20, మే 2023, శనివారం

ఆచార్య సద్బోధన:*

 

            *ఆచార్య సద్బోధన:*

                 ➖➖➖✍️


*' పరోపకారార్ధమిదం శరీరం ' పరులను సేవించుట కొరకే మానవ దేహము.* 

*సేవ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని తటపటయిస్తూ ఉంటే పనులు జరగవు.*


*అసలు నువ్వేమనుకుంటున్నావో ముందు ఆలోచించు!*

*ఆకలి వేసినపుడు నీకు నచ్చిన ఆహారము తింటున్నావు, మంచి దుస్తులు వేసుకుంటున్నావు. పక్కవాడకి నచ్చలేదు అని, వద్దు అన్నాడని  మానుకుంటున్నావా!లేదు కదా! మంచిని శత్రువు చెప్పినా వినాలని, చెడును మిత్రుడు చెప్పినా వినకూడదని అంటుంటారు.*


*సేవ అనేది అత్యుత్తమైన ఆధ్యాత్మిక సాధన.*

*దానిని ఎవరో ఏమో అనుకుంటారు అని వదులుకోవడం మూర్ఖత్వం.*


*మంచి చేస్తున్నపుడు ఎవరి మాట పట్టించుకోవాల్సిన పని లేదు.*


*భగవంతుణ్ణి దృష్టిలో పెట్టుకో! అన్నింటా భగవంతుడే తోడై నిన్ను సఫలం చేస్తాడు...*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️

*మన ఆరోగ్యం….!


          *అమృతఫలం..జామ!*

                   ➖➖➖✍️


*చక్కెర వ్యాధిని కంట్రోల్ చేయగలిగే ఏకైక ఔషధం…జామ కాయ.*


*ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం_ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఏ రోగాలతో అత్యధికంగా చనిపోతున్నారు అనే విషయాలని ఎన్నో సార్లు వెల్లడించింది. అందులో ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో అత్యధికంగా ప్రజలు చనిపోతుంటే..రెండవ స్థానం మాత్రం చెక్కెర వ్యాధితో ప్రజలు చనిపోతున్నారని తేల్చి చెప్పింది. * 


*ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధి తీవ్ర రూపం దాల్చిందని, దీని ప్రభావానికి చిన్న పిల్లలు సైతం లోనవుతున్నారని తెలిపింది.*


*అయితే డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఈ షుగర్ లెవిల్స్ కంట్రోల్ చేసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని అంటున్నారు నిపుణులు.* 

*మరి షుగర్ లెవిల్స్ ని కంట్రోల్ చేయడం ఎలా…?*


*షుగర్ లెవిల్స్ ని కంట్రోల్ చేయడానికి జామకాయలు ఎంతగానో ఉపయోగ పడుతాయి.*


*వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.* 


*జామకాయలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ లో  షుగర్ లెవిల్స్ ని చెక్ చేస్తుంది. జామలో ఉండే గ్లైకమిక్ ఇండెక్స్ తొందరగా అరగనివ్వవు.* 


*దాంతో రక్తంలో గ్లూకోజ్ లెవిల్స్ ఒక్క సారిగా పెరగకుండా ఉంటాయి.* 


*ఫలితంగా బ్లడ్ లో లెవిల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అందుకే వైద్యులు డయాబెటిస్ రోగులకి జామకాయలు ఎక్కువగా తీసుకోమని సూచిస్తారు.*


*అంతేకాదు బరువు తగ్గాలని అనుకునే వారు కూడా జామకాయ తినవచ్చు ఎందుకంటె జామకాయలో కేలరీస్ తక్కువగా ఉంటాయి. అత్యధిక బరువు ఉన్న వారికి కూడా షుగర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా కాబట్టి జామ కాయ తినడం ద్వారా బరువు తగ్గి వివిధ వ్యాధుల నుంచీ కాపాడుకోవచ్చు.* 


*షుగర్ ని కంట్రోల్ లో ఉంచడానికి సోడియం, పొటాషియం రెండూ కావాలి ఈ రెండూ జామకాయలో పుష్కలంగా లభిస్తాయి. “సి” విటమిన్ కోసం అందరూ నిమ్మకాయ, నారింజ తినాలని అంటారు.  కానీ జామకాయలో “సి విటమిన్” నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది.* 


*డయాబెటిస్ ఉన్న వారికి రోగ నిరోధక శక్తి అధికంగా ఉండాలి. జామలో   రోగ నిరోధక శక్తిని అందించే కారకాలు లెక్కకి మించే ఉంటాయి.*✍️

                                     ….సేకరణ.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                                                                                                                                   

      *అద్భుతం ఖరీదు.. ₹.83/-*

                  ➖➖➖✍️

                                                               *ఒక చిన్నబాబు అతని పిగ్గీబ్యాంక్ పగలగొట్టి అందులోని డబ్బులు లెక్కపెడుతున్నాడు.*


*చాలా జాగ్రత్తగా లెక్క పెడుతున్నాడు. మూడుసార్లు లెక్కపెట్టాడు.*


*తప్పు ఉండకూడదు అని తనకు తాను చెప్పుకుంటున్నాడు..*

*ఆ డబ్బులు తీసుకుని నెమ్మదిగా తన ఇంటి వెనకాల తలుపు నుండీ వెళ్ళి ఒక మందుల షాప్ దగ్గర నుంచున్నాడు..*


*షాప్ లో ఆవిడ తనవేపు చూసేవరకు ఎదురుచూస్తూ నుంచున్నాడు...*

*షాప్ ఆవిడ బాబుని చూసి అడిగింది.. “ఏమి కావాలి బాబు” అని.* 


*బాబు చెప్పాడు..*

*“నాకు ఒక అద్భుతం కావాలి” అని.*


*షాప్ ఆవిడ అర్ధం కానట్టూ “ఏంటి బాబు సరిగ్గా చెప్పవా” అని అడిగింది.*


*“నాకూ సరిగ్గా తెలీదు..కానీ చెల్లికి ఆరోగ్యం ఏమీ బాలేదు కదా..నాన్న అంటున్నారు ‘ఒక అద్భుతం మాత్రమే చెల్లిని కాపాడగలదు’  అని. చెల్లి చాలా కష్టపడుతోంది. అందుకే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చాను అద్భుతం కొనుక్కుని వెళ్దామని..అది ఉంటే చెల్లికి నయం అయిపోతుంది.” అని అడిగాడు బాబు.*


*ఆవిడకి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు..*

*“ఇక్కడ అద్భుతాలు అమ్మము బాబు” అని షాప్ ఆవిడ బాధగా చెప్పింది. బాబు మాటలకి విషయం అర్ధం అయ్యి ఆవిడకి బాధేస్తోంది....*


*”నా దగ్గర డబ్బులు ఉన్నాయి అద్భుతం కొనేందుకు.. అవి చాలకపోతే నేనింకా డబ్బులు తెచ్చిస్తాను.” అని బతిమలాడుతున్నట్టుగా అడుగుతున్నాడు బాబు...*


*ఇంతలో బాబు పక్కనే ఇదంతా వింటున్న పొడుగ్గా ఉన్న, మంచిగా తయారయ్యి ఉన్న, హుందాగా ఉన్న ఒకాయన బాబుని అడిగారు...“ఏమిటి నీ చెల్లి సమస్య, నీకు తెలుసా?” అని ...*


*బాబు చెప్తున్నాడు..”చెల్లికి తలలో చెడుది ఏదో పెరుగుతోందంటా.. అది బాగవ్వాలంటే సరిపడా డబ్బులు లేవు, అద్భుతం ఉంటే చెల్లి తప్పక బాగవుతుంది. అని నాన్న అమ్మకి చెప్తుంటే విన్నాను... సరే అదేదో కొందామని నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చేసాను, కావాలంటే ఇంకా డబ్బులు పోగేసి తెస్తాను..” అని చెప్తుంటే బాబుకి తెలీకుండానే అతని చిట్టి చెంపల మీద కన్నీళ్ళు జారుతున్నాయి....*


*ఆ పొడుగు మనిషి కొంచెం కిందకు వంగి బాబుని అడిగారు.. ”నీ దగ్గర ఎంత డబ్బు ఉందీ!” అని..*


*బాబు చెప్పాడు..“83 రూపాయలు” అని...అదీ వినపడి వినపడనట్టు..*


*”ఓ అవునా ...తమాషా చూడు నీ చెల్లికి కావాల్సిన అద్భుతం కూడా సరిగ్గా 83 రూపాయలే. ఏదీ పద నా దగ్గర ఉన్న అద్భుతం నీ చెల్లెలికి సాయపడగలదేమో చూద్దాం..” అని నెమ్మదిగా ఒక చేత్తో బాబు చెయ్యి పట్టుకుని ఇంకో చేత్తో బాబు అందించిన డబ్బులు తీసుకుని చొక్కా జేబులో పెట్టుకున్నారు బాబు తృప్తి కోసం.*


*ఆయన ఒక పేరు పొందిన పెద్ద హాస్పిటల్ కి డైరెక్టర్. ఆయన ఒక్కరే చిన్నిపాప సమస్యకు వైద్యం చెయ్యగలరు...*


*ఆయన దయ వల్ల పాపకు ఒక్క పైసా కూడా ఇవ్వనక్కరలేకుండానే ఆపరేషన్ జరిగింది...తొందరగానే పాప ఇల్లు చేరి మునుపటిలాగా ఆరోగ్యంగా బాబుతో సరదాగా ఉండగలుగుతోంది.* 


*తల్లి అంటోంది...*

*“ఎంత అద్భుతం జరిగిందీ అది కూడా ఒక్క పైసా ఖర్చు పెట్టనక్కరలేకుండానే” అని తండ్రితో అంటోంది.*


*అది విన్న బాబు నవ్వుకుంటున్నాడు. వాడికి మాత్రమే తెలుసు...ఒక అద్భుతం ఖరీదు 83 రూపాయలు అని...*

*కానీ ఒక అద్భుతం విలువ 83 రూపాయలు ప్లస్ ఆ చిన్ని బాబు అపార విశ్వాసం...*

*కల్మషం లేని ప్రేమ, స్వార్ధం లేని ప్రయత్నం తప్పక ఫలిస్తాయి.. దేవుడిని నమ్ముకున్నవారికి ఏదో ఒక రూపేణా తప్పక సాయం అందుతుంది.*

*అది ఒక అద్భుతం లాంటి ఒక మంచి మనిషి మానవత్వం రూపంలో...*

*మనిషికి మనిషి సాయం చెయ్యాలి, అని అనుకోవాలి, అంతే........!* ✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     

*మనం..*

       *నడుస్తున్న శవాలమా..?*

                 ➖➖➖✍️


*మనిషి సుఖభోగాలను అనుభవిస్తున్నంత కాలం పరమాత్మ చింతన కలిగి ఉండటం కష్టమే. మామూలుగా ఆపద సమయాల్లో మాత్రమే భగవంతుడు గుర్తుకొస్తాడు.* 


 *జీవితం కష్టసుఖాల సంగమం. కష్టాల్లో సైతం మద్యపాన వ్యసనానికి దాసులైన వారికి భగవంతుడు జ్ఞప్తికి రాడు. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ పశుతుల్యంగా జీవితాన్ని గడుపుతుంటారు వీళ్లు.* 


 *”జాతస్యహి మరణం ధృవమ్’’ అన్నారు. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఈ భూమీద పడ్డ ప్రతీ జీవినీ ప్రతీక్షణం మృత్యువు కనిపెట్టుకునే ఉంటుంది. కనుక వ్యర్థంగా కాలంగడపకుండా దైవచింతన కలిగి ఉండటం ఎంతైనా అవసరం. ఉత్కృష్టమైన మానవజన్మ ఎత్తికూడా అనివార్యమైన భగవత్ప్రేమకు పాత్రులు కాకపోవడం ఆత్మహత్యా సదృశం.*


*అభ్యాసం ఉంటే తప్ప ఎవరికి పరమాత్మ చింతన అలవడదు. అది ఇసుమంతైనా లేకపోగా..  ”ఏమి తిందామా! ఏమి త్రాగుదామా!” అనే యావతో జీవితాన్ని వృథా చేసుకునే వాళ్లకెంత ఆయుష్షుంటే ఏం లాభం? అది హారతికర్పూరంలా కరిగిపోతూనే ఉంటుంది కదా!*


*ఈశ్వరోపాసనకి పూజ,  ప్రార్థన ముఖ్య సాధనాలు. మన స్థూల శరీరానికి  కర చరణాదులు ఎలాగో అలాగే ఆత్మకు జ్ఞానాదులు అలాంటివి. లోకంలో జనులు దేహం మీదున్న అభిమానం చేత సర్వసుఖాల్ని పొందడంకోసమే ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారే తప్ప ఆత్మానంద సుఖంకోసం గాని, సంసార బంధ విముక్తులు అవడానికిగాని యత్నించరు. కాగా “ఎవరినెట్లా పీడించాలా?”అనే పైశాచిక ప్రకృతిని ఒంటబట్టించుకుంటున్నారు. అందువల్లే ఉత్కృష్టమైన ఈ మానవజన్మ వ్యర్థవౌతోంది.*


*ఆత్మను పోషించుటకు, రక్షించుటకు పరమాత్మ చింతనే ముఖ్యసాధనమనేమాట నిర్వివాదాంశం. అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. అలాగే భగవంతుణ్ణి తలంచని వాణ్ణి ఆ దేవుడు కరుణించడు. ముక్తినివ్వడు. పండితులు, భాగవతులు తమ గానం చేత, పూజాది సత్కర్మలచేత జపతపముల చేత భగవంతుణ్ణి అనేక రకాలుగా స్తుతిస్తారు.*


*రాజదర్శనం కావాలంటే ముందుగా భటుని దర్శించవలసి ఉంటుంది. తోటలోని ఫలాలు కావాలనుకుంటే ముందుగా తోటమాలిని ఆశ్రయించాలి. అలాగే భగవంతుణ్ణి గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు భాగవతుల్ని ఆశ్రయించాలి. అది సాధ్యంకానప్పుడు సత్పురుష సాంగత్యమైనా చెయ్యాలి. అది కూడ దుర్లభం అనుకుంటే తన దుష్టప్రవర్తనను తానే సరిదిద్దుకోగలగాలి. అందుకు శుభాశుభములు తెలుసుకోవాలి. అవి తెలుసుకోవాలంటే వివేకం ఉండాలి. వివేకం కలగాలంటే ముందు తను నీతిగా ఉండాలి. అందుకు విద్య అవసరం. విద్య అంటే ఆ సర్వేశ్వరుని మార్గాన్ని తెలుసుకోవడమే తప్ప పొట్టకూటికోసం విద్యలుకావని గ్రహించాలి. ఈశ్వర చింతన యందు అభిలాష ఉంటే విజ్ఞానవంతులవుతారు.*


*మనమంతా పుణ్యంకోసం నదీస్నానాలు, గుళ్ళు గోపురాల దర్శనం చేస్తుంటాం. ఇవన్నీ బాహ్యేంద్రియ శుద్ధి చేసేవే గాని ఆత్మశుద్ధికి తోడ్పడవు. వాటన్నిటికంటె ముందు శుభకర్మల్ని ఆచరించాలి.     పరోపకారం,                          సత్యం పలకడం, భూతదయ, సత్‌సాంగత్యం, దానాదిక ధర్మాలు, ఈశ్వర స్తుతి వంటి ఉత్తమగుణాలే శుభకర్మలు అనబడతాయి. శుభకర్మలు చేసేందుకు అలవాటుపడని వాళ్ళంతా ఈ భూమ్మీద నడుస్తున్న శవాలే.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



          *హరే కృష్ణ అంటే ఏంటి?*

                  ➖➖➖✍️


*మనం తరుచూ భగవంతుడియొక్క ఈ నామాన్ని వింటూ ఉంటాం. హరే కృష్ణ అంటే కేవలం ఎదో ఒక మతం వాళ్ళకో, ఒక సంస్థకో, కొంతమంది భక్తులకో సంబంధించినది కాదు. కలియుగంలో సమస్త మానవాళిని ఉద్దరించేసే భగవానుడియొక్క దివ్య మంత్రం.*


*ఇద్దరు భక్తులు కలిసినపుడు ఒకరినొకరు ‘హరే కృష్ణ’ అంటూ పిలుచుకుంటూ ఉండటం సాధారణంగా చూస్తూ ఉంటాం. అసలు హరే కృష్ణ అంటే ఏంటో ఒకసారి చూద్దాం…*


*’హరి’ అంటే తేలికైన అర్ధం ఏంటంటే ఎటువంటి పాపములనైనా, ఎటువంటి దోషములనైనా హరించగలిగినవాడు,* 


 *’కృష్ణ’ అంటే భగవంతుడు, సర్వ జగన్నియామకుడు. ‘క్రిష్’ అంటే అనిర్వచనీయమైన ఆనందం (మోక్షం), అటువంటి మోక్షాన్ని ప్రసాదింపగలవాడు కాబట్టి ఆయన్ని ‘కృష్ణ’ అంటారు.* 


*సృష్టిలో కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయి. కానీ ‘పంచమహా పాతకాలు’ అంటే బ్రాహ్మణ హత్య, బంగారం దొంగతనం చెయ్యటం, మందు తాగడంలాంటి మహా పాతకాలులాంటి వాటికి ప్రాయశ్చిత్త కర్మలు లేవు.* 


*యోగి అయినా, జ్ఞాని అయినా, ఎంతటి గొప్పవారైనా ఆ ప్రారబ్ధ కర్మలు మాత్రం అనుభవించవలసిందే.*


*సృష్టిమొత్తం మీద అలా పోగొట్టగల నామం ఏదైనా ఉంది అంటే అది కేవలం ‘కృష్ణ’ నామం మాత్రమే,  కృష్ణ కథలు మాత్రమే! అందుకే ప్రత్యేకంగా భాగవతాన్ని తీసుకొనివచ్చారు వ్యాసులవారు.* 


*కలియుగంలో కేవలం ‘భాగవతం’ చదివినంత మాత్రాన, విన్నంత మాత్రాన, కృష్ణ నామం స్మరించినంత మాత్రాన పంచ మహాపాతకాలే కాదు సమస్త పాపరాశి ధ్వంసమై కృష్ణలోకమైన మోక్షాన్ని చేరుకుంటారు. *


*చాలామంది భక్తులు రోజుకి కొన్ని వేలసార్లు కృష్ణ నామం పారాయణం చేస్తూ ఉంటారు. జననమరణ చక్రం అనే సంసార సముద్రంలో నావ వంటిది ‘హరే కృష్ణ’ నామం.* 


*"కోట్లజన్మల తర్వాత ఏ ఒక్కడో మాయాపూరితమైన జగత్తుని వదిలి నన్నే స్మరించుకుంటూ నాకు దాసుడవుతున్నాడు. అటువంటి వాడియొక్క యోగక్షేమాలు నేనే వహిస్తున్నాను” అని భగవద్గితలో(7.19) కృష్ణుడు మనకి అభయం ఇచ్చారు.*


*అలా ఆ పరాత్పరుడియొక్క ‘హరేకృష్ణ’ నామాన్ని ప్రతిరోజు స్మరించుకోవడం మన జన్మజన్మాంతరంగా కలిగిన అదృష్టం.* 


*అందునా వాట్సాప్, ఫేస్బుక్ లాంటి ‘సోషల్ మీడియా’ ద్వారా ఆధ్యాత్మిక గ్రూపులలో ప్రతిరోజూ కృష్ణ నామాన్ని స్మరించుకోవటం, కృష్ణుని  చిత్రపటాలని చూడటం కూడా ఆధ్యాత్మికతలో, భక్తిలో ఒక భాగమే. ప్రతిరోజు క్రింద ఉన్న కృష్ణ మంత్రాన్ని  స్మరించుకోవడం ఉత్తమం.*


*హరే కృష్ణ హరే కృష్ణ *

*కృష్ణ కృష్ణ హరే హరే *

*హరే రామ హరే రామ*

*రామ రామ హరే హరే * (108 సార్లు)


*కర్మఫలితంగా ఎటువంటి ఆపదలు మనల్ని, మనకుటుంబ సభ్యులను  భాదించకుండా ఉండాలని, కృష్ణపరమాత్మ మనల్ని అనుగ్రహించాలని ఆయన పాదపద్మములను నమస్కరిస్తూ... 

✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


*సనాతన..*

                   *ధర్మ రక్షణ!*

                   ➖➖➖✍️



*సనాతనధర్మాన్ని రక్షించడమంటే అసలు అర్ధమేమిటి? *


*ఎలాగైతే కాపరి పశువులను రక్షిస్తాడో అలా రక్షించడమా?*


*కాదు…*


*ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని ఆచరించడం. ధర్మాన్ని తాను ఆచరించడం, ఇంకొకరి చేత ఆచరింపజేయడంవల్ల ధర్మం రక్షింపబడుతుంది.*


*వెనకటికాలంలో ఎంతోమంది ఎన్నోరకాల అనుష్ఠానాలు చేసేవారు . తమ పిల్లలను వేరే దేశాలకు పంపిస్తారో..లేదో...అనేది వేరే విషయం. మొట్టమొదటగా వారిని సంస్కారవంతులుగా తయారు చేసేవారు.*


*మా పిల్లలు ధనవతులు కాకపోతే ఏమైపోతారని భయపడేవారు కాదు.*


*అయ్యో ! మా పిల్లలు సంస్కారహీనులైతే ఏమైపోతారు? అని ఆలోచించేవారు.*


*ఆ సంస్కారమే వారికి అన్ని రకాల శ్రేయస్సులను అందజేస్తుంది. కాబట్టి చిన్ననాటినుండే రామాయణ, భారత, భాగవత పురన ఇతిహాసాదులన్నీ చెప్తుండే వారు. దానితో వారి మనస్సులో అద్భుతమైన సంస్కారం ఏర్పడేది.* 


*ఆ సంస్కారం చిన్నవయసులో కలిగితే, ఆ సంస్కారమే వారిచేత ధర్మాచరణ చేయిస్తుంది. అప్పుడు ధర్మాన్ని రక్షించడం అవుతుంది.* 


*మన చేత ఆచరించబడిన ధర్మం పుణ్యంగా మారి మనకు ఈ లోకంలో, పరలోకంలోనే కాక తరువాతి జన్మలకు కూడా శ్రేయస్సును, సుఖాన్ని అనుగ్రహిస్తుంది.*


*ఈ విధంగా ఆచరణతోనే సనాతన ధర్మం రక్షింపబడుతుంది.*✍️

సనాతన ధర్మస్య ధర్మో రక్షతి రక్షితః

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


*రామాయణం...

ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది.


              *వాల్మీకి రామాయణం:*

                     *3 వ  భాగం:*

                     ➖➖➖✍️


రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు.............

పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడవు, 

3 యోజనముల వెడల్పు ఉండేది. (యోజనం అంటే = 9 మైళ్ళు) ఆ నగరం మధ్యలో రాజ ప్రాసాదంలో దశరథ మహారాజు నివాసముండేవారు. ఆ నగరంలో రహదారులన్నీ విశాలంగా, ఎప్పుడూ సుగంధ ధూపాలతో ఉండేవి. ధాన్యం, చెఱకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలో. ఏ ఇంట్లోను కూడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు, అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే, ఎవడికి ఉన్నదానితో వాడు తృప్తిగా ఉండేవాళ్ళు, అందరూ దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవాళ్ళు, అందరూ ఐశ్వర్యవంతులే, ఆవులు, గుర్రాలు, ఏనుగులతో ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలో పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలో లేడు.


*దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు  ఎప్పుడూ సహాయం చేసేవారు, వాళ్ళు… దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు. 

వశిష్ఠుడు, వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్విక్కులు. ఇతరమైన బ్రాహ్మణులూ, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పని చెయ్యడం తెలిసినవాళ్లు, ఇంద్రియములను నిగ్రహించినవాళ్లు, శ్రీమంతులు, శాస్త్రము తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగినవాళ్ళు. ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు.

ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేథ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి, వెంటనే సుమంత్రుడిని పిలిచి, ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేథ యాగానికి కావాల్సిన సంభారములన్నీ తెప్పించి, సరయు నదికి ఉత్తర తీరంలో యాగమంటపం నిర్మించారు.

దశరథ మహారాజు దక్షిణ నాయకుడు, ఆయనకి 300 కి పైగా భార్యలున్నారు. కాని పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలపెడుతున్నాడు కాబట్టి, తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు...........


సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం |

ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి ||


పూర్వకాలంలో ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు........ ఇక్ష్వాకువంశములో జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేథ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు. కాని అశ్వమేథ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా చెయ్యాలి. ఈ రెండు యాగాలని చెయ్యగలిగినవాడు రుష్యశృంగుడు. ఆయన ఆ యాగాలని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతో అన్నాడు. ఆ రుష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలో ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్లి ఆయనని తీసుకొని రండి” అన్నాడు.


అప్పుడు దశరథ మహారాజు, నాకు ఆ రుష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటే, సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు.....   పూర్వకాలంలో విభణ్డక మహర్షి చాలాకాలం తపస్సు చేసి స్నానం చెయ్యడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళగా, అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రేతస్థానము నుంచి కదిలిన వీర్యం సరోవరంలో పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి, గర్భం దాల్చి, శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి రుష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభణ్డక మహర్షి, రుష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ చెప్పాడు. కాని ఆ రుష్యశృంగుడికి లోకం తెలీకుండా పెంచాడు, ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ-పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలీకుండా పెంచాడు. అంటే విషయసుఖాల వైపు వెళ్ళకుండా పెంచాడు. ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే, తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడడం మానేశాయి. దేశంలో క్షామం వచ్చింది. రుష్యశృంగుడు కాని మన దేశంలో అడుగుపెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు.


వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే, “రుష్యశృంగుడిని తీసుకురావడం మావల్ల కాదు, ఏమి కోరికలు లేని వాడు, మన రాజ్యానికి ఎందుకు వస్తాడు?” అన్నారు. 


ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు..... 

ఇంద్రియార్థైః అభిమతైః నరచిత్త ప్రమాథిభి |. 


రుష్యశృంగుడికి కుడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక, విషయసుఖాల వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలని పంపిస్తే, విభణ్డకుడు లేని సమయంలో వీళ్ళు ఆ రుష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి, ప్రలోభపెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు, అని మంత్రులు సలహా ఇచ్చారు.


ఆ వేశ్యలకి విభణ్డకుడి మీద ఉన్న భయం వలన, వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చెయ్యడం మొదలుపెట్టారు. 


ఒకరోజు విభణ్డకుడు లేని సమయంలో గానం విన్న రుష్యశృంగుడు, ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడున్న ఆ వేశ్యలని చూసి, వాళ్ళు పురుషులే అనుకొని, “మహాపురుషులారా! మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను” అన్నాడు. 


అందరూ విభణ్డకుడి ఆశ్రమానికి వెళ్లారు. తరువాత ఆ వేశ్యలు ఆశ్రమంనుంచి వెళ్ళిపోతూ ఆ రుష్యశృంగుడిని గట్టిగ కౌగలించుకుని వెళ్ళిపోయారు. 


మరునాడు ఆ రుష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి, ఆ వేశ్యలని చూడాలనిపించి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. 


ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. 


సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే..........


తత్ర చ ఆనీయమానే తు విప్రే తస్మిన్ మహాత్మని |

వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయన్ తదా ||


ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు రుష్యశృంగుడికి నమస్కారం చేసి, ప్రార్ధించి, అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జరిపించారు.


కాబట్టి దశరథ మహారాజు ఆ రుష్యశృంగుడిని పిలవడానికి, అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక, వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు...  “మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది, కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా” అని అడిగాడు. 


రోమపాదుడు ఆనందంగా పంపించాడు. 


దశరథుడు చాలా సంతోషించి, వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు.✍️

రేపు...4వ భాగం..

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

* గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

[18/05, 8:54 pm] +91 94939 06277: 180523b0336.   190523-2.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀X83.



    మహాస్వామి – ముస్లిమ్ భక్తుడు

                  ➖➖➖✍️



    కంచి కామకోటీ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పండరీపురంలో మకాం చేస్తున్నారు.     


     వారి దర్శనం కోసం మేము అక్కడికి బయలుదేరాము.     మేము ఎక్కిన రైలు పండరీపురం చేరుకుంది. 'చంద్రభాగా' నది ఆవలి ఒడ్డున  ఒక చిన్న మఠంలో బస చేస్తున్న పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళడానికి ఎలాగా అని మేము ఆలోచిస్తూ నిలుచున్నాము.


       ఆ రోజుల్లో టాక్సీలు అవి ఏవి లేవు. అప్పుడు ప్రయాణ సాధనం      గుర్రపు బండి మాత్రమే.  నా కళ్ళు  ఒక  టాంగా వాడి మీద పడ్డాయి.       చూడడంతోనే అతను మహమ్మదీయుడు అని  తెలిసి పోవడం వల్ల    స్వామి వారి గురించి... అతనికి తెలిసి ఉండదని వేరొక టాంగా కోసం వెతికాను.    అక్కడ అతను తప్ప ఎవరూ లేక పోవడంతో వెళ్ళి అతనితో, “శంకరాచార్య స్వామి వారు ఎక్కడ బస చేసి ఉన్నారో నీకు తెలుసా....?”    అని అడిగాను. 


       అతను “కంచి పెరియవనా? వారు తెలియకేం.... చాలా   బాగా   తెలుసు. మిమ్మల్ని   అక్కడికి  తీసుకుని వెళ్తాను. ఆయన మాకు అల్లా”  బదు లిచ్చాడు. 


          నేను కొంచం ఆశ్చర్యపోయి, సరే పదమన్నాను.


                మేము స్వామి వారున్నచోటికి చేరుకున్నాము. ఆ టాంగావాలా   మాతో డబ్బు తీసుకోవడానికి   నిరాకరించాడు. అతను  సరాసరి  పరమాచార్య  స్వామి వారు   కూర్చుని ఉన్న  చోటికి  మమ్మల్ని తీసుకుని వెళ్ళాడు.   అతను ఆనందం తో,        తల్లి దగ్గరికి నెలల బిడ్డ వెళ్ళిన చందంగా....  స్వామి వారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు.  అది అతనికి ఈ జన్మకు లభించిన హక్కు కాబోలు, పరమాచార్య స్వామి వారు  కూడా      ఏమి మాట్లాడ లేదు.      స్వామి వారికి    మమ్మల్ని.... పరిచయం చేసాడు.     

 

    తరువాత తను మాతో, ”వీరు వచ్చిన నాటినుండి   మా జీవితాలు     ధన్యమ య్యాయి.   తాగుడు మొదలైన  వ్యసనా లను త్యజించాము”       అని అన్నాడు. 


            అతను కళ్ళారా చూసిన ఒక సంఘటనని మాతో పంచుకున్నాడు.

"చంద్రభాగా నది ఎగువ ప్రాంతంలో... వర్షాలు ఎక్కువై     నదికి     వరదలు... వచ్చాయి.     ప్రమాదపు అంచులో నది ప్రవాహం ఉంది.    ఆరోజు స్వామివారు  నిద్రలేచారు.    వరద ఉధృతి ... ఎక్కువగా ఉంది... వెళ్ళొద్దని అందరూ బ్రతిమాలుకున్నా స్వామివారు స్నానానికి నదికి వెళ్ళారు.       నదిలోకి వెళ్ళి వారి దండాన్ని ఒకచోట నిలబెట్టారు. ఆశ్చర్య కరంగా వరదనీరు ఆదండం దరిదాపు ల్లోకి కూడా రాలేదు.        అక్కడినుండి వరద వెనుకకు   వెళ్ళనారంభించింది. నేను కూడా నదిలో స్నానం చేసాను.

దీనికి  నేను ప్రత్యక్ష సాక్షిని.....”      అని భావోద్వేగంతో   చెప్పాడు   ఆ సాధారణ ముస్లిమ్ భక్తుడు.


                         ➖➖


      [ఆదిశంకరాచార్యుల వారు గురువు అన్వేషణలో భాగంగా....     నర్మదానదీ పరీవాహక ప్రాంతానికి    వచ్చినప్పుడు, నదికి వరద వచ్చింది.         వారు తమ కమండలంలో ఆ వరద నీటినంతటినీ పట్టి, వరద ముంపు నుండి కాపాడారు. 


      అలా చేసినవాడే   నీకు శిష్యుడై...., జగద్గురువై సనాతన ధర్మాన్ని     ఉద్ధరి స్తాడని       గోవిందభగవత్పాదులకు.... చెప్పారు.]


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


http://t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

 *శుభోదయం*


💐🙏💐🙏💐


*అన్వేషణ నా కర్తవ్యం*


*ఆలోచన నా నైజం* 


*ఆవేదన నా కర్మ ఫలం*

 

*అనురాగం నా బంధనం*


*ఆత్మీయత నా  గుణం*


*ఆక్రోశం నా దుఃఖం*


ఇవన్నీ *నాకు* కలిగేవి.


*ఆనందం  నా లక్షణం.*

  

*ఆనందం నా స్వభావం.*

 

ఇది *నాలో* ఉండేది.




*Sri panjarla Mahindra Reddy*


*హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేయడానికే*

*బ్రాహ్మణ వ్యతిరేక వాదం వెనుక ఉన్న కుట్ర .*


*పరాయి మత చాందస వాద పాలకులచే మన మెదళ్లలో నాటబడ్డ బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతం అర్ధం చేసుకోవడానికి బుర్ర ఉంటే చాలు ఎవరికైనా . అపారమైన తెలివితేటలూ అవసరం లేదు . మన దేశాన్ని తుష్కర మూకలు 800 సంవత్సరాలు , క్రైస్తవ మూకలు 200 సంవత్సరాలు అప్రతిహతంగా పాలించారు . మరి ఈ దేశంలో కొన్ని వర్గాల వారు అభివృద్ధి చెందలేకపోవడానికి పూర్తిగా బ్రాహ్మణులే కారణం అంటుంటే మన బుర్ర ఎప్పుడైనా ఆలోచించిందా?*


*మన దేశాన్ని పాలించిన చక్రవర్తులలో అధిక శాతం బ్రహ్మణేతరులు కాదా ?* *ఉదాహరణకు చంద్రగుప్త మౌర్య , శ్రీ కృష్ణ దేవరాయ , ఛత్రపతి శివాజీ , చోళులు , పాండ్యులు వీళ్ళెవరూ బ్రాహ్మణులు కాదే . బ్రాహ్మణుడైన చాణక్యుడు లేకుంటే చరిత్రలో చంద్ర గుప్తుని స్థానం ఏంటి అసలు . మన పురాణాల్లో గాని , కధల్లో గాని మనం ఏం చదువుకున్నాం ? "* *అనగనగా ఒక ఊరిలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు . అతని కుటుంబానికి తినడానికి తిండి కూడా ఉండేది కాదు . ఒకరోజు అతను అడవిలో వెళ్తుండగా.... " ఇటువంటి కధలే కదా మనం చదువుకుంది . మరి అంత పేద బ్రాహ్మణుడు వేరే వారిపై వివక్ష ఎలా చూపించాడంటారు చెప్పండి ?*


*నేడు హరిజనులుగా పేర్కొనబడుతున్న కొన్ని కులాల వారిని నిజానికి అణచివేసింది భూస్వాములు , జమిందారులు , క్రైస్తవులు, ముస్లింలు మాత్రమే . మొత్తం బ్రాహ్మణులలో అర్చక వృత్తి చేప్పట్టే వారూ కేవలం 20% మాత్రమే ఉంటారు . ఒకసారి ఆలోచించండి . మన స్నేహితుల్లో ఉన్న బ్రాహ్మణుల్లో ఎంతమంది అర్చక వృత్తి చెప్పట్టారో. నా స్నేహితుల్లో అర్చక వృత్తిని చేపట్టిన వారు 2 ,3 ముగ్గురు తప్పించి ఎవరూ లేరు.*


*మేధావులు చెప్పినట్టు బ్రాహ్మణులకు మాత్రమే వేద విద్య అనుకుంటే నేడు మనకు ఆది కావ్యమైన రామాయణం ఉండేది కాదు . హిందువులకు అత్యంత పవిత్రమైన భగవద్గీత , పురాణాలు , మహా భారతాలే ఉండేవి కాదు . వీటిని రచించింది బ్రాహ్మణులు కాదు . ఎప్పటి సంగతో ఎందుకు హిందూ ధర్మ రక్షకుడు అయిన స్వామీ వివేకానంద బ్రాహ్మణుడు కాదు.* 


*చరిత్రలో బ్రాహ్మణులపై దాడి :*


*హిందువుల మహా పుణ్య క్షేత్రం అయిన కాశీలో, గంగ ఒడ్డున మతం మారాడానికి నిరాకరించారు అన్న కారణంతో వేల మంది బ్రాహ్మణులను , వారి పిల్లలను నరికి చంపి దూరంగా కనపడే ఒక పెద్ద గుట్టగా వేసాడు ముష్కర చక్రవర్తి ఔరంగజేబు . ఆ బ్రాహ్మణుల జంధ్యాలు తెంచి గుట్టగా పోసి నిప్పంటించి చలి కాచుకున్నడు ఆ క్రూరుడు .*


*క్రైస్తవ సన్యాసి సెయింట్ జేవియర్ పోర్చుగల్ రాజుకి ఒక ఉత్తరం రాసాడు . దాని సారాశం ఏమంటే " బ్రాహ్మణులను లేకుండా చేస్తే  భారతీయులందరూ తేలిగ్గా క్రైస్తవులుగా మారిపోతారు " అని . అర్ధం అయ్యింది కదా . బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతం వెనుక ఉన్న అసలు కుట్ర ఇదీ . వేల మంది గౌడ సరస్వతి బ్రాహ్మణులను కిరాతకంగా చంపించాడు నేర విచారణ పేరుతో . దీనినే మనం "Goa Inquisition" పేరుతో చరిత్రలో చదువుకుంటాం .*


*మైసూరు ప్రాంతం మేల్కొటేలో దీపావళి రోజున 800 మంది అయ్యంగార్ బ్రాహ్మణులను ఊచకోత కోయించాడు టిప్పు సుల్తాన్ . అందుకే ఇప్పటికీ ఆ ప్రాంతంలో బ్రాహ్మణులు దీపావళి జరుపుకోరు .*


*ఇక కాశ్మీరీ పండిట్ల సంగతి తెలియనిది ఎవరికీ . మతం మారతారా లేక ఇళ్ళు విడిచిపెట్టి పోతారా అని నమాజ్ అనంతరం మైకుల్లో ప్రకటన చేస్తే ప్రాణాలు అరచేత పట్టుకుని ఢిల్లీ ప్లాటుఫారంల పైకి చేరి దిక్కు లేని జీవితం గడుపుతున్నారు వేలాది మంది కాశ్మీరీ పండిట్లు . ముష్కర జీహాదీల చేతుల్లో దాదాపుగా హత్య చేయబడ్డ వారూ 500000 మంది.*


*మీకు తెలుసా కాశీలో రిక్షా తొక్కుకుని జీవించే వారిలో అధిక శాతం బ్రాహ్మణులే .  ఢిల్లీ రైల్వే స్టేషన్లో కూలీలుగా పని చేసేవారిలో 50% బ్రాహ్మణులే . ఆంధ్ర ప్రదేశ్లో వంట పని వారుగా పని చేసేవారిలో 75% బ్రాహ్మణులే . ఈ బాధలు పడలేకే చదువుకున్న బ్రాహ్మణులు ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ విదేశాల్లో స్థిరపడుతూ అక్కడ మన సంప్రదాయాలను ప్రచారం చేస్తున్నారు.*


*బ్రాహ్మణులు ప్రధానంగా జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల , మత మార్పిడి మాఫియాలు ఎక్కువగా బ్రాహ్మణ వ్యతిరేక కధలు ప్రచారం చేస్తుంది . వారు చెప్పే తాటాకు, చెంబు కధలు చరిత్రలో ఎక్కడా కనపడవు . కాని ఒక అబద్దాన్ని పదే పదే చెబితే దాన్నే నిజం అనుకుంటుంది ఆలోచించే సమయం లేని లోకం . ఇదే వారి సిద్ధాంతం . నేటికి కూడా ఇలా వ్యతిరేక సిద్ధాంత్తాన్ని కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ మొదలైన చాలా పార్టీ వాళ్ళు వెనక ఉండి నడిపిస్తున్నారు . దయచేసి ఎవరు వారి ఉచ్చు లో పడకండి , మీ ధర్మాన్ని చరిత్ర ని తెలుసుకోండి , ధర్మంగా జీవించండి .*

*జై శ్రీ రామ్ జై భారత్ భారత్ మాతాకీ జై జై హింద్*

*ఇట్లు*

*మీ పెంజర్ల మహేందర్ రెడ్డి*

*అఖిల భారత ఓసి సంఘం*

*మరియు EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్*

 *జాతీయ అధ్యక్షుడు*

*జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ....

 *


*ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ....*


నేను ఈ లేఖ రాయడానికి మూడు కారణాలున్నాయి.


1. జీవితం లో అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు.


2. నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ నీకు చెప్పరు.


3.నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో నీ గుండె గాయపడకుండా ఉంటుంది.


*ఈ క్రింద విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకో....*


1. నీతో సఖ్యంగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోకు.

 నేను, మీ అమ్మ తప్ప నీకు తప్పనిసరిగా మంచే చేయాలన్న బాధ్యత ఎవరికీ లేదని బాగా గుర్తెరిగి మసలుకో.

నీతో మంచిగా ఉన్నవారిపట్ల కృతజ్ఞుడివై వుండు.

 అలాగే జాగ్రత్తగా గమనించు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చేసే ప్రతి పనికీ ఒక ఉద్దేశం ఉంటుంది. 

 నీతో ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ అలానే ఉండాలని లేదు, జాగ్రత్త, గుడ్డిగా వారిని ఆత్మీయులుగా నమ్మి మనసు గాయపరచుకునేవు సుమా!


2. ఏ ఒక్కరూ తప్పనిసరి కాదు మరియు తప్పక కలిగి ఉండితీరవలసినది ఏదీ లేదని మరచిపోకు.

ఇది నీవు సరిగా అర్థం చేసుకున్న రోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా, 

నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా నీ మనసు పెద్దగా గాయపడదు.


3. జీవితం చిన్నది.

ఒక్క రోజు వ్యర్థమైనా చక్కగా అనుభవిం చాల్సిన, 

మళ్ళీ తిరిగిరాని ఒక రోజుని కోల్పోయావన్న విషయం గుర్తించు.


4. ప్రేమ అనేది ఒక నిలకడలేని, చంచలమైన ఒక భావన.

కాలాన్ని, మూడ్ ని బట్టి వెలసిపోయే ఒక ఎమోషన్.

 నువ్వు బాగా ప్రేమించానను కున్నవారు దూరమైనపుడు కుంగిపోకు, ఓపిక పట్టు. కాలం నీ గాయాలను, బాదలను అన్నింటినీ కడిగేస్తుంది.

ప్రేమ యొక్క సౌందర్యాన్ని , 

అలాగే ప్రేమ విఫలమవడాన్ని అతిగా ఊహించుకోకు. 

ఇవి ఏమంత పెద్ద విషయాలు కావని కాలం గడిచే కొద్దీ తెలుసుకుంటావని తెలుసుకో.


5. చాలామంది పెద్దగా చదువుకోకుండానే జీవితంలో బాగా పెద్ద స్థాయికి వెళ్లుండచ్చు, 

కానీ దానర్థం నువ్వు కష్టపడి చదవకుండానే గొప్పవాడయిపోతావని కాదు. 

నువ్వు సంపాదించే జ్ఞానమంతా నీ ఆయుధాలని గ్రహించు.

దీవాళా తీసిన స్థితి నుండి తిరిగి ఉన్నతమైన స్థానం చేరడం సాద్యమే, 

కానీ దీవాళా తీసినప్పటి పరిస్థితి దారుణంగా ఉంటుందని మరచిపోకు.


6. నేను వృద్ధాప్యంలో ఆర్థికంగా నీమీద ఆధారపడను, అలాగే జీవితాంతం ఆర్థికంగా నీకు ఆసరా ఇవ్వలేను. నువ్వు పెద్దవాడవుతూనే నా బాధ్యత తీరిపోతుంది. తర్వాత బస్సులో తిరుగుతావా నీ సొంత లగ్జరీ కారులోనా? రిచ్ గానా మామూలు జీవితమా? అన్నది నీవే నిర్ణయించుకో.


7. నువ్వు నీ మాట నిలబెట్టుకో. ఇతరులనుంచి ఏది ఆశించకు.

 నువ్వు అందరితో మంచిగా ఉండు, 

అందరూ నీతో మంచిగా ఉంటారని అనుకోకు. 

ఇది నువ్వు సరిగా అర్ధం చేసుకోకపోతే నీకు అనవసర సమస్యలు తప్పవు.


8. లెక్కలేనన్ని లాటరీ టికెట్లు చాలా కాలం కొన్నా, ఒక్క చెప్పుకోదగ్గ పెద్ద ప్రైజ్ కూడా ఎప్పుడూ రాలేదు. కష్టపడితేనే ధనవంతులవుతాము అన్నదానికి ఉదాహరణమిదే. విజయానికి షార్ట్ కట్ లేదని బలంగా నమ్ము.


9. అది ఎంత తక్కువ/ ఎక్కువ కాలమైనా సరే, మనం కలసివున్న కాలాన్ని జాగ్రత్తగా దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్లీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా కన్నా!

                                      *........ నాన్న*


Heart Touching and very valuable 👍

సత్యం వలన

 .

             _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*అమృతం చైవ మృత్యుశ్చ* 

*ద్వయం దేహే ప్రతిష్ఠితమ్।*

*మృత్యుమాపద్యతే మోహాత్* 

*సత్యేనాపద్యతేఽమృతమ్॥*

                         ~మహాభారతమ్


తా𝕝𝕝

*శరీరంలో అమృతమూ మృత్యువూ రెండూ ఉంటాయి... మోహం వలన మృత్యువును, సత్యం వలన అమృతాన్ని పొందుతారు*......"

 WHAT TO DO IF SUDDENLY YOU ARE UNABLE TO PASS URINE ...

This is the experience of a famous allopathy doctor on account of a medical article. He is in his 70's and an ENT specialist. It was astonishing to listen to one of his experiences which he shared. 

That morning one day he had a problem on waking up. He had an urge to pass urine but for some reason he was unable to do so. At an advanced age some people face such a problem some times and if they try two or three times they may succeed. He tried repeatedly but nothing happened. His continuous efforts didn’t bear any result. Then he realised there is a problem. Although he is a doctor he is no exception to such physical problems as he is also made of flesh and blood like everyone else. Now his lower abdomen became heavy and he was unable to sit or stand and was suffering from the pressure buildup. Immediately he called up a known urologist on the phone and explained his situation. The Urologist replied “I am at present in a hospital in the outskirts and I will be at a clinic in your area in one and a half hours.. Will you be able to withstand it for that long?” He replied “I will try”. 

At that instant he received an incoming call from another allopathy doctor, a childhood friend. With great difficulty the old doctor explained the situation to his friend.  

His friend replied “Oh, your bladder is full and you are unable to pass urine. Don’t worry, do as I suggest and you will be able to overcome it”. 

And he gave the instruction:

: “Stand up and jump vigorously … while jumping lift both your hands as though you are plucking mangoes from a tree.. Do that 15 to 20 times”. 

What? ? ?

With a full bladder he wants me to jump? 

Though a little sceptical the old doctor tried it. What a relief to him when within 5 to 6 jumps urine started passing. He felt overjoyed and thankful to his childhood friend for solving the issue with such a simple method which otherwise would have required an admission to a hospital where they would have inserted a catheter inside the bladder, injections, anti-biotics etc etc etc resulting in a bill over thousands of Dollars in addition to physical and mental stress for him and his near and dear ones.

 

KINDLY SHARE WITH SENIOR CITIZENS AND ALL WHO MAY NEED THIS VERY SIMPLE REMEDY FOR WHAT COULD BE AN UNBEARABLE EXPERIENCE.

మిత్రుడు

 శ్లోకం:☝️

*ఉత్సవే వ్యసనే ప్రాప్తే*

 *దుర్భిక్షే శత్రుసంకటే l*

*రాజద్వారే శ్మశానేచ*

 *య తిష్ఠతి స బాంధవః ll*


భావం: సుఖంలోనూ, దుఃఖంలోనూ, ధనికునిగా ఉన్నప్పుడు, పేదరికంలోనూ, శత్రు బాధలందును, రాజాస్థానములోనైనా శ్మశానమందైనా అండగా నిలచినవాడే అసలైన మిత్రుడు. సూర్యునికి మిత్రుడు అన్న నామముంది. ఆయన వెలుగేలేనిదే ఒక్క రోజునైనా ఉహించలేము.

*ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 65*

🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 65*


నందసోదరుల వైపు ప్రసన్నంగా దృష్టి సారించాడు జీవసిద్ధి. 


"చాతుర్వర్ణములలో బ్రాహ్మణులదే మిగిలిన మూడు వర్ణముల వారిపై ఆధిపత్యం. దానికి కారణం బ్రాహ్మణుల హస్తగతమై ఉన్న వేదాలు. ఉపనిషత్తులు, మంత్రాలు, తంత్రాలు. నిజానికి అది వారి తప్పు కాదు. క్షత్రియులు అధర్వణ వేదంలోని యుద్ధ, రాజకీయ, రాజ్యాంగ, ధనుర్విద్యా విభాగాలని మాత్రమే అధ్యయనం చెయ్యడానికి ఇష్టపడతారు. ఎందుకంటే, రాజ్యాధికారం క్షత్రియులదే కాబట్టి, వారు అంతవరకూ తెలిస్తే చాలనుకుంటారు." 


"నిజం. నిజం." అన్నాడు సుకల్పనందుడు, జీవసిద్ధి మాటలకు వంత పాడుతూ. 


జీవసిద్ధి మందహాసం చేసి "వైశ్యులు వ్యాపారవాణిజ్యాలే తమకి ముఖ్యమని భావిస్తారు కాబట్టి, వారు అర్థశాస్త్రా అధ్యయనాన్ని మాత్రమే ఆశిస్తారు. శూద్రులకి అసలు వేదద్యయన అధికారమే లేదు" అన్నాడు. 


"యదార్ధం ... యదార్థం..." అన్నాడు సుకల్పుని తమ్ముడు, కోశాధికారి ధర్మానందుడు. 


జీవసిద్ధి తలపంకించి "అందుకే బ్రాహ్మణులకే అన్ని శాస్త్రాలూ సొంతమయ్యాయి. ఒక చిన్న మంత్రం కావాలన్నా, మంత్రోపదేశం పొందాలన్నా, మందో మాకో కావాలన్నా, తాయత్తో రక్షరేఖో అవసరమైనా, ఇలా ప్రతి చిన్న విషయానికీ మిగతా వర్ణాలవారు వారి మీద ఆధారపడడం వల్ల వారి ఆధిపత్యం పెరిగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే నియమ నిష్టాతులైన బ్రాహ్మణులు నిస్వార్ధంగా సమాజసేవ చేస్తున్నారు. ధర్మరక్షణ దీక్షను వహిస్తున్నారు. నిజమే, కానీ అభిజాతులైన కొందరు బ్రాహ్మణులు ప్రపంచానికి తామే దిక్కూ, అతీ గతీ అని అహంకరించడం చేతనే బౌద్ద మతావలంబులమైన మేము వారి అహంకారాన్ని యండ గట్టడానికి... ఇప్పటివరకూ వారికి మాత్రమే సొంతమైన మంత్ర, తంత్ర, మహిమాన్విత మాయాశక్తుల మీద పట్టు సాధించాం... లోకసేవ, ఆర్తుల రక్షణ చేస్తూ మా మహత్తును లోకానికి చాటుతున్నాం" అని వివరించాడు. 


"తమ మాటలు ప్రత్యక్షర సత్యం .... అందుకే తమ ఆశ్రయం కోరి వచ్చాం" చెప్పాడు సుకల్పనందుడు వినయంగా. 


"చేతులు కాలాక, ఆకులు పట్టుకున్న చందానా... ?" అంటూ జీవసిద్ధి నవ్వి చప్పున కళ్ళు మూసుకుని ధ్యాన నిమగ్నుడయ్యాడు. అతని నోటి వెంట ఏం మాట వస్తుందోనని నందులు ఉత్కంఠతో ఎదురు చూడసాగారు. రెండు క్షణాల తర్వాత... 


"నల్ల బాపడు నందప్రభువులను దూషిస్తుంటే... నమ్మకస్తులమని పదే పదే చెప్పుకుంటున్న వాళ్లు వారించకపోగా... అతడిని దండించకుండా అడ్డుపడ్డాడు కదా ... అసలు ఎవరి అండదండలూ లేకుండానే అతడలా మిడిసి పడగలడా ?" అన్నాడు జీవసిద్ధి ఉచ్చస్వరంతో. నందులు ఉలిక్కిపడి మొహాలు చూసుకున్నారు. 


"ఆ బాపడు తనంతతానే వచ్చాడా... ? నందులను అవమానించాలన్న దురుద్దేశంతో... మహానందుల వారి వంశాంకురానికి మగధ సింహాసనాన్ని కట్టబెట్టాలన్న దుర్బుద్ధితో... అయిన వాళ్లే పథకం ప్రకారం ఆ బాపడిని రప్పించి రభస చేయించారా ?" అన్నాడు జీవసిద్ధి మహోగ్రస్వరంతో, ధ్యానదీక్షలో. 


సుకల్పనందుడి మొహం ఎరుపెక్కింది. పటపట పళ్లు కొరుకుతూ "నిజమే... మేము ఎంత అభిమానంగా సేవిస్తున్నా సుబంధుల వారికింకా మహానందుల వారి మీదున్న అభిమానం పోలేదు. ఆనాటి ఆయన పరిపాలనతో మా పరిపాలనని పోలుస్తూ అప్పుడప్పుడూ మమ్మల్ని కించ పరుస్తుంటాడు. అసలు ఆయన మెప్పుకోసమే ధర్మశాలలో ప్రత్యేకపీఠం ఏర్పాటు చేశాం. ఆ పీఠం కారణంగానే అవమానాల పాలయ్యాం. ఆ చాణక్యుడు మమ్మల్ని అనరాన్ని మాటలు అంటుంటే ఆయన్ని ఖండించలేదంటే... అది సుబంధుల వారి వ్యూహమా ? చాణక్యుని పట్ల బ్రహ్మణాభిమానమా...?" అన్నాడు ఉక్రోషంగా. 


"ఏదైతేనేం...? స్వజాతి అభిమానంతో మిమ్మల్ని అవమానించిన బాపడిని మందలించకుండా ఉపేక్షించిన వారిని శిక్షించకతప్పదు... ధర్మశాలని తక్షణం మూసివెయ్యండి. బోలడంత ధనం ఆదా అవుతుంది. సుబంధుల వారిని తరిమెయ్యండి. మీ ప్రక్కనే నమ్మకంగా ఉంటూ, నక్కజిత్తులు ప్రదర్శించి మీ రహస్యాలను మీ శత్రువులకు చేరవేసిన ఫలితం అనుభవిస్తాడు..." చెప్పాడు జీవసిద్ధి బిగ్గరగా. 


"తమ ఆజ్ఞని తక్షణం పాటిస్తాం స్వామీ ! ధర్మశాల వల్ల మాకంతా నష్టమే. దాన్ని వెంటనే మూసేస్తాం. సుబంధుడిని ఆలస్యం చెయ్యకుండా సాగనంపుతాం. ఇంకా ఏం చెయ్యాలో శెలవియ్యండి" అన్నాడు ధర్మనందుడు. 


"ప్రస్తుతం ఈ రెండు చెయ్యండి. మేము వీలు చూసుకుని కోటనీ, అంతఃపురాన్నీ సందర్శిస్తాం. అక్కడే ఏదో దుష్టశక్తుల ప్రాబల్యమేదో మా దివ్యదృష్టికి గోచరిస్తోంది. మా మహత్తుతో ఆ శక్తులను గుర్తించి, మా మంత్రశక్తితో వాటి ఆట కట్టిస్తాం..." అన్నాడు జీవసిద్ధి కళ్ళు తెరుస్తూ. 


సరిగ్గా అప్పుడే రాజుగురువు సుబంధుడు హడావిడిగా లోపలికి వచ్చాడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

హనుమజ్జయంతి ప్రత్యేకం - 9/11

ॐ       హనుమజ్జయంతి ప్రత్యేకం - 9/11

       (ఈ నెల 14వ తేదీ హనుమజ్జయంతి) 


IX. హనుమంతుడు - పరిపాలకుల శక్తి అంచనా 


హనుమంతుడు, 

    సీతాన్వేషణకై దక్షిణదిక్కుకు పయనమైన బృంద నాయకుడు అంగదుని సామర్ధ్యాన్ని గుర్తించి, 

    సక్రమ మార్గానికై హెచ్చరిక చేశాడు. 


    "వాలి కుమారుడైన అంగదునిలో 

  - అష్టాంగములు (బుద్ధికి సంబంధించిన గుణములు), 

  - నాలుగు బలములు, 

  - పదునాలుగు విశిష్ట గుణములు కలవని హనుమంతుడు గుర్తించాడు" 


"బుద్ధ్యా హ్యష్టాంగయా యుక్తం  

 చతుర్బల సమన్వితం I 

 చతుర్దశగుణం మేనే  

 హనుమాన్ వాలినః సుతమ్" ॥ 

              కిష్కింధాకాండ 54/2  


    Hanuman thought Vali's son possessed in addition to his intellect, 

  - eight kinds of limbs, 

  - four kinds of strength and 

  - fourteen qualities 

      (required of a king):


I. బుద్ధికి సంబంధించిన ఎనిమిది గుణాలు:  

( Eight attributes of intellegence ) 


(i) వినవలెననే కోరిక, 

(ii) వినడం, 

(iii) విన్న విషయాన్ని గ్రహించడం, 

(iv) గ్రహించినదాన్ని మనసున నిలపటం, 

(v) ఊహించడం, 

(vi) సంశయ నివృత్తి, 

(vii) అర్థాన్ని చక్కగా గ్రహించడం, 

(viii) తత్త్వజ్ఞానాన్ని ఎఱుగడం. 


Eight attributes of intellegence: 


(i) Inclination to hear what otgers say (శుశ్రూషా),  

(ii) actuallt hearing what others say (శ్రవణం), 

(iii) the Capacity to grasp the meaning of what others say (గ్రహణం), 

(iv) Retentiveness (ధారణం),  

(v) Reasoning in favour of a proposition (ఊహః), 

(vi) Reasioning against a proposition (అపోహః), 

(vii) Insight into the meaning of what others say (అర్థలవిజ్ఞానమ్), 

(viii) True Wisdom (తత్త్వజ్ఞానమ్). 


* another set of meanings (with a slight difference): 


(i) an inclination to hear what  others have to say, 

(ii) the capacity to hear what others have to say, 

(iii) the ability to comprehend the basic meaning of what others have to sat, 

(iv) good memory, 

(v) capacityt to reason in favour of a preposition, 

(vi) capacity to reason againt a preposition, 

(vii) deep insight into the meaning of what others say, 

(viii) true wisdom. 


"శుశ్రూషా శ్రవణం చైవ 

గ్రహణం ధారణం తథా I 

ఊహాఽపోహ అర్థవిజ్ఞానం 

తత్త్వజ్ఞానం చ ధీ గుణాః ॥" 

                   లేక 

" గ్రహణం ధారణం చైవ 

  స్మరణం ప్రతిపాదనం I 

  ఊహోఽపోహోఽర్థ విజ్ఞానం 

  తత్త్వజ్ఞానంచ ధీగుణాః ॥" 


II. నాలుగు బలములు 


సామ, 

దాన, 

భేద, 

దండోపాయాలు 

(ఇవి శత్రువును లొంగదీసుకోడానికి తగిన ఉపాయాలు) 

              మరియు 

బాహుబలము, 

మనోబలము, 

ఉపాయబలము, 

బంధుబలము. 


III. రాజుకు ఉండవలసిన పదునాలుగు విశిష్ట లక్షణాలు:  

  ( Fourteen excellences that characterize great personalities )


(i) దేశకాల జ్ఞానము  

    (a sense of place and time), 

(ii) దృఢత్వము 

    (firmness), 

(iii) అన్నివిధములైన క్లేశములను సహింపగల శక్తి  

    (ability to endure all kinds of hardship), 

(iv) వివిధ విషయములయందు పరిజ్ఞానము  

    (knowledge of all subjects), 

(v) సామర్థ్యము 

    (expertise), 

(vi) ఉత్సాహము లేక బలము 

    (vigor), 

(vii) మంత్రాలోచనలు గోప్యంగా ఉంచడం 

    (సంవృతమంత్రతా - ability to guard secrets), 

(viii) పరస్పర విరోధములైన మాటలు పలుకకుండటం 

    (అవిసంవాదితా - consistency), 

(ix) శౌర్యము 

    (heroism), 

(x) తనబలాన్నీ శత్రుబలాన్నీ ఎఱిగియుండడం 

    (శక్తిజ్ఞత్వం - ability to judge one's own strengtg in comparison to that of the enemy), 

(xi) కృతజ్ఞత 

    (appreciation for the services rendered by others), 

(xii) శరణాగత వాత్సల్యము 

    (compassion for surrendered souls), 

(xiii) తగిన సమయమున కోపాన్ని ప్రకటించడం 

    (అమర్షిత్వమ్ - indignation in the presence of unrighteousness), 

(xiv) స్థిరత్వాన్ని కలిగియుండడం 

    (అచాపలమ్ - steadyness in duty). 


" దేశకాలజ్ఞతా,దార్ఢ్యం,సర్వక్లేశ సహిష్ణుతా,  సర్వవిజ్ఞానితా,దాక్ష్యమ్,ఊర్జః,

                సంవృతమంత్రతా I  అవిసంవాదితా,శౌర్యం,శక్తిజ్ఞత్వం,కృతజ్ఞతా,

శరణాగతవాత్సల్యమ్,అమర్షిత్వమ్, 

                        అచాపలమ్ ॥ " 


    మన రాజకీయ విధాన నిర్ణేతలకీ, పరిపాలనాధికారులకీ కూడా ఈ లక్షణాలు ఉండాలి అని హనుమను ప్రార్థిద్దాం. 

             

               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్  


                           కొనసాగింపు .... 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

 నేను ఇలా అనుకుంటాను*


 1. భగవంతుడిని వశంచేసుకునే యుక్తే భక్తి.


2. భక్తి నటించ కూడదు. భక్తిని జీవింపజేయాలి.


3. ధ్యానంలో పరమాత్మను అంతర్ముఖంగా దర్శించాలి. ఆలయంలో భగవంతుని బహిర్ముఖంగా (తెరచిన కళ్ళతోనే) దర్శించాలి.


4.  భగవంతుని సన్నిధిలో అన్యులకు పాదాభివందనం చేయకూడదు.


5. దానం ఏ చేత్తో ఇచ్చినా పరవాలేదు. ఎడమ చేత్తో ఇచ్చినా మంచిదే. హృదయం ఎడం ప్రక్క ఉంది గదా!


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

 సాయంకాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ద్వాదశస్కంధము -  తొమ్మిదవ అధ్యాయము*


*మార్కండేయుడు భగవన్మాయను దర్శించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*9.17 (పదిహేడవ శ్లోకము)*


*క్వచిద్గతో మహావర్తే తరలైస్తాడితః క్వచిత్|*


*యాదోభిర్భక్ష్యతే క్వాపి స్వయమన్యోన్యఘాతిభిః॥13899॥*


*9.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*క్వచిచ్ఛోకం క్వచిన్మోహం క్వచిద్దుఃఖం సుఖం భయమ్|*


*క్వచిన్మృత్యుమవాప్నోతి వ్యాధ్యాదిభిరుతార్దితః॥13900॥*


ఆ ముని ఒక్కొక్కసారి పెద్ద పెద్ద సుడిగుండములలో చిక్కుకొనుచుండెను. ఒక్కొక్క పర్యాయము తరంగములతో కొట్టబడుచుండెను. ఒక్కొక్కసారి పరస్పరము పోట్లాడుకొనుచున్న జలజంతువులు ఆయనపై విరుచుకొనిపడుచు బాధించుచుండెను. అతడు అప్పుడప్పుడు శోకగ్రస్తుడగుచుండెను. ఒక్కొక్కసారి మోహములో పడిపోవుచుండెను. అప్పుడప్పుడు పూర్తిగా దుఃఖములో మునిగిపోవుచుండెను. ఒక్కొక్కసారి సుఖానుభవమును పొందుచున్నట్లుగా ఉండెను. అప్పుడప్పుడు వ్యాధులకు లోనగుచున్నట్లుగను, మృత్యువుపాలగుచున్నట్లుగను భావించి, భయకంపితు డగుచుండెను. 


*9.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*అయుతాయుతవర్షాణాం సహస్రాణి శతాని చ|*


*వ్యతీయుర్భ్రమతస్తస్మిన్ విష్ణుమాయావృతాత్మనః॥13901॥*


ఈ విధముగా మార్కండేయుడు శ్రీమహావిష్ణువుయొక్క మాయామోహితుడై ప్రళయకాల జలధియందు పరిభ్రమించు చుండగా, కోట్లకొలది సంవత్సరములు గడచిపోయెను.


*9.20 (ఇరువదియవ శ్లోకము)*


*స కదాచిద్భ్రమంస్తస్మిన్ పృథివ్యాః కకుది ద్విజః|*


*న్యగ్రోధపోతం దదృశే ఫలపల్లవశోభితమ్॥13902॥*


శౌనకమహర్షీ! మార్కండేయుడు ఇట్లు ప్రళయకాల జలములలో పెద్దకాలము తిరుగుచుండెను. ఒకనాడు అతడు ఒక ఎత్తైన ప్రదేశమునందు కోమలమైన ఒక చిన్న మర్రిచెట్టును జూచెను. అది చిగురుటాకులతోను, ఫలములతోను విలసిల్లుచుండెను.


*9.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*ప్రాగుత్తరస్యాం శాఖాయాం తస్యాపి దదృశే శిశుమ్|*


*శయానం పర్ణపుటకే గ్రసంతం ప్రభయా తమః॥13903॥*


ఆ మర్రిచెట్టుయొక్క ఈశాన్య దిశయందలి కొమ్మపై దొన్నె ఆకారమున ఒక ఆకుగలదు. అందు అందమైన ఒక చిన్న శిశువు పరుండియుండెను. ఆ శిశువుయొక్క దేహకాంతి ప్రభావమున ఆ చుట్టునుగల చీకట్లు  పటాపంచలైపోయెను.


*9.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*మహామరకతశ్యామం శ్రీమద్వదనపంకజమ్|*


*కంబుగ్రీవం మహోరస్కం సునాసం సుందరభ్రువమ్॥13904॥* 


ఆ శిశువు దివ్యమైన ముఖారవిందమున అందములు చిందుచుండెను. అతడు శంఖమును బోలిన కంఠమును, విశాలమైన వక్షస్థలమును, చక్కని నాసికను, చూడముచ్చట గొలిపెడి కనుబొమలను కలిగి అల్లారు ముద్దుగా ఉండెను. 


*9.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*శ్వాసైజదలకాభాతం కంబుశ్రీకర్ణదాడిమమ్|*


*విద్రుమాధరభాసేషచ్ఛోణాయితసుధాస్మితమ్॥13905॥*


అతనియొక్క నిశ్శ్వాసలకు కుంతలములు  ఇటునటు కదలుచు శోభాయమానములై యుండెను. శంఖాకారముననున్న అతని చెవులయందు దానిమ్మపూవులవలె  నున్న ఆభరణములు మిలమిల మెఱయుచుండెను. అమృతధారలొలికెడు అతని చిఱునవ్వుపై పడుచున్న పగడమువంటి అధరముయొక్క శోణ (ఎర్రని) కాంతులు మనోహరముగా నుండెను. 


*9.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*పద్మగర్భారుణాపాంగం హృద్యహాసావలోకనమ్|*


*శ్వాసైజద్వలిసంవిగ్ననిమ్ననాభిదలోదరమ్॥13906॥*


నేత్రాంతములు పద్మములయందలి లోపలిభాగమువలె అరుణద్యుతులను వెలార్చుచుండెను. దరహాసములు, చూపులు, హృద్యములై అలరారుచుండెను. ఆ చిన్నారి నిట్టూర్పులు  సలుపుచున్నప్పుడు వళిత్రయము పైకి క్రిందికి కదలుచు మనోజ్ఞముగా ఉండెను. గంభీరమైన   నాభితో  ఒప్పుచున్న ఉదరము రావి ఆకువలె చలించుచుండెను.


*9.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*చార్వంగులిభ్యాం పాణిభ్యామున్నీయ చరణాంబుజమ్|*


*ముఖే నిధాయ విప్రేంద్రో ధయంతం వీక్ష్య విస్మితః॥13907॥*


ఆ పసివాని చేతులవ్రేళ్ళు అతికోమలములు. ఆ చిన్ని శిశువు మృదువైన తన చిట్టి చేతులతో పాదారవిందమును పట్టుకొని నోటియందిడుకొని బొటనవ్రేలును చీకుచుండెను. ఈ అద్భుత దృశ్యమును గాంచి మార్కండేయుడు మిగుల విస్మితుడాయెను.


