23, జనవరి 2021, శనివారం

మహర్షులు - 2

 మన మహర్షులు - 2


 *అత్రి మహర్షి* 


🍁🍁🍁🍁🍁


అత్రి మహర్షి సప్తమహర్షులలో ఒకరు.


అత్రి మహర్షి బ్రహ్మదేవుడి మనస్సులోంచి పుట్టాడు. 


అంటే బ్రహ్మమానస పుత్రుడన్నమాట. అలా పుట్టిన అత్రి మహర్షిని బ్రహ్మదేవుఁడు “లోక రక్షణ కోసం నేను కొంతమందిని సృష్టిస్తున్నాను, నువ్వు గొప్ప తపశ్చక్తిని పొంది నాకు ఈ సృష్టికార్యంలో సాయపడాలి" అని అడిగాడు


అందుకు అత్రి మహర్షి సరే! అలాగే సాయపడతానని చెప్పి ఒక మంచి అనుకూలమయిన ప్రదేశాన్ని చూసుకుని తపస్సు ప్రారంభించాడు


ఈ మహర్షి చేసిన ఘోరతపస్సుకి ఆయన కళ్ళల్లోంచి ఒక గొప్ప తేజస్సు బయటికి వచ్చి భూమి, ఆకాశం అన్ని దిక్కులా వ్యాపించి పోయింది. ఆ తేజస్సుని భూమ్యాకాశాలు కూడా భరించలేక పోవడం వల్ల అది సముద్రంలో పడిపోయింది


ఇది బ్రహ్మదేవుడికి తెలిసి ఆయన ఆ తేజస్సుని అత్రిమహర్షికి తేజస్సు యొక్క కొంత అంశతో చంద్రుడు కుమారుడుగా పుడతాడని, క్షీరసాగర మథన సమయంలో మిగిలిన అంశ వచ్చి చంద్రుడిని కలుస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు.


 కొంతకాలం తర్వాత, అత్రి మహర్షికి అనసూయాదేవితో వివాహం జరిగింది. 

. అనసూయాదేవి గొప్ప

పతివ్రతగా వినుతికెక్కింది.


 ఒకనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అనసూయాదేవిని పరీక్షిద్దామని బయలుదేరి అత్రిమహర్షి ఆశ్రమానికి వచ్చారు. 


అత్రి మహర్షి అనసూయాదేవి వారికి ఆతిథ్యం ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పుడు త్రిమూర్తులు మహర్షితో మాకు వడ్డించే స్త్రీ నగ్నంగా వడ్డించాలి

అన్నారు. అనసూయాదేవి అంగీకారంతో అత్రిమహర్షి మీ కోరిక ప్రకారమే అన్నాడు.



త్రిమూర్తులు స్నానం చేసి కూర్చున్నాక అనసూయ వారిమీద మంత్రజలం చల్లి చంటి పిల్లల్లా చేసి నగ్నంగా వడ్డించింది. మళ్ళీ దుస్తులు ధరించి వాళ్ళ ముగ్గుర్ని మంత్రజలంతో మామూలుగా చేసి తినండి అంది. భోజనం తర్వాత మళ్ళీ చంటి పిల్లల్ని చేసి ఉయ్యాలలో వేసింది.


త్రిమూర్తుల్ని వెతుక్కుంటూ సరస్వతి, లక్ష్మి, పార్వతి వచ్చి అనసూయ దగ్గర చంటి పిల్లల్ని చూసి మా భర్తల్ని మాకియ్యమని అడిగి అత్రి అనసూయలను మా ముగ్గురి అంశలతో ముగ్గురు పిల్లలు కలుగుతారని దీవించి తమ భర్తల్ని తీసుకుని వెళ్ళిపోయారు.


ఒకసారి కౌశికుడి భార్య, సూర్యుడు ఉదయించగానే తన భర్త చనిపోతాడని తెలిసి సూర్యుడు ఉదయించకుండా చేసింది. అనసూయాదేవి సూర్యుడు ఉదయించేటట్లు చేసి కౌశికుణ్ణి కూడా బ్రతికించింది.


అత్రి మహర్షి సంతానం కోసం వంద సంవత్సరాలు భార్యతో కలిసి తపస్సు చేశాడు.


అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమై పిల్లలు కలిగేలా వాళ్ళని ఆశీర్వదించారు.


 కొన్నాళ్ళయ్యాక అత్రి మహర్షి  

 అనసూయా దేవికి చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు అనే పేర్లతో ముగ్గురు పిల్లలు పుట్టారు.


సంసారపోషణార్ధం పృథు చక్రవర్తి దగ్గరకు ధనం కోసం వెళ్ళాడు అత్రి మహర్షి.


ఆ సమయంలో పృథుచక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్నాడు. ఆ యాగాశ్వాన్ని రక్షించడానికి తన కుమారుడితో వెళ్ళమని పృథు చక్రవర్తి అత్రి మహర్షిని అడిగాడు. అత్రి మహర్షి సరేనని బయల్దేరాడు.


పృథు చక్రవర్తి వైభవాన్ని చూడలేక ఇంద్రుడు యాగాశ్వాన్ని దాచేశాడు. 


అత్రి మహర్షి తన దివ్యదృష్టితో చూసి ఆ విషయం పృథు చక్రవర్తి కుమారుడికి చెప్పాడు.


 అతడు ఇంద్రుణ్ణి జయించి ఆ యాగాశ్వాన్ని తీసుకుని వచ్చాడు.


అశ్వమేధయాగం పూర్తయ్యాక పృథు చక్రవర్తి ఇచ్చిన ధనం, వస్తువులు మొదలయిన వాటిని తీసుకువెళ్ళి పిల్లలకిచ్చి అత్రి మహర్షి అనసూయా దేవితో కలిసి తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోయాడు.


 ఒప్పుడు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది. అందులో రాహువు వేసిన అస్త్రాలకి సూర్యచంద్రుల్లో వెలుగు తగ్గిపోయి లోకమంతా చీకటయిపోయింది. అప్పుడు

అత్రి మహర్షి తన చూపులతోనే రాక్షసులందర్ని చంపేశాడు.


అత్రి మహర్షి రచించిన ఆత్రేయ ధర్మశాస్త్రంలో దాన ధర్మాలు, జపతపాలు రహస్య పాయశ్చిత్తాలు మొదలయిన వాటి గురించి తెలియచేయబడ్డాయి.


. అలాగే అత్రి సంహితలు అనే గ్రంథాల్లో ఆచారాలు, గురుప్రశంస, చాతుర్వర్ణ ధర్మాలు, జపమాలాపవిత్రత, పుత్రులు దత్తపుత్రులు మొదలయినవాటి గురించి తెలియచేయబడ్డాయి.


దత్తపుత్రుణ్ణి స్వీకరించవచ్చు అనే దాన్ని గురించి మొట్టమొదట ప్రవేశపెట్టింది.

అత్రిమహర్షి......!


చదివారు కదా !... సప్తమహర్షుల్లో ఒకడయిన అత్రి మహర్షి గురించి...


రేపు మరో మహర్షి గురించి తెలుసుకొందాం...


జై శ్రీమన్నారాయణ🙏


🍁🍁🍁🍁

సాధన - 8*

 *సాధన - 8* 


*ఓం పూతాత్మనే నమః* 


అద్భుతమైన శ్రీమహావిష్ణువు మంత్రం ఇది. ఇది అత్యద్భుతమైన కార్యసిద్ధి మంత్రం . "పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణా బాధతే". పూర్వజన్మలో చేసిన పాపం రోగం రూపంలో పీడిస్తుంది. రోగం పోతే కాని కార్యసిద్ధి అవ్వదు. సంపదలు రావు. కాబట్టి, రోగం పోవాలంటే కార్యసిద్ధి అవ్వాలంటే పాపం తొలగాలి. పాపం తొలగితే పుణ్యాత్ముడు  అవుతాడు.

