలగించుకొనుటవల్ల మానవుడు నిర్మలుడు కాడు. మనోమాలిన్యమును తొలగించుకోవడం వల్లనే నిజముగా నిర్మలుడు అగుచున్నాడు".

-----------------------------------------

28, మార్చి 2022, సోమవారం

ఉచితంగా

 🍁ఉచితం🍁

ఒక రోజున దొంగ ఒకడు 

ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు.

ఇంటి ముందు కాపలాగా 

ఒక కుక్క ఉన్నది. 

దొంగను చూసింది కానీ 

ఏ చప్పుడు చేయకుండా చూస్తూ ఉన్నది. 

అతన్ని చూసి మొరగని కుక్కను చూసి దొంగ ఆలోచనలో పడ్డాడు. దొంగతనానికి వెళదామా? వద్దా? అని.

తీరా ఇంటి లోపలకు వెళ్ళాక కుక్క అరిచిందంటే ఏం చేయాలి? 

ఇప్పుడే అరిస్తే వేరే ఇంటికి దొంగతనానికి వెళ్లొచ్చు! 

అని అనుకున్నాడు.

ఇలా ఆలోచిస్తూ చివరగా తాను తెచ్చిన రొట్టెముక్కను  కుక్కకు విసిరాడు. 

అంతే వెంటనే ఆ కుక్క గట్టిగా అరుస్తూ అతని వెంటపడి కరవడానికి ప్రయత్నించింది.

అప్పుడు దొంగ కుక్కతో ఇలా అన్నాడు. 

"నన్ను చూసికూడా అరవని నువ్వు రొట్టె ముక్క ఇవ్వగానే అరుస్తున్నావు ఎందుకు?" అని అడిగాడు.

నువ్వు ఊరికే ఉన్నప్పుడు, ఒకవేళ నువ్వు ఈ ఇంటి బంధువో లేక తెలిసిన వ్యక్తో అయిఉంటావని  అనుకున్నాను.

కానీ ఎప్పుడైతే నువ్వు "ఉచితంగా రొట్టెముక్క  ఇచ్చావో అప్పుడే నాకు అర్థమయింది 

నువ్వు దొంగవని", ఉచితంగా

అని బదులిచ్చింది 

ఆ కుక్క.

ఆలోచించవలసిన విషయమే కదండీ ఇది. 

ఉచితం అనగానే ఆలోచన మరిచి ఎగబడుతున్నారు జనాలు.

"ఉచితంగా రొట్టె" ఇచ్చాడంటే అందులో ఎంతటి అర్థం ఉందో గ్రహించింది కుక్క. 

కానీ మషులమైన మనమే "ఉచితంగా డబ్బులు" ఎందుకు ఇస్తునారో గ్రహించలేక పోతున్నాం.

ఒక కుక్క గ్రహించిన 

చిన్న విషయాన్ని కూడా మానవులమైన మనం గ్రహించలేక పోతున్నందుకు  చాల బాధగా ఉంది. 


         ✡️✡️✡️✡️✡️✡️✡️ 


విద్య, వైద్యం, ఈ మూడు మాత్రమే ఉచితంగా ఇస్తే చాలు ప్రజలకు సంతోష పడతారు.

భ్రాంతులు

 శ్లోకం:☝️

    *పాలాశకుసుమభ్రాంత్యా*

*శుకతుండే పతత్యళిః |*

    *సోఽపి జంబూఫలభ్రాంత్యా*

*తం అళిం హంతుమిచ్ఛతి ||*


భావం: మోదుగపుష్పమను భ్రాంతిచే తుమ్మెద చిలుకముక్కుపై వాలిందిట. చిలుక ఆ తుమ్మెదను నేరేడుపండనుకుని దానిని తినడానికి ప్రయత్నిస్తోంది. ఎవరి భ్రాంతులు వారివి!

దూరంగా ఉండుట మంచిది!

 శ్లోకం:☝️

    *క్షణే రుష్టాః క్షణే తుష్టాః*

*రుష్టా తుష్టాః క్షణే క్షణే |*

    *అవ్యవస్థిత చిత్తానాం*

*ప్రసాదోపి భయంకరః ||*


భావం: క్షణం కోపం క్షణం శాంతం కలిగినవారి ప్రసన్నత కూడా ఎంతో భయంకరంగా ఉంటుంది. ఏ నిమిషానికి ఎలా ఉంటారో తెలియని వ్యక్తులకు దూరంగా ఉండుట మంచిది!

సంపంగి శాపం!

 🎻🌹🙏*సంపంగి శాపం!!*...


🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿


🌷 ఎంతో సువాసన ఇచ్చే సంపంగి పుష్పమును దేవుని పూజ లో ఉపయోగించము,,కారణము ఏమిటో తెలుసుకొందాము,, ఒకానొక కాలంలో ఒక దురాత్ముడు ఉండేవాడు. అయినను అతడు నిత్య శివపూజాసక్తుడు. ప్రతిదినం సంపెంగలచేత శివుని పూజించి ఆయన కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రుడైనవాడు.


🌷 ఆ దేశపు చక్రవర్తినే శాసించగల స్థితికి చేరుకున్నవాడు. చక్రవర్తి అంతటి వాడిని, పాదాక్రాంతుడిగా చేసుకున్న గర్వంతో అతడు ప్రజలను పీడించసాగాడు. కానీ, అతడిపై ఫిర్యాదు చేసినా రాజు పట్టించు కొనేవాడుకాదు.


🌷 ఇలా ఉండగా - అతడు ప్రతిరోజు తన అర్చన (సంపెంగపూలతో) మానివేయకుండా జాగ్రత్త పడుతూవచ్చాడు. ఆ కారణాన అంతులేని శివానుగ్రహానికి పాత్రుడయ్యాడు. నారదుడు ఓసారి భూలోక సంచారార్థం వచ్చినప్పుడు ఈ వైనం అంతా చూశాడు. కానీ ఆయనకు మొదట్లో ఈ దుష్ఠుని అంతర్యం అంతుపట్టలేదు.


🌷 అతడెటువంటివాడని అడగ్గా, సంపంగి బదులివ్వలేదు. కేవలం ఆ దుష్టబుద్ధి అకృత్యాలకు భయపడి సంపంగి మారుపల్కలేదు.


🌷 అయినా దేవర్షి అంతటివాడు అడిగినప్పుడు సత్యం చెప్పాలి కదా! దుష్టుని బెదిరింపు వల్ల చెప్పలేకపోవచ్చు! అసత్యమేల? నారదుడు తరచి తరచి ప్రశ్నించినా తనకేమీ తెలియదంది సంపంగి. అసత్యదోషానికి పాల్పడినందువల్ల 'నేటినుంచీ నీ పూలు శివపూజార్హత కోల్పోవుగాక!' అని శపించాడు నారదుడు.


🌷 అంతవరకు శివప్రీతికరమైన సంపెంగకు శివపాద సన్నిధి చేరే అవకాశం నశించింది.


*(శ్రీ శివ మహాపురాణము నుండి సేకరించిన కధ)*...🌞🙏🌹🎻


🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

శివ క్షేత్రాలు:

 శివ క్షేత్రాలు:


కొన్ని విశిష్టమైన శివ క్షేత్రాలు:

భైరవకోన ::


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగల 'ప్రకాశం' జిల్లా కొత్తపల్లి గ్రామానికి 5 కి.మీ. నడక దూరంలో ఈ క్షేత్రము కలదు. ఎక్కడ చూసినా కోనేరులు, శివ లింగాలు కనిపించే ఈ కొనలో ఒకే రాతిలో చెక్కబడిన 8 శివాలయాలు క్రీ.శ. 7, 8 శతాభ్దాలలో నిర్మించబడినట్లు చరిత్ర. పురాణాలలో వర్ణించిన శివుడు తన 8 రూపాలకు సంకేతంగా శశినాగ, రుద్ర, విశ్వేశ్వర, నగరికేశ్వర, భర్గేశ్వర, రామేశ్వర, మల్లిఖార్జున, పక్షఘాతక లింగాల రూపంలో దర్శనమిస్తాడు.


ధర్మస్థల ::


కర్నాటక రాష్ట్రంలో గల 'ఉడిపి' నుండి 120 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. ఇది మంగుళూరు నుండి 75 కి.మీ. దూరంలో ఉన్నది. నేత్రావతి నదీ తీరంలోనున్న ఇచ్చటి ఆలయం పేరు 'మంజునాథేశ్వరాలయం'. క్రీ.పూ. 10వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించబడింది.ఈ ఆలయంలో అసత్యం పలికే విపత్తు కలుగుతుందనే నమ్మకం వలన కోర్టులో తెగని కేసులు స్వామి ఎదుట పరిష్కారం పొందుతారు. ఆలయంలో మూలవిరాట్ ను జైనులు ప్రతిష్ఠించారు. 800 సంవత్సరాల నుండి నిత్యాన్నదానం ఇచ్చట జరుగుతుంది.

తంజావూరు ::


తమిళనాడు రాష్ట్రంలో గల 'చెన్నై' నుండి 335 కి.మీ. దూరంలో గల 'తంజావూరు' అద్భుత క్షేత్రం. ఇచ్చటి ఆలయం పేరు బృహదీశ్వరాలయం. ఇది 10వ శతాబ్దంలో రాజరాజచోళుడు అనే చక్రవర్తిచే నిర్మించబడినది. ప్రపంచంలోని ఏ ఆలయానికి ఇంత ఎత్తయిన ప్రాకారాలు లేవని అంటారు. ఈ ప్రాకారం పొడవు 793 అడుగులు, వెడల్పు 393 అడుగులు, 13 అంతస్తులుగా నిర్మించిన 216 అడుగుల ఎత్తుగల ఆలయ గోపురం పై 80 టన్నుల రాయిని శిఖరాగ్రంగా ఆ రోజుల్లో 4 మైళ్ళ దూరం నుండి ఏటవాలు రాళ్ల వంతెనపై దొర్లించుకొచ్చి నిలిపారట. ఆలయం లోపల ఎత్తయిన వేదికపై 13 అడుగుల ఎత్తుగల శివలింగం ఉంటుంది. ఆలయానికి కొంచెం దూరంలో రాజరాజచోళుని కుమారుడు నిర్మించిన గంగైకొండ చోళపురంలో శివాలయం అద్భుత శిల్పకళతో ఈ ఆలయంతో పోటీ పడుతుంది. ఈ ఆలయం 'యునెస్కో' వారిచే ప్రపంచ సంస్కృతీ చిహ్నంగా గుర్తింపు పొందినది.

దుగ్ధేశ్వరనాథ్ ::


ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గల 'గోరఖ్ పూర్-బటని' మార్గంలోనున్న 'గౌరీబజార్' స్టేషన్ నుండి 15 కి.మీ. దూరంలో గల ఈ క్షేత్రం రుద్రపురం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగము 12 జ్యోతిర్లింగాలలో ఒకటయిన ఉన్నయినిలోని మహాకాళేశ్వర లింగానికి ఉపజ్యోతిర్లింగం. ఆలయంలోని శివలింగం అప్పుడప్పుదు తనకు తానుగా కదులుతుంది. ఒక్కక్కసారి రోజంతా కదులుతుంది. హఠాత్తుగా ఆగిపోతుంది. అప్పుడు లింగాన్ని గట్టిగా పట్టీ ఉంచినప్పటికీ కదలిక లేకపోవటం ఆశ్చర్యం.

తలకాడు ::


(1) కర్నాటక రాష్ట్రంలో గల 'మైసూర్' నుండి 60 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. కావేరీ నదీ తీరంలోనున్న ఇచ్చటి ఆలయం పేరు 'వైద్యేశ్వరాలయం'. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇసుకతో కప్పబడి 1978, 1999, 2002 సంవత్సరాలలో కార్తీకమాసం 5 సోమవారాలలో దర్శనం ఇచ్చింది. మరలా పునర్దర్శనం క్రీ.శ. 2014లో అంటున్నారు. ఈ విధంగా ఇచ్చటి లింగాకారం 12 సంవత్సరాల కొకసారి కార్తిక మాసంలో 5 సోమవారాలు పడినపుడు మాత్రమే దర్శనం ఇస్తుంది. అప్పుడు జరిగే 'పంచలింగ దర్శనం' అనే మహోత్సవానికి లక్షల కొలదీ జనం వస్తారు.

(2) కర్ణాటక రాష్ట్రంలోని 'మైసూర్' నుండి 600 కి.మీ. దూరంలో గల క్షేత్రం 'తలకాడు'. ఈ ఆలయం పేరు 'పాతాళేశ్వరాలయం'. క్రీ.శ. 1004 వరకు పాలించిన గంగవంశ రాజుల కాలం నుండి ఈ ఆలయ ఉంది. కాల ప్రవాహంలో ఇసుకతో కప్పబడింది. పురావస్తు శాఖవారి దయ వలన బయటపడింది. నేల మట్టంకన్నా చాలా లోతుగా ఉన్న ఆలయంలోని శివలింగం ఉదయం ఎరుపు, మధ్యాహ్నం నలుపు, సాయంకాలానికి తెలుపు రంగులోకి మారుతూ కనిపిస్తుంది.

మహేశ్వర్ ::


మధ్యప్రదేశ్ రాష్త్రంలో 'ఇండోర్' నుండి 100 కి.మీ. దూరంలో గలదు ఈ క్షేత్రం. ఇచ్చటి ఆలయంపేరు 'రాజరాజేశ్వరాలయం'. పురాణాలలో 'మాహిష్మతి'గా పిలువబడే ఈ క్షేత్రం అనడు కార్తవీర్యార్జునుని రాజధాని. అయన సహస్ర బాహువులకు ప్రతీకలుగా 'సహస్రధార'గా నర్మదానది ప్రవహిస్తుంది. ఇండోర్ రాణి అహల్యాబాయి నిర్మించిన ఏకశిలా నిర్మిత ఆలయాల సముదాయం 'అహల్యేశ్వరాలయం' చూడవలసినది. అనేకమైన ప్రాచీన మందిరాలు విభిన్న దేవతలకు ఉన్నాయి. 108 దేవీ పీఠాలలఓ ఒకటైన 'స్వాహాదేవి' మందిరం ఉంది. రాజరాజేశ్వరాలయంలో పెద్ద శివలింగంతో పాటు 8 లోహాలతో నిర్మించబడిన శివపార్వతుల విగ్రహం ఉంది. వాటికీ ఎదురుగా 1000 సంవత్సరాల క్రిందటి అఖండదీపం దర్శనం ఇస్తుంది.

కోటప్పకొండ ::


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'గుంటూరు' నిల్లాలోని నరసరావుపేట నుండి 11 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. శివుని దక్షిణామూర్తి రూపానికి గల ఏకైక ఆలయం. కనుక ఇచ్చట అమ్మవారు ఉండరు. స్వామికి ఉత్సవాలు ఉండవు. త్రికూట క్షేత్రంలో స్వయంభూ శివలింగం. కొండమీద ఆలయం ఉంది. ఆలయం వరకు బస్సు సౌకర్యం కలదు. బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలు మూడింటిమీద 3 శివాలయాలు ఉన్నాయి. వేలకొలది ప్రభలు మొక్కుబడిగా శివరాత్రికి వస్తాయి.

సురుటుపల్లి ::


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నందు గల 'సత్యవేడు'కు దగ్గరలో గల క్షేత్రం ఇది. అరుణానదీ తీరంలో గల ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'పల్లికొండేశ్వరాలయం'. శివశైవ క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో గరళం త్రాగిన శివుడు పరుండి యుంటే బయట ఏకాంతంగా నంది ఉంటుంది. స్వయంభూ శివలింగంతో పాటు స్వయంభూ గణపతి విగ్రహం కలదు. స్కాంద పురాణ శివరహస్య ఖండంలో శివుడు హాలాహలం మ్రింగి విశ్రమించి నందున 'కాలకూటానన'క్షేత్రంగా ఇది వర్ణించబడింది. నిదురించే శివుని చుట్టూ బ్రహ్మాది దేవతలు అందరూ ఉన్నారు.

పోండా ::


గోవా రాష్ట్ర రాజధాని 'పానాజీ' నుండి 22 కి.మీ. దూరంలో గల ఈ క్షేత్రంలో ఆలయం పేరు మంగేష్ ఆలయం. ఈ ఆలయం 16వ శతాబ్దంలో పునఃప్రతిష్ఠ చేయబడింది. అందమైన సరస్సు తీరానున్న ఈ ఆలయం బంగారు కలశంతో ధర్శనమిస్తుంది. ఇండో-పోర్చుగీసు-ఇస్లాం నిర్మాణ శైలీ విన్యాసాలు ఈ ఆలయంలో గోచరిస్తాయి. ప్రతి సభా మంటపం, దీప స్తంభం ఆలయ శోభను ఇనుమడింపజేస్తాయి. గర్భాలయంలో రజత తోరణం మధ్య మంగేష్ స్వర్ణ ప్రతిమ కిరీటంపై నరసింహ స్వామి ఉగ్రరూపం దర్శనమిస్తుంది. శాలువాలతో, ఆభరణాలతో, పుష్పాలతో, స్వర్ణ ప్రతిమను నిత్యం అలంకరిస్తారు. ఆలయంలోని ఈ ప్రాచీన శివలింగం క్రీ.శ. 1560 వరకు 'కుశస్థలి'లో గల ఆలయంలో పూజలందుకునేది.

ఖాట్మండు ::


(1) నేపాల్ దేశ రాజధాని అయిన 'ఖాట్మండు' క్షేత్రంలోని ఒక ఆలయం పేరు 'విశ్వరూప మందిరం'. ఇది ప్రసిద్ధి చెందిన పశుపతినాథ దేవాలయానికి దగ్గరలో ఉంది. ఈ మందిరానికి వెళ్ళే దారిలో ఎడమవైపున 11 శివాలయాలు ఉన్నాయి. అతి ప్రాచీనమైన ఈ ఆలయం విశాలమైన ప్రాంగణం కలిగి, గర్భాలయ, అంతరాలయాలను కలిగి ఉంది. అంతరాలయం చుట్టూ ఎత్తైన గోడ కలిగి ప్రదక్షిణానికి అనుకూలంగా ఉంది. ప్రధానాలయంలో శివుడు వేయి చేతులతో పార్వతిని ఆలింగనం చేస్తున్నట్లు సుమారు 50 అడుగు విగ్రహం ఉంది. ఈ ఆలయాన్ని ఉ. 5.00 గం.లకు, సాయంకాలం 7.00 గం.లకు మాత్రమే తెరుస్తారు. ఆ సమయంలో సుమారు అరగంట మాత్రమే దర్శనం ఉంటుంది.

(2) శివుని అష్టమూర్తి క్షేత్రాలలో యాజమాన లింగంగా ప్రసిద్ధినొందినది పశుపతినాథలింగం నేపాల్ లోని ఖాట్మండులో కలదు. నేపాల్ లోని అత్యంత పవిత్రమైన 'ఖాట్మండు' ప్రదేశం;హిందూధర్మానికి, సంస్కృతికి పట్టుకొమ్మగా నిల్చింది. ఇచ్చటి దేవత పశుపతినాథ్, అమ్మవారు గుహ్యేశ్వరి (పార్వతి). ఖట్మాడులో విరాజిల్లుతున్న ఈ జ్యోతిర్లింగం 'పశుపతి' అనే నామంతో ప్రసిద్ధి పొందినది. ఇది శివుని అష్టమూర్తులలో 'యాజమాన' మూర్తిగా కూడా కొలువబడుతున్నది. మహేశ్వరునకు ఉన్న అనేక నామములలో పశుపతి ఒకటి.

తిరువల్లం ::


తమిళనాడు రాష్ట్రంలో 'రాణిపేట'కు మరియు చిత్తూరుకు దగ్గరలో ఉంది. ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'బిల్వనాథేశ్వరాలయం'. దీనిని 5వ శతాబ్దంలో పల్లవరాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 1500 ఏళ్ళనాటిదిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలోని విగ్రహం క్రీ.పూ. 794లో రూపొందించబడినదని శాసనం. పల్లవ రాజులు 850 బి.సి. లో గర్భగుడిపై విమాన గోపురాన్ని నిర్మించారు. చోళుల కాలంలో 1000 స్తంభాల మండపం నిర్మించబడింది. ఇక్కడ ఉన్న బిల్వవృక్షంలోని ఆకులతో శివుని విగ్రహానికి నిత్యపూజలు చేస్తారు. ఆ ఆకులను తింటే రోగాలు నయమవుతాయని స్థానికుల నమ్మకం.

నత్తరామేశ్వరం ::


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా 'అత్తిలి' నుంది 6 కి.మీ. దూరంలో గల క్షేత్రమిది. గొనని నదీ తీరాన ఉన్న ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'రామలింగేశ్వరాలయం'. ఆలయంలోని శివలింగాన్ని పరుశురాముడు ప్రతిష్టించినట్లు చరిత్ర. ఈ ఆలయంలోని లింగం ఎప్పుడూ నీటిలో మునిగి నత్తల సంపుటితో కుడి ఉంటుంది. లింగంపై వ్రేలి ముద్రలుగా నిలువు చారలు ఉంటాయి.

కాళేశ్వరం ::


అంధ్రప్రదేశ్ రాష్త్రంలో 'కరీంనగర్' జిల్లా కేంద్రం నుండి 130 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. గోదావరి, ప్రణీత, సరస్వతుల త్రివేణీ సంగమంలో ఉన్న ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'కాళేశ్వరాలయం'. వేంగి రాజైన విష్ణువర్ధనుడు నిర్మించినట్లు చరిత్ర. ఇచ్చటి ఆలయంలో ఒక స్వయంభూ లింగం ముక్తీశ్వరుడు, రెండవది శివుని ఆదేశం ప్రకారం యమధర్మరాజే లింగంగా వెలిసిన కాళేశ్వరుడు అనే రెండు లింగములు ఒకే పానవట్టంపై ఉండటం విశేషం. ఈ ఆలయంలో ప్రాకారం క్రింద వివిధ దిక్కులలో వివిధమైన ఆలయాలుంటాయి. ఆలయం పరిసరాలలో ఉన్న 'యమకోణం' చూచి తీరవలసింది.

పృధుదక్ ::


హర్యానా రాష్త్రంలో కురుక్షేత్రం నుండి 50 కి.మీ. దూరంలో గణ పిహోవా స్టేషను నుండి 4 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. ఇక్కడి ఆలయం పేరు 'సంగమేశ్వరాలయం'. దీనిని 'అరుణాయి మందిరం' అని కూడా పిలుస్తారు. భూగర్భంలో ఎంతలోతు వరకుందో తెలియని స్వయంభూ లింగం గల ఈ ఆలయం అరుణ, సరస్వతి నదుల సంగమ స్థలంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగంను చుట్టుకొని ఎప్పుడూ ఒక సర్పం ఉంటుంది. శివశక్తే అలా సర్పరూపంలో ధర్శనమిస్తుందని భక్తుల విశ్వాసం. ఆ సర్పం ఇప్పటి వరకు ఎవరికీ హాని చేహలేదని చెబుతారు.

గార్హముక్తేశ్వర్ ::


ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 'ఢిల్లీ-మొరాదాబాద్' లైనులో గల 'బ్రజ్ ఘాట్' నుండి 6 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. ఒక సిద్ధుని ద్వారా ఇచ్చటి ఆలయానికి చేరిన శివలింగం తెల్లని స్ఫటికంతో నిర్మితమై సప్త వర్ణాలను వెదజల్లుతుంది. ఏడాదికొకసారి పెద్ద శివలింగం నుండి చిన్న శివలింగం పుడుతుంది. బహు ముఖాలతో కూడిన శివలింగం నుండి అనేక భాగాలు విడివడిన సంగతి బాగా పరిశీలిస్తే తెలుస్తుంది. ఇంతకు పూర్వం చిన్న లింగం వెలువడిన స్థానంలో నుండి మరొకటి బయటపడుతోంది.

శివగంగ ::


కర్ణాటక రాష్ట్రంలోని 'బెంగళూరు' నుండి 60 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చటి ఆలయం పేరు 'గంగాధరేశ్వరాలయం'. గుహలోపల ఉన్న 2-1/2 అడుగుల ఎత్తుగల శివలింగానికి పసుపుగా ఉన్న నెయ్యిని మర్దిస్తే అది చూస్తుండగానే తెల్లటి వెన్నగా మారుతుంది. కాదని తొలచి చేసిన ఓ విశాలమైన గుహలో ఉన్న ఈ శివలింగాన్ని చేరుకోవాలంటే దాదాపు 200 మెట్లు ఎక్కి వెళ్ళాలి. అర్చన టికెట్ తో పాటే నెయ్యి కూడా ఇస్తారు. యూరోపియన్ హేతువాదులు తపదేశం నుండి (మనల్ని నమ్మక) నెయ్యిని తెచ్చి లింగానికి రుద్ది వెన్నగా మారే వాస్తవాన్ని అంగీకరించారు. ఈ వెన్నని బాధా నివారణ మందుగా వాడుతుంటారు.

కాంచీపురం ::


ఏకామ్రేశ్వరుడుగా (క్షితిలింగం) పరమశివుడు పృథ్వీలింగంగా వెలసి అనంత మహిమలతో భక్తులను తరింపజేసేదే ఈ కాంచీ క్షేత్రం. 'ఏక' అంటే ఒక, 'అమ్ర' అంటే మామిడి. ఈశ్వరుడు అంటే శివుడు. (ఏక+అమ్ర+ఈశ్వరుడు) అంటే మామిడి చెట్టు క్రింద వెలసిన స్వామి వారు గనుక ఈ స్వామికి ఏకామ్రేశ్వరుడు అనే పేరు ఏర్పడినట్లు చెప్పబడింది. ఈ ఆలయాన్ని 'పెద్దపడి' అని పిలుస్తారు. దీనినే 'తిరువేంకంబం' అని 'తిరుకుచ్చి ఏకంబం' అని 'తిరు ఆలయం' అని తమిళులు పిలుస్తారు. శివకంచి ఏకమ్రేశ్వరస్వామి ఆలయం విశాలమైన మూడు ప్రాకారాలతో, ఎత్తైన గోపురంతో అద్భుతమైన శిల్పకళావైభవోపేతంగా ఉంటుంది.

పంచరామాలు ::


ఈ పంచారామ క్షేత్రాలు ఆంధ్రరాష్ట్రంలో మూడు జిల్లాలలో వెలసినవి. అవి - గుంటూరు జిల్లాలోని అమరావతిలోను, పశ్చిమ గోదావరి జిల్లాలోని గునుపూడి భీమవరంలో ఒకటి, పాలకొల్లులో ఒకటి, తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలోని ఒకటి, సామర్లకోట కుమారారామ భీమేశ్వరంలో ఒకటి వెలసి భక్తుల పూజలందుకొంటున్నాయి. ఇక ఆలయ విశేషాలు పరిశీలిస్తే శివుని లింగాకృతిలో విచిత్రమైన విభేదాలు - అమరారామంలో 36 అడుగుల ఎత్తులో 9 అడుగులు మాత్రమే దర్శిస్తాము. ద్రాక్షారామంలో 14 అడుగులు, సామర్లకోటలో 12 అడుగులు ఎత్తుగల శిలింగం. భీమవరం, పాలకొల్లులో రెండడుగుల ఎత్తు ప్రమాణం గల శివలింగం దర్శిస్తాము. అమరారామంలో బాలరాముండేశ్వరి సహిత అమరేశ్వరస్వామిగాను, ద్రాక్షారామంలో మాణిక్యాంబ సహిత భీమశ్వరునిగాను, కుమారారామంలో బాలాత్రిపుర సుందరి సమేత సోమేశ్వరునిగాను, సోమారామంలో పార్వతి, అన్నపూర్ణసమేత సోమేశ్వరునిగానూ, క్షీరామంలో పార్వతి సహిత శ్రీరామలింగేశ్వరునిగాను పూజింపబడుతున్నారు. ఈ పంచారామ క్షేత్రాలైదింటిలోను ద్రాక్షారామానికి ప్రత్యేక విశిష్టత కలదు. ఇక్కడి అమ్మవారు మాణిక్యాంబదేవి అష్టాదశపీఠాలలో 12వ శక్తిపీఠంగాను, భీమేస్శ్వర స్వామి ద్వాదశ జ్యోతిర్లింగ ఉపలింగంగాను ప్రసిద్ధి చెందినది.

చిదంబరం ::


పరమశివుని పంచభూతాల్లో అయిదవది, శివుని అష్టమూర్తి స్వరూపాల్లో ఒకటైనది -- ఆకాశరూపంలో కొలువుతీరిన చిదంబరం క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నగరానికి సుమారు 250 కి.మీ. దూరంలో దక్షిణ ఆర్కాట్ జిల్లాలో ఉంది. నటరాజస్వామి ఆనంద తాండవం చేసే చిదంబరాన్ని ప్రాచీనకాలంలో తిల్లయ్-వనం, వ్యాఘ్రపురం, పొన్నాంబళం, పురియార్, పుండరీకపురం, భూలోక కైలాస్ అనే పేర్లు ఉండేవి. కాలక్రమంలో ఈ స్థలానికి చిదంబరం అనే పేరు వ్యాప్తిలోకి వచ్చి స్థిరపడింది. చిదంబరం అంటే చిత్ + అంబరం, చిత్ అంటే జ్ఞానము, అంబరం అంటే అనంతమైన ఆకాశం. చిదంబరంలో (చిత్ సభ, కనుక సభ, దేవసభ, నృత్యసభ, రాజసభ) పంచ సభలకి ప్రాధాన్యం ఉంది గనుక ఆ పేరు వచ్చింది. 'తిల్లయ్' అనే వృక్షాలు అధికంగా ఉండడం వాళ్ళ ఈ క్షేత్రానికి 'తిల్లయ్' వనం అనే పేరు వచ్చింది. ఇక్కడి అమ్మవారి పేరు "శివకామసుందరి'.

తిరువణ్ణామలై ::


'తిరు' అంటే పెద్దది, 'అణ్ణా' అంటే అగ్ని 'మలై' అంటే కొండ అని అర్థం. ఎత్తైన కొండపై వెలసిన స్వామి అరుణగిరి రూపంలో అవతరించిన శివమహాదేవుని మహిమాన్వితమైన జ్యోతిస్వరూపమే అణ్ణామలయ్యార్ స్వామి. ఇక్కడ పర్వతమే శివ స్వరూపం. ఇదికాక లింగరూపంగా ఆలయంలో కొలువున్నారు. అమ్మవారి పేరు 'అపీతకుచాంబ'. తిరువణ్ణామలై క్షేత్రం తమిళనాడులోని (ఉత్తర ఆర్కాట్ జిల్లా) ప్రస్తుతం సంబురాయర్ జిల్లాలో ఉంది. ఈ పట్టణం తాలూకా కేంద్రం విల్లిపురం. కాత్పాడి రైలు మార్గంలో చెన్నైకి 226 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీకాళహస్తి ::


శ్రీకాళహస్తీశ్వర స్వామి స్వయంభువుగా బిల్వకావనములో సువర్ణముఖీ నదీ తీరంలో వెలిశాడు. 'శ్రీ' అంగ సాలెపురుగు, 'కాళీ' అనగా పాము, 'హస్తి' అనగా ఏనుగు, ఈ మూడు జంతువులు శివభక్తి వలన సాయుజ్యమంది శివునిలో లీనమైపోయాయి. అందువలన ఇచ్చటి స్వామివారికి శ్రీకాళహస్తీశ్వరుడని, ఈ పురమునకు శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఇచ్చట అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కృతయుగంలో ఇక్కడ స్వామి వాయురూపంలో ఉండి మహాయోగులను స్పర్శ మాత్రమునే గ్రహింపదగియుండేవారట. త్రేతాయుగంలో స్వర్ణ రూపంగా, ద్వాపరయుగంలో రజిత రూపంగా, ప్రస్తుత కలియుగంలో శ్వేతశిలా రూపం పొంది తన సహజ వాయుతత్వ నిదర్శనంగా గర్భాలయంలో స్వామికి కుడి ప్రక్కనున్న దీపములను రెండింటిని ఎల్లప్పుడూ చలింపజేస్తూండటం గమనించదగినది. ఇక్కడి జగదంబ 'జ్ఞానప్రసూనాంబ'.

శీర్కాళి :: వైదీశ్వరన్ కోయిల్ ::


చిదంబరానికి, కుంభకోణానికి మధ్యలో ఉన్న వైదీశ్వరన్ కోయిల్, శీర్కాళ్ గొప్ప క్షేత్రాలు. వైదీశ్వరన్ కోయిల్, శీర్కాలి రెందు, కేవలం 8 కి.మీ. దూరం ఉన్న ప్రక్క ప్రక్క ఊళ్ళు. వైదీశ్వరన్ కోయిల్ ఉత్తర తమిళనాడు వారికి చాలా ముఖ్యమైన పవిత్రస్థలం. ఒకానొక ముని తనకు గొప్ప జబ్బు చేయగా పరమేశ్వరుని గూర్చి ఎంతో భక్తితో తపస్సు చేయగా శంకరుడు ఒక వైద్యుని రూపంలో ప్రత్యక్షమై, అతని జబ్బు నయం చేశాడమొ స్థల పురాణం. ఈ ప్రాంతం వారు ఇంట్లో ఎవరికీ ఏ జబ్బు చేసినా, ఈ వైదీశ్వరునికి మొక్కుకుంటారు. ఊరు మాత్రం అతిచిన్న పల్లెటూరు. అయినా దేవాలయం మాత్రం ఎన్నడూ భక్తులతో నిండి ఉంటుంది. ఈ మధ్య ఈ ఊరికి చెందిన 'నాడీగ్రంథ' జ్యోతిష్కులు అన్నిచోట్ల వెలియడంతో ఈ ఊరికి జ్యోతిషం చెప్పించుకుంటానికి వచ్చేవారు ఎక్కువ అయ్యారు. వైదీశ్వరన్ కోయిల్ కు శీర్కాలి మధ్యదూరం కేవలం ఐదు మైళ్ళు. తమిళులందరికి శిర్కాలి చాలా పవిత్రమైన యాత్రాస్థలం. తమిళులకు ఈ దేవాలయం సంస్కృతిక కేంద్రం లాంటిది. ఈ ఊరిని గూర్చి వారందరూ ఎంతో పవిత్రంగా భావిస్తారు. గొప్ప శివభక్తాచార్యుడు 'జ్ఞాన సంబంధర్' ఈ శిర్కాలిలోనే జన్మించారు. ఈ సంబందర్ పసికూనగా ఉన్నప్పుడు పార్వతీదేవి స్వయంగా తన స్తన్యమిచ్చి ఆ పిల్లవాని ఆకలి తీర్చింది. ఆ తరువాత నుంచి ఆ పిల్లవాడు అమిత జ్ఞానవంతుదై చిన్నతనం నుండే గొప్ప శివభక్తుడై శివతత్వాన్ని అందరకూ ప్రభోదిస్తూ కేవలం పదహారు సంత్సరాలు మాత్రమే జీవించి, తనువూ చాలించారు. అయితే, ఆ పదహారు సంవత్సరాల లోపునే అయన అనేక వేల కీర్తనలు రచించారు. అందులో దాదాపు నాలుగు వందల కృతులు.

దుర్జనుడు

 🕉️🌸 *సుభాషితమ్* 🌸🕉️

--------------------------------------------


శ్లోకం:

*దుర్జనః స్వస్వభావేన*

*పరకార్యం వినశ్యతి।*

*నోదరతృప్తిమాయాతి*

*మూషకః వస్త్రభక్షకః॥*

                   ~సుభాషితరత్నావళి


తాత్పర్యం:

దుర్జనుడు తన స్వభావము ననుసరించి తనకెటువంటి లాభము కలుగకున్ననూ ఇతరుల కార్యములు చెడగొట్టును.

తనకు కడుపు నిండకపోయిననూ ఎలుక బట్టలను కొరికి ముక్కలు ముక్కలు చేయునుకదా!

27, మార్చి 2022, ఆదివారం

చిన్ముద్ర

 *చిన్ముద్ర..... ఒక విశ్లేషణ*


మానవుని చేతికి ఐదు వ్రేళ్ళుంటాయి. నాలుగు కలిసే ఉంటాయి. ఒకటి మాత్రం దూరంగా ఉంటుంది. అది పరమాత్మ. మిగిలిన ఈ నాలుగు వ్రేళ్ళలో చూపుడు వ్రేలు జీవుడు. మిగిలిన మూడు వ్రేళ్ళు, మూడు గుణాలు.


జీవుడెప్పుడూ మూడు గుణాలతో కూడియే ఉంటాడు. అందుకే నాలుగు వ్రేళ్ళు ఎప్పుడూ కలిసే ఉంటాయి. అయితే ప్రయత్నంతో చూపుడు వ్రేలు అనబడే జీవుడు ని మిగిలిన మూడు వ్రేళ్ళు అనే మూడు గుణాలకు దూరంగా జరిపితే.. పరమాత్మ అనే బొటన వ్రేలితో కలసిపోతాడు.


ఇలా చూపుడు వ్రేలు, బొటన వ్రేలు కలిసి సున్నాగా ఏర్పచితే అదే "చిన్ముద్ర". ఆలయాల్లో దేవతా విగ్రహాలు చూపే చిన్ముద్ర లోని ఆంతర్యం ఇదే... మూడు గుణాలను వదిలించుకొని నాతో ఐక్యం కండి అని చెప్పటమే...


 ఓం

పరనింద ప్రమాదకరం

 (Copy. చాలా బాగుంది. చదవండి)


పరనింద ప్రమాదకరం. 


పరనింద ప్రమాదం.


ఇతరుల్ని కించపరిస్తే కల్గే నష్టాన్ని ఒక సంస్కృత కవి  ఎంత చక్కగా వివరించాడో స్వయంగా చూడండి.

ఒకరోజు లక్ష్మి వైకుంఠం నుంచి బయలుదేరి కైలాసంలో ఉన్న  పార్వతి ఇంటికి వెళ్లింది. పార్వతి ఇంటికి వచ్చిన అతిథిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది. లక్ష్మి ఆ పరిసరాలన్నీ పరికించింది. పార్వతికి లక్ష్మికున్నంత  ఐశ్వర్యం లేదు డాబు లేదు. పరిసరాలన్నీ సామాన్యంగా ఉన్నాయి.  లక్ష్మికి అనుకోకుండా పార్వతిని ఓ ఆట పట్టించాలనే ఆలోచన కల్గింది.

"భిక్షార్థీ స క్వ యాత:?” అని చిన్న ప్రశ్న వేసింది.  మీ ఆయన ఎక్కడికెళ్లాడమ్మా అంటే బాగుండేది.. కాని లక్ష్మి అలా అనలేదు. ఆ ముష్టివాడు ఎక్కడికెళ్లాడమ్మా? అంది.  శివుడు ఆది భిక్షువు కదా! లక్ష్మి ఆ విషయాన్ని ఎత్తిపొడుస్తూ వెటకారంగా మాట్లాడింది.  పార్వతికి ఈ  ప్రశ్న చాలా బాధ కల్గించింది . ఏ ఆడదైనా తనను ఎన్నన్నా సహిస్తుంది గాని తన భర్తను నిందిస్తే ఏమాత్రం  సహించలేదు కదా! కాని ఏంచేస్తుంది. ఇంటికి వచ్చిన అతిథిని మందలిస్తే బాగుండదు. అలాగని సరిపెట్టుకుని  ఊరుకోనూలేదు. ఏదో సమాధానం చెప్పాలి.  ఎంచెప్పాలి?  కొంచెం ఆలోచించింది.

"సుతను బలిమఖే "  అంది.

'బలి చక్రవర్తి చేస్తున్న యాగం దగ్గరకు వెళ్లారమ్మా! అని సమాధానం.  ఆ సమాధానం వినేసరికి లక్ష్మికి తల తిరిగి పోయింది. బలి దగ్గరకు వెళ్లిన ముష్టివాడు  తన భర్త శ్రీమహావిష్ణువు. వామనావతారంలో ఆయన బలిచక్రవర్తిని మూడడుగులు నేల అడగడం లోకవిదితమే.  'మా ఆయనకన్నా మీ ఆయనే దారుణం' అనే భావం పార్వతి మాటల్లో తొంగి చూసింది. లక్ష్మి కొంతసేపటికి ఎలాగో తేరుకుంది. మళ్లీ ఏదోవిధంగా పార్వతిని ఉడికించాలని సమాయత్తమయింది. రెండో ప్రశ్న వేసింది.

తాండవం క్వాద్య భద్రే! అనడిగింది. అమ్మా! మీ ఆయన ఈ రోజు నాట్యం ఎక్కడ చేస్తాడు? అని దానర్థం.   మీ ఆయన ఏ పని పాట లేకుండా దిగంబరంగా నాట్యం చేస్తుంటాడని  లక్ష్మి మాటల్లోని అంతరార్థం. అప్పటికే ఆరితేరిన పార్వతి వెంటనే అందుకుంది.

మన్యే బృందావనాంతే అంది. బృందావనంలో అనుకుంటున్నానమ్మా! అని ఆ మాటలకర్థం. బృందావనంలో నాట్యం చేసే ప్రబుద్ధుడు కృష్ణుడు, శివుడు కాదు. ' మా ఆయనే కాదు  మీఆయన కూడ నాట్యం చేస్తాడు.   ఎటొచ్చీ మా ఆయన ఒంటరిగా నాట్యం చేస్తాడు. అంతే గాని మీ ఆయన లాగ అందరి ఆడవాళ్లను వెంటేసుకుని నాట్యం చెయ్యడు' అని సమాధానం. పార్వతి సమాధానం ఇంత పదునుగా  ఉంటుందని లక్ష్మి ఊహించలేదు. ఆమెకు మతిపోయినంతపనయింది. ఏలాగో కుడగట్టుకుంది. ఈ సారి తనకు ఇబ్బంది లేనివిధంగా మాట్లాడాలనుకుంది.

క్వను చ మృగ శిశు: ? అని మరో ప్రశ్న వేసింది.  మీ ఏనుగు మొగంవాడు ఎక్కడమ్మా? అని అర్థం. లక్ష్మి  కొడుకు మన్మథుడు చాల అందగాడు. పార్వతి కొడుకు వినాయకుడు ఎంత అందగాడో వివరించి చెప్పనవసరం లేదు. 'మా అబ్బాయి చాల అందగాడు మీ అబ్బాయి మాత్రం కురూపి' అని లక్ష్మి ఆక్షేపణలోని  అభిప్రాయం .  పార్వతి చాల నొచ్చుకుంది.  కాకిపిల్ల కాకికి ముద్దన్నట్లు ఎవరిపిల్లలు వాళ్లకు ముద్దు. పార్వతి మెదడులో ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది. వెంటనే అంది.

' నైవ జానే వరాహం ' అంది

“ ఇక్కడేదో పంది  తిరుగుతూ ఉంటే దానివెంట వెళ్లాడమ్మా! ఎక్కడున్నాడో తెలీదు" అంది. మా అబ్బాయిది ఏనుగు ముఖమేగాని మీ ఆయన పూర్తిగా వరాహావతారమే సుమా!అని పార్వతి సమాధానం లోని చమత్కారం. ఇది లక్ష్మికి దిగ్భ్రాంతి కల్గించింది. కొంతసేపటికి  ఎలాగో తేరుకుంది. ఈసారి జాగ్రత్త్తగా తనకు ఎదురుదెబ్బ తగలని విధంగ పార్వతికి దెబ్బకొట్టాలనుకుంది. అటు ఇటు కాసేపు చూసింది.

బాలే! కచ్చిన్న దృష్ట :  జరఠ వృషపతి: ?  అనడిగింది. 'మీ వాహనం అదే ఆ  ముసలి ఎద్దు ఎక్కడా కనబడడం లేదేమిటమ్మా! అని ప్రశ్న. 'మాది గరుడ వాహనం విమానాల్లో  వలే ఆకాశంలో తిరుగుతాం.  మీరు నేల పై తిరుగుతారు. మీ వాహనం  ముసలి ఎద్దు.  అది కదల్లేదు మెదల్లేదు'  అని ఆక్షేపం. మేం పై స్థాయి వాళ్లం మీరు నేలబారు మనుషులు అని వెక్కిరింపు. ఆ వెక్కిరింపు అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు పార్వతి. అందుకే  వెంటనే అందుకుంది.

"గోప ఏవాస్య వేత్తా " అంది. 'ఆవులసంగతి ఎద్దులసంగతి గోవుల్ని కాసేవాణ్ణి అడిగితే తెలుస్తుంది గాని నన్నడిగితే ఏం లాభమమ్మా?  పో! పోయి, మీ ఆయన్నే అడుగు' అని చిన్న చురక అంటించింది.   మా ఆయన నడిపే వాహనాన్ని మీఆయన మేపుతాడు. మీకంటే మేమే ఎక్కువ అని పార్వతి మాటల్లోని ఆంతర్యం. ఈ సమాధానానికి లక్ష్మి పూర్తిగా అవాక్కయింది. తిన్నగా జారుకుంది.

నిజానికి ఇదంతా వారిద్దరి మధ్య వేళాకోళంగా జరిగిన సంభాషణ. ఇందులో నిందగాని వెక్కిరింపుగాని ఏమాత్రంలేవు. ఇతరులను అవమానపరిస్తే అది మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందనే సత్యాన్ని చెప్పడానికే ఒక కవి  లక్ష్మీపార్వతులను పాత్రలుగా చేసుకుని ఈ సన్నివేశాన్ని కల్పించాడు. ఇందులో నీతి ముఖ్యం గాని ప్రశ్నలు సమాధానాలు ముఖ్యం కాదు

వారిరువురి మధ్య జరిగిన ఈ సరసమైన  సంభాషణ మనందరిని రక్షించుగాక అని చమత్కరించాడో కవి. ఇంత సరసమైన భావాన్ని తనలో దాచుకున్న ఈ శ్లోకం చదవండి.


భిక్షార్థీ స క్వ యాత: ?సుతను బలిమఖే " తాండవం క్వాద్య భద్రే ?


మన్యే బృందావనాంతే క్వను చ మృగశిశు:? నైవ జానే వరాహం


బాలే కచ్చిన్న దృష్ట: జరఠవృష పతి:? గోప ఏవాస్య వేత్తా


లీలాసంలాపఇత్థం జలనిధిహిమవత్కన్యయో: త్రాయతాం న:


(శ్రీ అప్పయ్య దీక్షితులు)

అంతర్ముఖ సమారాధ్య*

 *అంతర్ముఖ సమారాధ్య*

*బహిర్ముఖ సుదుర్లభా*



సాధన లో *అంతర్ముఖత* ప్రాధాన్యత తెలుపుట కు వశిన్యాది వాగ్దేవతలు ఈ నామం తో స్తుతించారు. కొంత బహిర్ముఖ తంతు అవసరము. కాని బహిర్ముఖ సాధన తోనే పరిమితము అవుట వలన సాధకుడు సద్వస్తువు ను చేరలేడు. 


అందుకే *“అంతర్ముఖ సమారాధ్య-బహిర్ముఖ సుదుర్లభా”* అని ద్వంద్వము ను సూచించారు. 

అనగా సాధన బహిర్ముఖత వలన ఆత్మ ను చేరుకోవడము దుర్లభము. అనగా చాలా కష్టతర సాధ్యము. అంతర్ముఖత వలన సులభము గా సాధ్యతరము. 


మానవ జన్మ లభించడమే బహు దుర్లభము. విశేషంగా కలియుగము లో మానవుడి జీవితకాల పరిమాణమే చాలా తక్కువ. ఇక ఈ తక్కువ జీవిత కాలము లో బహిర్ముఖత కే పరిమితము అవడము అంటే సముద్రము ఊపరితలము లోనే ముత్యములు ను వెతుకడము వంటిది. బాహ్య సాధన కొంత జరిగిన పిమ్మట అంతర్ముఖ సాధన ని కొనసాగించాలి. 

మన నిత్య జీవితము లో చేసే ప్రతి కార్యము కు కావలసిన ప్రేరణ, శక్తి వచ్చేది లోపల నుంచే. సర్వవ్యాపి అయిన ఆత్మ మనలో ఉండుట వలనే జడమైన శరీరము లో కదలికలు,  మాట్లాడే ప్రతి దానిలో *నేను*, *నాది*.. అనే పదజాలం వాడడము సర్వసామాన్యము. అయతే మాట్లాడతున్నది ఎవరు..? శరీరము జడపదార్థము అవడము వలన, శరీరము మాట్లాడలేదు. శరీరమే మాట్లాడును అన్నప్పుడు నిద్రావస్థ లో ఏ మాటామంతి లేకపోవుట కు కారణం ఏమి..? ఇట్టి విచారము *సాంఖ్యము* కు దారి తీయును. దైవము ఉనికి గ్రహించుటకు ఉన్న అనేకమైన మార్గముల లో మంత్రమార్గము, అందులో ప్రత్యేకముగా *శ్రీవిద్య* మహోత్కృష్టమైనది, అతి ప్రాచీనమైనదిగా పేరు పొందెను. ఇక మంత్రమార్గము లో పయనించుటకు శ్రీగురువులు లభించిన తరువాత సాధన ను కొనసాగించగా మంత్రమే సాధకుడను లోన కు తీసుకుపోవును. బాహ్యతంతు ముగిసాక కొంత నియమపూర్వకముగా, ప్రయత్నపూర్వకముగా అంతర్ముఖత అవవలెను. ఈ నామము లో ఉన్న సంకేతము ఇదే. 

ఉదాహరణ కు బయట మనకు ప్రతి వస్తువు లభించును. కాని శాంతి లభించదు. పరిపూర్ణమైన శాంతి, దైవస్వరూపము అవుట వలన, శ్రీ చండి సప్తశతి లో *యా దేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా…..* అని స్తుతింపబడింది. 


సముద్ర ఊపరిభాగము లోనే అలలు ఉండును. సముద్రగర్భము లో నీటి ప్రవాహము కూడా ఉండదు. కారణం కదలికలు లేని నిశ్చలమైన స్థితి. ఇక్కడే అమూల్యమైన సంపద నిక్షిప్తమై ఉండును. ఊపరిభాగము లో నావల వలన జరిగే వ్యాపారములు, గందరగోళము, తుఫాన్లు, కెరటములు, సూర్యరశ్మి వలన భాష్పీకృతము లాంటివే సంభవించును. ఇవన్ని ప్రకృతి మానవాళి కి ఇచ్చే సూచనలు, ఆదేశాలు. కాని ఇంద్రియ 

చాంచల్యము, పటుత్వము వలన మానవుడు  ఈ సూచనలు ను పట్చించుకోడు. ప్రకృతి అనగా శక్తి. గోచరమయే ప్రతి చరాచరము నుంచి మనకు నిత్యమూ ఏదో ఆధ్యాత్మిక సందేశము వస్తూనే ఉండును. ఇదే విషయము *అవధూతోపాఖ్యానము* లో వివరించబడింది. (శ్రీ సరస్వతి గంగాధర్ గారు రచించిన శ్రీ గురు చరిత్ర చివరి భాగము లో కలదు.)

అటులనే శ్రీమద్భగవద్గీత లో రెండవ అధ్యాయము *సాంఖ్య యోగము* లో కూడా ఆత్మ అన్వేషణ వివరణ కలదు. ఇదే విషయము ఋుగ్వేదప్రోక్త *శ్రీదేవీసూక్తము* యందు కూడా కలదు. ఇంకా లోతుగా పరిశీలించగలిగే సాధకబృందము కు 1.దశ ఉపనిషత్తులు (ముఖ్యము గా కఠోపనిషత్-ప్రశ్నోపనిషత్తలు), 2.అష్టావక్రగీత, 3. ఋుభుగీత, 4.గురుతంత్రము, 5.సాంఖ్యయోగము..లాంటివి చాలా సహాయపడును. కర్తృత్వభావన నశించును. కర్తృత్వభావన కు మూలము కూడా *నేను* యే. కాని ఇది *అహంకారము* రజో-తమోగుణ సంపన్నమైనది. కర్తృత్వభావన నశించిన తరువాత మిగిలినది కూడా *నేను* యే. కాని ఇది ప్రారంభమున సత్వగుణసంపన్నమై, చివరకు గుణరహితమైనదిగా మిగిలిపోవును. 


ఇక శ్రీవిద్య పరంగా విచారిస్తే మంత్రము లో ఇమిడి ఉన్న ధ్యానశ్లోకము నే ధ్యానవిషయము గా చేయడము వలన, ధ్యానము సులభమవును. ఇది ఇంద్రియములకు తిరుగు ప్రయాణం వంటిది. లోపల కు ప్రయాణము ప్రారంభము చేయగా చేయగా శూన్యము కు దారితీయును. గుణరహితమైన ఆత్మ గోచరమవును. ఇదియే *నేను*….

ఈ *నేను* యే  *పరదేవత/అమ్మ*..


*అహం రుద్రేభిర్వసుభిశ్చరామి…..* అని ఋుగ్వేదప్రోక్త శ్రీదేవిసూక్తము లో అమ్మ ఘోషిస్తున్న తన స్వరూపము. 


నిత్యము సాధన లో ధ్యానశ్లోకము ను ధ్యానించడము వలన గమ్యము చేరుట సులభము. 


*అమ్మ* ఒక తత్వము. ఈ తత్వమే ఆత్మ తత్వము. ఆత్మ సర్వవ్యాపి అయినా ప్రతి ప్రాణి హృదయగుహ లో స్థిరముగా ఉండుట చేత *అమ్మ* *అంతర్ముఖ సమారాధ్యా* అని స్తుతింపబడినది. 



సర్వం అస్మత్ 

శ్రీ గురుచరణారవిందార్పణమస్తు

🙏🙏🙏

విముక్తి

 🕉🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


        🌸  _*విముక్తి*_ 🌸


*_ప్రతి మనిషిలో ముఖ్యంగా మూడు కోరికలు ఉంటాయి._*

*_1. జీవించాలి... మరణం ఉండకూడదు._*

*_2. సంపాదించాలి... మితం ఉండకూడదు._*

*_3. ఆనందించాలి... హద్దులు ఉండకూడదు._*

*_ఎవరైతే వీటిని దూరంగా ఉంచగలుగుతారో వారిని మానవాతీతులుగా భావించాలి. మనిషి మొదటినుంచి తాను ఉన్న స్థితిలో రాజీ పడలేక ఇంకా దేనికోసమో తపనతోనే జీవిస్తున్నాడు. అనంతాన్ని జయించాలన్న కోరిక ఒక్క మనిషిలోనే కనిపిస్తుంది._*

*_‘మీరు ఇంకా ఒక్క గంట మాత్రమే బతుకుతారని ముందుగా తెలిస్తే, ఎలా ఉంటుందో... ఆ స్థితిలోనే జీవించాలి’ అంటారు జిడ్డు కృష్ణమూర్తి._*


*_ఆ రహస్యం తెలిసిన మరుక్షణమే తనకు సంబంధించినవన్నీ తనవారికి ధారాదత్తం చేయడానికి ఆ గంట వ్యవధి సరిపోదని బాధపడతాడు మనిషి. త్యజించాల్సిన శరీరాన్ని బతికించాలన్న తపనతోనే, విలువైన సమయాన్ని వృథా చేస్తాడు. కానీ తాను చేరుకోవాల్సిన సహజ స్థితి గురించి ఆలోచించడు._*


*_కర్మ ఫలాల్ని జన్మ జన్మలుగా అనుభవిస్తున్నాడు. అయినా దేహం ఉండగానే విముక్తి కోసం సాధన మార్గం సుగమం చేసుకోలేక పోతున్నాడు._*


*_రామకృష్ణ పరమహంస పొందిన నిర్వికల్ప సమాధి, రమణ మహర్షి పొందిన సహజస్థితి..... ఇవన్నీ వారు అంతఃకరణాన్ని, ఇంద్రియాలను, సమస్త భోగ సామగ్రిని త్యజించి సాధించారు. ఆశారహితులై శారీరక కర్మలను చేసినట్టు కనిపించినా, వాటి ఫలితం అంటకుండా జీవించబట్టే అవి సిద్ధించాయి._*


*_మనిషి సహజ స్థితిని పొందడానికి సన్యాసం అవసరం లేదంటారు జిడ్డు కృష్ణమూర్తి._*


*_మరణం తరవాతే సహజస్థితి సిద్ధిస్తుంది అనేది అపోహ. వాస్తవానికి మనిషి నశించేవాడు కాదు, స్వేచ్ఛారహితుడు అంతకంటే కాదు. నిజమైన మనిషి అంటే ఆత్మ. ఆత్మ నిజస్వరూపం సచ్చిదానందం. అనంత ఆకాశంలో సర్వవ్యాపకమైన సర్వస్వాన్ని ప్రకాశింపజేసేదే సత్‌, చిత్‌, ఆనందం. నిత్యమైన, మరణంలేని, పతనంలేని పరమాత్మతత్వం ఇదే._*


*_దాన్ని పొందడానికి చేసే సాధనలో అహం అడ్డు పడుతూ ఉంటుంది. అహం అనే ప్రవాహం మీద తేలుతూ సహజస్థితి చేరే సాధన చేయడం అసాధ్యం. అహం హద్దులు దాటి, దాని ఆద్యంతాలు తెలుసుకోవడానికి అంతఃచైతన్యమనే నిచ్చెన ఎక్కాలి. అప్పుడే స్పష్టత ఏర్పడుతుంది. చైతన్య ఉన్నత స్థితిని చేరుకోవడానికి చేసే ప్రయత్నమే నిజమైన సాధన._*


*_సూర్యుడి వేడికి సముద్ర జలాలు ఆవిరై, మేఘాలుగా మారతాయి. అవి హిమాలయాల ఎత్తుకు ఎగురుతాయి. ఆవిరి అణువుల నిజస్వరూపం సముద్రమే. తమ మూలస్థానమైన సముద్రాన్ని తిరిగి చేరడానికి ఆ అణువులు నిరంతరం తాపత్రయపడతాయి. ఆకాశంలో సంచరిస్తూ తిరుగుతుంటాయి. సమయం రాగానే వర్షించి, అనంత సాగరంలో ఐక్యమై సహజస్థితికి చేరుకుంటాయి._*


*_అన్ని నీటి బిందువులూ సముద్రాన్ని చేరనట్లే, ఎంత సాధన చేసినా కర్మఫల శేషం వీడిపోనిదే సహజస్థితి సిద్ధించదు. కర్మ బంధాలనుంచి విముక్తి పొంది, ఆత్మను గుర్తించి, ఇంద్రియాల పరిధిని అధిగమించడానికి చేసే ప్రయత్నం నిరంతరం కొనసాగాలి. ఎవరైతే సమస్త సృష్టిలో సర్వవ్యాపిని చూడగలుగుతారో, వారికే ఆత్మ దర్శనం కలుగుతుంది. ఆ స్థితిని నిలబెట్టుకోవడమే యోగం._*


*_భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాల క్రితమే, ఎంతో మంది తపోధనులు తమ యోగవిద్య ద్వారా, ఉన్నతమైన ఆధ్యాత్మిక చైతన్యంతో అస్తిత్వ సమస్యలకు పరిష్కారం కనుగొన్నారు. తమ ఆధ్యాత్మికతతో అహం తాలూకు వాస్తవ స్వరూపం తెలుసుకొని, భవబంధ విముక్తులు అయ్యారు !_*


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

సుభాషితం

 🕉️✡️  *సుభాషితం*  ✡️🕉️



శ్లో.

*విత్తం బంధుర్వయః కర్మ*

*విద్యాభవతి పంచమీ|*

*ఏతాని మాన్యస్థానాని*

*గరీయో యద్యదుత్తరమ్||*


ధనం,బాంధవ్యము, వయస్సు, చేసేవృత్తి, విద్య మొదలయినవి ఐదుకూడా గౌరవించదగినవే.వీటిలో కూడా వరసగా ఒకదానికన్నా ఒకటి అంటే ముందుదానికన్నా తర్వాతది గొప్పది.

అనగా ధనంకన్న బాంధవ్యం గొప్పది. ధనం, బాంధవ్యంకన్న వయస్సు గౌరవించదగ్గది. ఆ మూడింటికన్న - "చేసేవృత్తి” గొప్పది అవుతుంది. అన్నింటికన్నను

విద్య అధికంగా ఆదరణీయం అని మనకు విద్యయొక్క వైభవాన్ని పై శ్లోకం తెలుపుతుంది. ఇవి అన్నీ అందరికీ అవసరమైనవే.....


మీ

*~శ్రీశర్మద*

26, మార్చి 2022, శనివారం

అన్నదాన మహిమ*

 *అన్నదాన మహిమ*

  

పూర్వం ఓ బ్రాహ్మణుడుండేవాడు. వేళగాని వేళ తనయింటికి ఎవరు వచ్చినా వాళ్లను తను ఎరగకపోయినాసరే, ఆదరించి భోజనం పెట్టేవాడు. ఒక వేళ ఇంటికెవరూ రాకపోతే, వీధి వెంట పోయే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు. ఇలాగ చాలాకాలం జరిగేక, ఒకనాడాయనకు అన్నదానంవల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. ఎవళ్ళను అడిగినా చెప్పలేకపోయారు.


ఒకాయన ఏమన్నాడంటే, " అన్నదాన మహిమ చాలా గొప్పది. దానిని వర్ణించాలంటే, కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. మీకు తెలుసుకోవాలని ఉంటే, స్వయంగా ఆ అన్నపూర్ణాదేవినే , అడిగి తెలుసుకోండి” అని సలహా ఇచ్చాడు.


అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య ఐన పార్వతీదేవి అన్నమాట.


ఆవిడకు కూడా అన్నదానమంటే ఎంతో ఆసక్తి. అందుకనే కాశీలో ఎవరికీ అన్నం లేకుండా పోదు. మన బ్రాహ్మడు కాశీ వెళ్లి గంగ ఒడ్డున కూచుని పార్వతీ దేవిని గురించి గాఢంగా తపస్సు చేయసాగాడు.


దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై 'నీకేం కావాలి?' అని అడిగింది. బ్రాహ్మడు సాష్టాంగనమస్కారం చేసి, " అన్నపూర్ణాదేవీ, నాకేమీ కోరిక లేదు. కాని, అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని నేను మిమ్మల్ని గురించి తపస్సు చేశాను. ఈసంగతి మీరే చెప్పాలి గాని ఇతరులవల్ల కాదు " అని తన మనసులో వుద్దేశం వెల్లడించాడు.


అప్పుడు దేవి అతనితో “నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు , అది నీవు తెలుసుకునే ఉపాయం మాత్రం చెబు తాను, విను:


హిమవత్పర్వతం దగ్గర హేమవతమని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు. నువ్వాయనదగ్గరకు వెళ్లి ఆయనకి కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషిoచి, ' బాబూ మీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు నీవు, 'నాకు పెద్ద కోరిక ఏమీ లేదు. నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాణ్ని నేను చూడాలి. ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణీ కూడా ఉండకూడదు ' అని ' చెప్పు. 'ఇంతేగదా ?' అని రాజు అందుకు ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ని 'అన్నదానంవల్ల కలిగే పుణ్యమేమిటిరా అబ్బాయి ?' అని అడిగి తెలుసుకో” అని చెప్పింది.


బ్రాహ్మణుడు 'సరే' అని చెప్పి హేమవతానికి బయలుదేరి వెళ్లేడు. దారిలో ఒక అడవి అడ్డమైంది. అందులో ప్రవేశించి వెడుతూ అతడు దారి తప్పి పోయాడు. దారితెలియక తచ్చాడుతోంటే, ఆ అడవిలో ఉండే బోయవాడొకడు ఆయన అవస్థ కనిపెట్టి "ఏం బాబూ, దారి తప్పిపోయినట్టున్నారు, ఏ ఊరు వెళ్లాలి?” అని ఆత్రముతో అడిగాడు.


హేమవత పర్వతం దగ్గరికి పోవాలి' అన్నాడు బ్రాహ్మడు.