ఈ సుందర దృశ్యమును లీలాశుకుడు తన కృష్ణకర్ణామృతమున ఇట్లు వర్ణించెను.


*శ్లో. కరారవిందేన పదారవిందం, ముఖారవిందే వినివేశయంతమ్|*

*వటస్య పత్రస్య పుటే శయానం, బాలం ముకుందం మనసా స్మరామి॥*


*9.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*తద్దర్శనాద్వీతపరిశ్రమో ముదా ప్రోత్ఫుల్లహృత్పద్మవిలోచనాంబుజః|*


*ప్రహృష్టరోమాద్భుతభావశంకితః ప్రష్టుం పురస్తం ప్రససార బాలకమ్॥13908॥*


శౌనకమహర్షీ! ఆ దివ్యశిశువును జూచినంతనే మార్కండేయుని అలసటలు అన్నియును తొలగిపోయెను. అతని హృదయపద్మము సంతోషముతో నిండిపోయెను. కమలమువలె వికసితములయ్యెను. శరీరము పులకించిపోయెను. 'ఇంతకును ఈ మహిత శిశువు ఎవరు?' అని అతడు తన మనస్సునగల శంకను దీర్చుకొనుటకై ఆ బాలుని సమీపమునకు చేరుటకు ముందుకు  జరిగెను.


*9.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*తావచ్ఛిశోర్వై శ్వసితేన భార్గవః సోఽన్తఃశరీరం మశకో యథాఽఽవిశత్|*


*తత్రాప్యదో న్యస్తమచష్ట కృత్స్నశో యథా పురాముహ్యదతీవ విస్మితః॥13909॥*


మార్కండేయుడు ఆ శిశువును చేరకముందే అతని ఉఛ్వాసవేగమున అతడు ఒక దోమవలె ఆ శిశువు గర్భములోనికి లాగబడెను. అచట అతడు ప్రళయమునకు పూర్వమునగల సమస్త జగత్తును గాంచెను. ఆ విచిత్ర దృశ్యమునకు అతడు ఎంతయు అబ్బురపడెను. మోహవశమున ఆయనకు దిక్కుతోచని స్థితి ఎదురయ్యెను.


*9.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*ఖం రోదసీ భగణానద్రిసాగరాన్ ద్వీపాన్ సవర్షాన్ కకుభః సురాసురాన్|*


*వనాని దేశాన్ సరితః పురాకరాన్ ఖేటాన్ వ్రజానాశ్రమవర్ణవృత్తయః॥13910॥*


*9.29 (ఇరువది తొమ్మిదివ శ్లోకము)*


*మహాంతి భూతాన్యథ భౌతికాన్యసౌ కాలం చ నానాయుగకల్పకల్పనమ్|*


*యత్కించిదన్యద్వ్యవహారకారణం దదర్శ విశ్వం సదివావభాసితమ్॥13911॥*


ఆ పసివాని ఉదరమున అతడు ఆకాశమును, అంతరిక్షమును, నక్షత్రములతో, గ్రహములతో నిండిన జ్యోతిర్మండలమును, పర్వతములను, సముద్రములను, ద్వీపములను, దేశములను, దిక్కులను, సురలను, అసురులను, వనములను, వివిధప్రదేశములను నదులను, నగరములను, గనులను, కర్షకుల గ్రామములను, గొల్లపల్లెలను, ఆశ్రమములను, వర్ణాశ్రమ ఆచార వ్యవహారములను, పంచమహా భూతములను, వాటితో ఏర్పడిన ప్రాణుల శరీరములను, పదార్థములను, వివిధ యుగములలో, కల్పములలో ఘటిల్లిన కాలాదిభేదములను చూచెను. అంతేగాక పలుదేశములలో, వస్తువులలో, కాలములలో జగత్తునందు ఏర్పడెడి పరిణామములను గమనించెను. విశ్వమంతయును అచటనేయున్నట్లు అతని (మార్కండేయునకు) ప్రతీతమయ్యెను.


*9.30 (ముప్పదియవ శ్లోకము)*


*హిమాలయం పుష్పవహాం చ తాం నదీం నిజాశ్రమం యత్ర ఋషీనపశ్యత్|*


*విశ్వం విపశ్యంఛ్వసితాచ్ఛిశోర్వై బహిర్నిరస్తో న్యపతల్లయాబ్ధౌ॥13912॥*


అతడు ఆ చిన్ని శిశువుయొక్క ఉదరమునందే హిమవత్పర్వతమును, పుష్పభద్రానదిని, ఆ నదీతీరమునగల తన ఆశ్రమములను, అచటి ఋషీశ్వరులను ప్రత్యక్షముగా చూచెను. ఇట్లు సంపూర్ణ విశ్వమును చూచుచుండగనే ఆ దివ్యశిశువు యొక్క నిట్టూర్పుద్వారా అతడు బయటికి వచ్చిన వెంటనే ప్రళయకాల సముద్రములో పడిపోయెను.


*9.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*తస్మిన్ పృథివ్యాః కకుది ప్రరూఢం వటం చ తత్పర్ణపుటే శయానమ్|*.


*తోకం చ తత్ప్రేమసుధాస్మితేన నిరీక్షితోఽపాంగనిరీక్షణేన॥13913॥*


మరల ఆ ప్రళయసముద్రమునందు ఎత్తైన భూతలమున అతడు ఆ చిన్నారిని అక్కున జేర్చుకొనటకై అతికష్టము పై ముందునకు సాగెను.


*9.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*అథ తం బాలకం వీక్ష్య నేత్రాభ్యాం ధిష్ఠితం హృది|*


*అభ్యయాదతిసంక్లిష్టః పరిష్వక్తుమధోక్షజమ్॥13914॥*


మార్కండేయుడు ఇంద్రియాతీతమైన ఆ భగవన్మూర్తిని  తన నేత్రములద్వారా హృదయమున ప్రతిష్ఠించుకొని యుండెను. ఇప్పుడు అతడు ఆ చిన్నారిని అక్కున జేర్చుకొనుటకై అతికష్టముపై ముందునకు సాగెను.


*9.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*తావత్స భగవాన్ సాక్షాద్యోగాధీశో గుహాశయః|*


*అంతర్దధే ఋషేః సద్యో యథేహానీశనిర్మితా॥13915॥*


శౌనకమహర్షీ! పరమయోగీశ్వరుడైన ఆ పరాత్పరుడు యోగుల హృదయములయందు నివసించుచుండును. మార్కండేయుడు తనను సమీపింపక ముందే అశక్తుడు, అదృష్టహీనుడు అగువానియొక్క పరిశ్రమ నిష్ఫలమైనట్లు, అతడు మార్కండేయునకు తన ఆలింగన భాగ్యమును ప్రసాదింపక అంతర్హితుడయ్యెను.


*9.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*తమన్వథ వటో బ్రహ్మన్ సలిలం లోకసంప్లవః|*


*తిరోధాయి క్షణాదస్య స్వాశ్రమే పూర్వవత్స్థితః॥13916॥*


శిశువు అంతర్ధానమైనంతనే, వటవృక్షము, అట్లే ఆ ప్రళయకాల దృశ్యమంతయును మాయమైపోయెను. మార్కండేయుడు మునుపటి వలెనే తన ఆశ్రమమునందే ఆసీనుడైయుండెను.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ద్వాదశస్కంధే మాయాదర్శనం నామ నవమోఽధ్యాయః (9)*


ఇది భాగవత మహాపురాణమునందలి ద్వాదశస్కంధము నందలి *మార్కండేయుడు భగవన్మాయను దర్శించుట* అను తొమ్మిదవ అధ్యాయము (9)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*


మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ నారాయణ, నారాయణిల కటాక్షము సిద్ధించుగాక. శుభరాత్రి.

భోజనం చేయుటకు

 భోజనం చేయుటకు ఉపయోగపడే ఆకులు - వాటిలోని ఔషధ గుణాలు  - 


        కొంతకాలం క్రితం ఒక గ్రామము నందలి బాలురు తీవ్రమైన అతిసార వ్యాధితో బాధపడుతున్నారు. వారికి ఎంత మంచి చికిత్స అందించినను వ్యాధి తీవ్రత తగ్గటం లేదు . వారిని పరిశీలించుటకు వచ్చిన శాస్త్రవేత్తలు వారు ఆహారం తీసికొనుటకు ఉపయోగించుచున్న అల్యూమినియం పాత్రలను ప్రయోగశాలకు పంపినప్పుడు వారి రోగానికి కారణం వారు భుజించు ఆహారం కాదు వారు ఆహారాన్ని వండటానికి ఉపయోగించుచున్న అల్యూమినియం పాత్రలే కారణం అని నిర్దారణకు వచ్చారు.  ఈ అల్యూమినియం పాత్ర యందు వండబడిన ఆహారం విషపూరితం అగును. అది శరీరం పైన ఒక్కసారిగా తన ప్రభావాన్ని చూపించదు. కొంచం కొంచంగా మనిషి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బ తీయును .


              అల్యూమినియం పాత్ర యందు ఆహారాన్ని ఉడికించడం మూలాన ఆహారం నందలి ఆమ్లములు , అల్యూమినియం లోహము పైన ప్రభావం చూపి అనేక విషసంభంధ రోగాలకు ప్రధానకారణం అగును. ముఖ్యంగా చర్మ సంబంధ , నరాల సంబంధ సమస్యలు అధికంగా వచ్చును. శరీరం నందు కేన్సర్ కూడ వృద్ధిచెందును. 


          పైన చెప్పినటువంటి సమస్యలు రాకుండా ఉండుటకు ముందుగా మనం ఆహారాన్ని వండే వంట పాత్రలను మార్చవలెను. అదేవిధముగా మనం ఆహారాన్ని భుజించుటకు విస్తరాకులు వాడటం ఎంతో మంచిది . ఇప్పుడు మీకు ఎటువంటి ఆకులతో చేసిన విస్తరాకులలో తింటే ఎటువంటి ఫలితాలు వస్తాయో వివరిస్తాను.


 *  అరటి ఆకు  -


      ఇందు భుజించటం మిక్కిలి శ్రేష్టం. కఫవాతములను హరించును . బలమును , ఆరోగ్యమును పెంచును. శరీరకాంతిని , సంభోగ శక్తిని పెంచును.  ఆకలిని , దంతకాంతిని కలిగించును. పైత్యశాంతిని కలుగచేయును . శ్లేష్మ సంబంధ దోషాలు పోవును . శరీరం నొప్పులు తగ్గించును . ఉదరము నందలి పుండ్లు అనగా పెప్టిక్ అల్సర్ ను నయం చేయును .


 *  మోదుగ విస్తరి  -


      ఇందులో భుజించుటచే గుల్మరోగం , మహోదరం , క్రిమిరోగం , రక్తసంబంధ రోగాలు , పిత్తరోగములు నశించును. బుద్దిని పెంచును.


 *  మర్రి ఆకు విస్తరి  -


      దీని యందు భుజించిన క్రిమి రోగ నివారణ , జఠరాగ్ని వృద్ది , కుష్ఠు వ్యాధి నివారణ అగును. నేత్రదోష నివారణ అగును. వీర్యవృద్ధి కలుగును.


 *  పనస  -


      దీని విస్తరి యందు భుజించిన అగ్నివృద్ధి , పిత్తహర గుణములు ఉండును.


 *  రావి  -


      ఇది పిత్తశ్లేష్మ నివారణ , అగ్నివృద్ది కలిగించును. వీర్యవృద్ధి కలుగచేయును . విద్యార్జనకు మనసు కలుగచేయును .


 *  వక్క వట్ట  -


      ఇది అగ్నివృద్ధిని కలుగచేయును . వాత,పిత్త రోగాలని హరించును . 