           'పూత ఆత్మ' అంటే పవిత్రమైన ఆత్మ కలవాడు విష్ణువు.శ్రీమన్నారాయణుడు పరమాత్మ, పవిత్ర ఆత్మ స్వరూపుడు.


*మంత్ర ప్రయోగం ఫలితం :* 

ఈ మంత్రాన్ని ప్రతి శనివారం 1000 సార్లు అనుష్ఠానం చేస్తే మీరు చేసిన ఏడు జన్మల పాపాలు పోతాయి. "సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి".  పాపాలు పోతే మీరు అనుకున్నవి అన్ని కార్యాలు సిద్ధి అవుతాయి, సంపదలు వస్తాయి.


           కాబట్టి మీరు 40 శనివారాలు కానీ లేదా 27 శనివారాలు కానీ నియమం పెట్టుకోండి. వీలుంటే 40 శనివారాలు  చేయటం చాలా మంచిది. అంత  ఓపిక లేని వాళ్ళు కనీసం  27 శనివారాలు నియమం పెట్టుకుని, ప్రతి  శనివారం నాడు, ఆడవాళ్ళు అయితే బయట ఉన్నప్పుడు మానేయండి, మగవాళ్ళు మైలు వచ్చినప్పుడు మానేయండి

ఆడవాళ్ళైనా ,మగవాళ్ళైనా అశుచిగా ఉన్నప్పుడు చేయకూడదు.

           శనివారం ఉదయం స్నానం చేసి శనిహోర అని ఉంటుంది 6 గంటల నుంచి ఇంచుమించుగా సూర్యోదయం నుంచి ఒక గంట కాలం శనిహోర ఉంటుంది.  మీకు పంచాంగం లో సూర్యోదయం అని ఉంటుంది 5.30 కి కానీ 6 గంటలకి కానీ అక్కడ నుంచి మొదలు పెట్టి 1000 సార్లు జపం చేయవచ్చు.

           ప్రతి శనివారం ఈ " ఓం పూతాత్మనే నమః" అనే మంత్రాన్ని అనుష్ఠానము చేస్తూ తులసి పత్రాలు లేక మారేడు ఆకులతో శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని పూజించండి. ఆ విగ్రహం రాగిది అయినా వెండిది అయినా ఇత్తడిది అయినా అవ్వచ్చు. చిన్ని విగ్రహాన్ని పూజించండి. 27 శనివారాలు లేదా 40 శనివారాలు ఇలా పూజ చేశాక  ఈ విగ్రహాన్ని ఎవరైనా ఒక మంచి పండితుడికి దానం చేయండి. మీకు తోచిన దక్షిణ  ఇవ్వండి. ఇంత అని నియమం లేదు. దీని వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. కార్యసిద్ధి అవుతుంది అని స్వయంగా దుర్వాస మహర్షి ఇంద్రుడికి చెప్పాడు. 

             ఇంద్రుడు అది చేశాక సామ్రాజ్యం వచ్చింది. అనుకున్న పనులు నెరవేరాలంటే ఎంత క్లిష్టమైన పనైనా సరే ఎంత కష్టమైన ఉద్యోగం రావాలనుకున్నా ఇలా మీరు 40 వారాలు చేసినా లేదా మీరు 27 వారాలు చేసినా మీ భక్తిశ్రద్ధలను బట్టి మీరు అనుకున్న పనులు నెరవేరి తీరుతాయి.అందువల్ల కార్యసిద్ధి శ్రీవిష్ణు మహామంత్రం అని దీనిని దుర్వాసుడు చెప్పాడు. తద్వారా కార్యసిద్ధిని పొందండి.