"బాబూ, దారితప్పి ఆమడ దూరం వచ్చేశావు. సాయంత్ర మయిపోయింది. పులులు, సింహాలూ ఉన్న అడవి ఇది. రాత్రి ప్రయాణం చెయ్యకూడదు. పొద్దున్నే దారి చూపిస్తాను. ఈ రాత్రి ఆగిపొండి” అన్నాడు బోయవాడు.


బ్రాహ్మడు రాత్రికి అక్కడ ఉండిపోవటానికి ఒప్పుకోగానే బోయవాడు ఆయనను తన చేనువద్దకు తీసుకెళ్లేడు.


చేను దగ్గరకు వెళ్ళటంతోనే బోయవాడు యింటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు. అనపకాయలూ, కంది కాయలూ, పెసర కాయలూ కావలసినన్ని ఉన్నాయిగాని వాటిని ఉడకేసుకోమని ఇవ్వటానికి వాడి వద్ద కొత్తకుoడ లేకపోయింది. తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు. ఎలాగ మరి? అని ఆలోచించాడు.


బ్రాహ్మడు, 'నాయనా, నాకేమీ వద్దోయ్. నువ్వు చేసిన ఆదరణవల్ల నా శ్రమా, ఆకలీ కూడా తీరిపోయాయి. ఆలోచించక పడుకో' అన్నాడు. కాని బోయవాడికి ఆ బ్రాహ్మణి పస్తు పెట్టడమంటే మనస్సు ఒప్పింది కాదు. అంచేత ఇంత చారపప్పూ పుట్ట తేనే తెచ్చి ఇచ్చి, వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు.


బ్రాహణుడు అవి తీసుకొని, అంగోస్త్రం పరుచుకుని, కింద పడుకోబోతూంటే, బోయవాడు, 'అయ్యో, కిందపడుకోబోకండి. పులులు వస్తాయి ' అని చెప్పి, ఆయనని చేలో ఎత్తుగా ఉన్న మంచె మీద పడుకో బెట్టి, తాను కింద ఉండి, విల్లూ, అమ్ములూ పుచ్చుకుని మృగాలేవీ రాకుండా రాత్రంతా బ్రాహ్మడికి కాపలా కాశాడు.


బోయవాడలా నిద్రపోకుండా రాత్రంతా కాపలా కాశాడు కాని, తెల్లవారు ఝామున నిద్ర ఆగక ఒక్క కునుకు తీశాడు. అంతలో ఎక్కడనుంచో ఓపులి వచ్చి, పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది.


బ్రాహ్మణుడు నిద్ర లేచి, జరిగినదంతా తెలుసుకుని, తనమూలాన ఆ బోయవాడు పులివాత బడ్డాడని ఎంతో విచారించాడు. బోయవాని భార్య బాహ్మణునితో “స్వామీ, నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు? మీరు విచారించకండి. మీకు హేమవతానికి దారి చూపిస్తాను , నడవండి" అని, ఆయనను తీసికెళ్లి దారి చూపెట్టి, వెనక్కి తిరిగివచ్చి, భర్తతోపాటు సహగమనం చేసింది.


ఆ బ్రాహ్మణుడు బోయదంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హేమవతాన్ని చేరుకున్నాడు. అక్కడ రాజును చూచి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు. ' పుట్టినప్పుడు మీ పిల్లవాణ్ణి ఏకాంతంగా చూడడ






కుటుంబ అనుబంధాలు

 🤷‍♀️🤷🏻‍♂️


నేను గత ముప్ఫై ఏళ్లుగా కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు లో వస్తున్న మార్పులను చాలా దగ్గరగా చూస్తూ వచ్చాను..

          పెద్దగా ఆస్తులు.. చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు.. సమాజంలో హోదా.. సౌకర్యాలు సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ్య ఆప్యాయత అనుబంధాలు చిక్కగా వుండేవి..

               ఒకరికి ఒకరు చేదోడుగా.. నిజాయితీగా అరమరికలు లేని సంబంధాలు కొనసాగించారు..

          వున్నంతలో తృప్తిగా వున్నారు.. కష్టానికి సుఖానికి ఒకరికొకరు కలుసుకోవడం.. అందరం దగ్గర వాళ్ళం అనే అనుభూతి పుష్కలంగా వుండేది..

               కుటుంబంలో ఎవరి పిల్లలు అయినా ఏదైనా సాధిస్తే అది కుటుంబం మొత్తం ఉమ్మడిగా సంతోషం వ్యక్తం చేసేవారు..

               మా మనవడు లేదా మనవరాలు..అని తాతలు.. మా మేనకోడలు లేదా మేనల్లుడు అని అమ్మమ్మ ఇంటివారు నానమ్మ ఇంటి వారు అందరూ గర్వంగా చెప్పుకునే వారు..

             కానీ ఎప్పుడైతే 1983-84 నుంచి కార్పొరేట్ కాలేజ్ సంస్కృతి పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే ఒక్కొక్కరు పిల్లలను చదివించడానికి priority ఇవ్వడం మొదలైందో.. ఎప్పుడైతే పిల్లలు కూడా ఒకరికి మించి ఒకరు అవకాశాలు అందిపుచ్చుకుంటూ. .కెరీర్ సృష్టించుకోవడం మొదలైందో..

             మొదట్లో వారే కుటుంబాలలో మిగిలిన వారికి మార్గనిర్దేశనం చేసే వారు.. మిగిలిన వారికి అరమరికలు లేకుండా అండదండలు అందించే వారు.. తాము ఎదగడంతో పాటు తమ వారు కూడా ఎదగడం కోసం సహాయ పడ్డారు..

             కానీ ఎప్పుడైతే సర్వీస్ సెక్టార్ ప్రాముఖ్యత పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే వేగంగా కెరీర్ దొరకడం మొదలైందో.. వేగంగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారడం మొదలైందో..

              అంతకు ముందు కన్నా జీవితంలో సౌఖ్యాలు.. విలాసాలు.. పెరిగాయో ఎందుకో మనుషుల వ్యక్తిత్వం మరింత పరిణతి చెందాల్సిన దగ్గర రివర్స్ లో కుంచించుకు పోవడం మొదలైంది పక్కాగా సంబంధాలు పలుచపడటం మొదలైంది..

              ఏ ఇద్దరు కలిసినా తమ పిల్లలు సాధించిన విజయాలు.. కొన్న ఆస్తులు.. చేయించుకున్న నగలు.. వారు పొందుతున్న సాలరీ ప్యాకేజ్.. వారు పొందుతున్న కంఫర్ట్ గురించి తప్ప..

               వెనుకటి రోజుల్లో లాగా ఆప్యాయంగా నోరారా పలకరించు కోవడమే తగ్గిపోయింది..

                నా చిన్న నాటి రోజుల్లో ఇంట్లో కీడు జరిగినా.. శుభకార్యం జరిగినా కనీసం 10 మంది చుట్టాలు వారం పది రోజుల ముందు నుంచే వచ్చి వుండేవారు..

              తరువాత కూడా ఇంకో వారం రోజులు వుండేవారు..

            రాత్రి పూట ఆరుబయట మంచాలు వేసుకుని పొద్దుబోయిందాక చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుకునే వారు..

               ఇప్పుడు ఎంత దగ్గర వారి కార్యక్రమం అయినా.. చేసే వారు కూడా ఆప్పో సొప్పో చేసి పక్క వాడి కన్నా ఘనంగా చేయాలి అని చూపించే శ్రద్ధ మన వాళ్ళను దగ్గరగా నిలుపుకుందాము అని మర్చిపోతున్నారు..

                అటెండ్ అయ్యే వారు కూడా తమ అతిశయం చూపించుకోవడానికి.. తమ స్థితిలో వచ్చిన మార్పు చూపించుకోవడనికి ఇస్తున్న ప్రయారిటీ..

             పారదర్శక సంబంధాలు కి ఇవ్వడం లేదు.. చాలా మొక్కుబడిగా ఆహ్వానాలు హజరులు మిగిలిపోతున్నాయి..

           అందరికి పిల్లలు దూరంగా వుంటున్నా.. ఇరుగు పొరుగు నే వుంటున్న రక్త సంబంధీకులు తో కూడా ఆత్మీయ అనుబంధాలు వుంచుకోవడం లేదు..

            నిష్కారణంగా చిన్న చిన్న కారణాలు తోనే విపరీతమైన అహం అతిశయం తో వ్యవహరిస్తూ.. అందరికి అందరూ గిరిగీసుకుని బతకడానికి అలవాటు పడుతున్నారు..

          వయసు పెరిగే కొద్దీ ఓర్పు సహనం పెరగాల్సిన దగ్గర అసూయ ద్వేషాలు పెంచుకుంటున్నారు..

         నూటికి 90% కుటుంబాలలో పిల్లలు దూరంగానే వుంటున్నారు.. వీళ్లకు పెద్ధతనం.. ఒంటరి తనం.. అనారోగ్య సమస్యలు.. మనిషి తోడు అవసరం..

            అయినా కొద్దిపాటి కూడా సర్దుబాటు ధోరణితో వుండడం లేదు.. విపరీతమైన తామసం.. పక్క వాడి నీడ కూడా సహించడం లేదు..

       చాలా కుటుంబాలలో ఇప్పటికే మనుషులు పలచబడ్డారు..

            వలసలు పుణ్యాన.. గత 60-70 సంవత్సరాలుగా అనుసరిస్తూ వచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఇప్పటికే కుటుంబాల సైజ్ తగ్గిపోయింది.. 

        దానికి తోడు కేవలం కూడూ గుడ్డా కూడా పెట్టని ఈ అడ్డు గోడలు పర్యవసానం..

                బాధాకరమైన విషయం ఏంటంటే ఒక వేళ కజిన్స్ మన రూట్స్ కాపాడుకుందాం అనుకున్నా.. రిలేషన్స్ లో ఎమోషన్ వుంచుకుందాము అనుకున్నా మెజారిటీ కుటుంబాలలో పెద్ద వాళ్ళు దూరిపోయి అగాధం పెంచుతున్నారు..

           చిన్నప్పటి మా రోజులే బంగారపు రోజులు అనిపిస్తున్నాయి..

              నేడు పిల్లలకు అసలు కుటుంబ సంబంధాలు పరిచయం చేయడం ఇన్వాల్వ్ చేయడం ఎప్పుడైతే తగ్గిపోయిందో..

      రేపటి రోజున మన తరువాత మన పిల్లలకు మన అనే వారే లేని..  మిగలని పరిస్థితి సృష్టిస్తున్నాము..

        నీ ఇంటికి వస్తే ఏమి పెడతావు? నా ఇంటికి వస్తె ఏమి తెస్తావు అన్న భావన నుంచి కొద్దిపాటి అయినా మార్పు చెందాలి..

           అందరూ కొద్దిగా ఆలోచించండి.. మన కుటుంబాల్ని మనమే ఎడం చేసుకుంటూ.. మనలో మనమే దూరం పెంచుకుంటూ ఇంకా సమాజం నుంచి మనం ఏమి ఆశిస్తాము..

