30, మార్చి 2022, బుధవారం

జ్ఞానయోగసాధన

 18వ అధ్యా.)


జ్ఞానయోగసాధన


453


1


దేహః కిమన్నదాతుః స్వం నిషేక్తుర్మాతురేవ చ మాతుః పితుర్వా బలినః క్రేతురగ్నేః శునోపి వా. ఏవం సాధారణం దేహమవ్యక్త ప్రభవాప్యయమ్ కో విద్వానాత్మసాత్ కృత్వా హన్తి జన్తూనృతే సతః.


2


(భాగవతము 10-10-11,12)


ఈ దేహము ఎవరిది? అన్నము పెట్టి పోషించువానిదా? పుట్టించిన తండ్రిదా? తొమ్మిది నెలలు మోసిన తల్లిదా? తల్లిని కనినట్టి తాతదా? దీనిచేత పనిచేయించు బలవంతునిదా? శ్మశానములో దీనిని కాల్చివేయు అగ్నిదా? రుధ్ర భూమియందు దీనిని కొటికి కొటికి తినివేయు కుక్కలదా? అని భాగవత కారుడు నిలదీసి ప్రశ్నించెను. భాగవతము దశమస్కంధములో నారదుడు నలికూబర, మణిగ్రీవులను దేవపుత్రులకు గావించిన హితోపదేశ సందర్భమున ఈప్రశ్న గావింపబడెను. ఆ ప్రశ్నకు నారదులే ఈ ప్రకారముగ సమాధానము ఒసంగివైచిరి –


'నాయనలారా! ఈ దేహము ఎవరిదీ కాదు. ఇది యొక సామాన్యమైన జడవస్తువు. మృత్తి కానిర్మిమగు ఘటమువంటిది. ప్రకృతి నుండి పుట్టి ప్రకృతిలో లయమైపోవుచున్నది. ఇట్టి అల్పవస్తువును 'నేను' అని తలంచి ఇతరులకు కీడు చేయదలంచువారు ఎంత అవివేకులు?' కావున నశ్వరమై, పాంచభౌతిక మైనట్టి ఈ శరీరము తాను కాదనియు, శాశ్వతమగు చిన్మయ ఆత్మయే తాననియు బాగుగ నిశ్చయించుకొని, సర్వప్రాణులు తన స్వరూపమే యని భావించు కొని, ఎవరికిని అపకారము చేయక జీవితమును గడుపవలయును.


మానవునికి కలుగుచున్న దుఃఖమంతటికిని కారణము ఈ దేహాభిమానమే. దేహముపైనను, దేహమునకు బయట గల పదార్థములపైనను గల మమత్వమే దుఃఖమునకు హేతువు. జీవుడు ఉపాధిని ధరించి లోకమున వ్యవహరించు

కామెంట్‌లు లేవు: