8, సెప్టెంబర్ 2024, ఆదివారం

మహర్షులు

 🔔 *మన ఋషులు* 🔔


108 మహర్షులు

——————————

1)కశ్యప 2)అత్రి 3)భరద్వాజ 4)విశ్వామిత్ర 5)గౌతమ 6)జమదగ్ని

7)వశిష్ట

8)అగస్త్య 9)అరణ్యక 10)అష్టావక్ర 11)అర్వావసువు 12)అస్టిక 13)అంగీరస 14)అరుణి 15)ఉద్ధాలక 16)ఉదంక 17)ఉపమన్యు 18)ఉతథ్య 19)రురు 20)రోమశ 21)రైభ్య 22)ఋచీక 23)ఋభు 24)ఋష్యశృంగ 25)ఔరవ 26)బకదాల్భ్య 27)బృహస్పతి 28)ఋృగు 29)కచ 30)కణ్వ 31)కండు 32)కర్దమ 33)కాశ్యప 34)కపిల 35)కాత్యాయన 36)కామందక 37)కతువు 38)కౌశిక 39)గర్గ 40)గృత్సమద 41)గౌరముఖ 42)చ్యవన 43)జడ 44)జరత్కప 45)జాబాలి 46)జైగీషవ్య 47)జైమిని 48)తండి 49)దధీచి 50)దక్ష 51)దత్తాత్రేయ 52)దీర్ఘతమ 53)దూర్వాసో 54)దేవల 55)దేవద్యుతి 56)ధౌమ్య 57)నరనారాయణ 58)నారద 59)నిదాఘ 60)నచికేతు 61)పరాశర 62)పరశురామ 63)పిప్పలాద 64)పులస్త్య 65)పైల 66)పృథు 67)మరీచి 68)మతంగ 69)మంకణ 70)మాండవ్య 71)మార్కండేయ 72)మాణక్యవాచకర్ 73)మైత్రేయ 74)మృతండు 75)ముద్గల 76)యాజ్ఞవల్క్య 77)లోమశ 78)వామదేవ 79)వాల్మీకి 80)వాత్స్యాయన 81)విపుల 82)విశ్రవస 83)విభాండక 84)వ్యాస 85)వ్యాఘ్రపాద 86)వైశంపాయన 87)సహస్రపాద 88)సనక,సనందన,సనత్కుమార,

సనత్సుజాత

89)సంవర్త 90)సాందీపని 91)సారస్వత 92)సూత 93)స్థూలకేశ 94)సౌభరి 95)శక్తి 96)శృంగి 97)శరభంగు 98)శతానంద 99)శమీక 100)శాండిల్య 101)శంఖు 102)లిఖిత 103)శిలాద 104)శుక 105)శుక్ర 106)శ్వేతకేతు 107)శౌనక 108)హరీత


https://youtube.com/shorts/S9TETEfDb5U?feature=share


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

Panchaag

 


మహాదర్శనము " --తొమ్మిదవ భాగము

 9. " మహాదర్శనము " --తొమ్మిదవ భాగము--అపరిగ్రాహి


తొమ్మిదవ భాగము  ---అపరిగ్రాహి 


        పాపడికి రెండు నెలలు నిండినాయి . ఆ రెండు నెలలలో రెండుసార్లు తొట్టిలు మార్చవలసి వచ్చింది . ఆలంబినికీ , జాయంతికీ , బిడ్డ అలాగ పెరుగుతున్నది చూసి చాలా సంతోషము . దేవరాతుడు కన్నారా చూస్తున్నాడు కాబట్టి నమ్మక తప్పలేదు . 


         రెండు నెలలు నిండి రెండు మూడు దినములయి ఉంటుంది . బుడిలుడు ’ ఆచార్యా ’ అంటూ వచ్చినాడు . దేవరాతుడు బయటికి ఎక్కడికో  వెళ్ళవలెను అని సిద్ధమవుతున్నవాడు , అతని గొంతు విని , ’ దయ చేయండి ’ అని వాకిలి దగ్గరకు వచ్చి లోపలికి పిలుచుకొని పోయినాడు . దేవరాతుడు అంచులు మడతలు పోకుండా అందముగా , పద్దతిగా కట్టుకొన్న ధోవతిని చూచి బుడిలుడు , " దీనికే కదటయ్యా మేమంతా నిన్ను అంతగా మెచ్చుకొనేది ! భలే , ఎంతబాగా ధోవతి కట్టుకున్నావు ! సరే , ఎక్కడికైనా కార్యార్థివై వెళుతున్నావా ? నేను ఒంటి బ్రాహ్మణుడను ఎదురు వచ్చినట్లాయె కదా " అన్నాడు . 


         ఆచార్యుడు నవ్వుతూ , " మీరే అలాగన్న ఎలాగు ? మీరే కదా చెపుతారు , " సర్వే దేవా వేదవిది బ్రాహ్మణే ప్రతివసంతి "  దేవతలందరూ వేదవిదుడైన బ్రాహ్మణునిలో ఉంటారు అని ! అలాగైనపుడు మీరు ఒంటి అనుట ఎలాగు ? " అన్నాడు . 


        బుడిలుడు నవ్వి అన్నాడు , " ఇదే చూడు మాయ అనేది ! మనకు తెలిసిన విషయమును మూసి , వేరొకదాన్ని పలికిస్తుంది కదా అది ! మంచిది , నావలన నీ కార్యమునకు తొందరేమీ కాలేదు కదా ? " 


        " ఏమీ లేదు , భార్గవులు ఎందుకో పిలిచినారు . తరువాత కూడా వెళ్ళవచ్చును . వెళ్ళకున్నా ఫరవాలేదు . మీరు వచ్చినారంటే నాకు మిగిలినవేవీ గణ్యములు కావు . " 


" అయితే సరే , నేను వచ్చినది ఒక విచిత్రమైన పని మీద . నీ భార్యకు పురిటి నెల గడిచింది కదా ? " 


" అప్పుడే గడచిపోయింది , గడచి ఒక నెల అవుతున్నది . " 


" మంచిదైంది , నేను పాపడిని చూడవలెను , అందుకే వచ్చినాను " 


" ఆమే ఎత్తుకొని రావచ్చునా లేక తమరే ఒక అడుగు అక్కడికి దయచేసెదరా ? " 


        " ఇంకెవరైనా అయిఉంటే , ఇక్కడికే రానిమ్ము అనేవాడిని , అయితే , ఆ పొద్దు చూచిన దృశ్యము మరచునట్లు లేదు . అందువలన , యే మహానుభావుడో మీ ఇంటికి వచ్చినాక , మేము అక్కడికి వెళ్ళుటయే సరి , అది సరేగానీ ఇదేమో చూచినావా ? " 


        బుడిలుడు నడుముకు కట్టుకున్న ఒక చిన్న డబ్బీ తీసినాడు . దానిలో యజ్ఞేశ్వరుని ప్రసాదమైన విభూతీ , ఒక తమలపాకులో రక్షా ఉన్నాయి . 


       " అతని దర్శనమునకు వెళ్ళునపుడు రిక్త హస్తాలతో వెళ్ళకూడదు అని తెచ్చినాను . మీ ఇంట్లో లేనిది తెచ్చినాను అన్న అహంకారము కాదులేవయ్యా !  ! " 


      " సరే పోయింది , మీరందరూ ఆశీర్వాదము చేయవలసిన బుడం కాయ వాడు . మాకందరికీ ఆచార్య స్థానము లో నున్న మీరే ఇలాగంటే ఇంకెటులో ? " 


       " అట్లు కాదయ్యా , ఆ శిశువు దేహము చిన్నదైనా గొప్ప ఆత్మ . మనము దానిని మరచిపోరాదు . అది , యే యే ప్రభావముల చేత , యేయే సిద్ధులతో పుట్టిందో మనకేమి తెలుసు ? " 


       దేవరాతునికి అవుననిపించినది . భార్యకు ఏకాంతములో ఈ సంగతి చెప్పవలెను అనిపించినది . ఆ భావముతో బుడిలుడి సిద్ధాంతమును ఒప్పుకుంటూ , " మీరే అంటిరి కదా , ఉన్నమాటని మాయ మరపిస్తుంది అని , నాకూ అదే జరిగింది . ఇకపైన జాగరూకతగా ఉంటే సరి . రండి , వెళదాము " అన్నాడు . 


" వీధిలో నడచి వచ్చినాను . ఒక చెంబెడు నీరు తెప్పించు . కాళ్ళు కడుక్కొని వస్తాను . " 


       బుడిలుడు వద్దన్ననూ ఆచార్యుడు వదలక , తానే కాళ్ళుకడిగి తుడిచినాడు . ఇద్దరూ పాపడిని చూచుటకు వెళ్ళినారు . వీరు వస్తున్నది చూచి ఆలంబిని చెరుగు సరిగ్గా కప్పుకున్నది . కూతురితో ఏమో మాట్లాడుతున్న జాయంతి లేచి వెళ్ళి తెర వెనుక నిలచింది . 


        బుడిలుడు వచ్చి ఉయ్యాలలోని పాపడిని చూసినాడు . ఎవరో తెలిసినవారిని చూసినట్లే సంతోషపడి , " ఆచార్యా , సందేహమే లేదు , నేను ఆ దినము , సీమంతము నాడు చూసిన ముఖము ఇదేనయ్యా , ఆవగింజంత కూడా వ్యత్యాసము లేదు . " అని వేదమంత్రముతో ఆశీర్వదించి , రక్షనూ , విభూతినీ తల్లి చేతికిచ్చి , " దీనిని పాపడి ఉయ్యాలలో ఉంచమ్మా , మొత్తానికి  వీర పత్నివై , వీరమాతవు కూడా అయినావు . ఈ దేహమును చూస్తే , నీ కొడుకు ఒక పెద్ద మర్రి వృక్షమువంటి వాడగుటలో ఆశ్చర్యము లేదు . నీ కడుపున పుట్టి కాయోన్నతి ని పొందినాడు . ఇక మానోన్నతి , విద్యోన్నతులను సంపాదించి ఇవ్వటము మీ దంపతుల ధర్మము . " అని మరలా ఒకసారి ఆశీర్వదించినాడు . 


       దేవరాతునికి , వృద్ధ బుడిలుడు కొడుకును మెచ్చుకొన్నాడని గొప్ప సంతోషమైనది . వెనుతిరిగి బయటికి వస్తూ బుడిలుడు , " ఏమయ్యా , రాజపుత్రులకు కూడా దొరకని దేహము కదా అది , బహు సంతోషమయినది " అని మరలా అన్నాడు . దేవరాతుడు , " యజుర్వేదుల ఇంట పుట్టినాడు , మాది ఎంతైనా ఆధ్వర్యము కదా ! దానికి తగ్గట్టు గట్టిగా ఉండవలెనా లేదా " అని నవ్వినాడు .


      బుడిలుడు చటుక్కున వెనక్కు తిరిగి , " వీడు కేవలము శ్రౌత విద్యా సంపన్నుడగు పాపడు కాదు , ఆ సౌందర్యము చూస్తే , కర్మ బ్రహ్మలు రెండింటికీ అధికారియగునట్లు కనపడుతున్నాడు . ఏమైనా కానీ  వాడిని అపరిగ్రాహిగా చేయి " అన్నాడు .


" అపరిగ్రాహిని చేయుట ఎలాగ ? " 


       " అదేమి పెద్ద విషయము ? అన్యాయార్జితమైన విత్తము వద్దన్న చాలు . గురువు గారని వచ్చి తీసుకోండి అని గురు దక్షిణ ఇచ్చినా , ’ నువ్వు ఉద్ధారమైనావు అని నమ్మకము వచ్చు వరకూ నేనుతీసుకోను ’ అంటే సరి . నీ చూపు చూస్తుంటే , ’ అలాగన్న , కుటుంబ భరణమునకు ఏమి గతి ? ’ అనేవాడిలా ఉన్నావు . చూడు , మొదటిది , మనుష్యుని మనసు ఎల్లపుడూ అర్థ కామముల వైపుకే తిరుగుతుంటుంది . రెండోది , బిడ్డ పుట్టుటకు ముందు తల్లికి స్తన్యము ఉండునట్లే , వారివారిని కాపాడుతూ , వారివారిచేత వారివారికి తగ్గ పనులు చేయించు ప్రారబ్ధము ఒకటుందనే సంగతిని మనము మరచినాము . కాబట్టి అపరిగ్రహము కష్టమేమీ కాదు . అపరిగ్రహము లేనివాడికి మానోన్నతి ఎక్కడిది ? మానోన్నతి లేనివాడికి విద్యోన్నతి ఎక్కడిది ? కాబట్టి మొదట అపరిగ్రహమును నేర్పించు . నేను చెప్పింది మనసుకు ఎక్కిందా ? " 


       దేవరాతుడు ఒప్పుకున్నాడు .అతని మనసుకు అర్థమైనది , " కొడుకుకు చిన్నవాటికి ఆశ పడకుండునట్లు నేర్పించవలెను . ఏమితీసుకున్నా , కార్యాంతములో దక్షిణా రూపముగా రావలెనే తప్ప , మధ్యలోనే ఆశపోతు వలె చేయి చాచరాదు . "... ’ అది సరియే కదా ’ అనిపించి , ఆచార్యుడు బుడిలుడి మాట ఒప్పుకున్నాడు . 


       బుడిలుడు ఇంకొంత సేపుండి , బిడ్డడి భవిష్యత్తు గురించి మాట్లాడి , వెళ్ళిపోయినాడు . దేవరాతుడు కూడా అతడిని పంపించివేసి , వెళ్ళి భార్గవుడిని చూచుకొని వచ్చినాడు .

అపుత్రస్య గతిర్నాస్తి

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

        *అపుత్రస్య గతిర్నాస్తి :*

*మధ్వాచార్యుల తాత్పర్య నిర్ణయం*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*పిల్లలు లేని వారికి పున్నామ నరక ప్రాప్తి అని అందరూ అంటుంటారు. వంశోద్ధారం చేసే కొడుకు లేకపోతే తమ గతేమిటి అని, పితృకార్యాలు ఆగిపోతాయని వ్యధ పడుతూ ఉంటారు. దీనికి సంబంధించి భాగవతాది గ్రంధాలు ఏమి చెబుతున్నాయి. శాస్త్ర నిర్ణయం ఏమిటి, వ్యాసుని మనోభావం ఏమిటి అన్న విషయం శ్రీ మధ్వాచార్యులు శ్రీమహాభారత తాత్పర్య నిర్ణయంలో విశదీకరిస్తారు.*


*పిల్లలు లేకపోతే నరకం అన్నది నిజం కాదు. వేదోక్త కర్మలు చేసేవారు, జ్ఞాన సంపాదన చేసేవారు ధార్మికంగా బతికి శాస్త్రోక్త పద్ధతిలో విధి నిషేధాలు పాటిస్తూ సాధన చేసేవారూ, పిల్లలున్నా, లేకున్నా వారి వారి సత్కర్మల వాళ్ళ ఉద్ధారం అవుతారు.*


*పాపులు, దుష్కర్మలు చేసినవారు, వారికి పుణ్యం లేకపోతే వారి పిల్లల పుణ్యంతోనో, వారి పిల్లలు ఇచ్చిన ధర్మోదకాలతోనో, శ్రాద్ధ కర్మలతోనో, పిండ ప్రదానాలతోనో ఉద్ధారం అయ్యే అవకాశం వుంది. అంతే తప్ప పిల్లలు లేరని నరకం లేదు.*


*మనకు భగవద్భక్తి లేక సాధన చేయకపోతే దానికి తోడు పితరుల సద్గతి కోసం పాటుపడే పిల్లలు లేకపోతే నరకమే.*


*తన జ్ఞానం వల్లనే తను చేసిన విహిత కార్యాల వల్లనే సాధన వల్లనే సద్గతి- అదే శాస్త్రం.*


*శాస్త్రం 12 రకాల పుత్రుల గురించి చర్చిస్తుంది. పుత్రులు ఆరు రకాలు. 1. ఔరసుడు, 2. దత్తకుడు, 3. కృత్రిముడు, 4. గూఢోత్పన్నుడు, 5. అపవిధ్ధుడు, 6. క్షేత్రజుడు. వీరికి రాజ్యములో కాని ఆస్తిలో కాని భాగం ఉంటుంది.*


*ఇంకొక రకమైన పుత్రులు ఆరుగురు ఉన్నారు. వారు 1. కానీనుడు, 2. సహోఢుడు, 3. క్రీతుడు, 4. పౌనర్భవుడు, 5. స్వయందత్తుడు, 6. జ్ఞాతుడు. వీరు కూడా పుత్ర సమానులే కాని, వీరికి రాజ్యాధికారము కాని, ఆస్తిలో భాగము కాని లేదు.*


