23, జనవరి 2021, శనివారం

సాధన - 8*

 *సాధన - 8* 


*ఓం పూతాత్మనే నమః* 


అద్భుతమైన శ్రీమహావిష్ణువు మంత్రం ఇది. ఇది అత్యద్భుతమైన కార్యసిద్ధి మంత్రం . "పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణా బాధతే". పూర్వజన్మలో చేసిన పాపం రోగం రూపంలో పీడిస్తుంది. రోగం పోతే కాని కార్యసిద్ధి అవ్వదు. సంపదలు రావు. కాబట్టి, రోగం పోవాలంటే కార్యసిద్ధి అవ్వాలంటే పాపం తొలగాలి. పాపం తొలగితే పుణ్యాత్ముడు  అవుతాడు.

           'పూత ఆత్మ' అంటే పవిత్రమైన ఆత్మ కలవాడు విష్ణువు.శ్రీమన్నారాయణుడు పరమాత్మ, పవిత్ర ఆత్మ స్వరూపుడు.


*మంత్ర ప్రయోగం ఫలితం :* 

ఈ మంత్రాన్ని ప్రతి శనివారం 1000 సార్లు అనుష్ఠానం చేస్తే మీరు చేసిన ఏడు జన్మల పాపాలు పోతాయి. "సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి".  పాపాలు పోతే మీరు అనుకున్నవి అన్ని కార్యాలు సిద్ధి అవుతాయి, సంపదలు వస్తాయి.


           కాబట్టి మీరు 40 శనివారాలు కానీ లేదా 27 శనివారాలు కానీ నియమం పెట్టుకోండి. వీలుంటే 40 శనివారాలు  చేయటం చాలా మంచిది. అంత  ఓపిక లేని వాళ్ళు కనీసం  27 శనివారాలు నియమం పెట్టుకుని, ప్రతి  శనివారం నాడు, ఆడవాళ్ళు అయితే బయట ఉన్నప్పుడు మానేయండి, మగవాళ్ళు మైలు వచ్చినప్పుడు మానేయండి

ఆడవాళ్ళైనా ,మగవాళ్ళైనా అశుచిగా ఉన్నప్పుడు చేయకూడదు.

           శనివారం ఉదయం స్నానం చేసి శనిహోర అని ఉంటుంది 6 గంటల నుంచి ఇంచుమించుగా సూర్యోదయం నుంచి ఒక గంట కాలం శనిహోర ఉంటుంది.  మీకు పంచాంగం లో సూర్యోదయం అని ఉంటుంది 5.30 కి కానీ 6 గంటలకి కానీ అక్కడ నుంచి మొదలు పెట్టి 1000 సార్లు జపం చేయవచ్చు.

           ప్రతి శనివారం ఈ " ఓం పూతాత్మనే నమః" అనే మంత్రాన్ని అనుష్ఠానము చేస్తూ తులసి పత్రాలు లేక మారేడు ఆకులతో శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని పూజించండి. ఆ విగ్రహం రాగిది అయినా వెండిది అయినా ఇత్తడిది అయినా అవ్వచ్చు. చిన్ని విగ్రహాన్ని పూజించండి. 27 శనివారాలు లేదా 40 శనివారాలు ఇలా పూజ చేశాక  ఈ విగ్రహాన్ని ఎవరైనా ఒక మంచి పండితుడికి దానం చేయండి. మీకు తోచిన దక్షిణ  ఇవ్వండి. ఇంత అని నియమం లేదు. దీని వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. కార్యసిద్ధి అవుతుంది అని స్వయంగా దుర్వాస మహర్షి ఇంద్రుడికి చెప్పాడు. 

             ఇంద్రుడు అది చేశాక సామ్రాజ్యం వచ్చింది. అనుకున్న పనులు నెరవేరాలంటే ఎంత క్లిష్టమైన పనైనా సరే ఎంత కష్టమైన ఉద్యోగం రావాలనుకున్నా ఇలా మీరు 40 వారాలు చేసినా లేదా మీరు 27 వారాలు చేసినా మీ భక్తిశ్రద్ధలను బట్టి మీరు అనుకున్న పనులు నెరవేరి తీరుతాయి.అందువల్ల కార్యసిద్ధి శ్రీవిష్ణు మహామంత్రం అని దీనిని దుర్వాసుడు చెప్పాడు. తద్వారా కార్యసిద్ధిని పొందండి.


*సూచన:*

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని,లేనివారు ఓంకారం లేకుం.డా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

కామెంట్‌లు లేవు: