25, మార్చి 2023, శనివారం

తిరుమల


🌻తిరుమల 7 కొండలు..పరమార్ధం🌻


🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥



1. నీలాద్రి2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వేంకటాద్రి 7. నారాయణాద్రి.


ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది. బ్రహ్మ స్థానం లో ఉంటుంది.


అందుకనే ఆయన 7 కొండలు పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. ఆ 7 కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు.


1. వృషభాద్రి - అంటే ఎద్దు. వ్రుశాభానికి ఋగ్వేదం లో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమ శివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములున్టాయ్. 3 పాదాలు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు)


వాక్కు అంటే - శబ్దం

శబ్దం అంటే - వేదం

వేదం అంటే - ప్రమాణము


నా కంటితో చూసిందే నిజమంటే కుదరదు. నిజం కానివి చాలా ఉంటాయ్. సుర్యోదయం, సూర్యాస్తమయం అని అంటున్నారు. నిజం గా దాని కన్నా అభద్దం ఉంకోటి లేదు. సూర్యుడికి కదలిక ఏమి ఉండదు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి తిరగడం మీరు చూసారా. భూమి సూర్యుడికి అభిముఖంగా వెళ్ళినప్పుడు చీకటి. తిరగనది సూర్యుడు. మీ కన్ను భ్రమకి లోనైట్ట లేదా. కాబట్టి వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు.


2. నీలాద్రి - అంటే ధర్మం


ధర్మం అంటే - నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు etc. దాని వల్ల ఇహం లోను, పరలోకం లోను సుఖాన్ని పొందుతాడు.


అవి చెయ్యడమే వృషాద్రి ని ఎక్కడం.


3. గరుడాద్రి - అంటే పక్షి - ఉపనిషత్తుల జ్ఞా నాన్ని పొందడం.

షడ్ - అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి.


పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. 


ఇవ్వన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ 6 లేని వాడు భగవానుడు.


భ == ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు & అంతా తానే బ్రహ్మాండము అయినవాడు.

అన్ == ఉన్నవాడు, కళ్యాణ గుణ సహితుడు, హేయగుణ రహితుడు.


అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి.


4. అంజనాద్రి - అంజనం అంటే కంటికి కాటుక.

కాటుక ఎప్పుడు పెట్టుకుంటాం? అందానికి, చలవకి.


కంటికి అందం ఎప్పుడు? - ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే.


అప్పుడు అంజనాద్రి దాటతాడు.


5. శేషాద్రి - ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగ ద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీత లో గీత చార్యుడు చెప్పాడు,


తుల్య నిందా స్తుతిర్ మౌని (శ్లోకం చెప్పారు) 


తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. (ఇక్కడ రమణ మహర్షి కొన్ని ఉదాహరణలు గురుంచి చెప్పారు ) ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.


6. వేంకటాద్రి - వేం : పాపం, కట : తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చి వాళ్ళలా కనవడుతారు అది మన కర్మ. రామ కృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చి వాడు ఒకలా ఉంటారు.


ఆయనకే అర్పణం అనడం & అటువంటి స్థితి ని పొందడం వెంకటాద్రి ఎక్కడం.


7. నారాయణాద్రి - అంటే తుల్యావస్థ ని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారయానాద్రి.


వేంకటాచలం లో 7 కొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను ఉంచారు. ఈ కారణాలు తెలుకుకోవడం 7 కొండలు ఎక్కడం


🙏సర్వేజనా సుఖినోభవంతు 🙏

: #తిరుమల_వేంకటేశ్వరుని_పంచ_రూపాలు  🙏🌺🙏


#తిరుమల  వేంకటేశ్వరుని ఆలయంలో మూలవిరాట్టు కాకుండా, మరో నాలుగు మూర్తులు ఉన్నాయి. 

ఈ మూర్తులు వరుసగా .


🍁భోగ శ్రీనివాసమూర్తి, 

🍁ఉగ్ర శ్రీనివాసమూర్తి, 

🍁మూలమూర్తి, 

🍁కొలువు శ్రీనివాసమూర్తి, 

🍁శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వాములు. 


ఏయే రూపాల ప్రాధాన్యత ఏమిటో  తెలుసుకుందాం.


#మూలమూర్తి (#ధ్రువబేరం) :

నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. ''వీరస్థానక'' పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు. నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.


#భోగ_శ్రీనివాసమూర్తి (#కౌతుకబేరం): 


ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు. ఇంకోరకంగా కౌతుక బేరం లేదా పురుష బేరం అంటారు. నిత్యం జరిపే దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవలు భోగ శ్రీనివాస మూర్తికి జరిపిస్తారు. ఈ వెండి శ్రీనివాసుని విగ్రహాన్నిక్రీస్తుశకం 614లో పల్లవ మహారాణి సామవాయి పేరిందేవి ఆలయానికి సమర్పించినట్లు శాసనాల్లో ఆధారాలు లభించాయి. మహారాణి ఈ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుండి నేటివరకూ ఎన్నడూ ఆలయం నుండి విగ్రహాన్ని ఆలయం నుండి తొలగించలేదు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మూలవిరాట్టుకు చేసే సేవలు భోగ శ్రీనివాస మూర్తికి అందుతాయి.


#ఉగ్ర_శ్రీనివాసమూర్తి (#స్నపనబేరం)


ఉగ్ర శ్రీనివాసమూర్తిని స్నపన బేరం అంటారు. ఈ మూర్తి శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉంటుంది. నిజానికి శ్రీనివాసమూర్తి రూపం 11వ శతాబ్దం వరకూ ఉత్సవ విగ్రహంగా ఉండేది. క్రీస్తుశకం 1330లో ఒకసారి ఉత్సవ విగ్రహంగా ఊరేగింపు జరుపుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో, అది ఉగ్ర శ్రీనివాసుని రూపానికి సంకేతంగా భావించారు. అప్పటినుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప రూపాన్ని ఉత్సవ విగ్రహంగా రూపొందించారు. ఆవిధంగా అగ్ని ప్రమాదం జరిగినప్పటినుంచి ఉగ్ర శ్రీనివాస మూర్తిని సంవత్సరానికి ఒకసారి సూర్యోదయానికి ముందు సర్వ అలంకారాలతో సుందరంగా తీర్చిదిద్ది ఊరేగింపుకు తీసుకెళ్ళి, తిరిగి అంతరాలయానికి తీసుకొస్తారు.


శ్రీదేవి, భూదేవి సమేత #మలయప్పస్వామి (#ఉత్సవబేరం):


13వ శతాబ్దంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగింపుకు తీసికెళ్ళడం మానేసిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ వేడుకల్లో ఊరేగిస్తున్నారు. ఈ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవబేరం అంటారు. ఈ మూర్తి మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. బ్రహ్మోత్సవాలతో సహా ప్రతి ఉత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామినే ఊరేగిస్తారు.


#కొలువు_శ్రీనివాసమూర్తి (#బలిబేరం):


గర్భగుడిలో మూలవిరాట్టు పక్కన ఉండే మరొక చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. ఆగమ పరిభాషలో బలిబేరం అంటారు. మూలవిరాట్టుకు తోమాలసేవ నిర్వహించిన తర్వాత కొలువు శ్రీనివాసుని బంగారు సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు. తిరుమలలో ఆవేళ జరిగే ఉత్సవ వేడుకలు ఏమైనా ఉంటే వాటి వివరాలను తెలియజేస్తారు. శ్రీవారి హుండీలో గతరోజు వచ్చిన కానుకల వివరాలను, ఆదాయ, వ్యయాలను తెలియజేస్తారు.


           🔔🔔🔔 మూడు గంటలు🔔🔔🔔


♦🙏తిరుమలలో మొదటి గంట🙏♦ 


నైవేద్యం సుప్రభాతసేవ, అభిషేకాలు, కొలువు, సహస్రనామార్చనల తర్వాత శయన మంటపాన్ని శుభ్రం చేసి బంగారు వాకిలి తలుపులు మూస్తారు. తిరుమామణి మంటపంలో రెండుసార్లు గంటలు మోగిస్తారు. ఇలా తిరుమామణి మంటపంలో గంటలు మోగగానే అర్చకులు స్వామివారికి తొలి నైవేద్యం సమర్పిస్తున్నట్లు ప్రకటిస్తారు. జీయంగారు లేదా ఆయన సహాయకుడు వైష్ణవ సంప్రదాయంలోని ప్రబంధ అధ్యాయాలను పఠిస్తారు. దీన్ని సట్టుమురా అంటారు. వేంకటేశ్వరుని ముందు మెట్టుకు ఇవతలి నుండి నైవేద్యం పెడతారు. స్వామివారికి నైవేద్యంగా పులిహోర, దద్దోజనం, లడ్డూలు, వడలు, పొంగలి, చక్రపొంగలి, అప్పాలు, పోళీలు నివేదిస్తారు.

నైవేద్యం స్వామివారికే కాకుండా విష్వక్సేనుడు, గరుడుడు, నిత్యాసురులకు కూడా నివేదిస్తారు. ఇలా గంటలు మోగించి, నైవేద్యం సమర్పించడాన్ని వ్యవహారంలో మొదటి గంట లేదా ఆలయ మొదటి గంట అంటారు. 


♦🙏తిరుమలలో రెండో గంట, అర్చన 🙏♦


తిరుమలేశుని దేవాలయంలో అష్టోత్తర శతనామార్చన తర్వాత రెండో గంట మోగిస్తారు. ఈ సంప్రదాయాన్ని రెండో గంట లేదా అపరాహ్న పూజ ( Second Bell or Aparahna Pooja) అంటారు. ఇలా రెండో గంట మోగించినప్పుడు స్వామివారికి రెండోసారి నైవేద్యం సమర్పిస్తారు. రెండోసారి జరిగే ఈ అర్చనలో ''వరాహపురాణం'' లోని శ్రీ వేంకటేశ్వరుని నామావళిని జపిస్తారు. పోటు నుండి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆనక తాంబూలం సమర్పించి, కర్పూరహారతి ఇస్తారు.

తిరుమల వేంకటేశ్వర ఆలయంలో రెండో గంట మోగినప్పుడు చేసే అష్టోత్తర నామార్చనను చూసేందుకు భక్తులను అనుమతించరు. ఇది ఏకాంత సేవ. ప్రత్యేక సేవలకోసం టికెట్లు కొనుక్కున్న భక్తులు నివేదించిన ''చెరుపులు'' (పులిహోర, దద్దోజనం), ''పన్యారాలు'' (లడ్డూలు) మొదలైన నైవేద్యాలను తిరుమల వేంకటేశ్వరునికి సమర్పిస్తారు. భక్తులు తెచ్చిన దాంట్లో నుండి కొంత మాత్రమే వేంకటేశ్వరునికి సమర్పించి, తక్కిన పదార్ధాలను వారికి తిరిగి ఇచ్చేస్తారు.


♦🙏తిరుమలలో మూడో గంట🙏♦


తిరుమల వేంకటేశ్వర ఆలయంలో ఉదయం జరిపే తోమాలసేవ, రాత్రిపూట కూడా జరుపుతారు. ఆ సేవ అనంతరం స్వామివారికి హారతి ఇచ్చి అష్టోత్తర శతనామార్చన చేస్తారు. శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీ నామార్చన జరుపుతారు. ఆ సమయంలో మూడో గంట మోగిస్తారు. అప్పుడు నైవేద్యాన్ని సమర్పిస్తారు. అనంతరం సర్వదర్శనం తిరిగి ప్రారంభమౌతుంది. 


♦🙏తిరుమల విమాన వేంకటేశ్వర స్వామి🙏♦


పూర్వం తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయ అర్చకులు తొమ్మిదిమంది , స్వామివారి ఆభరణాలను ధరించారు. అది స్వామివారి దర్శనానికి వచ్చిన విజయనగర రాజు కంటపడింది. దాంతో ఆ రాజుకు ఆగ్రహం ముంచుకొచ్చింది. తొమ్మిదిమంది అర్చకులనూ విచక్షణా రహితంగా అక్కడికక్కడే చంపేశాడు.


నరహత్య మహాపాపం అనుకుంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిదిమందిని హత్య చేశాడు రాజు. పైగా పవిత్ర దేవాలయంలో హత్య చేశాడు. అది సామాన్య దోషం కాదు. మహా పాపం. ఆ పాప పరిహారం కోసం వ్యాసరాయలు ప్రయత్నించారు. పన్నెండేళ్ళ పాటు భక్తులెవర్నీ ఆలయంలోనికి అనుమతించలేదు. వ్యాసరాయలవారు గర్భగుడిలో ప్రవేశించి, పాప నివృత్తి అయ్యేందుకు కఠోర దీక్షతో పూజలు నిర్వహించారట.


ఆ పన్నెండేళ్ళ కాలంలో భక్తులకు గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టును దర్శించుకునే భాగ్యం కలగలేదు కానీ, అందుకు ప్రతిగా ఆనంద నిలయ విమానం మొదటి అంతస్తులో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇలా ప్రతిష్టించిన వేంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉత్తర వాయువ్యంలో ఉంటుంది. అప్పుడు ప్రతిష్టించిన స్వామివారి విగ్రహమే విమాన వేంకటేశ్వర స్వామి. అప్పుడు స్వామివారికి బదులుగా ప్రతిష్టించిన విమాన వేంకటేశ్వర స్వామిని ఇప్పటికీ భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు. తిరుమల వెళ్ళిన భక్తులు తప్పనిసరిగా విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆచారంగా మారింది.


ప్రస్తుతం ఆనంద నిలయానికి ఉత్తర వాయువ్యంలో విమాన వేంకటేశ్వరుని విగ్రహం వద్ద బంగారు, వెండి పూత పూసి, మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. తిరుమల దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా విమాన వేంకటేశ్వరుని దర్శించుకుంటారు.

సుభాషితమ్


             _*సుభాషితమ్*_


*బ్రాహ్మణాః పాదతో మేధ్యా*  

 *గావో మేధ్యాస్తు పృష్టతః*

 *అజాశ్వే ముఖతో మేద్యౌ*

 *స్త్రియో మేధ్యాస్తు సర్వతః* 


తా: *ఈ లోకములో స్వతహాగా పవిత్రమైనవి -  మంగళ దాయక మైనవి.....సద్బ్రాహ్మణుని(సద్భక్తుని)పాదారవిందాలు, ఆవుయొక్క వెనుక భాగము, మేకల, గుర్రాలముఖ భాగము, ఉత్తమురాలైన స్త్రీయొక్క సర్వాంగాలు శుభకరం( మాతృ భావన తో సేవించడం )వీటిని దర్శించిన సేవించిన మాత్రాననే సర్వ పాపములు తొలగిపోవును.*...


*మేధ్యం: పవిత్రమైన అని అర్థం*.


              _*సూక్తిసుధ*_



*ఒకప్పుడు దోషమును విడువనివి:* 

            వేపచెట్టుకు తేనె పోసి పెంచియు చేదుమానదు, పామునకు పాలు పోసియు విషము పోదు, గాడిద ఎంత చక్కబెట్టియు జోడుకాలు మానదు, కుక్కతోక బద్దవేసికట్టియు చక్కగాదు, గుడ్డి కంటికి కుంచెడు కాటుక పెట్టియు కనుపించదు, ఉల్లిగడ్డకు పన్నీరు పోసియు కంపుమానదు. మడ్డివానికెంత జెప్పియు తెలివిరాదు.

సుభాషితమ్


             _*సుభాషితమ్*_


*బ్రాహ్మణాః పాదతో మేధ్యా*  

 *గావో మేధ్యాస్తు పృష్టతః*

 *అజాశ్వే ముఖతో మేద్యౌ*

 *స్త్రియో మేధ్యాస్తు సర్వతః* 


తా: *ఈ లోకములో స్వతహాగా పవిత్రమైనవి -  మంగళ దాయక మైనవి.....సద్బ్రాహ్మణుని(సద్భక్తుని)పాదారవిందాలు, ఆవుయొక్క వెనుక భాగము, మేకల, గుర్రాలముఖ భాగము, ఉత్తమురాలైన స్త్రీయొక్క సర్వాంగాలు శుభకరం( మాతృ భావన తో సేవించడం )వీటిని దర్శించిన సేవించిన మాత్రాననే సర్వ పాపములు తొలగిపోవును.*...


*మేధ్యం: పవిత్రమైన అని అర్థం*.



              _*సూక్తిసుధ*_



*ఒకప్పుడు దోషమును విడువనివి:* 

            వేపచెట్టుకు తేనె పోసి పెంచియు చేదుమానదు, పామునకు పాలు పోసియు విషము పోదు, గాడిద ఎంత చక్కబెట్టియు జోడుకాలు మానదు, కుక్కతోక బద్దవేసికట్టియు చక్కగాదు, గుడ్డి కంటికి కుంచెడు కాటుక పెట్టియు కనుపించదు, ఉల్లిగడ్డకు పన్నీరు పోసియు కంపుమానదు. మడ్డివానికెంత జెప్పియు తెలివిరాదు.

ప్రవచనం - పారాయణం - ప్రాణ రక్షణం


🙏🙏🙏🙏🙏:

 ప్రవచనం - పారాయణం - ప్రాణ రక్షణం


పరమాచార్య స్వామివారి భక్తులైన బ్రహ్మశ్రీ వళత్తూర్ శ్రీ రాజగోపాల శర్మ గారు ప్రముఖ సంస్కృత విద్వాంసులు. వేదశాస్త్రాలను పాఠశాల ప్రణాళిక ద్వారా నేర్చుకున్నారు. చిన్నవయసులో కుంబకోణం గోవింద దీక్షితర్ రాజ వేద పాఠశాలలో చదువుకుంటూ సంస్కృతం కూడా నేర్చుకున్నారు. ఆచారం, అనుష్టానం, ఉన్నత విలువలు కలిగిన మనిషి. తరువాత మద్రాసు సంస్కృత కాలేజిలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.


సంస్కృత బోధన చెయ్యాలని వారికి మక్కువ ఎక్కువ. దాంతో వారికి ఎందఱో శిష్యులయ్యారు. వారు మామూలు విద్యార్థులు కాదు. వారి వద్ద సంస్కృతం నేర్చుకునే అదృష్టం పొందిన ధన్యాత్ములు. చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న పెద్దవారు కూడా వారికి విద్యార్థులే. కొంతమంది ఇతర భాషలందు నిష్ణాతులు కూడా.


భారతీయ విద్యాభవన్ మైలాపూర్ చెన్నై శాఖ శాస్త్రిగారి శక్తిసామర్త్యాలకి నిలవెత్తు సాక్ష్యం. ఆదినుండే వారు సంస్కృత అభివృద్ధి మండలికి వారు అధ్యక్షులు. ఇరవైఏడేళ్ళ పదవీకాలంలో వేలమంది విద్యార్థులు సంస్కృతం నేర్చుకోవడానికి కారణభూతులయ్యారు. ఎందరో విద్యార్థులు వారిని కులగురువుగా భావించేవారు.


వారు సంస్కృత కళాశాలలో చదువు ముగించుకున్న తరువాత కుంబకోణం వెళ్లి పళమనేరి ఆయుర్ అయ్యర్ వేద పాఠశాలలో చదివారు. తరువాత చెన్నై రామకృష్ణ మిషన్ పాఠశాలలో ఇరవైఆరేళ్ళ పాటు సంస్కృత అధ్యాపకులుగా చేశారు.


నలభై సంవత్సరాల క్రితం రామకృష్ణ మిషన్ పాఠశాలలో ఉన్నప్పుడు పురాణ ప్రవచన సభను నెలకొల్పి, చెన్నై రామకృష్ణ మిషన్ సెంట్రల్ ఎలిమెంటరి స్కూల్ ఆడిటోరియంలో వారంలో మూడురోజుల పాటు ప్రవచనాలు చెప్పేవారు.


ఆ సమయంలో కూడా నీటి కొరత వల్ల ప్రజలు చాలా ఇబ్బందిపడేవారు. అప్పుడు మహానుభావులు రాజాజీ చెన్నై స్టేట్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. రాష్ట్రం మొత్తం పూజలు, ప్రార్థనలు చెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


అప్పుడు కొందరు ఆస్తికులు నా వద్దకు వచ్చి, మహాభారతంలోని విరాటపర్వం పారాయణ చెయ్యవలసిందిగా అడిగారు. దాదాపు రెండు నెలల పాటు పారాయణ చేశాను. అప్పుడు రెండు మూడు సార్లు భగవంతుడు మాకు వర్షాలు ప్రసాదించాడు.


దాని తరువాత చాలామంది నన్ను మొత్తం మహాభారతం ప్రవచనం చెప్పమని అడగడం ప్రారంభించారు. ఆచార్యుల అనుగ్రహంతో సంపూర్ణ మహాభారత ప్రవచనానికి శ్రీకారం చుట్టాను. వారానికి మూడు రోజుల చొప్పున మొత్తం పూర్తవడానికి నాలుగున్నర సంవత్సరాలు పట్టింది. ధన, వస్తు ఇతర రూపేణా సహాయం కావాలని ఎవ్వరిని అర్థించింది లేదు. ధనసహాయం చెయ్యమని ప్రవచనంలో చెప్పింది లేదు. కేవలం ఒక చిన్న హుండి పెట్టాము ఎవరికీ తోచినది వారు వెయ్యడానికి. కేవలం పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్లనే నాలుగున్నర సంవత్సరాల పాటు ఏ అడ్డంకి లేకుండా జరిగింది. రోజూ ప్రవచనానికి ముందు నేను విష్ణుసహస్రం పారాయణ చేసేవాడిని. ఈ ప్రవచనం విజయవంతమవడంలో ఇది కూడా ఒక కారణం అని ప్రగాఢ విశ్వాసం.


దీని తరువాత పద్దెనిమిది పర్వాలకు గాను పద్దెనిమిది ఆదివారాలు పాటు పద్దెనిమిదివేల సార్లు విష్ణుసహస్రనామ పారాయణ నిర్వహించాలని సంకల్పించాను. ఆస్తికుల అభ్యర్ధన మేరకు వివిధ చోట్ల దిన్ని నిర్వహించడం జరిగింది. పదిహేడు వారాలు పూర్తైన తరువాత చివరిదైన పద్దెనిమిదవ వారం పారాయణ స్థలంపై చర్చలు జరుగుతున్నాయి.


చెన్నై పర్యటన నిమిత్తం వచ్చిన పరమాచార్య స్వామివారు అభిరామపురంలోని శ్రీ శంకర గురుకులంలో మకాం చేస్తున్నారు. మేము శ్రీవారిని దర్శించి మా చివరి పారాయణ గురించి తెలిపాము. స్వామివారు చివరి పారాయణ తాము ఇప్పుడున్న ప్రదేశంలోనే జరపమని, దాన్ని ఇక్కడున్న అందరికి మైకులో తెలియజేయమని ఆజ్ఞాపించారు.


మరుసటిరోజు ద్వాదశి కావడంతో పారణకు ముందే పద్దెనిమిది వేలు పూర్తిచేయ్యడానికి మాకు చాలా తక్కువ సమయం ఉంది. పారాయణకు ముందు కలశపూజ, లక్ష్మినారాయణుల పటానికి పూజ చెయ్యడం మాకు ఆనవాయితీ. ఆరోజు కూడా ఆ ప్రకారమే చేశాము. ఎంతసేపటికి పారాయణ పూర్తికాగలదని పరమాచార్య స్వామివారు అడిగారు. ఆరోజు పారాయణకి చాలామంది వచ్చినందువల్ల త్వరగానే పూర్తిచేస్తాము అని చెప్పాను.


స్వామివారు ఇచ్చే తీర్థం స్వికరించేందుకు వచ్చిన భక్తుల కోసమని వెదురు కర్రలతో వరుసలు ఏర్పాటు చెయ్యవలసివచ్చింది. పారాయణ పూర్తై, దీపారాధన ప్రారంభించాము. ఘంటానాదం వినబడగానే భక్తులందరూ ఒక్కసారిగా “పుండరిక వరద . . .” అని ఎలుగెత్తి చెబుతున్నారు. అది వినగానే పరమాచార్య స్వామివారు వెదురుకర్రలను దాటుకుంటూ దీపారాధన దర్శనానికి వచ్చారు. దీపారాధన మొదలవగానే తనకు తెలపమని శిష్యులకు స్వామివారు తెలిపారని మాకు తరువాత తెలిసింది. నేను కుంభజప తీర్థాన్ని, పూలదండలను స్వామివారికి సమర్పించడానికి తిసుకునివెళ్ళాను. అది మహాజప తీర్థం కావున దాన్ని ఉంచడానికి ఒక చెక్కబల్లను తెప్పించారు స్వామివారు.


మామిడి ఆకులతో ఆ తీర్థజలాన్ని అందరిపైన ప్రోక్షించారు. తరువాత దాన్ని తీర్థంగా ఇచ్చారు. ఒక పెద్ద పళ్ళెంలో తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు, టెంకాయ, పూలమాలలు, పద్దెనిమిది రూపాయి నాణాలు స్వామివారి పాదాలకు సమర్పించాను.


“పూర్తైన పదిహేడు పారాయణాలు ఇలాగే చేశావా?” అని అడిగారు స్వామివారు. అవునని చెప్పగా మరలా అడిగారు. నాకు కళ్ళల్లో నీరు తిరిగి, “అవును. మా శక్తి కొలది పెరియవ” అని చెప్పాను. పారాయణ చేసివారిని అక్కడే భోజనం చెయ్యమన్నారు. పరమాచార్య స్వామివారు సంతోషంతో చాలాసేపు నాతో మాట్లాడారు. పూర్తిగా సంస్కృతంలోనే మాట్లాడి చివరకు మమ్మల్ని ఆశీర్వదిస్తూ, “మహాత్ ఇథం కార్యం సౌభాగ్యోదయ ప్రవర్తతే” అని అన్నారు.


సాయింత్రం లక్ష్మినారాయణుల చిత్రపటాన్ని తేవడానికి గురుకులానికి వెళ్లాను. అది పరమాచార్య స్వామివారు సంస్కృత కళాశాలకు వెళ్ళే సమయం. శ్రీవారు అభిరామపురం నుండి మొదలై నాగేశ్వరరావు పార్కు వీధి, కర్పగాంబళ్ వీధి గుండా వెళ్తారు. చేతిలో చిత్రపటంతో నేను కూడా భక్తులతో చేరి ముందుగా నడుస్తున్నాను. కర్పగాంబళ్ వీధిలోకి వెళ్ళబోతుండగా, ఒక వ్యక్తీ నావద్దకు పరిగెడుతూ వచ్చి, “స్వామివారు మీ ఇంటి మీదుగానే వెళ్తున్నారు” అని చెప్పాడు. నేను నివ్వెరపోయాను. అందరితోనే వస్తున్నా నాకు తెలియకపోవడమేమిటని వెంటనే ఇంటికి పరిగెత్తాను.


వెంటనే ఇంటిముందు కళ్ళాపి చెల్లి, ముగ్గులు వేయడానికి సమాయత్తపరిచాను. మావిడాకుల తోరణం కట్టి, చేతిలో ఉన్న పటాన్ని ఒక కుర్చీలో పెట్టి, పూలహారం వేసి, ఒక దీపం వెలిగించాను. పూర్ణకుంభం, కర్పూరహారతి పళ్ళెం సిద్ధం చేశాము. త్వరితగతిన అన్నీ సిద్ధం చేశాము. ఆ విధి గుండా పరమాచార్య స్వామివారు వెళ్తున్నారని జనమంతా దారికిరువైపులా నిలబడ్డారు.


ఇరుగుపొరుగు వారు మేము అందరమూ కలిసి ముకుళిత హస్తాలతో స్వామివారి కోసం బయట ఎదురుచూస్తున్నాము. నాకు అంతటి అర్హత లేదని స్వామివారిని ఇంటికి ఆహ్వానించలేదు. సాధారణంగా నాగేశ్వరరావు పార్కు వీధి, కర్పగాంబళ్ వీధి, వివేకానంద కళాశాల తూర్పు వీధి, సుల్లివాన్ గార్డన్ వీధి గుండా సంస్కృత కళాశాలకు వెళ్ళే మార్గమును వదిలి ఇలా ఆగమిస్తున్నారు.


ఎంతోమంది ఆ దివ్యచరణ కమలములు తమ ఇంటికి రావాలని ఆర్తితో ఎదురుచూస్తుంటే, నాకు కలిగిన భాగ్యానికి కళ్ళు తడి అవుతున్నాయి. ఇప్పుడు స్వామివారు వస్తున్న మార్గాన్ని శిష్యులు ఖచ్చితంగా వద్దు అని చెప్పి ఉంటారు. ఎందుకంటే ఆ మార్గమంతా నల్ల జండాలు, గోడలపై నాస్తిక వాదనలు రాశారు. కాని అటువంటి స్థలాన్ని వారి పాదముల చేత తరింపచేయాలనుకున్నారేమో. ఒకసారి టి. నగర్ లోని యునైటెడ్ ఇండియా కాలనికి ఒక మురికివాడ గుండా వెళ్ళడానికి అడ్డు చెప్పినప్పుడు, “అంతటి దారుణమైన పరిస్థితులు ఉన్న ప్రాంతమా? అయితే తప్పక వెళ్ళవలసింది ఆటే” అని అన్నారు.


మా ఇంటి ముందర పెద్ద గుంపు ఏర్పడింది. పరమాచార్య స్వామివారు లోపలికొచ్చి, ముగ్గు వేసిన చెక్కబల్లపై కూర్చున్నారు. పూర్ణకుంభ పాదపూజ, హారతి చేశాము. నా భార్యాపిల్లలలతో పాటు స్వామివారికి ముమ్మారు ప్రదక్షిణ చేసి, నేలపై పడి నమస్కరించాము. స్వామివారు లోపల ఉన్న లక్ష్మినారాయణుల చిత్రపటాన్ని చూపిస్తూ “పూజకు పెట్టిన ఈ లక్ష్మి నారాయణుల చిత్రపటంతో వీరు నాలుగున్నర సంవత్సరాలు మహాభారత ప్రవచనం, మూడు లక్షలా ఇరవైనాలుగువేల విష్ణు సహస్రనామ పారాయణం చేశారు” అని చెప్తూ పటాన్ని చూడటానికి త్రోవ ఇవ్వవలసినదిగా అక్కడున్నవారిని పక్కకు జరగమని చెప్పట్లు చరిచారు.


ఆ పటాన్ని తదేకదృష్టితో చూస్తూ, “రాజగోపాలా!” అని దగ్గరకు పిలిచారు. నేను ఉంటున్న ఆ పాత ఇంటిని ఒకసారి పరీక్షగా చూసి, “ఇదే మీ ఇల్లు. ఈ ఇంట్లోనే నువ్వు ఉండడం” అని అన్నారు. అవును అని చెప్పగా, మమ్మల్ని మరొక్కసారి నమస్కరించమని ఆదేశించారు. అందరమూ శ్రీవారికి నమస్కరించాము. కేవలం కొద్దిరోజుల్లోనే ఆ పాత ఇంటిని వదిలి, ఇప్పుడున్న పెద్దదైన ఈ కొత్త ఇంటికి వెళ్ళగలిగాము. ఇక్కడకు వచ్చిన తరువాత కాలంతోపాటు ఇంట్లోకూడా శుభకార్యాలు, పెళ్ళిళ్ళు జరిగాయి.


కేదార్ నాథ్, బదరీనాథ్ యాత్ర కూడా వెళ్ళే అవకాశం వచ్చింది. మహాస్వామివారు మదురైలో మకాం చేస్తున్నప్పుడు, ఈ యాత్రకోసం వారి ఆశీస్సులు అర్థించగా, “మొత్తం కుటుంబం అంతా వెళ్ళండి. బదరీనాథ్ మాత్రమె కాదు. కేదార్ నాథ్ కూడా వెళ్ళండి” అని అన్నారు. అప్పుడు ప్రపంచమంతా గ్రహాల అష్టగ్రహ కూటమి గురించి భయపడుతున్న కాలం. దానికి పరిహారంగా కేదార్ నాథ్ వెళ్ళమని ఒక ఒక రుద్రాక్ష మాలను అనుగ్రహించారు.


వారి అనుగ్రహం వల్ల వచ్చిన ఆటంకాలను అధిగమించి యాత్ర పూర్తీ చేశాము. బదరీనాథ్ వెళ్ళేదారిలో హిమాలయ పర్వతాల నుండి కొండ చెరియలు పడుతుండడంతో హృషికేశ్ లో మా ప్రయాణం ఆలస్యం అయ్యింది. రెండు మూడు రోజుల తరువాత మా ప్రయాణం ప్రారంభమైనా ఎక్కువ రద్దీ వల్ల హృషికేశ్ లో ఇంకా కొన్ని రోజులు ఉండిపోవాలేమో అనుకున్నాము.


మేము బస చేస్తున్న నేపాలి ఆశ్రమం వారి అభ్యర్ధన మేరకు పురాణ ప్రవచనాలు మొదలుపెట్టాను. నేను సంస్కృతంలో చెబుతుంటే, ఒక గురూజీ హిందీలో అనువదించి చెప్పేవారు. స్వామివారి అనుగ్రహం వల్ల ఉత్తరాదివారు కూడా నా ప్రవచనాలను ఇష్టపడేవారు. చివర్లో మా యాత్ర ఇబ్బందుల గురించి చెప్పాను. ఉత్తరాదివారికీ సంస్కృత పండితులపై ఉన్న గౌరవ మర్యాదలు ఆ రోజే నాకు అవగతమయ్యాయి.


వాళ్ళల్లోనుండి ఒకతను లేచి, “మిమ్మల్ని బదరీనాథ్ తీసుకుని వెళ్ళే బాధ్యత నాది. ఉదయం సిద్ధంగా ఉండండి. మీతోపాటు ఎందరున్నారు?” అని అడిగాడు. అలాగే అతను మాట నిలుపుకున్నాడు. బదరీనాథ్ లో దర్శనమప్పుడు కూడా రద్దీ వల్ల చాలా ఇబ్బంది పడ్డాము. కాని ఎవరో మమ్మల్ని గుర్తుపట్టి అన్ని సదుపాయాలూ చేసేవారు. ఇదంతా కేవలం పరమాచార్య స్వామివారి అనుగ్రహం మాత్రమె. మొత్తానికి కేదార్ నాథ్ యాత్ర కూడా ముగించాము.


దాదాపు యాత్రకు వెళ్ళిన ఇరవై మందిమీ క్షేమంగా చెన్నై చేరుకున్నాము. మా క్షేమసమాచారముల గురించి వాకబు చూస్తూ, చాలామంది బంధువులూ, శిష్యులూ ఫోన్లు చేస్తున్నారు. ఇంతమంది చెయ్యడానికి కారణమేంటో తరువాత నాకు తెలిసింది. మేము తిరిగొచ్చిన తరువాత హిమాలయాల్లో భారీగా కొండచరియలు పడి చాలామంది యాత్రీకులు గాయపడ్డారని వార్తలు వచ్చాయి.


రెండు మూడు రోజుల్లో ఇలయత్తాంగుడిలో మకాం చేస్తున్న పరమాచార్య స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. గంగానుండి తెచ్చిన తీర్థాన్ని స్వామివారి ముందుంచాను. అప్పుడే ధనుష్కోటి తీర్థం కూడా వచ్చింది. మరుసటిరోజు పరమాచార్య స్వామివారు స్నానం చేస్తున్నప్పుడు రెండు తీర్థాలను శరీరంపై వేసుకున్నారు. అది చూడగానే మాకు చాలా ఆనందం కలిగింది. ఇతర భక్తులతో పాటు మేము కూడా స్నానాలు ఆచరించాము.


తరువాత స్వామివారు మా యాత్రా విశేషాల గురించి అడుగుతూ, “హిమాలయాల్లో కొండచరియలు పడుతున్నాయని విన్నాను” అని అన్నారు. “మాకు కవచం ఉనడడం వల్ల మాకు అవేవీ ఇబ్బంది కలిగించలేదు” అని అన్నాను. “కవచమా?” అని అడిగారు. నా మేడలో ఉన్న రుద్రాక్షమాలను తాకి, “మీ ఆశీస్సులు ఈరూపంలో మావద్ద ఉన్నప్పుడు, మాకు ఇబ్బంది ఏముంది” అని చెప్పాను. స్వామివారు నవ్వారు. వారికి నమస్కరించి మేము వెనుదిరిగాము.


ఇది జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినా, వాటి జ్ఞాపకం ఇంకా తాజాగానే ఉంది.


--- పరంథమన్ వి. నారాయణన్, ‘పరమాచార్యర్’ నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కళద్వారా చిత్తశాంతి


గ్రంథ పఠనంవల్ల, ఉపన్యాస శ్రవణంవల్ల మనస్సుకు భావగ్రహణం చక్కగా లభిస్తుంది. ఆ ఉపన్యాసమేగానముతో కూడుకునివుంటే హరికథా కాలక్షేపంవలె మరీ మనోరంజక మవుతుంది. అలాగే గ్రంథంకూడా శబ్దార్థాలంకారాలతో విభావాదివర్ణనలతో కూడుకుని ఉంటే అందలి భావసౌందర్యం ఎంతో హృదయంగమ మవుతుంది. ఆ గ్రంథములే మహాకవి రచిత కావ్యములయితే మరి చెప్పేదేమిటి? కావ్యములు- శ్రవ్యములు-వినదగినవి. దృశ్యములు-చూడదగినవి, అని రెండు విధాలు. దృశ్యకావ్యములనే నాటకము లంటాము. చెవితో విన్నదానికంటే రంగస్థలమందు కండ్ల ఎదుట ప్రదర్శితమైనభావం సరాసరిగా హృదయాన హత్తుకొంటుంది. భాస కాళిదాస భవభూత్యాదులగు మహాకవులు చిరకాలమునాడే ఇట్టినాటకాలు రచించారు. 


అచ్చుయంత్రం వచ్చినపిమ్మటచేతితో గ్రంథప్రతుల్లు వ్రాసుకునే శ్రమ తప్పిపోయి, వేలకొలది ప్రతులిట్టే సిద్దమవు తున్నవి. అట్లే ఇపుడు సినిమావచ్చింది కనుక, నాటకాన్ని నటులు మాటిమాటికి ప్రదర్శింపనక్కరలేదు. ప్రదర్శనాన్ని ఒక్కసారి సినిమాతీస్తే, దాన్నినే ఎన్ని సార్లయినా మనం చూస్తూవుండవచ్చు. 


చిత్త మందుపుట్టే రసభావాలన్నిటికీ నాటకమందు ప్రవేశమున్నప్పటికీ ఒక్కొక్క నాటకం ఒక్కొక్కరసాన్ని ప్రధానంగాను, తక్కినవానిని అప్రధానంగాను ప్రదర్శిస్తూంది. ప్రధానమైన అంగిరసానికి తక్కినవి అంగములుగా ఉంటవి. మహావీరచరితం, వేణీ సంహారము అనే నాటకాలలో వీరం ప్రధానరసం. అట్లేశృంగార హాస్య కరుణాదులు కొన్ని నాటకాలలో ప్రాధాన్యం వహిస్తవి. నవరసాలలో శాంతరసం అగ్రగణ్యం. ఒక్కొక్క విధమయిన చిత్తవికారంవల్ల శృంగారాదిరసాలు పుట్టుతవి. శాంతరసం అట్టిదికాదు. వృత్తిరహితమై నిర్వికారమైన చిత్తస్థితినే శాంతమంటాము. కనుకశాంతమును నవరసాదులలో గణించకూడదనే మతభేదం ఉంది. ఆలంకారికులలో ఇతర రసములందు చింతాజడత్వాది వ్యభిచారిభావాలకు ప్రాధాన్యం వుంటుంది. కనుక స్థిరమైన ఆనందాన్ని కలిగించవు. శాంతరసము నిర్వికారము, సాత్త్వికము కావడంవల్ల దానిచే అభంగురము, సుస్థిరము అయిన ఆనందం లభిస్తుంది. త్యాగయ్యగారు చెప్పినట్లు ''శాంతములేక సౌఖ్యములేదు.'' కావున యితర రసములందుండే రంజకత్వము, ఉద్దీపనము లేకున్నను శాంతమునకు స్వతః రసత్వమున్నదని చెప్పవచ్చు. 


జిహ్వకు రుచినిపుట్టించే కటుతిక్తావ్లుకషాయాదిషడ్రసములు కూడా ఈ నవరసాల వంటివే. ఈ షడ్రసాలు పాళ్ల చొప్పున ఒంటొంటితో కలిసి సంతోషాన్ని కలిగిస్తవే కాని, స్వభావముచే సాత్వికములు కావు. నాలుకపై రుచుల నుద్దీపింపచేసి ఇవి మనస్సును తల్లడిపెట్టుటేతప్ప చిత్తమునకు శాంతి నివ్వజాలవు. వీనిలోచక్కెరమున్నగు వానియందు మాధుర్యం లభిస్తుంది. ఆమాధురంకూడ మితిమీరితే మొగంమొత్తుతుంది. ఎంత అనుభవించినాతృప్తితీరని మాధుర్యంమరొకటి వున్నది. దానినే మధు-రసమంటారు. రుచినిపుట్టించేషడ్రసాలలో ఏదీ అందులో కలియదు. అది సాత్వికము, శ్రీకృష్ణుడారగించేదదే! విశుద్ధవర్ణము. కేవల సాత్వికము అయిన నవనీతమే ఆ పదార్ధం, కృష్ణునినోటినిండా వెన్నా, మనమునిండా ఆనందమూను, ఆవెన్నచే మొగముమొత్తదు తనివితీరదు. వెన్నయందు లభించే మధురరసమే శాంతరసం. 