*మనుమడు, కూతురు కొడుకు కూడా పుత్రుల లెక్కలోకి వస్తారు.*


*అందుకే మన తర్పణ విధులలో ఇటు తండ్రి వైపు మూడు తరాల వారికి, అటు తల్లి వైపు మూడు తరాల వారికి పిండాలు పెడతాము, తర్పణాలు వదులుతాము. కాబట్టి ఒకరికి కొడుకు లేదు అని బాధ పడవలదు. యోగ్యులైన కూతురు కొడుకులు తర్పణాలు విడిచినా అవి ఆ తండ్రికి అందుతాయి.*


*కొడుకుల్ పుట్ట రటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై*


*కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్*


*వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్!*


*చెడునే మోక్షపదం మపుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!*


*శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు అవివేకులు ఈ ప్రాపంచిక జీవనమును జీవనప్రవృత్తిననుసరించి ఆలోచింతురు. తమకు పరలోకమున ఉత్తమగతులు లభించుటకు పుత్రులు కావలయుననుకొందరు. తమకు పుత్రులు కలగనివారు అయ్యో మాకు పుత్రులు కలుగలేదు, మాకు ఎట్లు ఉత్తమగతులు కలుగును అని ఏడ్చుచుందురు. కౌరవ రాజగు ధృతరాష్ట్రునకు నూరుమంది పుత్రులు కలిగినను వారి మూలమున అతడు ఏ ఉత్తమలోకములు పొందగలిగెను? బ్రహ్మచారిగనే యుండి సంతతియే లేకున్న శుకునకు దుర్గతి ఏమయిన కలిగెనా? కనుక పుత్రులు లేనివానికి మోక్షపదము లభించక పోదు. పుత్రులు కలవారికి ఉత్తమగతులు కాని మోక్షము కాని సిధ్ధించక పోవచ్చును. పుత్రులు లేనివరికిని అవి రెండును సిద్దించను వచ్చును.*


*కావున కొడుకులు లేరు అని ఎవరూ బాధ పడవలదు. మన పుణ్యం మనం సంపాదించుకోవాలి. మన ఉద్ధారం కోసం మనమే పాటు పడాలి. మనకు ఆ ఈశ్వర కటాక్షంతో  ఉత్తమసాధన చేసే అవకాశం సద్వినియోగమై మనం  ఉత్తమగతులు సాధించుగాక.*


*ఓం నమః శివాయ।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

దగ్గులు హరించుటకు

 దగ్గులు హరించుటకు సులభ యోగాలు - 


 * దానిమ్మ కాయ పెచ్చులను వేయించి చూర్ణం చేసుకుని పూటకు 5 గ్రాముల చూర్ణం తేనెతో తీసుకొనుచున్న కోరింత దగ్గు తగ్గిపోవును . 


 * శుద్ధిచేసిన కొబ్బరి నూనె పూటకు 10ml చొప్పున తీసుకొనుచున్న కోరింత దగ్గు తగ్గిపోవును . 


 * మర్రిచెట్టు పైన బెరడు తెచ్చి నీడన అరబెట్టి చూర్ణం చేసి ఆ చూర్ణం 20 గ్రాములు పావు లీటర్ నీటిలో వేసి కాచి వడపోసుకొని అందులో పాలు మరియు పంచదార కలుపుకుని తాగుచుండిన యెడల 3 నుంచి 5 దినములలో దగ్గు తగ్గిపోవును .


 * పిప్పిలి గింజను ఆముదపు దీపమున కాల్చి తమలపాకు కు కొంచం తేనె రాసి ఆ తమలపాకులో ఈ కాల్చిన పిప్పిలి గింజని పెట్టి నమిలి మింగుచున్న యెడల దగ్గులు నయం అగును.


 * తులసి పువ్వులను అల్లపు రసంతో మర్దించి శనగల వలే మాత్రలను చేయవలెను పూటకి ఒక మాత్ర చొప్పున మంచినీటితో సేవించిన దగ్గులు తగ్గిపోవును . 


       పైన సూచించిన యోగాలలో మీకు సులభమైన యోగాన్ని ఎంచుకుని సమస్య నివారణ చేసుకోవచ్చు .


                  మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

ఉపవాసం చేయడం

 ఉపవాసం చేయడం వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు - 


 * జీర్ణక్రియ - 


      జీర్ణావయవాలకు మంచి విశ్రాంతి లభించును . అజీర్ణము తొలగించి ఆకలి వృద్ది అగును. 


 * మలాశయం - 


       మలాశయంలోని మురికి బహిష్కరించబడి అజీర్ణం తొలగును . క్రిములను , బ్యాక్టీరియాలను నాశనం చేయును . 


 * మూత్రపిండములు - 


       మూత్రపిండములలోని విషపదార్ధములు , రాళ్లు బయటకి వెడలును . 


 * ఊపిరితిత్తులు - 


        ఉపిరితిత్తులోని నంజు , నీరు బహిష్కరించబడి ఆయాసము నివారించును . శ్వాసక్రియ చక్కగా జరుగును . 


 * గుండె - 


       గుండె చుట్టు , లోపల చేరిన కొవ్వు , నీరు తగ్గి గుండె చక్కగా కొట్టుకొనును . అధికంగా తినడం వలన రక్తంలో కొలెస్టరాల్ ఎక్కువ అయ్యి గుండెజబ్బులు వచ్చును . 


  * లివర్ , స్ప్లీన్ - 


        ఆహారం జీర్ణం అగుటకు ఇవి ముఖ్యముగా పనిచేయవలెను . ఉపవాసం చేయుట వలన వీటికి విశ్రాంతి దొరుకును . వాటిలో మాలిన్యాలు తొలగించబడి జీర్ణక్రియ వృద్ధిచెందును . 


 * రక్తప్రసరణ - 


       రక్తదోషములు నివారణ జరుగును. ఉపవాసం వలన రక్తప్రసారం చురుకుగా జరుగును. కావున తిమ్మిర్లు , మంటలు , నొప్పులు నివారణ అగును. 


 * కీళ్లు - 


        కీళ్లలో పేరుకుపోయిన కొవ్వు , నీరు , మాంసం , ఇతర మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ అగును. 


 * నాడి మండలము - 


        ఉపవాసం వలన నాడీ మండలం శుద్ది జరిగి వ్యాధి నివారణ జరుగును. 


 * జ్ఞానేంద్రియములు - 


        జ్ఞానేంద్రియాలలోని మాలిన్యములు కూడా నివారణ అగును. 


 * చర్మము -  


        చర్మము కాంతివంతం అగును. చర్మవ్యాధులు హరించును . శరీరానికి చక్కని రంగు వచ్చును . 


 * మనస్సు - 


        మనస్సు నిర్మలం అగును. కోపతాపములు నివారించును . ఆధ్యాత్మిక చింతనకు పునాదులు ఏర్పడును . 


        పైన చెప్పినవే కాకుండా మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి . దురభ్యాసాలను విడుచుటకు ఉపవాసం మిక్కిలి ఉపయోగపడును. ఉపవాసం అనగా ఆహారం తీసుకోకపోవడం ఉపవాసం కాదు. ఉపవాసానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటి గురించి తరవాతి పోస్టులలో వివరిస్తాను . 


  

      మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

మహా దర్శనము--ఎనిమిదవ భాగము

 8. " మహా దర్శనము--ఎనిమిదవ భాగము --సందడే సందడి


8. ఎనిమిదవ భాగము--- సందడే సందడి 


        " జాత కర్మ అనునది ఒక వైదీక కర్మ . దానికి లౌకిక అంటు సోకకూడదు . " అని దేవరాతుని హఠము . అయితే రాజ భవనము దానికి ఒప్పుకోలేదు . ’ వంశభూషణుడైన కొడుకు పుట్టినాడు . కాబట్టి దిగ్దిగంతాలకూ ఈ సమాచారము వ్యాపించవలెను ’ అని వారి వాదము . అంతేగాక , దేవరాతుని పై తన ప్రభావమును చూపి అతనిని రాజభవనపు సలహాను అంగీకరించునట్లు చేయవలెనని భార్గవుని ప్రయత్నములు . ఆ మిథిలా నగరములో భార్గవుని మాటను తిరస్కరించినది ఒక్కరే ఒక్కరు , వారే ఆ వృద్ధ బుడిలులు . " వారిని వదిలేయండి , తాము అపరిగ్రాహులు , ఇతరులు కూడా అపరిగ్రాహులుగా ఉండాలనే వారి ఆశ " అని చాలామంది మూతులూ ముక్కులూ ముడుచుకునేవారే . 


        మొత్తానికి జాతకర్మ రాజవాడలో జరుగు కర్మ వలెనే నడచింది . ఒక బండెడు చక్కెర పంచినారు . రాజాస్థానపు జ్యోతిష్యులే వచ్చి జాతకమును రాసినారు . వారికి అంతులేని ఆశ్చర్యము , ’ ఆచార్యులవారూ , నేనింతవరకూ ఇట్టి శుభ జాతకమును చూచియుండలేదు . తులా లగ్నము , చతుర్థములో కుజుడు ఉఛ్చములో ఉన్నాడు . దశమములో గురువు ఉఛ్చ. , ద్వితీయములో రవి ఉండుట చూస్తే , ఇతడు వంశభూషణుడే కాదు , లోకవిభూషణుడగుటలో సందేహమే లేదు . ఇతనికి ఎదురుమాట్లాడి నెగ్గగలవారే లేరు . " అని ఎన్నోవిధములుగా పొగిడినారు . ఆదినము పుత్రోత్సవమని ఆచార్యుడు రెండు మూటల చక్కెరను తెప్పించినాడు . ఆస్థానమునుండీ మూడు మూటల చక్కెర వచ్చినది . ఐదు మూటల చక్కెరనూ పంచినారు . 


        నామకరణపు దినము కూడా అటులే అయినది . లోకభూషణుడగు వాడు పుట్టినాడన్న తర్వాత మహారాజుకు అభిమానము ఇనుమడించినది . ఒక నూరు బళ్ళ బియ్యమును సోపస్కరము ( ఇతర సంభారములు ) తోపాటు పంపినారు . దానిలో మిగిలించుకోవలెనను ఆలోచనకూడా లేక ఆచార్యుడు తన ఇంటిలో నిండిన బియ్యము , పప్పులను వాటితో చేర్చినాడు . వైదీక కర్మ ముగిసేవేళకు మధ్యాహ్నమయినది . మొదట పుణ్యాహ వాచనము , భూమినుండీ ఎప్పుడూ పైకి లేచు ఆఘాహ శక్తులను కడిగివేసి , పైనుండీ దిగు పుణ్యాహ శక్తులు అంతటా వ్యాపించునట్లు చేయుటయే పుణ్యాహపు ఉద్దేశము . ఆ ఉద్దేశము నెరవేరినట్లు వచ్చిన వారందరికీ తెలియునట్లు ఎక్కడెక్కడ చూచినా ప్రసన్నత నిండిపోయినది . నవగ్రహ హోమము , ఆయుష్య హోమములూ నడచినవి . నవగ్రహములు ప్రసన్నులై వచ్చి ఆహుతిని తీసుకొని పోవుటను అక్కడ జ్ఞాన చక్షువులున్న వారందరూ చూచి ’ వల్లె వల్లె ’ అన్నారు . ఆయుష్య హోమకాలములో అగ్ని ప్రసన్నుడై జ్వాలామాలా పరిశోభితుడైనను , శాంతుడై ప్రదక్షిణాకారముగా సంచరిస్తూ హవ్యమును స్వీకరించినాడు . హోమమునకు వచ్చిన ఋత్విజులు ’ మేము ఇంతవరకూ ఎన్నో హోమములు చేసినాము , కానీ యజ్ఞేశ్వరుడు ఇంతగా ప్రసన్నుడగుటను ఎక్కడా చూడలేదు . పొగ యనునదే లేదు , భలే , భలే ! చూడబోతే ఈ పిల్లవాడు దేవకార్యార్థియై జనించినట్లున్నది . ’ అని పాపడిని పొగడినారు . కొందరు ఇతరులు ’ మీరు సరిగ్గా చూడండి , అక్కడ కూర్చున్నది ఎవరు ? సాక్షాత్ ’ యజ్ఞవల్క్య ’ పేరున్న దేవరాతుడు . వారు ఆచార్యులు కూడా ! వారు ఎన్ని యాగములలో అధ్వర్యులై యజ్ఞేశ్వరుని , దేవతలనూ మెప్పించినారో ! వారే యజమానులై కూర్చున్నపుడు ఇలాగయగుట అదేమి ఆశ్చర్యము ? " అన్నారు . 


      తరువాత పితృ పూజారూపమైన ’ నాందీ ’ యజ్ఞము నెరవేరినది . పుత్రుడికి దేవరాతుడు ’ యాజ్ఞవల్క్యుడు ’ అనియే పేరు పెట్టినాడు . అక్కడికి వచ్చిన కులపతి వైశంపాయనుడు , ఉద్ధాలకుని ముఖమును చూచినాడు . అతడు ముసి ముసిగా నవ్వుచూ , ’ " ఈ శిశువు బ్రహ్మ జ్ఞానియై , కర్మత్యాగము చేయునని ఆచార్యులకు బెదురు . దానివలన , ఈ పేరుంటే ఎల్లపుడూ అతనికి తాను కర్మఠ వంశపు వాడిని యని గుర్తుండవలెనని ఆచార్యుల అభిమతము . కానివ్వండి , ఇంటిలో ఎలాగైనా వేరే పేరుతోనే కదా పిలుస్తారు ! " అన్నాడు . వైశంపాయనులు తలయూపి , సత్యము అన్నారు . మొత్తానికి మాధ్యాహ్నికపు వేళకు వైదిక కర్మ అంతా ముగిసినది . 


        ఆచార్యుల ఇంటి వెనకే ఒక పెద్దతోట ! దానిలో విస్తరించియున్న ఒక తటాకము . ఆ తటాకము పక్కనే విశాలముగా పాకశాలను కట్టినారు . " వంట అంతా సిద్ధముగానున్నది . అందరూ మాధ్యాహ్నికమునకు లేవ వచ్చును " అని వంటవారు వచ్చి అందరినీ హెచ్చరించినారు . త్రికాల స్నానము చేయువారు స్నానమునకు సిద్ధమైనారు . మిగిలిన వారు తమ తమ కర్మలలో ప్రవృత్తులైనారు . 


         అక్కడున్న వృద్ధులలో ఒకరికి ఒక ఆలోచన వచ్చింది , " కార్తీక మాసము వనభోజనము. ఉసిరి చెట్టు కూడా ఉంది , ఒక ధాత్రీ హవనము ఏల చేయరాదు ? " అనిపించి ఆచార్యులను వెదకికొని పోయి తమ సలహాను వారి ముందుంచినారు . వారు , " మంచి ఆలోచన , గృహ శౌచము కూడా గడచినది , ఎందుకు చేయరాదు ? అయినా ఇద్దరు కులపతులు వచ్చినారు , వారినొకసారి అడిగి చూదాము " అని వారిని పిలుచుకొని, కులపతులను వెతుక్కుంటూ పోయినారు .  


        ఇద్దరూ చెరువు ఒడ్డునే కనిపించినారు . ఒకరు అప్పుడే స్నానము చేసి , శిష్యుడు ఇచ్చిన మడి కట్టుకుంటున్నారు . ఇంకొకరు నీటిలో దిగుతున్నారు . ఆచార్యుడు వచ్చి , " యజమానులు ఏమో చెప్పవలెనని యున్నారు " అని విషయమును ప్రస్తావించినారు . కులపతి వైశంపాయనుడు తల ఊపుతూ , ’ మంచి సలహా , అటులే చేసెదము , అయినా ఉద్ధాలకులు కూడా రానీ . వారిని అడిగి చేదాము , ఆ వేళకు హవనమునకు కావలసిన సామగ్రినంతటినీ సిద్ధము చేసుకొనండి . దానికోసము ప్రత్యేకముగా ఒక చరువు కానివ్వండి , అన్నారు . ఆచార్యుడు సరేనని ఆ అనుమతిని నెరవేర్చుటకు శిష్యుడొకనిని పంపించి , తాను , సలహాను సూచించిన వృద్ధునితోపాటు ఉద్ధాలకుని కోసము కాచుకున్నాడు . 


         వారుకూడా వచ్చినారు , సలహాను విని , " ఎందుకు చేయరాదు ? అవశ్యము చేయవచ్చును . కానీ చాతుర్వర్ణముల వారందరూ రావలెను కదా ! " అన్నారు . వైశంపాయనులు " ఎక్కడికి వెళ్ళినా , రాజభవనపు వారందరూ రాలేదే అనునదొకటే కొరత . అయితే , ఆచార్యుల ఇంటిలో సమారాధనము అంటే ముఖ్యులైన వారందరూ వచ్చే ఉంటారు . అతి ముఖ్యముగా ఆ బుడిలులు వచ్చినారు కదా ? వారు వస్తే ఒక లక్ష మంది వచ్చినట్టు . " ఆసహస్రాత్ పంక్తిం పునంతి " అటువంటి వారొక్కరు వస్తే చాలు . వారు కూర్చున్న పంక్తి మాత్రమేనా ? వారు నడచిన అంతటా భోజనానికి కూర్చున్నవారంతా కృతార్థులే ! వారినే ఆపోశన ఇవ్వమని అడిగితే సరి ! " అన్నారు . అంతలో సన్నాహములకు వెళ్ళిన శిష్యుడు వచ్చి అంతా సిద్ధమగుచున్నది అని తెలిపినాడు . 


         బ్రహ్మయజ్ఞమైన తర్వాత ఇద్దరు కులపతుల సమ్ముఖములో బుడిలులు ధాత్రీ హవనము చేయుదురు అని నిర్ణయించడమైనది . సకాలములో ధాత్రీ హవనమై , అందరూ వైశ్వేదేవమును నెరవేర్చినారు . భోజనాత్పూర్వములోను , భోజనాత్పరము లోనూ వేదఘోషలు మ్రోగినవి . అప్పుడక్కడ ఉన్న చాతుర్వర్ణముల వారూ పుష్కలముగా భోజనము చేసినారు . సంధ్యవరకూ సమారాధన నడచినది . ఆచార్యుల గాదెలలో నింపిపెట్టిన బియ్యమూ , పప్పులూ అన్నీ వెచ్చమైనవి . అయినా ఆచార్యుని ముఖములో చింతాఛాయలే కనపడలేదు . " సర్వమూ సార్థకమైనది , భూత తృప్తి యయినది , ఈ బాలుడి జీవితములో కూడా సర్వమూ ఇటులనే సార్థకమవనీ , వాడు అనృణుడై కృతార్థుడు కానీ " అని నమస్కారము చేసినాడు . 


         ఇక్కడ ఆలంబినీ దేవి కూడా కొడుకు సౌఖ్యము కోసము ఏమేమి కావలెను అని ఆలోచిస్తుండినది . బహుదినములనుండీ సేకరించిన ధావళులన్నీ బయటికి వచ్చినాయి . మూడు నాలుగు నెలలనుండీ ఆలంబినీ , జాయంతులు కూడబెట్టిన చీరలూ పంచెలూ , మూటల్లోనున్నవన్నీ గాలికి ఆరేసినారు . జాయంతి మనవడికి హారతి నిచ్చుటకని ఉండలు సిద్ధపరచినది . తొట్టిలు తన స్థానములో అలంకృతమై పాపడిని పిలుచుకొని వచ్చుటకు ఏర్పాటు అయినది . ఆదినము సాయంకాలము అతివల సందడే సందడి . వారి సంభ్రమము మగవారు ఊహించి తెలుసుకోవలసినదే తప్ప , అనుభవించి అర్థము చేసుకొనుట వారి నుదుట రాయనే లేదు . ఆడవారు సంభ్రమము పొందుటకు తమ కార్యమే కానవసరము లేదు . తమకు సంబంధమే లేకున్ననూ , ఇంకొకరి ఇంటిపనే అయిననూ , దానిని అభిమానించగలరు . అలాంటపుడు , ఆచార్యులు , ఆచార్య పత్నులు ఊరికందరికీ కావలసినవారైనపుడు , ఇంక చెప్పవలెనా ? 


         పాటల పిలుపులలో , కోలాటము , పేరంటపు ఆటపాటలలో , నవ్వుల నర్తనములలో పూజమొదలు జరగవలసిన తంతులన్నీ జాయంతి నేతృత్వములో జరిగినాయి . అందరూ , ’ బాలింతను చూచినారా ? బిడ్డతల్లి వలె లేనే లేదు , పదహారేళ్ళ లేత పడుచువలె నున్నదే ? " అనువారే ! వచ్చినవారంతా పాపడిని చూసి ఆనందముతో , ’ ఆలంబీ ! మొదట నీ కొడుకుకు దిగదుడుచు . తొట్టిలు నిండా పరుండిన ఈ శిశువును చూచి ముచ్చట పడని వారెవరు ? దృష్టి తగలకుండా ఉంటుందా ? పున్నమి చంద్రునిలాగా వెలుగుతున్నాడు . ఆ నుదురు చూడు , ఆ చిన్ని ముక్కు చూడు , ఆ నోరు చూడు , ఆ పెదవులు చూడు , అక్కడ చూడు ఆ చిన్ని చిన్ని చేతులు ! ఆ వేళ్ళు చూడు , ఎంతపొడుగ్గా ఉన్నాయో , ఆ చెవులు చూడు , అప్పుడే ఏనుగు చెవుల్లాగా లేవూ ? " అని పలువురు పలు రకాలుగా పొగడుతున్నారు . అందరి నోటిలోనూ ఒకే మాట ! " ఆలంబమ్మ అదృష్టవంతురాలు . అంతటి భర్త ! ఆ భర్తకు తగ్గ కొడుకు ! మొత్తానికి ఈ కొడుకును పొంది జన్మ సార్థకము చేసుకున్నది . ఆచార్యులు పుత్రుడు కావాలీ అని చేసిన తపస్సు సార్థకమైనది . " 


        వారు భవిష్యత్తును తెలిసినవారు కారు . వారిలో ఎవరైనా శాస్త్రజ్ఞులు ఉండిఉంటే , తాము ఆడినమాటలు లోకాభిరామముగా ఆడినవి కావు , అది శాస్త్రవాణి వలెనే తథ్యమగుతుంది అని తెలిసి , నమ్మకముతో నిండేవారు . 


        ఆ సందడులు , కోలాహలములు శాంతమైన తరువాత , ఆచార్యులు వచ్చి భార్యను మాట్లాడించినారు . ఆమె భర్త వచ్చినాడని లేవబోయింది . భర్త , " వద్దొద్దు , ఇకపైన నా పుత్రుడి తల్లివి అని నిన్ను గౌరవించవలెను . నువ్వు గౌరవించుకాలము గడచిపోయినది . చూడు , నేనొచ్చినది నిన్ను హెచ్చరించుటకు . ఇకమీద పాపడిని ఎత్తుకొనునపుడు మరవకుండా సరస్వతీ ధ్యానము చేయి . ఉయ్యాలలో పరుండబెట్టి ఊపునపుడు ’ భద్రం కర్ణేభిః ’ చెప్పుతూ ఉండు . ఒకవేళ సంస్కృతములో చెప్పుట వద్దనిపిస్తే , దాని అర్థమును లౌకిక భాషలో పాటగా చేసుకొని పాడుతూ ఉండు . మిగతా అప్పుడు , వాడిని తొడపైన వేసుకొని ఆడించునపుడు , ’ పూర్ణమదః ’ మరవవద్దు . నేనిక వస్తాను , పొద్దుటినుంచీ నీకు కూడా తీరిక లేనంత పనితో ఆయాసమై ఉంటుంది , పడుకొని నిద్రపో . దేవతలు నిన్నూ , నీ కొడుకునూ కాపాడనీ ! " అన్నాడు . ఆవేళకు భోజనానికి వెళ్ళిన జాయంతి వచ్చినది . అత్త వచ్చినది చూసి అల్లుడు గౌరవముగా లేచి వెళ్ళిపోయినాడు . 


        తల్లి , కూతురితో హాస్యమాడింది , " అదేమిటే , మొగుడిని పిలిపించుకున్నదానివి , కొడుకుని వారి చేతికి ఇచ్చి ఉండకూడదా ? " అన్నది . కూతురు ఆ హాస్యమును ఆనందిస్తూ , కొంటె తనము కనుపించునట్లు , " మేమిలాగ ఉండాలనే కదా , నువ్వుకోరేది ? వారి కొడుకును వారు ఎత్తుకుంటే నేను అడ్డురాకూడదే తప్ప , నేను ఇవ్వాలేమిటి ? అయినా మధ్యాహ్నము నుండీ , కావలసినంత సేపు చూస్తూ ఉన్నారు కదా ? ఈ నెల పురిటి మైల గడచిన తర్వాత వద్దన్నా ఎత్తుకుంటారు . ఇప్పుడు వచ్చినది , మంత్రములు జపము చేస్తూ ఉండు , ఆఖరికి మంత్రార్థమునైనా నెమరు వేస్తూ ఉండూ అని చెప్పుటకు ! " అన్నది . తల్లికి , కూతురు వెనుక చెప్పిన కల గుర్తుకు వచ్చి , ఈ బాలుడు ఎంతటి మహానుభావుడవుతాడో ,ఎవరికి తెలుసు ? అనిపించింది . ఆకు వక్కలు నోటిలో నిండి ఉండినవి , నిద్ర కంటిలో నిండి ఉండినది . మాట్లాడుతూ అలాగే మంచముపై వాలి ఒరిగింది . పొద్దుటినుండీ అలసి ఆయాసపడిన దేహము నిద్రలోకి జారింది .

మీకు తెలుసా

 #మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు

మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు

మీకు తెలుసా... ఇలాంటి పుస్తక సంపద 90 లక్షల గ్రంథాలను భక్తియార్ ఖిల్జీ నలందలో తగులబెట్టాడని... అవి అన్నీ కాల్చేందుకు వారికి ఒక సంవత్సర కాలం పట్టిందట... అన్ని గ్రంథాలు... విజ్ఞాన సంపద ఉన్నాయి.. మన భారతీయుల దగ్గర..

(ఇతని పేరు మీద ఇప్పుడు ఒక ఊరు భక్తియార్ పూర్ అని ఉంది...దాని పేరు మారిస్తే బావుండు)

 నేడు అమలులోలేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వ గ్రంథ శాస్త్ర రాజములు:

 నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద. క్రింది మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు చూస్తుంటే నేడు మనకు ఇవి ఎలా అందకుండా పోయాయా అని ఆశ్చర్యం కలుగక మానదు.*

1.అక్షర లక్ష: ఈ గ్రంథం ఒక ఎన్‌సైక్లోపీడియా గ్రంథము. రచయిత వాల్మీకి మహర్షి. రేఖాగణితం, బీజగణితం, త్రికోణమితి, భౌతిక గణిత శాస్త్రం మొదలైన 325 రకాల గణిత ప్రక్రియలు, ఖనిజ శాస్త్రం, భూగర్భ శాస్త్రం, జలయంత్ర శాస్త్రం, గాలి, విద్యుత్, ఉష్ణంలను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.*

2. శబ్ద శాస్త్రం: రచయిత ఖండిక ఋషి. సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను, ప్రతిధ్వనులను ఇది చర్చించింది. ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం, వాటి పిచ్(స్థాయి), వేగాలను కొలవడం వివరించారు.*

3. శిల్ప శాస్త్రం: రచయిత కశ్యప ముని. ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి. 307 రకాల శిల్పాల గురించి, 101 రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు. గుళ్ళు, రాజ భవనాలు, చావడులు మొదలైన నిర్మాణ విషయాలు 1000కి పైబడి ఉన్నాయి. ఇదే శాస్త్రంపై విశ్వామిత్రుడు, మయుడు, మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.*

4. సూప శాస్త్రం: రచయిత సుకేశుడు. ఇది పాక శాస్త్రం, ఊర గాయలు, పిండి వంటలు, తీపి పదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేక రకాల వంటకాల గురించి, ప్రపంచ వ్యాప్తంగా ఆ విషయాలు, వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.*

5. మాలినీ శాస్త్రం: రచయిత ఋష్యశృంగ ముని. పూల మాలలను తయారు చేయడం, పూలగుత్తులు, పూలతో రకరకాల శిరోఅలంకరణలు, రహస్య భాషలో పూవుల రేకుల పైన ప్రేమ సందేశాలు పంపడం లాంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.*

6. ధాతు శాస్త్రం: రచయిత అశ్వినీ కుమార. సహజ, కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు. మిశ్రలోహాలు, లోహాలను మార్చడం, రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.*

7. విష శాస్త్రం: రచయిత అశ్వినీ కుమార. 32 రకాల విషాలు, వాటి గుణాలు, ప్రభావాలు, విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.*

8. చిత్ర కర్మ శాస్త్రం (చిత్ర లేఖన శాస్త్రం): రచయిత భీముడు. ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి. సుమారు 200 రకాల చిత్ర లేఖన ప్రక్రియల గురించి చెప్పారు. ఒక వ్యక్తి తల వెంట్రుకలను గాని, గోటిని కాని, ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది.*

9. మల్ల శాస్త్రం: రచయిత మల్లుడు. వ్యాయామాలు, ఆటలు, వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు చెప్పబడ్డాయి.*

10. రత్న పరీక్ష: రచయిత వాత్సాయన ఋషి. రత్నాలు కల్గి ఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి. వీటి శుద్దతను పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి. రూపం, బరువు మొదలగు తరగతులుగా విభజించి తర్కించారు.*

11. మహేంద్రజాల శాస్త్రం: సుబ్రహ్మణ్య స్వామి స్వామి శిష్యుడైన వీర బాహువు రచయిత. నీటిపై నడవడం, గాలిలో తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.*

12.అర్థ శాస్త్రం: రచయిత వ్యాసుడు. ఇందులో భాగాలు 3. ధర్మ బద్ధమైన 82 ధన సంపాదనా విధానాలు ఇందులో వివరించారు.*

13. శక్తి తంత్రం: రచయిత అగస్త్యముని. ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని మొదలైన 64 రకాల బాహ్య శక్తులు, వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి. అణువిచ్చేదనం ఇందులోని భాగమే.*

14. సౌధామినీ కళ: రచయిత మతంగ ఋషి. నీడల ద్వారా, ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది. భూమి మరియు పర్వతాల లోపలి భాగాల ఛాయా చిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.*

15. మేఘ శాస్త్రం: రచయిత అత్రి ముని. 12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు, 64 రకాల మెరుపులు,33 రకాల పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.*

16. స్థాపత్య విద్య: అదర్వణ వేదంలోనిది. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, కట్టడాలు, నగర ప్రణాళిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.*

ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం, సాముద్రిక శాస్త్రం, అగ్నివర్మ విరచిత అశ్వ శాస్త్రం, కుమారస్వామి రచించిన గజ శాస్త్రం, భరద్వాజ ఋషి రచించిన యంత్ర శాస్త్రం మొదలగునవి, ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.*

నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద. వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు​.

(సేకరణ)(ఆదినారాయణ. తిప్పనా ) #ధర్మపథం.!!

సెప్టెంబర్, 08, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        🌞 *ఆదివారం*🌞

🌹 *సెప్టెంబర్, 08, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*                   


 *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః*

*భాద్రపద మాసం - శుక్లపక్షం*


*తిథి : పంచమి* రా 07.58 వరకు ఉపరి *షష్ఠి* 

*వారం : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం : స్వాతి* మ 03.31 వరకు ఉపరి *విశాఖ*


*యోగం  : ఐంద్ర* రా 12.05 వరకు ఉపరి *వైధృతి*

*కరణం : బవ* ఉ 06.50 *బాలువ* రా 07.58 ఉపరి *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 08.00 - 12.00 మ 02.00 - 04.00*

అమృత కాలం:శేషం ఉ 07.26 వరకు

అభిజిత్ కాలం  : *ప 11.40 - 12.29*


*వర్జ్యం : రా 09.42 - 11.29*

*దుర్ముహూర్తం:సా 04.36-05.25*

*రాహు కాలం:సా 04.42 - 06.15*

గుళికకాళం : *మ 03.10 - 04.42*

యమగండం : *మ 12.05 - 01.37*

సూర్యరాశి : *సింహం*

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 05.55*

సూర్యాస్తమయం :*సా 06.15*

*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 05.55 - 08.23*

సంగవ కాలం    :    *08.23 - 10.51*

మధ్యాహ్న కాలం :*10.51 - 01.19*

అపరాహ్న కాలం :*మ 01.19 - 03.47*

*ఆబ్ధికం తిధి:భాద్రపద శుద్ధ పంచమి*

సాయంకాలం :  *సా 03.47 - 06.15*

ప్రదోష కాలం   :  *సా 06.15 - 08.35*

రాత్రి కాలం : *రా 08.35 - 11.42*

నిశీధి కాలం     :*రా 11.42 - 12.28*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.22 - 05.08*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


యన్మణ్డలం దేవ గణైః సుపూజితం విప్రైః స్తుతం భావనముక్తి కోవిదమ్ ।

తం దేవదేవం ప్రణమామి సూర్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ ౩ ॥


   🌞 *ఓం సూర్యాయ నమః*🌞 


🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🌞🌞🌹🌷

 🌹🍃🌿🌞🌞🌿🍃🌹

08.09.2024,ఆదివారం

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏*

08.09.2024,ఆదివారం



ఋషి పంచమి


భాద్రపద మాసంలో వినాయక చవితి మరసటి రోజు వచ్చే పంచమి 'ఋషి పంచమి' గా జరుపుకుంటాం. భారతీయ ధర్మానికి, ఆధ్యాత్మికతకు మూల స్థంబాలు అయిన గొప్ప గొప్ప మహర్షులలో సప్తర్షులను ఋషి పంచమి రోజు ఒక్కసారి అయినా తలచుకోవాలని పెద్దలు చెబుతారు.


ఋషి పంచమి రోజు "అత్రి, కశ్యప, భారద్వాజ, గౌతమ, వశిష్ఠ, విశ్వామిత్ర, జమదగ్ని" అనే సప్తర్షులను తప్పకుండా స్మరించుకోవాలి. పూర్వకాలంలో ఋషులు ఎందరో ఉన్నారు. కానీ వారిలో సప్తర్షులు ఖ్యాతికెక్కారు.


అత్రి మహర్షి

* సాక్షాత్తు ఆ మహావిష్ణువునే పుత్రునిగా పొందినవాడు అత్రి మహర్షి. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసానికి వెళ్లినప్పుడు అత్రి మహర్షి ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. ఆ సమయంలో అత్రి మహర్షి సీతారామ లక్ష్మణులకు తన ఆశీర్వాదాన్ని ఇచ్చారు.


భారద్వజ మహర్షి

* శ్రీరాముని అరణ్యవాస సమయంలో సీతారాములకు చిత్రకూట పర్వతానికి దారి చూపించినవాడు భారధ్వజ మహర్షి.


గౌతమ మహర్షి

* తన భార్య అహల్యకు శాపవిమోచనం కలిగించిన శ్రీరామునికి తన తపః శక్తిని మొత్తం ధారబోసిన వాడు గౌతమ మహర్షి.


విశ్వామిత్రుడు

* రామలక్ష్మణులను తన వెంట తోడ్కొనిబోయి వారిచేత రాక్షస సంహారం చేయించినవాడు విశ్వామిత్రుడు.


వశిష్ఠుడు

* ఇక్ష్వాకు వంశ కులగురువు, శ్రీరాముని గురువు వశిష్ఠుడు.


జమదగ్ని

* శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఒక అవతారమైన పరశురాముని తండ్రి జమదగ్ని మహర్షి.


కశ్యపుడు

* శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మరొక అవతారమైన వామనుడి తండ్రి కశ్యప మహర్షి.


ఈ సప్తర్షులను ఋషి పంచమి రోజున తప్పకుండా స్మరించాలి, పూజించాలి. ఎందుకంటే వారు అందించిన జ్ఞానమే నేటి భారతదేశాన్ని గొప్పగా నిలబెడుతోంది. ఈ సప్తర్షులకు రామాయణానికి అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఋషి పంచమి రోజు శ్రీరాముని పూజించడం, రామాయణ పారాయణ చేయడం తప్పకుండా చేయాలి...

నిందనీయులు గూడా వందనీయులే*

 🙏🙏 *శ్రీ గణేశాయ నమః*🙏🙏

*నిందనీయులు గూడా వందనీయులే*


సభ్యులకు నమస్కారములు.


ఈ దినం వినాయక చతుర్థి. సాయం సంధ్య తదుపరి చంద్ర దర్శనము కూడదని, చంద్ర దర్శనము అవుతే నీలాపనిందలు తప్పవని వినాయక కథలలో తెలుసుకున్నాము. *అవుతే* సభ్య సమాజంలో *ఒక్కొక్క సారి నిందనీయలు కూడా వందనీయులే*. ఇందుకు సముచిత దృష్టాంతము *శమంతక మణి - శ్రీ కృష్ణ పరమాత్మ* ఉందంతము. ఆలాగే *రామాయణ మహా కావ్యంలో సీతమ్మ వారి గురించి చాకలి ప్రేలాపనలు*. నిందలకు గురికావడం యాద్ధృచ్ఛికమా లేక వినాయక చతుర్థి రోజు చంద్ర దర్శనమా అంటే ఇదమిద్ధంగా ఏమి చెప్పలేము. కాని, వినాయక చతుర్థి కథల ప్రకారము, చంద్ర దర్శనము వలన నిందలు వాస్తవమే అని అంగీకరించవలసి ఉంటుంది.


పై రెండు వృత్తాంతములు (శమంతక మణి - శ్రీ కృష్ణ పరమాత్మ, శ్రీ రామాయణ మహా కావ్యము) సర్వులకు విదితమే కావున చర్విత చర్వణం కూడదని అనుకుంటున్నాను.


ప్రతి ఒక్కరికీ ఎప్పుడో అప్పుడు సంసార లేదా వ్యవహార రంగంలో ఈలాంటి పరిస్థితి తప్పకపోవచ్చును. వ్యక్తులు ఎవరైనా, పరిస్థితులు ఏవైనా, సత్యాసత్యాలు ఎట్లున్నా అపనిందలకు గురవుతుంటారు. ఈ అపనిందలు తాత్కాలికం కావచ్చును లేదా శాశ్వతము కావచ్చును. *ఇవి అన్నియు పరిస్థితుల ప్రాబల్యం అని గ్రహించిన నాడు ప్రశాంతత ఏర్పడుతుంది*. పలు రకాల మనస్తత్వాలు ఉన్న ఈ సమాజంలో ఎప్పుడో అప్పుడు నిందా పూర్వక ఆరోపణలు, ఆక్షేపణలు తప్పవు. *అంత మాత్రాన కృంగి పోయి అపరాధ భావనకు లోను కాకుడదు*. 


*ఒక్కొక్క సారి మంచి చెప్పబోయినా, చెప్పినా* అపార్థాలకు, ఆలోచనా రాహిత్యానికి గురైన వారు ఎదుటివారిపై *నిందలు వేస్తుంటారు*. *అవుతే* నిందలకు గురైన వారు దుర్మార్గులు, ధూర్తులు కాకపోవచ్చును. మీదు మిక్కిలి నిందలన్ని అసత్యాలు అని తేలిననాడు *నిందనీయులే వందనీయులవుతారు. నిందలు మోపిన వారు దోషులవుతారు*. 

ఈ ప్రపంచం చాలా పెద్దది, మోప బడిన నిందలన్నీ నిజాలని నమ్మే వారు కొందరైతే, నమ్మని వారు అధికులు. 


మనుష్యుల వ్యక్తిత్వాలు గురించి ఒక రచయిత మాటల్లో...

*ఒకరి వ్యక్తిత్వం గురించి మంచిగా చెప్పుకోకపోయినా ఫరవాలేదు గాని, చెప్పుడు మాటలు విని ప్రచారం చేయవద్దు. ఆ వ్యక్తి యొక్క గుణగణాలు అతనికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే బహిర్గతమవుతాయి తప్ప, దూరంగా ఉండి ఇతరుల మంచి చెడులను గ్రహించలేము, అంచనా వేయలేము*.


*మరి ఒక మాట* నిందలు వేసిన వాళ్లపై తారాస్థాయిలో విరుచుకపడవద్దు, సర్వాంతర్యామి దృష్టిలో పడవద్దు. *ఇద్దరు ఇద్దరే అనుకునే ప్రమాదనున్నది*. సమాజం గూడా అందరిని ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. మంచి చెడులు తెలుస్తూనే ఉంటాయి.


పెద్దలు చెప్పిన మరియొక వాక్యం చూద్దాం.

*నహి నిందా న్యాయం, ప్రశస్తా వాక్యం* అర్థం :- ఒకరిని నిందించడం, తక్కువచేసి మాట్లాడం న్యాయం కాదు, మంచి పద్ధతి కాదు. నిందలను మాని (వద్దు), వారి ప్రశస్తి అంటే మంచిదనం మరియు కీర్తి గురించి తెలియజేయాలి.


చాలా వరకు నిందలన్నీ నిజాలు కాకపోవచ్చును. తొందరపడి నిందలను నమ్మడం, ప్రచారం చేయడం తగదు, 


*శ్రీ గణనాథం భజామ్యహాం*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


ధన్యవాదములు.

