17, మార్చి 2024, ఆదివారం

చర్మవ్యాధుల గురించి

 చర్మవ్యాధుల గురించి సంపూర్ణ వివరణ - చర్మవ్యాధులు రావడానికి గల కారణాలు - 


  * విరుద్ధములగు అన్నపానములు తినటం అనగా పాలతో తయారైన సేమ్యా , కోవా , ఐస్ క్రీం తిని పెరుగన్నం తినటం లేదా చల్లని కూల్ డ్రింక్ ని వేడిఅన్నం , కూరలు కలిపి తినటం ఇలాంటి ఆహారపు అలవాట్లు పాటించటం . 


 * మలమూత్రాలను ఆపడం , అదేవిధముగా వాంతి వంటి సహజ వేగాలను బలవంతముగా నిరోధించడం . 


 * భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయుట , ఎండలో తిరుగుట చేయరాదు . 


 * ఎండలో తిరిగి వచ్చి చల్లని నీరు తాగరాదు . 


 * అతిగా శ్రమపడి వచ్చి వెంటనే నీటిని సేవించరాదు . 


 * అజీర్ణముగా ఉండగా మరలా భుజించరాదు . అనగా ముందు తిన్నది సంపూర్ణముగా అరగక ముందు మరలా భోజనం చేయరాదు . 


 * కొత్తబియ్యపు అన్నం , పెరుగు మరియు చేపలు కలిపి తినరాదు . 


 * అధికంగా పులుపు , ఉప్పు తినరాదు . 


 * మినుములు , ముల్లంగితో చేయబడిన వంటలు , పాలు నువ్వులతో చేసిన వంటలు ఎక్కువుగా తీసుకొనుట 


 * తినిన ఆహారం జీర్ణం కాకముందే దాంపత్యములో పాల్గొనుట చేయరాదు . 


 * పగలు నిద్రించరాదు . పగలు నిద్రించుట వలన శరీరం నందు శ్లేష్మము పెరిగి దానివలన రక్తప్రసరణకు అవరోధము కలిగి చర్మమునకు రక్తప్రసరణ సరిగ్గా జరగక చర్మవ్యాధులు సంభవించును . ఎండాకాలం కొంచంసేపు పగలు నిద్రించవచ్చు . 


        పైన చెప్పినవిధముగా విరుద్ధమైన ఆహారం , పనులు చేయుటవలన శరీరంలో చర్మము , రక్తము , మాంసము , లింప్ గ్రంథులు దోషమును పొంది రకరకాల చర్మవ్యాధులు కలుగును. 


  చర్మవ్యాధులు రావడానికి పూర్వము కనిపించు లక్షణములు - 


 * స్పర్శజ్ఞానం క్రమేపి తగ్గిపోవుట . 


 * చెమట ఎక్కువుగా పట్టుట లేదా చర్మవ్యాధి ప్రదేశము నందు అసలు చెమట పట్టకపోవును . 


 * శరీరవర్ణము మారి నల్లబారిపోవుట . 


 * దద్దుర్లు . 


 * పోట్లు . 


 * అలసట , వడలినట్లు అగుట. 


 * వ్రణములు లేచి అధికభాధతో కూడి శీఘ్రముగా  

      జనించి త్వరగా మానకుండా ఉండటం. 


 * తాపము ( చర్మం అంతా మంటలు ) . 


  అసాధ్య చర్మవ్యాధి లక్షణములు - 


 * రోగి బలహీనుడుగా ఉండి దప్పిక , మంట , అగ్నిమాంద్యములతో కూడి క్రిములు ఏర్పడిన అసాధ్యము . 


 * చర్మవ్యాధి ఏర్పడి 10 సంవత్సరాలు దాటిన     

      అసాధ్యము . 


  చర్మవ్యాధుల యందు చికిత్సాక్రమము - 


        శరీరము నందలి వ్యర్ధపదార్ధముల వలన చర్మవ్యాధులు వచ్చును . కాబట్టి వానిని వివిధరకాల పద్ధతుల ద్వారా వాంతి , విరేచనం మొదలగు శోధన పద్ధతులను ఉపయోగించి వ్యర్ధాలను బయటకి పంపుతూ ఔషధాలను ఇయ్యవలెను . 


  చర్మవ్యాధుల యందు పథ్యము - 


  * తేలికగా అరిగెడి ఆహారం తీసికొనవలెను . 


  * త్రిఫలములు - ఉశిరి , కరక్కాయ , తానికాయ 

       విరివిగా వాడవలెను . 

  

  * త్రిఫలా ఘృతము కూడా వాడవచ్చు . 


  * పాతధాన్యములు వాడవలెను . 


  * యవలు , చామలు , కొర్రలు , కందికట్టు , పెసర 

       కట్టు , మేకమాంసం వాడవలెను . 


  * బీరకాయ , పొట్లకాయ , దోసకాయ , పెరుగు 

      తోటకూర , పొన్నగంటికూర , మెంతికూర , ఆవు 

       నెయ్యి , తెల్ల గలిజేరుకూర , తేనె , నీరుల్లి . 


           పైన చెప్పిన పదార్ధాలు ఆహారంలో తప్పక భాగం చేసుకొనవలెను . 


  చర్మవ్యాధుల యందు అపథ్యము - 


 * చింతపండు పులుపు , అతిగా కారం , ఆవాలు , 

      గుమ్మడి , వెల్లుల్లి , పెరుగు , పాలు . 


 * బెల్లం , కల్లు , సారాయి , నువ్వులు .


 * మినుములు , చెరుకురసము , పానకము .


 * చేపలు , నీటిపక్షులు , కోడి మాంసం , పావురం .


 * అతిగా వ్యాయామం , స్త్రీసంభోగం చేయరాదు .  


          పైన చెప్పినవిధముగా ఆహారపు అలవాట్లు పాటిస్తూ సరైన వైద్యుడి పర్యవేక్షణలో ఔషధాలు సేవించుచున్న చర్మవ్యాధుల నుంచి త్వరగా బయటపడగలరు. ఇక్కడ మనం ముఖ్యముగా గుర్తు ఉంచుకోవాల్సిన విషయము ఏమిటంటే వ్యాధి సంప్రాప్తినిచ్చిన తరువాత ఔషధాలు సేవించుట కంటే వ్యాధి రాకుండా చూసుకోవడమే అత్యంత ప్రధానమైనది. 


 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

Panchaag

 


Voter ID Card

 *Voter ID Card: ఓటరు ఐడీ కార్డులో ఏదైనా తప్పులు ఉన్నాయా? ఈ విధంగా అప్‌డేట్ చేసుకోండి*


కొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు (2024). మరి ఓటరు గుర్తింపు కార్డు ఎంపిక ఎలా సాధ్యం? ఇలాంటి పరిస్థితుల్లో ఓటర్ ఐడీ కార్డులో మీ చిరునామా తప్పుగా ఉంటే ఓటు వేయడం కష్టం. అందుకే ఇప్పుడు ఓటరు గుర్తింపు కార్డు చిరునామాను అప్‌డేట్ చేయడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. అయితే దీని కోసం మీరు మరెక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీని గురించి డిటేయిల్డ్‌గా తెలుసుకుందాం


1. ఓటరు గుర్తింపు కార్డుపై చిరునామాను అప్‌డేట్ చేయడానికి, మీరు ముందుగా నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ www.nvsp.inకి లాగిన్ అవ్వాలి. అప్పుడు మీరు వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ఎలక్టోరల్ రోల్‌లో నమోదుల సవరణ కనిపిస్తుంది. ఆ విభాగంపై క్లిక్ చేయండి.

2. ఆ తర్వాత ఫారం-8పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ముందు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు కొన్ని అవసరమైన వివరాలను నమోదు చేయాలి. ఇక్కడ మీరు సెల్ఫ్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

3. ఇక్కడ మీరు షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ ఎంపికను ఎంచుకోవాలి. మీ అడ్రస్ నియోజక వర్గం లోపల లేదా వెలుపల మారుతుందో లేదో కూడా మీరు ఎంచుకోవాలి. ఆ తర్వాత సరే క్లిక్ చేయండి.

4. అప్పుడు మీరు మీ రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంటరీ నియోజకవర్గం సమాచారాన్ని పూరించాలి. ఆ తర్వాత ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ నంబర్, ఇమెయిల్, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

5. తర్వాత మీ కొత్త అడ్రస్‌ ఎంటర్‌ చేసి ఓటరు ఐడీ కార్డ్‌లో అప్‌డేట్ చేయండి. పత్రాన్ని అప్‌లోడ్ చేసిన తర్వాత తదుపరి ఎంపికపై క్లిక్ చేయండి. తర్వాత క్యాప్చా కోడ్‌ని నమోదు చేసి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి.

6. ఆ తర్వాత మీ ఆన్‌లైన్ అప్లికేషన్ వెరిఫై చేయబడుతుంది. అయితే మీరు అప్లై చేసే ముందు అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా? లేదా అని తెలుసుకోవాలి. మీ ఓటర్ ఐడీలో కొత్త అడ్రస్‌ అప్‌డేట్ చేయడం జరుగుతుంది. దీని కోసం మీరు ఎటువంటి డబ్బు ఖర్చు చేయనవసరం లేదు.

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 57*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 166*


*అన్ని జాతులకును నాధారమైనట్టు*

*లున్న సామగాది మిన్న ఋషుల*

*నెన్ని జన్మములకు నెక్కడ గానము* 

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

అన్ని జాతులకు ఆధారమైన ఋషుల జన్మమును ఎక్కడను చూడలేము.

ఋషితత్వమలవడుట పురాకృతసుకృతము.


*💥వేమన పద్యాలు -- 167*


*అన్ని జాతులందు నధికుల మనుచును*

*యజ్ఞ పశువు జంపి యగ్ని నిడుచు*

*మల్ల మందు బెట్టి మాంసంబు దిందురు*

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

బ్రాహ్మణులు అన్ని జాతులకంటే తమ జాతే గొప్పదని పలుకుచు యజ్ఞయాగాదుల అగ్నిలో కాల్చి ప్రసాదముగా

తిందురు.


*💥వేమన పద్యాలు -- 168*


*అన్ని జాడ లుడుగ నానందకాముడై*

*నిన్ను నమ్మ జాలు నిష్ఠతోడ*

*నిన్ను నమ్మ ముక్తి నిక్కంబు నీయాన* 

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

ఆశలన్ని తీరిపోయాక దేవుని గూర్చి నమ్మబలికి , మానవుడు ముక్తి కాముకు డౌతాడని భ్రమపడుదురు.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 53*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*శృతివిప్రతి పన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా ।*

*సమాధావచలా బుద్ధిస్తదా యోగామవాప్స్యసి ।।*


*భావము:* 

కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగ స్థితిని పొందెదవు.


*వివరణ:*  

సాధకులు ఆధ్యాత్మిక పథంలో పురోగమించేటప్పుడు తమ మనస్సులో వారికి భగవంతునితో సంబంధం బలపడుతూ ఉంటుంది. ఆ సమయంలో, తాము పూర్వం చేసే వైదిక కర్మలు ప్రతిబంధకంగా, సమయం తీసుకునేవిగా అనిపిస్తాయి. తమ భక్తి తో పాటుగా ఇంకా పూజలు మొదలగునవి చేయాలా అని అనుకుంటారు మరియు పూజాది కార్యాలను వదిలి పూర్తిగా సాధన లో నిమగ్నమైతే ఏదైనా తప్పు చేసినట్టవుతుందా అని సంశయ పడతారు. ఇలాంటి వారు తమ సందేహానికి ఈ శ్లోకం లో జవాబు తెలుసుకొంటారు. కోరికలను తీర్చే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా సాధన లోనే నిమగ్నం అవటం తప్పు కాదని, పైగా అది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.


మాధవేంద్ర పూరి అనే 14వ శతాబ్ద ముని చాలా దృడంగా ఈ భావాన్ని వ్యక్తం చేస్తాడు. అతను విస్తృతమైన కర్మకాండ ఆచారాలు పాటించే ఒక వేద బ్రాహ్మణుడు, కానీ సన్యాసం తీసుకుని, పరిపూర్ణంగా శ్రీ కృష్ణభక్తి లో నిమగ్నమయిపోయాడు. తన జీవిత తదుపరి దశలో ఇలా అన్నాడు:


*సంధ్యా వందన భద్రమస్తు భవతే భోః స్నాన తుభ్యం నమః*

*భో దేవః పితరశ్చతరపణ విధౌ నహం క్షమః క్షమ్యతాం*

*యత్ర క్వాపి నిషద్య యాదవ కులోత్తాస్య కంసద్విషః*

*స్మారం స్మారమఘం హరామి తదలం మన్యే కిమన్యేన మే*


"అన్ని వైదిక ఆచారాలకి నా క్షమార్పణ అర్పిస్తున్నాను, ఎందుకంటే వాటిని పాటించటానికి ఇక నావద్ద సమయం లేదు. కాబట్టి ఓ ప్రియమైన, సంధ్యా వందనము (ఉపనయనం జరిగి యజ్ఞోపవీతం పొందినవారు రోజుకు మూడు సార్లు చేసే వైదిక ప్రక్రియ), పుణ్య స్నానాలు, యజ్ఞయాగాదులు, పితృకర్మలు వంటివి, దయచేసి నన్ను క్షమించండి. ఇప్పుడు, నేనెక్కడ కూర్చున్నా, కంస విరోధి అయిన శ్రీ కృష్ణ పరమాత్మ నే ధ్యానిస్తున్నాను, అది చాలు నన్ను ఈ భౌతిక బంధాల నుండి విడిపించటానికి".


శ్రీ కృష్ణుడు 'సమాధౌ-అచలా' అన్న పదాన్ని, భగవంతుని ధ్యాస లో ఉండే ధృఢ సంకల్పాన్ని సూచించటానికి, ఈ శ్లోకం లో ఉపయోగించాడు. 'సమాధి' అన్న పదం 'సమ్' (సమత్వము) మరియు 'ధి' (బుద్ది) అన్న మూలధాతువుల నుండి ఏర్పడింది, అంటే 'పరిపూర్ణ సమత్వ బుద్ధి స్థితి'. ఉన్నతమైన చైతన్యం లో స్థిర బుద్ది కలిగి, ప్రాపంచిక భౌతిక ప్రలోభాల పట్ల మోహితుడు కానివాడు ఆ యొక్క 'సమాధి' అంటే సంపూర్ణ యోగ స్థితిని పొందుతాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*షష్ఠ స్కంధం*


*సతతము కృష్ణ పాదజలజంబులయందు మనంబు నిల్పు సు*

*వ్రతులు తదీయ శుద్ధ గుణరాగులు కాలుని యుగ్రపాశ సం*

*హతుల ధరించు తత్సుభటవర్గములం గలలోన గానరే*

*గతులను దుష్టకర్మములు గైకొని వారల జెందనేర్చునే?*


రాజా ! శ్రీకృష్ణుడు పరమాత్మ. నామరూపాలులేని పరమాత్మ లోకాలను అనుగ్రహించటం పనిగా శ్రీకృష్ణమూర్తియై భూమికి దిగివచ్చాడు. ఆయన పాదపద్మాలయందు నిరంతరం మనస్సును నిక్షేపించాలి. అలా చేసేవారిని ‘సువ్రతులు’ అంటారు. ఆ మహాత్ముడు మానవులను ఉద్ధరించటంకోసం భూమిపై సంచరించిన కాలంలో కొన్ని గుణాలను లీలలుగా ప్రకటించాడు. మనం అట్టి అతని శుద్ధగుణాలయందు చెదరని అనురాగం కలవారమైపోవాలి. అలా అయిన వారు భయంకర పాశాల దెబ్బలను వడ్డించే యమభటుల గుంపులను కలలో కూడా చూడరు. ఎటువంటి ఘోరమైన కర్మముల చేయగల అధికార పురుషులైనా కృష్ణభక్తుల దాపునకు ఏవిధంగానూ రాలేరు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