రంగులప్రస్తావం వచ్చినప్పుడు వానిలో నలుపు తెలుపు అంటూ బేధంచేస్తాము. నలుపు తెలుపు వేర్వేరుగా మన కంటికి కనుబడునేగాని, నిజానికవి వర్ణములు కావని సైన్సు చెబుతుంది. సూర్యుడు ఏడుగుర్రాలరథంమీదప్రయాణంచేస్తున్నట్లు పురాణములు వర్ణిస్తవి. వేదములుకూడా సూర్యుని సప్తాశ్వుడంటున్నవి. ఈయశ్వశబ్దానికి, నిరుక్తం కిరణమని అర్థంచెపుతున్నది. కావున సప్తాశ్వుడంటే సప్తకిరణాలుకలవాడని గ్రహించాలి. పూర్వం సంపన్నులఇండ్లలో స్ఫటికగోళములుగృహములకలంకారంగా వ్రేలాడుతూవుండేవి. వానిలో దీపములు వెలిగించేవారు. ఆగోళములు దీపములతో వూగులాడినప్పుడు ఏడురంగులుగా కనుపించేవి. ఆఏడువర్ణములు ఏకమైనప్పుడు తెల్గగా కనుపించునేకాని, తెలుపు వేరేరంగు కాదు. శుద్ధమైన తేజస్సే తెల్లగా కనిపిస్తుంది. ఆవిశుద్ధకాంతిని మూడుపలకల కాచఖండములోనుండి చూస్తే ఏడురంగులుగా కానవస్తుంది. ఈ యేడురంగులను సమపాళ్లుగా కలిపితే తెల్లని తేజము లభిస్తుందని సైన్సు తెలియచెప్పుతున్నది. చమురు దీపం ఎర్రగాకనుపిస్తుంది. చమురునందు ఆయెరుపుపాళ్లెక్కువగా వుండుటే దానికి కారణం. 


నేతి దివ్వెయం దంత ఎరుపు కనిపించదు. నూనెకంటె నేయి పరిశుద్ధం కనుకనే దేవాలయములందు గర్భగుడిలో స్వామిసన్నిధిని నేతిదివ్వెలు వెలిగిస్తారు. నిర్మలమైన ఆవెలుగు నందు రంగు కనిపించదు. 


బంగారము, వెండి, ఇనుము మొదలైన లోహములను నిప్పులలో కాల్చి ప్రజ్వలింపజేసినపుడు ఆయాలోహాలనుబట్టి ఆజ్వాలయందు భిన్నవర్ణములుగోచరిస్తవి. ఇచట ఇంకో విశేషమేమిటంటే సూర్యకాంతిని వర్ణదర్శినితో పరిశీలిస్తే దానియందీ లోహాలుకనిపించుతవట. ఇవేకాక హేలియం అనే మరో ధాతువుకూడా సూర్యకాంతియందున్నదట. ఈహేలియమనే శబ్దం సూర్యుడనే అర్థంగల లాటిన్ శబ్దం నుంచి పుట్టింది. సంస్కృతభాషయందు సూర్యుణ్ణి చెప్పే 'హేళి' అనేశబ్దమున్నది. ఈ హేలియం సూర్యునియందేతప్ప భూమియందులభించదట. ఈవిశ్వాన్ని 'హేలియో సెంట్రిక్' అంటారు. అం టే విశ్వానికి సూర్యుడే కేంద్రమనితాత్పర్యం. హేళిశబ్దంనుంచే హేలియో సెంట్రిక్ శబ్దంకూడా పుట్టిందని మనం గమనించాలి. 


సూర్యకాంతికి లేనట్లే స్ఫటికానికి గూడా రంగులేదు. అంతేకాదు, నీటికిగూడా రంగులేదు. శుద్ధస్ఫటికానికి పరీక్ష ఏమిటంటే, దానిని నీటిలో వేసినపుడది కనుపించగూడదు. కంటి కగుపించు వస్తువులలో స్ఫటికానికి రంగులేనట్లే రుచి చూచే వస్తువులలో వెన్నకుగూడా రుచిలేదు. ఈరెండివలెనే నవరసాలలో శాంతముగూడ నిర్మలం, పరిశుద్ధమూను, శాంత రసమందు మనస్సు వృత్తిరహితమై, సమాధిని పొందుతుంది. రసానుభవసమయమందు మనస్సు తన్మయత్వం పొందుతుంది. కనుక శాతరసమం దది శాంతిమయమవుతుంది. 

శృంగారాది రసప్రధానములైన నాటకాలు అనేకంగా వున్నవి. కాని శాంతరసనాటకాలు చాలా అరుదు. నేటి నాటకాలు చూడబోతే కామ క్రోధాదులను ప్రకోపింపజేసి మనుష్యుని అథమస్థితికికొనిపోయేవేతప్ప చిత్తశాంతినిచ్చి ఉన్నతిని కల్గించేవి కానరావు. శాంతరస ప్రధానములగు నాటకములు నేడు లేనే లేవు. 


వెయ్యేండ్ల క్రితం రాజపుత్రస్థానవాసియైన కృష్ణమిశ్రుడనే కవి ప్రబోధ చంద్రోదయమనే శాంతరసప్రధానమైన నాటకం రచించాడు. దీనిని పోలినది మరొకటి లేదు. జ్ఞానమే మోక్ష సాధనమని కథారూపాన చెపుతుందీనాటకం. వివేకుడు, విష్ణు భక్తీ, శ్రద్ధ, కరుణ, ధర్ముడు, వైరాగ్యం, అజ్ఞానం మొదలైన విందు పాత్రలు, ప్రబోధమనే సామ్రాజ్యంకోసం ఇందు ఇరు తెగలకుపోరాటం జరుగుతుంది. అశాంతి కారణమైన తెగ ఓడిపోయి, జ్ఞానఫలమైన శాతిపక్షం జయంపొందుతుంది. ఈనాట కాన్ననుసరించి శ్రీ వేదాంతదేశికులుగూడ సంకల్ప సూర్యోదయమనే నాటక మొకటిరచించారు. పరమేశ్వరాను గ్రహానికి కారణమైన భక్తికి ఇందు ప్రాధాన్యం చెప్పబడింది. 


నాటక ప్రదర్శనాన్ని చూడటంవల్ల చిత్తశుద్ధీ, చిత్తశాంతీ కలుగవలెనేకాని కామాదులు ప్రకోపింపకూడదు. నేటి నాటకాలు, సినిమాలూ కామాదులను ప్రకోపింపజేయుటే పనిగా పెట్టుకొని ప్రజాసంఘములకు పరస్పరద్వేషం కలిగిస్తూ ఒక్కొక్కసంఘాన్ని పరిహాసపాత్రము చేస్తూదానిపట్ల అసూయా క్రోధాలను రేకెత్తిస్తున్నవి. పూర్వం నాటక ప్రయోగంకోసం ఏర్పడినతెగనుభరతపుత్రులనేవారు. నాటకాలాడడమే వారికి స్వధర్మంగా వుండేది. వారికదే జీవనాధారమైనవృత్తి. ఇతర వృత్తులు స్వధర్మములలో గల తెగలవారు ఈనాట్యవృత్తిలో ప్రవేశిస్తేభరతపుత్రుల వృత్తికిభంగం కలిగించినవారవుతారు. అంతేకాదు, స్వధర్మమును విడనాడి పరధర్మాన్ని స్వీకరించుటచే తమధర్మానికి చేటూ, సంఘానికిహాని చేకూర్చినవారవుతారు. నాట్యజీవనులైన భరతపుత్రులకు కొన్ని నియమాలుఉండేవి. పురుషుడు స్త్రీవేషం ధరించి నటించరాదు. స్త్రీపాత్రధరించిన పురుషుని చూడడంపాపమన్నారు. నాటకంలో దంపతులవేషం ధరించే స్త్రీపురుషులు నిజంగా దంపతు లయ్యుండాలేకాని పరపురుషునకు భార్యగా స్త్రీనటింపగూడదు. నేటినాటకాలలో సినిమాలలో ఈనియమాన్ని ఉల్లంఘించటంవల్ల సంఘంలో బహిరంగంగానూ, చాటుమాటునా అవినీతి ప్రబలిపోతున్నది. ఇంతకు నేటి బాటకాలు కామాదిప్రశోపనమే పనిగా పెట్టు కొన్నవనీ, చిత్తశాంతినీ, ఆనందాన్నీ చేకూర్చే నాటకాలు మృగ్యమైనవనేదే సారాంశం.   


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- “జగద్గురు బోధలు” నుండి


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

సాష్టాంగ నమస్కారం

 🙏🙏🙏🙏🙏

సాష్టాంగ నమస్కారం

🙏🙏🙏🙏🙏

అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటారు.

సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము.


ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః


అష్టాంగాలు అంటే


"ఉరసా" అంటే తొడలు,

"శిరసా" అంటే తల,

"దృష్ట్యా" అనగా కళ్ళు,

"మనసా" అనగా హృదయం,

"వచసా" అనగా నోరు,

"పద్భ్యాం" అనగా పాదములు,

"కరాభ్యాం" అనగా చేతులు,

"కర్ణాభ్యాం" అంటే చెవులు.


ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.


మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి.


ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి.


1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.


2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.


3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.


4) మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి.


5) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి.


అంటే  "ఓం నమః శివాయ" అని అంటూ నమస్కారం చేయాలి.


6) పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.


7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.


8) జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి.


స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. 

అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది.


పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. 

దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి 


నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం.

🙏🙏🙏🙏🙏

అష్ట దిక్కుల గాలులు

 అష్ట దిక్కుల గాలులు  -  లాభ నష్టాలు . 


  గాలులు లొని రకాలు  - 


     బౌగోళిక పరిస్థితులను బట్టి సూర్య చంద్రుల గమనాలని బట్టి భూమి స్వరూపాన్ని ఎనమిది దిక్కులుగా విభజించారు. అన్ని దిక్కుల నుంచి వీచే గాలులు అన్ని ఒకే రకంగా ఉండవు  . ఆయా దిక్కుల స్వభావాన్ని బట్టి గాలి స్వభావం మారుతుంది . అయితే అన్నివేళలా అన్ని దిక్కుల నుండి గాలులు వీచవు. ఒక్కో రుతువులో ఒక్కో దిక్కునుండి ఒక్కో రకమైన గాలులు వీస్తాయి. వాటివల్ల మానవులు మానవులకు కొంత ఆరోగ్యము , కొంత అనారోగ్యము కలుగుతాయి. ఏ గాలులు అనారోగ్యమో , ఏ గాలులు ఆరోగ్యమో తెలుసుకోవడం ప్రతి మనిషికి అవసరం. 


  దక్షిణ దిక్కు గాలులు  - 


    ఏప్రిల్ , మే నెలలలో వచ్చే వసంత మాసంలో దక్షిణ దిక్కు నుంచి గాలులు నెమ్మదిగా వీస్తాయి . ఇవి మలయ పర్వతం మీదగా వీచడం వలన ఆ పర్వతం మీద ఉన్న ఔషధాల సువాసనలు కూడా ఈ గాలులతో కలిసి వస్తాయి. ఈ మలయ పవనాలు తమ చల్లని స్పర్శతో మానవాళిని వేసవితాపం నుంచి కాపాడతాయి. ఈ గాలులని ఆస్వాదించ గలిగితే శరీరంలోని త్రిదోషాలు హరించి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ గాలిలో తీపి , చేదు , వగరు రుచులు ఉంటాయి. ఈ కాలంలో అదే స్వభావం కలిగిన ఈశాన్య గాలులు కూడా వీస్తాయి 


  నైరుతి గాలులు  - 


      జూన్ , జూలై నెలలలో వచ్చే గ్రీష్మ రుతువు లొ నైరుతి దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఈ గాలుల్లో కారం రుచి ఉంటుంది. ఇవి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. ఈ గాలులు వాళ్ళ ఉదర రోగాలు , పైత్య రోగాలు , మేహా రోగాలు పుడతాయి. రక్త పిత్త రోగాలు కూడా పుడతాయి. ఈ నైరుతి గాలులు సకల రోగాలుకు నిలయాలు. 


  పడమర గాలులు  - 


     ఆగస్ట్ , సెప్టెంబర్ నెలలలో ఉండే వర్ష ఋతువులో పడమర గాలులు వీస్తాయి . ఈ గాలులు వెగటుగా ఉండి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. అయినా గ్రీష్మ ఋతువులో నైరుతి గాలుల వలన ఏర్పడిన రక్తపిత్త వ్యాధి హరించి పొతుంది. ఎంతో కాలం నుంచి ఉన్న వివిధ వ్రణాలు మాడిపోతాయి. 


  వాయువ్య దిక్కుల గాలులు  - 


   

     అక్టోబర్, నవంబర్ నెలలలో ఉండే శరత్కాలంలో వాయువ్య దిక్కు నుంచి గాలులు వీస్తాయి . ఈ గాలులలో కారం , చేదు గుణాలు ఉంటాయి. తేమ ఉండదు. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అయితే వాత వ్యాదులు కలిగించడం . వాతవ్యాదులు ఉన్నవారికి ఎక్కువ అవ్వడం ఈ గాలుల స్వభావం . కఫ రోగాలు , పైత్య రోగాలు తగ్గించి వంటిలోని చెడు నీరు తొలగించే గుణం ఈ గాలులలో ఉంది. 


  తూర్పు , ఉత్తర దిక్కుల గాలులు  - 


     డిసెంబర్ , జనవరి నెలలలో ఉండే హేమంత ఋతువులో తూర్పు దిక్కున ఉండి ఉత్తర దిక్కుకు ఈ గాలులు వీస్తాయి . తూర్పు గాలులు చలువ చేస్తాయి. కాని వీటివల్ల వాత రోగాలు , కఫ రోగాలు పైత్య రోగాలు పెరుగుతాయి. వంటి నిండా నీరు పట్టే ఉబ్బు వ్యాధి ని కలిగిస్తాయి. ఉత్తరపు గాలులు కూడా చల్లగా ఉంటాయి. ఇవి కఫాన్ని , కొవ్వుని పెంచుతాయి. 


   ఆగ్నేయ గాలులు   - 


  

       ఫిబ్రవరి , మార్చి నెలలలో ఉండే శిశిర ఋతువులో ఆగ్నేయ దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఇవి కూడా అమిత చల్లగా ఉంటాయి. వాతవ్యాదులని పుట్టిస్తాయి. ఉబ్బు రోగాలు , వ్రణాలు ఉన్నవారిని మరింత పీడిస్తాయి.


 

         

ఆలయం- అర్చన"

 " ఓం నమో వేంకటేశాయ" మువ్వల రాంబాబు మాస్టారు .... మిత్రులందరికీ 🙏🙏🙏 Imp 

     ఒక అద్భుత అవకాశం ... తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ...ప్రతి నెలా 15రోజులు ఉండవచ్చు .రూము , భోజనం ఉచితం ... ప్రయాణ ఖర్చులు , రోజుకు వెయ్యి రూపాయలు ..చివరి రోజు ప్రత్యేక దర్శనం కూడా TTD వారే చేయిస్తారు ... 

ఈ కార్యక్రమానికి మనకు ఆసక్తి ఉంటే ప్రతి నెలా 15 రోజులు తిరుపతిలోనే రెసిడెన్షియల్ మోడ్ లో ఉండటానికి సిద్ధపడాలి ... 


  మనం ఏంచేయాలి ?

 ....ఈ కార్యక్రమాన్ని " అర్చక శిక్షణ" అంటారు ...  అంటే భక్తి ప్రపత్తులు ఉండీ ....పూజ , అర్చన వాటి మీద పూర్తిగా అవగాహన లేని ... ప్రథానంగా ( వెనుకబడిన)  అన్ని వర్గాలలోని భక్తులకు ...(25 సం.దాటిన వారికి)  ధర్మం , అర్చన వీటిమీద మీరు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది .....


    కంగారు పడాల్సింది లేదు ... ముందుగా మీకు తిరుపతిలోనే శిక్షణ ఇస్తారు ... "ఆలయం- అర్చన" అనే పుస్తకం ఇస్తారు ... ఈ శిక్షణ మీరు తీసుకున్నాకనే .... మీరు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది... మీకు తెలుగు భాష మీద పట్టు , మంచి ఉచ్చారణ ఉంటే చాలు .... 


      వర్కింగ్ లో ఉన్నవారికి ...కష్టమేమో ...O.D. ఉండదు .. మీరు సెలవులు పెట్టుకుంటామంటే సంతోషం ...కాబట్టి రిటైర్డ్ తెలుగు మాస్టార్లు గానీ ..... భక్తులు గాని వెళ్ళవచ్చు .... ఇప్పుడు వెళ్ళాలనుకునేవారు ... ఈ మార్చి 23 సాయంత్రానికల్లా మీరు తిరుపతిలో ఉండాలి .... ప్రస్తుతం మీకు  ఈ 24 , 25 , 26 తేదీల్లో మీకు శిక్షణనిస్తారు ... 26న మీకు spl దర్శనం ... 27న మీరు ఇంటికి వచ్చేయవచ్చు ... వచ్చేనెల నుండీ 15 రోజులు మీరు శిక్షణ ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది ........



      కాబట్టి ఆసక్తి ఉన్నవారు అర్జెంట్ గా నన్ను కాంటాక్ట్ చేయగలరు ....


లేదా ...అలాంటివారెవరైనా ఉంటే వారికీ విషయం తెలియజేసి ... నా నెం ..వారికివ్వండి .... ధన్యవాదాలు ... మువ్వల 

రాంబాబు మాస్టారు ...


నా నెం.స్ .

8332934529

9592559819 🙏🙏🙏

విలువ

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀డబ్బు శాశ్వతం కాదు,

                

      *డబ్బే జీవితమూ కాదు*

            ➖➖➖✍️


*ఒక జడ్జి తన వృత్తినుండి పదవీవిరమణ అయ్యాక తన భార్య నుండి తనలోని భావాలను ఇలా పంచుకుంటున్నారు…*


*”లక్ష్మీ! నేను లాయర్ గా ఉన్నప్పుడు కాని జడ్జి గా ఉన్నప్పుడు కాని ఈరోజు నేను చూసిన నా చివరి కేసు లాంటిది చూడనే లేదు” అని అన్నాడు.*


*“ఏంటా కేసు?” అని ఆమె అడగగా…*


*”ఒక తండ్రి తన కొడుకు తనకు నెలకు డబ్బులు ఇవ్వడం లేదని కేసు“ అన్నాడు.*


*కొడుకుని పిలిచి … “ఏంటయ్యా నీ తండ్రికి నెలకు సరిపడ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు?” అని అడిగాను.*


*”మా తండ్రిగారు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పదవి విరమణ పొందిన వ్యక్తి. నెలనెలా ఆయనకు పెన్షన్ వస్తున్నది. బాగానే డబ్బులు ఉన్న వ్యక్తి. నా పైన ఇలా ఎందుకు కేసు పెట్టాడో అర్థం కాలేదు” అన్నాడు.*


*ఆ తండ్రి “అవును డబ్బుకు నాకు లోటులేదు, కాని నా కొడుకు నెలకు 100 రూపాయలు కానివ్వండి స్వయంగా వచ్చి అందించేలా తీర్పు ఇవ్వమ”ని అడిగాడు.*


*తీర్పు చెప్పాక ఆ తండ్రిని కలిసాను “ఎందుకయ్యా ఇలా అడిగావు” అని*


*”మాకు ఉన్నది ఒక్కడే కొడుకు. మీరు ఇచ్చే తీర్పు కారణంగా అయినా నెలకు ఒక్కసారి మా దగ్గరకు వచ్చి మాతో గడిపి వెళ్ళగలడని ఆశ, వాళ్ళ అమ్మకు వాడంటే ప్రాణం।” అని అన్నాడు.*


*ఇలా చెబుతూ ఆయన కళ్ళు తడిచాయి.*


*డబ్బే ప్రధానం అనుకుంటారు; అంత కంటే ఎక్కువగా మనల్ని ఎదురుచూసేవారుంటారు అని గుర్తించలేము.*


*నాకెందుకో అప్పటి కన్నవారికి నేడు ఉన్న తల్లితండ్రులకి చాలా తేడా కనిపిస్తుంది.*


*మా పిల్లలు డబ్బు సంపాదించకపోయినా పర్లేదు మా కళ్ళ ముందు ఉంటే చాలు సరిపడా సంపాదన చాలు అనుకునే వారు.*


*నేడు పిల్లలు అంటే వారు విధేశాలకు వెళ్ళిపోవాలి, లక్షలు సంపాధించాలి అని కోరుకుంటున్నారు.*


*అందుకే ప్రేమ ఆప్యాయతలు బంధాలు అనేవాటికి విలువ లేకుండా పోయింది .*

*ఎవరైనా ఇవన్నీ పిల్లల నుండి ఎదురుచూస్తుంటే పిచ్చివాళ్ళను చూసినట్టు చూస్తున్నారు*

*అనురాగం ఆప్యాయత అందని ద్రాక్ష పళ్ళు కాకూడదు కనిపెంచిన తల్లిదండ్రులకు.*✍️

.         

                   


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

పరమాత్మ అసలు స్వరూపం

 మనలో కొంత మంది, పరమాత్మ అసలు స్వరూపం తెలుసుకోకుండా, కేవలం దేవాలయాలకు వెళ్లడం, పూజలు చేయడం, నివేదనలు అర్పించడం, దానికి మించిన కోరికలు కోరడం, ఆ కోరికలు తీరకపోతే ఈ దేవుడికి మహిమ లేదనుకోవడం, అక్కడితో ఆగిపోవడం. తనను గురించి కానీ, పరమాత్మ గురించి కానీ తెలుసుకోకపోవడం. ఇటువంటి వారు దేవుడిని కేవలం తమ కోరికలు తీర్చుకోడానికి అంటే తమ స్వార్థానికి వాడుకుంటారు తప్ప భక్తితో కాదు. కాని వీరు తమను తాము భగవద్భక్తులం అని చెప్పుకుంటారు. ఆడంబరంతో, ఆర్భాటాలతో, ఇతరుల మెప్పు కొరకు పూజలు చేస్తారు వాటిని భగవంతుడు స్వీకరించడు, సంపూర్ణ భక్తితో ఆశరహిత ప్రార్థనను మాత్రమే ఆయన స్వీకరిస్తాడు.


మాయను దాటాలంటే శాస్త్రజ్ఞానము, వివేకము, వైరాగ్యము, భగవంతుని మీద భక్తి, శ్రద్ధ, శరణాగతి, భగవంతుని ఆశ్రయించడం కావాలి. దీని కంతా కావాల్సింది శాస్త్ర జ్ఞానం. గురువు దగ్గర నేర్చుకోవడం. సత్యం ఏదో అసత్యం ఏదో తెలుసుకోవడం. అప్పుడు మనను ఆవరించిన మాయ తొలగిపోతుంది. కొంత మంది శాస్త్రాలు చదువుతారు జ్ఞానం సంపాదిస్తారు కానీ, రజోగుణము, తమోగుణములతో కూడిన మాయ వారి జ్ఞానమును కప్పివేస్తుంది. దాని ఫలితంగా తమకు తెలుసు, తమనుమించిన వాడు లేడనుకుంటారు. అందుకే వాళ్లకు దేవుడు కనపడటం లేదు.


Follow : @bhagavadgithaa


       🚩🙏 జై శ్రీ కృష్ణ 🙏🚩

హాని జరగలేదు

 🙏 నమస్కారం అండి 🙏


🙏 *ఓం నారాయణ- ఆదినారాయణ* 🙏


*గ్రంథం:* అమృత వాక్కులు, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య బోధలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*సంపన్నత్వం- సాధారణత్వం*


సంపన్నత్వమంటే లౌకికమైన సంపదగలవారు మరియు ఆధ్యాత్మిక సంపదగలవారని కూడా అర్ధము. సంపన్నత్వము కలవారు తప్పక సాధారణత్వం కల్గి వినమ్రులై భగవంతునకు కృతజ్ఞులై ఉండాలంటారు శ్రీ స్వామివారు. నేను సంపదనార్జించి శ్రీ స్వామివారికి దానం చేసిన దాతను. కనుక నాకు ప్రత్యేక దర్శనము, ప్రత్యేక మర్యాదలు కావాలని మనసులో కూడా కోరరాదు. అలాంటి ప్రత్యేకతలు సంస్థానం వారు ఇచ్చినా స్వీకరించరాదని శ్రీమాన్ బూటీ మహాశయుని చివరి సందేశమేగాక, పూజ్యపాదులు ఆచార్య భరద్వాజ మాష్టరు గారి సలహా మరియు ఆచరణ మాత్రమేగాక, శ్రీ జ్ఞానేశ్వర్ మహరాజ్ గారు మానవాళికి ఒసంగిన దివ్య సందేశమదే.


 శ్రీ స్వామివారు సర్వసాక్షి కనుక మనం సమర్పించినది వారికి తెలుసు. మరి మనమిపుడు ప్రత్యేక మర్యాదలు, ప్రత్యేక దర్శనాలు కోరుతున్నామంటే, మనం కైంకర్యము చేసిన దానికి బదులు ఈ ప్రత్యేక దర్శనాలు, మర్యాదలు కొంటున్నామని భావం. వజ్రాలనిచ్చి గాజు పెంకులు కొనే ప్రబుద్ధులమవ్వాలని తలచవచ్చా? ఆశ్రమం వారు కళ్ళు తెరచి ఇలాంటి అమాయకులకు నిజరహస్యం బోధించేటట్లు చేయమని శ్రీ స్వామివారిని ప్రార్ధిద్దాం.  శ్రీ జ్ఞానేశ్వర్ మహరాజ్ ఎవరో ఏమి చెప్పారో తెలుసుకోవాలనే సత్పురుషులు శ్రీ జ్ఞానేశ్వర్ భగవద్గీత అనే పేరుతో అన్ని 'వెంకట్రామ్ అండ్ కో' లలో దొరుకు గ్రంధం చదవండి. అందులో ఈ విషయం 16వ అధ్యాయం 4వ శ్లోకంలో వివరించారు.


*''ఈ లోకమునందును, పరలోకమునందును మనకు స్నేహ పూర్ణుడుగా నుండు ధర్మము-అభిమానముతో మేము ధర్మాచరణమొనర్చుచున్నామని చెప్పుకొనుచున్నచో మనను తరింపజేయు ధర్మము కూడా మనకు దోషముకలుగ జేయుచున్నది.* కావున ఓ అర్జునా! మనము చేసిన ధర్మ కార్యమును ఆడంబరముగా నలుదిక్కులకు ప్రచారము చేసుకొన ఆరంభించినచో ఆ ధర్మము కూడా అధర్మమే అగును.' గనుకనే విద్యానగర్ (నెల్లూరు జిల్లా) లో పూజ్యశ్రీ భరద్వాజగారి ఆధ్వర్యములో నిర్మించిన శ్రీ శిరిడీ సాయి మందిరంలో వస్తువులపై పేర్లుగానీ, మందిర నిర్మాణమునకు సహకరించిన వారి పేర్లుగానీ వ్రాయబడలేదు. ఇందుకే కాబోలు పెద్దలు 'గుప్తదానం' అన్నారు. కుడిచేత్తో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదన్నారు.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీ సాయిమాస్టర్ స్మృతులు*

       *సంకలనకర్త :- లక్ష్మీ నరసమ్మ*

                   *టాపిక్ :- 21*

                 *సౌజన్యమూర్తి*

                              - శ్రీ ఎమ్. గోపాలకృష్ణమూర్తి


తర్వాత ఆలోచిస్తే నాకెంతో  ఆశ్చర్యం వేసింది. మాస్టార్ గారు కరెక్ట్ గా ఆ టైమ్ కే రావటం, నా తలనొప్పి తగ్గటానికి ఆయన టీకి పిల్చుకుపోవటం, మధ్యలో ఎవరి ద్వారానో నోట్స్ దొరకటం తల్చుకుంటే యిదంతా మాస్టార్ గారి కృపే అనిపిస్తుంది. లేకపోతే హాయిగా కూర్చుని మాట్లాడ్తున్న వారల్లా మూడు కిలోమీటర్ల దూరంలో వున్న టీ బంక్ కి తీసికెళ్ళటం ఆయన కరుణగాక మరేమిటి? ఆయన రాకపోతే ఆ పేపర్ దొరికే ప్రసక్తే లేదు. ఆ తర్వాత కనుక్కుంటే మాస్టార్ గారు లేరు. ఏవో పేపర్లు దిద్దటానికొచ్చారు. దిద్దటం అయిపోయింది. ఆయనెళ్ళిపోయారు.


ఇంకోసారి మోటార్ సైకిల్ యాక్సిడెంట్ జరిగింది. కాని నాక్కొంచెం కూడా హాని జరగలేదు. నా బండిని చూసిన వాళ్ళెవరూ నమ్మలేరు.ఎందుకంటే అంత ఘోరంగా బండి పాడయిపోయింది. ఇది కూడా మాస్టార్ గారి, బాబా గారి చలవే.


                       🙏జై సాయిమాస్టర్🙏

నాన్న..*_ _*వృద్ధుడేమో కానీ,

 *శుభోదయం*


🙏💐🙏💐🙏


      _*నాన్నే నారాయణుడు.*_


*సమయాన్ని సందర్భాన్ని బట్టి తానే  దశావతారుడు అవుతాడు.*


               

 🙏🙏🙏🙏🙏



_*పాకడానికి మనం ప్రయత్నించేటప్పుడు*_

_*"మత్స్యం." అవుతాడు..*_



_*ఆటలాడే సమయానికి*_

_*"కూర్మం." అవుతాడు..*_



_*కాస్త పెరగగానే తల మీద ఎత్తుకొని వేసే చిందుల్లో*_

_*"వారాహుడు." అవుతాడు.*_



_*ఎంత అల్లరి చేసినా.. పైకి మాత్రమే కోపం నటించే*_

_*"నారసింహుడు." అవుతాడు.*_



_*తాహతు తెలియక  అడిగే కోర్కెల కోసం తాను తగ్గి వేరే వాళ్ల ముందు చేయ్యి చాచే వెర్రి*_

_*"వామనుడు." అవుతాడు.*_



_*వెయ్యి కష్టాలు వచ్చినా అలవోకగా నరుక్కొంటూ వెళ్ళే*_

_*"భార్గవుడు." అవుతాడు.*_



_*జీవిత విలువల నడక నేర్పే*_

_*"రాముడు." అవుతాడు.*_



_*జీవన యుద్దపు నడత నేర్పే*_

_*"కృష్ణుడు." అవుతాడు*_





_*చివరికి ఏదేమైనా.. మన నాన్నే మనకు "ఆ నారాయణుడు!!." అవుతాడు*_




 _*నాన్న..*_

_*వృద్ధుడేమో కానీ,*_

_*వ్యర్దుడు కాదు.*_


            🙏🙏

శరవేగంతో

 శ్లోకం:☝

*యద్వత్ ప్రత్యఞ్చి బాణస్య*

  *తీవ్రగతిశరాయణం |*

*తద్వత్ ప్రత్యఞ్చి విక్రాంతే*

 *యశోమార్గపరాయణం ||*


భావం: ఎలాగైతే వింటి నారిని వెనక్కి సారించి వదిలితే బాణం అత్యంత వేగంగా వెళుతుందో, అలాగే జరిగిన విషయాలని ఒక్కసారి సింహావలోకనం చేసుకుని ప్రణాళిక వేసుకుంటే అభివృద్ధి పథంలో శరవేగంతో దూసుకుపోవచ్చు!

సద్గురు బోధలు

 🙏 నమస్కారం అండి 🙏


🙏 *ఓం నారాయణ- ఆది నారాయణ* 🙏


*గ్రంథం:* అమృత వాక్కులు, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య బోధలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*సత్యం, ధర్మం - ఆచరణ*


వీటిని తప్పిన వారంతా చేతికి చిక్కిన మాణిక్యమును దక్కించుకోలేని దౌర్భాగ్యులయ్యారు. శ్రీ స్వామివారి దివ్య సన్నిధికి దూరమయ్యారు. అలా శ్రీ స్వామివారికి దూరమైన వారు కొందరు దివంగతులైనారు. మరికొందరు శ్రీ స్వామివారు ఉండగనే వారి సన్నిధి వదలి వెళ్ళిపోయారు. మరి సత్యం, ధర్మం తప్పని శ్రీ రోశిరెడ్డి వంటి మహా భక్తులు ఒక్కొక్కప్పుడు సాటిసేవకుల పరిహాసాలు, నిందలు, దూషణల ఓర్చుకోలేక శ్రీ స్వామివారిని వదిలి వెళ్ళిపోవాలని చూస్తేగూడ సర్వజ్ఞులైన శ్రీ స్వామివారు వారిని తనకు దూరం కానివ్వలేదు. 


*"అయ్యా ఎవరో ఏమో అన్నారని వెళ్ళిపోవాలంటావా?. పంటచేను వదలి పరిగ ఏరుకుంటావా?.. ఊర్లోకెళ్ళి అన్ని నూకలు తెచ్చుకుని జావకాచుకుని తాగి ఇక్కడ ఉండయ్యా"* అని చెప్పి వెళ్ళేవారిని ఆపి తన దివ్యసన్నిధి ప్రసాదించారు. చివరిదశలో ఎవరిసేవనూ తీసుకోకుండా పూర్తిప్రజ్ఞతో తనువు చాలించేటట్లు చేశారు. మరి తక్కిన వారిని *పొయ్యేవాళ్ళను పోనిచ్చేదేగదయ్యా* అన్నారు. సత్యం, ధర్మం తప్పిన వాళ్ళకు శ్రీ స్వామివారు కొన్ని హెచ్చరికలు చేసి వదిలేస్తారని అర్థం.


జిహ్వరుచికొరకు ఇతరులవద్ద తిని మొహమాటపడి తమ ధర్మం తప్పిన వారు కొందరు, సంఘం దృష్టిలో గొప్పవారుగా ఉండాలని సేవకాధర్మమే మరచి అహంకరించినవారు కొందరు. ధనాశకులోనై శ్రీ స్వామివారు సర్వజ్ఞులని మరచి మనమాటలను, చేతలను, ఆలోచనలు అనుక్షణం సాక్షిగా గమనిస్తూ తగు ఫలితాలిస్తారనే సత్యం మరచినవారు ఇంకొందరు శ్రీ స్వామివారికి దూరమయ్యారు.


రోశిరెడ్డిగారు శ్రీస్వామివారి ఆజ్ఞలను కఠోర దీక్షతో ప్రాణానికి తెగించి ఆచరించేవారు. అందుకే వారిని *"నీది భీష్ముని పట్టుదలయ్యా"* అని వ్రాయించారు. రోశిరెడ్డిగారు ఇతరుల మొహమాటాలకు, వత్తిళ్ళకు లొంగి శ్రీ స్వామివారిని తాకి నమస్కరించుకోనిచ్చేవారు కాదు. శ్రీ స్వామివారిని ఇతరులు తాకకుండా కాపలా ఉండే తనధర్మాన్ని అంతచక్కగా ఆచరించి శ్రీ స్వామి వారి సంపూర్ణ కృప పొందిన భాగ్యశాలి అయ్యాడు. మనలను కూడా వారి ఆచరణ చూసి నేర్చుకోమన్నారు.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ - 

వారు మనకు చేసిన మేలేమి? మన జీవితాలలో నింపిన వెలుగేమి?


మన దేశంలో ఒక్కొక్క చోట ఒక్క రీతిలో సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి.. కొన్ని చోట్ల శక్తీ ఆరాధన ఉంటె, కొన్ని చోట్ల శివ లేక విష్ణు ఆరాధనలు, కొన్ని చోట్ల ఇతర దేవతారాధనలు. గురుపీఠాలను అనుసరించి వారి ఆచారవ్యవహారాలతో ముడిపెట్టుకున్న ఇంకొంతమంది. కానీ అక్కడక్కడా మాత్రమే, మనము గురువాక్యాన్ని అనుసరించి తమ జీవితాలను దిద్దుకునే వారిని చూస్తాము. భగవంతుడు ఎప్పుడు ఒక అవతారాన్ని తీసుకున్నా, ఆ అవతారంలో గురువుకు ప్రాధాన్యతనివ్వడం మన పురాణాల్లో కూడా చూస్తాం. హనుమంతుడిని ఒక గొప్ప సాధకుడుగా, సుందరకాండ ఎన్నో యోగ రహస్యాలను తెలిపే గ్రంథంగా వర్ణిస్తారు. కానీ, ఇన్ని చూసిన ఇన్ని విన్నా, చాలామందిమి, గురువు కోసం ఆరాటపడడం చూడం. గుడికి వెళ్లి భగవంతుణ్ణి ప్రార్థిస్తాం కానీ, గురువు కోసం తపించం. ఎవరు దొరికితే మన జీవితానికి సార్ధకత ఉంటుందో, ఎవరైతే మన అస్తవ్యస్త జీవితాలను సరి అయిన మార్గంలో నడపగలడో, ఎవరైతే భగవంతుని జ్ఞాన స్వరూపంగా భూమి మీద వెలిసిందో, అటువంటి గురువు గురుంచి మాత్రం తెలుసుకోవాలనే జిజ్ఞాస ఇసుమంతైనా ఉండదు. ఇది చాలా మంది జీవితాలలో ఒక ఒరవడిగా వచ్చేసింది. 


అసలు జీవితం అంటే ఏమిటో, ఎలా జీవించాలో తెలపగలిగేది ఒక్క గురువు మాత్రమే. ఈ గురువులు రకరకాలుగా మన జీవితంలో తారసపడతారు. కానీ జీవిత లక్ష్యమైన భగవంతుని తెలుసుకోవడం అనే ప్రక్రియ మాత్రం, ఒక్క సద్గురువు మాత్రమే చెయ్యగలడు. ఈ గురువు ఎవ్వరు, సద్గురువు ఎవ్వరు అనే విషయాలు మనకు సరళంగా తెలియచెప్పే వారు కూడా సద్గురువులే! జీవితం నడుపుకునే రీతి పట్ల అవగాహన పెంచి, అందరి పట్ల మరియు అన్నింటి పట్ల కృతజ్ఞతతో ఉండేటట్టు మన దృక్పధాన్ని మార్చి మన జీవితంలో వెలుగు నిమ్పగలిగేది ఒక్క సద్గురువు మాత్రమే!


మన దేశంలో కొన్ని చోట్ల అదృష్టం కొద్దీ ఈ గురుసాంప్రదాయం దృఢంగా వెలుగుతోంది. అటువంటి గురుసాంప్రదాయాన్ని, మన తెలుగువారికి అందించి, వారి బాగు కోసం మహాత్ములు అంటే ఏమిటో తెలిపి, వారి జీవిత చరిత్రలు అందచేసి, వివిధ సాధనా మార్గాలు అందచేసిన మహనీయులు, సద్గురువులు పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు! మహాత్ములు అంటే ఎవరో, వారు తిరుగాడిన ప్రదేశాలు, వారు దేహం వదిలేసినా కూడా, ఆ దేహాలు ఎంత పవిత్రమో, వాటిని ఎలా పూజించాలో, వారి చరిత్ర పఠన ద్వారా మనకు వచ్చే ప్రయోజనమేంటో, ఇవన్నీ తెలిపి మన జీవితాలలో వెలుగు నింపే ప్రయత్నం చేశారు! 


శిరిడీ సాయినాథుని ఈ యుగావతారమని, ఈ కాలంలో ఎదురయ్యే ప్రతీ సమస్యకు అయన పరిష్కారం చూపారని, అంతటి మహనీయుడు ఈ కాలంలో రాలేదని, అయన సమర్ధ సద్గురువని తెలుపుతూ, 20 సంవత్సరాల పాటు కృషి చేసి, అయన జీవిత చరిత్ర తెలుగువారికి అందించారు! ఈ గ్రంథాన్ని ఎందరో చదివి ఒక అద్భుత గ్రంథమని పేర్కొనడమే కాక, దీనికి సాయినాథుని ఆశీస్సులు ఎలా అందాయో చెప్పారు. ఈ గ్రంథాన్ని ఎంతో మంది తమ కష్టాలు తీరే సాధనగా చేసుకొని, నెమ్మదిగా ఒక నిత్యపారాయణ గ్రంథంగా తమ జీవితాలలో భాగం చేసుకున్నారు!


భగవంతుడే మనపై కరుణతో ఆ సమర్ధ సద్గురుడైన సాయినాథుని మనకు పరిచయం చేయాలని, ఈ కాలంలో, పూజ్య ఆచార్యునిగా మనకు అందించి, ఈ గ్రంథాన్ని వారి ద్వారా అందించి, ఆ గ్రంథానికి తమకు భేదం లేదని కూడా చూపించారు! ఇది అంతా, మనకు ఈ మాత్రమైనా తెలియడం మన పూర్వ జన్మ సుకృతం. ఇప్పటికైనా మన తరువాత తరానికి ఈ జీవిత సత్యాన్ని తెలిపే బాధ్యత మన అందరిదీ. 


పూజ్య ఆచార్యుని ఆరాధన మహోత్సవం (మార్చ్ 28, తిథి ప్రకారం మరియు ఏప్రిల్ 12 తేదీ ప్రకారం) జరుపుకునే వేళ, మన అందరి బాధ్యతగా అందరికీ ఆ సద్గురుని బోధలు పరిచయం చేద్దాం! మన తరువాత తరాన్ని వారి అడుగుజాడల్లో, వారి బోధల మీద అవగాహన పెంచుకుని నడిచేలా చేద్దాం!


జై సాయి మాస్టర్.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