*సూచన:*

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని,లేనివారు ఓంకారం లేకుం.డా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

జీవితం

 *ఒక మంచి కథ..*


*జీవితం గురించి కథ..సహనం.*


అనగనగా ఒక చెట్టు, పచ్చని ఆకులతో, 

తెల్లటి పూలతో అందంగా ఉండేది.. 

దారిన పోయేవాళ్ళకు ఆ చెట్టు నీడనిచ్చేది, విశ్రాంతినిచ్చేది.. 

ఎంత వైరాగ్యం ఉన్నవాడికైన సరే నిండుగా ఉన్న 

ఆ చెట్టుని చూస్తే చాలు మళ్ళి జీవించాలనే 

ఆశ కలిగేది.


అలా కొన్నాళ్ళు గడిచాక చెడుగాలులు వీయడంతో పూలు రాలిపోయాయి.. 

ఎండకు ఆకులు ఎండిపోయి కొమ్మనుండి వేరైపోయాయి.

చెట్టు బోసిపోయింది.. 

అటుగా వెళ్తున్న వాళ్లందరు చెట్టును జాలి చూపులు చూశారు.

ఇక దీని ఆయుష్షు ఐపోయిందని మాట్లాడుకున్నారు.


అది విన్న ఆ చెట్టు మాత్రం నిరుత్సాహ పడలేదు.

తనకు మళ్ళి గత వైభవం రాకపోతుందా! 

అనే నమ్మకంతో బతుకుతుంది.


కొన్నాళ్ళకి ఒక వర్షపు చుక్క ఆ చెట్టు వేరుపై పడింది. అంతే చెట్టులో చలనం మొదలైంది.. 

కొన్ని లక్షల చినుకులు కలిసి ఆ చెట్టును తడిపేశాయి... కొన్ని రోజులకి ఆకులు చిగురించాయి , 

పువ్వులు వికసించాయి.. 

మళ్ళి పది మందికి నీడనివ్వటం మొదలుపెట్టింది, వాళ్ళకు జీవతం మీద ఆశను కలిగేలా చేసింది... 

ఆ చెట్టు...!


మనిషి జీవితము అంతే...

ఒక్కొక్కసారి కొన్ని 'అనర్ధాల' వల్ల నవ్వులు అనే పూలు మాయమౌతాయి..

కొన్ని అపార్ధాల వల్ల కావాల్సినవాళ్ళే ఎండిపోయిన ఆకులు లా వీడిపోతారు...


అయిన సరే నిరుత్సాహ పడకూడదు.. 

ఏదో రోజు ఆ అనర్ధాలు, అపార్దాలు అనే అడ్డుతెరలు తొలగిపోతాయి..


ఏ నమ్మకంతో నువ్వు ఉదయాన్నే లేస్తావని అలారం పెట్టుకుంటున్నావో.. అదే నమ్మకంతో ఏదో ఒకరోజు 

నీ జీవితం నువ్వు కోరుకున్న విధంగా మారుతుంది 

అని గట్టిగా నమ్ము...

అలా జరగాలంటే నీకు కావాల్సిందల్లా ఓర్పు, సహనం..


గొంగలి పురుగు ఒక్క రాత్రిలోనే సీతాకోక చిలుకగా మారలేదు అన్న నిజం నువ్వు గ్రహించాలి.

కాలం పెట్టిన సహన పరిక్షలో నువ్వే నెగ్గాలి..


ఎందుకంటే మంచి విషయాలు అంత తేలికగా 

పూర్తి కావు.. కాబట్టి నీ కర్తవ్యాన్ని పూర్తి చేసి, 

సహనానికి ఆశ్రయం ఇవ్వు... బద్ధకానికి కాదు.

గుర్తుంచుకో.


నువ్వు త్వరగా లేచినంత మాత్రాన సూర్యుడు 

ముందుగా ఉదయించడు., 

దానికి సమయం రావాలి..మనకు సహనం ఉండాలి...!

Gaanam