               ఎవ్వరికీ వారు గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి.. మన చిన్ననాడు మనం ఏమేమి పొందాము నేడు మన పిల్లలకు ఏమేమి దూరం చేస్తున్నాము? 

           ఇప్పటికే చాలా మంది పెద్దవారు వెళ్ళిపోయారు.. మనకి ఎంత టైం వుంటుందో తెలియదు..

           మనం సక్రమంగా ఆరోగ్యంగా వున్నప్పుడే కనీసం మన వాళ్ళ దగ్గర అయినా పనికిమాలిన అహం అతిశయం వదిలి వెద్ధాము..

           మన తరువాత కూడా మన పిల్లలకి మన కుటుంబ అనుబంధాలు వారసత్వంగా ఇద్దాము..

           🙏🙏🙏

జగద్గురు

 The True Meaning of Jagadguru by Maha Periyava.

Kriya Sakti

జగద్గురువు


1933లో పరమాచార్య స్వామివారు వారణాసిలో ఉన్నప్పటి సంఘటన. కాశి మహారాజు రాజభవనంలో మహాస్వామివారిని స్వాగతించారు. అక్కడ ఎందరో విద్వాంసులు పండితులు ఉన్నారు. అక్కడున్న కొద్దిమంది పండితులకి స్వామివారిపై కొంచం అసూయ. పరమాచార్య స్వామికి జగద్గురు బిరుదు ఎలా సంభావ్యం అన్నది వారి కడుపుమంట.


అక్కడున్న వారిలో ఒక పండితుడు, “ఈ జగద్గురువు ఎవరు?” అని అడిగాడు.


స్వామివారు మర్యాదతో, “నేనే” అని సమాధానమిచ్చారు.


ఆ పండితుడు వ్యంగంగా “తమరు జగద్గురువు” అన్నాడు.


అందుకు స్వామివారు “जगतां गुरुः न – నేను జగద్గురువు అని అంటే దాని అర్థం నేను ఈ జగత్తుకు గురువు అని కాదు అర్థం.


जगति पद्यमनाः सर्वे मम गुरवः - విశ్వాంలోని అన్ని ప్రాణులు నాకు గురువులు అని అర్థం” అని చెప్పారు.


ఇలా చెప్పగానే అక్కడున్న పండితులందరూ ఆశ్చర్యంతో వెనక్కు తగ్గారు. కాని మహాస్వామివారు అంతటితో ఆపలేదు.


ఈ వాదం జరుగుతున్న మందిరంలో పిచుకలు పెట్టిన కొన్ని గూళ్ళు ఉన్నాయి. స్వామివారు ఒక గూటివైపు చెయ్యి చూపిస్తూ, ఆ పండితులను అడిగారు, “किं इदं? - ఏమిటిది?”


అందుకు ఆ పండితులు, “नीडः - గూడు” అని చెప్పారు.


మహాస్వామివారు “केन निर्मितं? – ఎవరు కట్టారు?” అని అడిగారు.


వారు “चटकैः – పిచుకలు” అని చెప్పారు.


స్వామి వారితో, “ఈ గూడు కట్టినది కాళ్ళు చేతులు లేని ఆ చిన్ని పక్షులు. మనకు కాళ్ళు, చేతులు ఉన్నాయి. కాని కాని మనం వాటిలా గూడు కట్టలేము. ఆ పిచుకలకు ‘క్రియా శక్తి’ ఉంది. నాకు ఆ శక్తి లేదు”


కాబట్టి ఆ పిచుకలు నాకు ‘గురువు’ అని చెప్పారు!!!


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం 


Note: Now a days unnecessary Controversies are created by Half Knowledged and Egoistic, Arrogant People for their Selfish Motives.

Let us understand Truth .

రస'భరితమైన వ్యంగ్యం

 ఒక 'రస'భరితమైన వ్యంగ్యం❗


నేను ప్రశాంతంగా కూర్చుని నా ఇంటర్నెట్‌ని వాడుకుంటున్నాను...

అప్పుడు కొన్ని దోమలు 🦟🦟ఒచ్చి, నా రక్తాన్ని పీల్చడం ప్రారంభించాయి, సహజ ప్రతిచర్యలో భాగంగా నా చేయి పైకెత్తి రెండు అందుకున్నాను.


మరో ఒకట్రెండు దోమలు 🦟🦟 కుప్పలు కుప్పలుగా పడ్డాయి...అప్పుడే తట్టుకోలేక పోయాడు.. (Intolerant) అని శబ్దం చేయడం మొదలుపెట్టాయి.


అడిగాను.., "ఇందులో అసహనం ఏముంది..?"


రక్తాన్ని పీల్చుకోవడం వాటి స్వేచ్చ.. (Freedom) అని చెప్పడం మొదలుపెట్టాయి.


ఆజాదీ అనే పదం వినగానే వాటికి 🦟🦟 అనుకూలంగా పలువురు మేధావులు (Intellectuals) దిగి వాదులాడడం (Debates) మొదలెట్టారు.. ఆ తర్వాత నినాదాలు (Slogans) మొదలయ్యాయి..


"ఎన్ని దోమలను చంపుతారు.. (Tum kitne ____ Maaroge)

ప్రతి ఇంటి నుండి దోమలు వస్తాయి." (Har ghar se ___ Niklega)


మేధావులు తీవ్ర వాదనలతో వార్తాపత్రికలలో (Hindu మొదలు Washington Post దాకా) పెద్ద పెద్ద కథనాలు రాయడం ప్రారంభించారు.


శరీరంపై దోమలు ఉన్నా.. రక్తాన్ని పీల్చుకుంటున్నాయని ఎక్కడ రుజువైంది.. అని అవి 🦟🦟🦟 అన్నాయి.


అంతేకాక 🦟🦟🦟లు రక్తం పీల్చినప్పటికీ, అది తప్పు కావచ్చు, కానీ అది రాజద్రోహం (Sedition) వర్గంలోకి రాదు.


ఈ "దోమలు" 🦟🦟🦟 చాలా ప్రగతిశీలంగా (Progressive) గా ఉన్నందున.. ఎవరి శరీరంపైనైనా వాలేయచ్చునేది, వారి 'ఆందోళన'గా (Protest) మారింది.


నేను.. - "నేను నా రక్తాన్ని పీల్చుకోనివ్వను." అనే చెప్పా


అందుకే అవి 🦟🦟🦟 అరవడం మొదలుపెట్టాయి..

ఇది "అతి విపరీతమైన (Extremist) ప్రేమ"... నువ్వొక మతోన్మాది (Fanatic), డిబేట్ (Cowardice) నుండి పారిపోతున్నావు.


నేను చెప్పాను..., "మీ ఉదారవాదం (Liberalism) నా రక్తాన్ని పీల్చడానికి మిమ్మల్ని అనుమతించదు."


దీనిపై వాటి 🦟🦟🦟 వాదన ఏమిటంటే, "అది తప్పు అయినప్పటికీ, కొద్దిగా రక్తం పీల్చడం మిమ్మల్ని చంపదు, కానీ మీరు అమాయక దోమల ప్రాణాలను లాగేసుకున్నారు.

"ఫెయిర్ ట్రయల్" (Fair Trial - Principles of Natural Justice - Audi Alterem Partem - Hearing from other side) కి కూడా అవకాశం ఇవ్వలేదు."


అదే సమయంలో, కొందరు రాజకీయ నాయకులు కూడా వచ్చి, ఆ దోమలకు 🦟🦟🦟 తమ తోటలోని 'పెద్దమ్మ' కొడుకులు లెక్క అని చెప్పడం ప్రారంభించారు.


పరిస్థితి చూసి కలత చెంది, నేను అలా అన్నాను, "కానీ ఇలా.. దోమలు రక్తాన్ని పీల్చడం వల్ల మలేరియా వస్తుంది. మరియు ముందుగానే లేదా తరువాత అతను అనారోగ్యంతో మరియు బలహీనంగా ఔతాడు మరియు మరణిస్తాడు ...


దీనిపై దోమలు 🦟🦟🦟 మాట్లాడుతూ.. "మీ మాటల్లో లాజిక్ లేదు. కాబట్టి భవిష్యత్తు కల్పనల (Futuristic) ఆధారంగా మీ ఫాసిస్ట్ (Fascist) నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు.


“దోమ 🦟 కుట్టడం వల్ల మలేరియా వస్తుందనేది శాస్త్రీయ సత్యం... గతంలో కూడా ఇలాగే ఎదుర్కోవాల్సి వచ్చింది.." కానీ మీవాళ్లకు 🦟🦟 సైంటిఫిక్ (Scientific) పదం అర్థం కాలేదు..


దానికి అవి 🦟🦟 స్పందిస్తూ.. "దోమల 🦟🦟సమాజంపై నాకున్న ద్వేషాన్ని సాకుగా చూపి, చరిత్ర సృష్టిస్తున్నా.. వర్తమానంలో జీవించకుండా."


చాలా కోలాహలం తరువాత, వాటి సామరస్య వాతావరణాన్ని (Peaceful Atmosphere) పాడుచేసినందుకు నా స్వంత తల🧠 ని కూడా నిందించాడు.


నాకు వ్యతిరేకంగా నా చెవిలోకి ప్రవేశించడంతో, దోమలన్నీ విజృభించడం ప్రారంభించాయి ... "మేము స్వాతంత్ర్యం తీసుకుంటాము..." (Hum leke rahenge Azadi)


వాదోపవాదాలు - వాదోపవాదాలకు దిగడం వల్ల నేను పడిన బాధ... రక్తం పీల్చుకున్నప్పుడు కంటే ఎక్కువ అని.


ఆఖరికి సంస్కృతం లో ఓ మాట గుర్తుకు ఒచ్చింది.. 

"దండం దశ గుణం భవేత్❗"


ఇంకేముంది


వెంటనే నేను నల్ల హిట్ స్ప్రే ని తీసుకుని, 

ఇంటి లోపల నుండి బయటి వరకు, 

పై నుండి క్రిందికి, 

తోట నుండి కాలువ వరకు,

వాటి ప్రతి అధునాతన మరియు రహస్య ప్రదేశాల్లో

స్ప్రే చేసేసాను...


ఒక్కసారిగా 🦟🦟🦟🦟 మెత్తబడి పోయి... 

తర్వాత అన్నీ 🦟🦟🦟🦟 శాంతించాయి..😄😄


అప్పటి నుంచి..

చర్చ లేదు...

వివాదం లేదు...

స్వేచ్ఛ లేదు...

వ్యర్థం లేదు...

విప్లవం లేదు...

ఆందోళన లేదు...


🙏 ఇప్పుడు అంతా బాగానే ఉంది.. ఇదే లోకం తీరు 🙏


ఈ పోస్ట్ అస్సలు కల్పితం కాదు.. 

ఇది 💯% ప్రస్తుత పరిస్థితులకు సంబంధించినదే