08-09-2024) రాశి ఫలితాలు

 ఈ రోజు (08-09-2024) రాశి ఫలితాలు


గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు

మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి

సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును



మేషం

  08-09-2024 

అందరిలోనూ మీ మాటకు విలువ పెరుగుతుంది. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.


వృషభం

  08-09-2024 

మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. నూతన రుణయత్నాలు చేస్తారు. ప్రయాణాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. పనులలో శ్రమ తప్పదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి.


మిధునం

  08-09-2024 

కొన్ని పనులు వాయిదా వేస్తారు. శారీరక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఉద్యోగమున అధికారులతో వ్యతిరేకత పెరుగుతుంది.


కర్కాటకం

  08-09-2024 

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.


సింహం

  08-09-2024 

ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారాలు ఆశించిన మేరకు రాణిస్తాయి. ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.


కన్య

  08-09-2024 

ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.


తుల

  08-09-2024 

చిన్ననాటి మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలలో మార్పులు చేస్తారు. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం అందదు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. 


వృశ్చికం

  08-09-2024 

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక లావాదేవీలలో చికాకులు తొలగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది.


ధనస్సు

  08-09-2024 

ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. నూతన ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు మరింత చికాకు పరుస్తాయి.


మకరం

  08-09-2024 

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.


కుంభం

  08-09-2024 

ఒక విషయంలో బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. దైవచింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.


మీనం

  08-09-2024 

ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ఋతుస్సుదర్శనః

 👆 శ్లోకం 

ఋతుస్సుదర్శనః కాలఃపరమేష్ఠీ పరిగ్రహః|

ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః||


ప్రతిపదార్థ:


ఋతు: - కాలరూపమై తెలియబడు ఋతువులై భాసించువాడు.


సుదర్శన: - భక్తులకు మనోహరమగు దర్శనము నొసంగువాడు.


కాల: - శతృవులను మృత్యురూపమున త్రోయువాడు.


పరమేష్ఠీ - హృదయగుహలో తన మహిమచే ప్రకాశించువాడు.


పరిగ్రహ: - గ్రహించువాడు.


ఉగ్ర: - ఉగ్రరూపధారి


సంవత్సర: - సర్వజీవులకు వాసమైనవాడు.


దక్ష: - సమస్త కర్మలను శీఘ్రముగా సమర్థతతో నిర్వర్తించువాడు.


విశ్రామ: - జీవులకు పరమ విశ్రాంతి స్థానము అయినవాడు.


విశ్వదక్షిణ: - అశ్వమేధయాగములో విశ్వమునే దక్షిణగా ఇచ్చినవాడు.

పంచాంగం 08.09.2024

 ఈ రోజు పంచాంగం 08.09.2024 Sunday.


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష పంచమి తిధి భాను వాసర: స్వాతి నక్షత్రం ఇంద్ర యోగ: బవ తదుపరి బాలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


పంచమి రాత్రి 07:55 వరకు

స్వాతి మధ్యాహ్నం 03:28 వరకు. 


సూర్యోదయం : 06:07

సూర్యాస్తమయం : 06:21


వర్జ్యం : రాత్రి 09:39 నుండి 11:25 వరకు.


దుర్ముహూర్తం : సాయంత్రం 04:43 నుండి 05:32 వరకు.


అమృతఘడియలు : తెల్లవారుఝామున 05:35 నుండి ఉదయం 07:23 వరకు.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


ఈ రోజు ఋషి పంచమి వ్రతం



శుభోదయ:, నమస్కార:

సప్త చిరంజీవులు

 🤔సప్త చిరంజీవులు

చిరంజీవులంటే చావులేనివారని అర్థం

అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।

కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥

సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం ।

జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ॥


శ్రీకృష్ణుని శాపము వలన అశ్వత్థాముడు వామనానుగ్రహమువలన బలిచక్రవర్తి లోకహితముకై వ్యాసుడు శ్రీరామభక్తితో హనుమంతుడు రామానుగ్రహమువలన విభీషణుడు విచిత్రజన్మము వలన కృపుడు ఉత్క్రుష్టతపోధనుడైన పరశురాముడు సప్తచిరంజీవులైరి । వీరికుత్తరమున శివానుగ్రహముచే కల్పంజయుడైన మార్కండేయుని ప్రతినిత్యం తలచుకొన్న సర్వవ్యాధి వివర్జితులై శతాయుష్మంతులౌతారని ఈ శ్లొకతాత్పర్యము॥


అశ్వత్థామ - ద్రోణాచార్యుని కుమారుడు. కురుక్షేత్ర యుద్ధం తరువాత కౌరవ పక్షాన మిగిలిన అతి కొద్దిమందిలో ఇతనొకడు. నిద్రిస్తున్న ఉపపాండవులను గొంతుకలు కోసి చంఫాడు. ఆ కారణంగా, ఒళ్ళంతా వ్రణాలతో చావు లేకుండా చిరంజీవిగా జీవించమని శ్రీకృష్ణూడు అతన్ని శపించాడు.

బలి - ముల్లోకాలనూ జయించిన దానవ చక్రవర్తి. ప్రహ్లాదుని మనుమడు. విరోచనుని కుమారుడు. పౌరాణిక గాథల్లో మహా దాతలుగా ప్రసిద్ధికెక్కిన ముగ్గురు - బలి, శిబి, ధధీచి - లలో ఒకడు. వామనావతారంలో వచ్చిన విష్ణుమూర్తి మూడడుగుల నేలను అతనినుండి దానంగా పొంది, రెండు అడుగులతో యావద్విశ్వాన్నీ ఆక్రమించి, మూడో అడుగు ఎక్కడ పెట్టమని అడగ్గా, తన తలను చూపించాడు. త్రివిక్రముడైన వామనుడు అతన్ని పాతళానికి తొక్కేసాడు.

హనుమంతుడు అత్యంత ప్రసిద్ధుడైన చిరంజీవి. బ్రహ్మచారి. రామకార్యం కోసం లంకకు లంఘించి, సీత జాడ కనుక్కున్న పరోపకారి. హనుమతుడు చేసిన 

ఉపకారానికి రాముడిచ్చిన బహుమానం అత్మీయమైన కౌగిలింత. రాముణ్ణి తన గుండెలో దాచుకున్నవాడు, రాముడి గుండెలో ఒదిగిపోయినవాడు -హనుమంతుడు.

విభీషణుడు 

రావణాసురుని తమ్ముడు

 అపహరించి తెచ్చిన సీతను తిరిగి రామునికి అప్పగించమని అన్నకు సలహా ఇచ్చాడు. ఆ తరువాత అన్నను వీడి, రాముని వద్ద శరణు పొందాడు. అతను చిరంజీవి కాదుగానీ దాదాపుగా చిరంజీవి. కల్పాంతము వరకూ చిరంజీవిగా ఉండే వరం పొందాడు.

కృపుడు

కౌరవ పాండవుల కుల గురువు. ద్రోణుని బావమరది. కురుక్షేత్ర యుద్ధంలో బ్రతికి బట్టకట్టిన అతి కొద్ది కౌరవ పక్ష యోధుల్లో మేనల్లుడు అశ్వత్థామతో పాటు కృపుడు ఒకడు.

పరశురాముడు

విష్ణుమూర్తి అవతారం. జమదగ్ని కొడుకు. తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని చంపి మళ్ళీ ఆమెను బతికించమని వరంగా కోరుకున్నవాడు. తన తండ్రిని క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు వధించినందుకు ప్రతిగా యావత్తు క్షత్రియ జాతిపై 21 మార్లు దండెత్తి వారిని వధించాడు.

వ్యాసుడు

భారత, భాగవత గ్రంథాలను రచించాడు. భారత దేశంలో వివిధ భాషల్లో ఉన్న భారత భాగవత గ్రంథాలకు ఈతని రచనలే మూలం. వశిష్టుని మునిమనుమడు, శక్తి మహర్షి మనుమడు, పరాశరుని కుమారుడు. భీష్మునికి వరుసకు అన్న.


ఈ ఏడుగురు చిరంజీవులని 

పురాణాలు 

 చెపుతున్నాయి. ఈ ఏడుగురితో పాటు మరొక చిరంజీవి యైన 

మార్కండేయుని

కూడా కలిపి అష్ట చిరంజీవులని కూడా అంటారు. మార్కండేయుడు శివుని అనుగ్రహాన చిరంజీవి అయ్యాడు.