      పైన చెప్పిన ఆకులలో భోజనం చేయడం వలన ఆయా ఆకులలో ఉండు ఔషధ గుణాలు అన్నియు మన శరీరం నందు చేరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును. 


   

 

     మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     

శ్రీమద్రామాయణము

 శ్రీమద్రామాయణము 

బాలకాండము

మొదటి సర్గము  లోని ‘సంక్షిప్త రామాయణం’ (2/5)

(పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణం నుండి)


*నారదుడు వాల్మీకికి రామకథ సంక్షిప్తముగా తెలుపుట.*


ముల్లోకసంచారి యగు నారదుడు , వాల్మీకి మాటలను విని సంతోషించి “చెప్పెదను వినుము.” అనుచు ఇట్లు చెప్పెను.

“ఓ వాల్మీకిమునీ! నీవు చెప్పిన అనేకమైన ఈ సద్గుణములు సామాన్య మానవులకు దుర్లభమైనవి. అయిననూ అట్టి గుణములన్నీ ఉన్న ఒక మహాపురుషుని గుర్తించి చెప్పెదను. వినుము.


_రాముని గుణవర్ణన_

ఇక్ష్వాకువంశమునందు జన్మించిన రాముడు లోకమంతటా ప్రసిద్దుడు. అతడు మనోనిగ్రహవంతుడు. గొప్ప పరాక్రమము, కాంతి, ధైర్యము కలవాడు. ఇంద్రియములను వశములో ఉంచుకొన్నవాడు. 

రాముడు బుద్ధి, నీతి, మాటలాడుటలో నేర్చు, ఐశ్వర్యము కలవాడు. శత్రువులను నశింపచేయువాడు. అతని మూపులు విశాలమైనవి. బాహువులు దీర్హములై బలిసి ఉన్నవి. కంఠము శంఖమువలె ఉండును. చెక్కిళ్ళ పైభాగము ఉన్నతముగా ఉండును. అతని వక్షస్థలము చాల విశాలమైనది. అతడి ధనుస్సు చాల గొప్పది. అతని మూపుల సంధులు పైకి కనబడవు. శత్రుసంహారకుడైన అతని బాహువులు మోకాళ్ళను స్పృశించునంతగా దీర్హమైనవి. అతడి నడక చూడముచ్చటగా ఉండును. అతడి శిరస్సూ, లలాటమూ కూడ మంచి లక్షణముతో ఒప్పుచుండును. 


అతడి శరీరము హెచ్చు తగ్గులు లేక సమముగా విభజింపబడిన అవయవములతో శోభించును. అతని శరీరము, మరీ పొట్టిగా గాని, పొడవుగా గాని కాకుండగా సమముగా ఉండును. అతడి శరీరపు ఛాయ చాల చక్కనిది. తేజస్సు ప్రశంసనీయమైనది. వక్ష్యస్టలము కండలు తేరి ఉండును. నేత్రములు విశాలమైనవి. అవయవాల శోభ ప్రశస్తమైనది. సాముద్రిక శాస్త్రములో చెప్పిన శుభలక్షణములన్నీ ఆతని శరీరములో కనబడును. 

అతడు సకల ధర్మములు తెలిసినవాడు. ఆడిన మాట తప్పనివాడు. ఎల్లప్పుడూ ప్రజల హితమునే కోరుచుండును. అతడు యశస్సు కలవాడు. అన్ని విషయములు తెలిసినవాడు. పరిశుద్ధమైనవాడు-వ్యవహారములలో ఎన్నడూ ఎవరినీ మోసము చేయనివాడు. 

శ్రీమంతుడైన ఆ రాముడు బ్రహ్మదేవునితో సమానుడు. అందరినీ పోషించువాడు. శత్రువినాశకుడు. సమస్త ప్రాణీసముదాయమును రక్షించువాడు. ధర్మసంరక్షకుడు. 

అతడికి వేదవేదాంగముల రహస్యములన్నీతెలుసు. ధనుర్వేదములో అతడి ప్రావీణ్యము సాటిలేనిది. 

సకల శాస్త్రముల సారము తెలిసిన ఆ రాముని జ్ఞాపకశక్తి, ప్రతిభ చాల ప్రశంసనీయమైనవి. అతడు సకల ప్రజలకు ఇష్టుడు. సాధుస్వభావం కలవాడు. మనస్సులో ఎన్నడూ దైన్యమెరుగనివాడు. పనులలో మంచి నేర్పు కలవాడు.


నదులు సముద్రమును చేరినట్లు సత్పురుషులందరు ఎల్లవేళలా అతనిని చేరుచుందురు. ఈ విధముగా అతడు ఆర్యుడు, అనగా ప్రతి ఒక్కరూ దగ్గరికి చేరవలసిన పురుషుడు. అందరివిషయమునందు సమముగా ప్రవర్తించువాడు. అతడి దర్శనము అందరికీ, ఒకే విధముగా, ఎల్లవేళలా ఆనందజనకమైనది. 

కౌసల్యానందవర్ధనుడైన ఆ రాముదొక్కడే సకలగుణములకు నిలయమైనవాడు. అతడు గాంభీర్యములో సముద్రమువంటివాడు. ధైర్యములో హిమవత్పర్వతమువంటివాడు. ఆతని మనస్సులోని భావము ఏమిటో ఎవ్వరూ గ్రహింపజాలరు. అతని మానసిక స్థైర్యాన్ని ఎవరూ కదల్పజాలరు. 


అతడు పరాక్రమములో విష్ణువుతో సమానుడు. చూచువారికి ఆనందము కలిగించుటలో చంద్రునివంటివాడు. క్రోధము వచ్చినచో ప్రళయకాలాగ్నితో సమానుడు. ఓర్పులో భూమితో సమానుడు. దానం చేయుటలో కుబేరునివంటివాదు. సత్యము విషయంలో సాక్షాత్తు రెండవ ధర్మదేవతయే. శ్రీమద్రామాయణము 

బాలకాండము

మొదటి సర్గము  లోని ‘సంక్షిప్త రామాయణం’ (3/5)

(పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణం నుండి)


*నారదుడు వాల్మీకికి రామకథ సంక్షిప్తముగా తెలుపుట.*


*కైక వరములు*

దశరథుడు ప్రజలకు హితము చేయవలెనను కోరికతో, సమస్త సద్దుణసంపన్నుడును, అమోఘములగు బలపరాక్రమములు కలవాడును, ఎల్లప్పుడును ప్రజల హితమునే కోరుచుందువాడును, తనకు ప్రీతిపాత్రుడును అగు జ్యేష్టకుమారుడైన రాముని యువరాజుగా చేయగోరెను. 


దశరథుని రాణులలో కైకేయి ఒకతె. పూర్వమెప్పుడో దశరథుడు ఆమెకు రెండు వరములు ఇచ్చియుండెను. రామాభిషేకముకొరకు సేకరించిన సంభారములను చూచి ఆమె తనకిచ్చిన వరములలో ఒక వరముగా రాముని అరణ్యమునకు పంపవలెననియు, రెండవ వరముగా భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలెననియు దశరథుని కోరెను. 


దశరథుడు సత్యవాక్పాలన నియమము గలవాడు. అందుచే ధర్మపాశబద్దుడై తన ప్రియపుత్రుడైన రాముని అరణ్యములకు పంపెను. రాముడు, కైకేయికి సంతోషము కలిగించుటకై తండ్రి మాటమా(త్రముగా చెప్పినంతనే దానిని ఆజ్ఞగా గ్రహించి, తన ప్రతిజ్ఞను నిలుపుకొనుచు అరణ్యమునకు వెళ్ళెను. 


లక్ష్మణుడు రామునికి చాల ఇష్టుదైన తమ్ముడు. అతనియందు సహజమైన ప్రేమ కలవాడు. వినయసంపన్నుడు. అతడు తన భ్రాతృస్నేహమును చూపుచు అరణ్యమునకు పోవుచున్న ఆ రామునివెంట వెళ్లెను. ఇట్లు ఉత్తమమైన కార్యము చేయుటచే తల్లియగు సుమిత్రకు కూడ ఆనందమును వృద్ధిపొందించెను. 


*సీత వర్ణన*

జనకుని వంశమునందు పుట్టినదియు, రామునికి భార్యయు, దశరథునికి కోడలు అయిన సీత రామునకు చాల ఇష్టురాలు. ప్రాణము వంటిది. ఆమె సర్వదా రామునకు హితమునే చేయుచుండును. రాక్షసులను మోహింపచేయుటకై సృజింపబడిన దేవమాయవలె లోకోత్తరమైన సౌందర్యము కలది. సాముద్రికశాస్తములో చెప్పిన మంచిలక్షణము లన్నియు ఆమెయందు ఉన్నవి. స్త్రీలలో ఉత్తమురాలైన ఆ సీత కూడ, రోహిణి చంద్రుని అనుసరించినట్లు, ఆ రామచంద్రుని అనుసరించి వెళ్లిను. 


*రాముడు అయోధ్యను వీడుట*

పౌరులును, దశరథుడును వనవాసమునకు వెళ్ళుచున్న రామునివెంట చాల దూరమువరకు వెళ్ళిరి. ధర్మాత్ముడైన రాముడు గంగాతీరమునందు, శృంగిబేరపురము అనెడు పట్టణములో బోయజాతివారికి ప్రభువైన గుహుని కలుసుకొనెను. అచటినుండి రాముడు తన సారథియెన సూతుని వెనుకకు పంపివేసెను. 

సీతారామలక్ష్మణులు ఒక వనమునుండి మరొక వనము చేరుచు, గొప్ప గొప్ప నదులను దాటుచు, భరద్వాజమహర్షి ఆదేశము ప్రకారము చిత్రకూటపర్వతమును చేరిరి. అచట పర్ణశాల నిర్మించుకొని దేవగంధర్వులవలె సుఖముగా నివసించిరి. 


రాముడు చిత్రకూటమునకు వెళ్ళిన పిమ్మట దశరథుడు పుత్రశోకముచేత పీడితుడై, పుత్రునిగూర్చి విలపించుచు స్వర్గస్థుడయ్యెను. 


దశరథుడు మరణించిన పిదప వసిష్టాదులు రాజ్యము చేయుమని భరతుని ఆజ్ఞాపించిరి. తనకు రాజ్యము చేయు సామర్ధ్యమున్నను, భరతుడు రామునిపై నున్న గౌరవముచే రాజ్యమును పాలించుటకు ఒప్పుకొనలేదు. 


రాగద్వేషాదులు జయించిన భరతుడు రాముని అనుగ్రహింప చేసుకొనుటకై అరణ్యమునకు వెళ్ళి, వినయముతో సుమహాత్ముడును, సత్యవ్రతుడును, తన సోదరుడును అగు రాముని చేరి, “నీవు సమస్తధర్మములు తెలిసినవాడవు. అందుచేత నీవే రాజువు కావలెను.” అని ప్రార్ధించెను.


రాముడు తనను ఆశ్రయించినవారి పట్ల సుముఖుడై వారి కోరికలన్నియు తీర్చును. అంతటి మృదుస్వభావుదైనను రాముడు, తండ్రియాజ్జను అనుసరింపవలెనను దీక్షవహించి యుండుటవలన భరతుడు ఎంత ప్రార్ధించినను రాజ్యమును స్వీకరించుటకు అంగీకరించలేదు. 

“నేను వచ్చునంతవరకును నా పాదుకలను నా ప్రతినిధిగా భావించి రాజ్యము చేయుటకై నీవద్ద ఉంచుకొనుము.” అని చెప్పి, తన పాదుకలను భరతునకిచ్చి, రాముడు అతనికి అనేకవిధముల బోధించి అయోధ్యకు పంపెను. 


రాముని తిరిగి తీసికొని వెళ్లవలెనన్న కోరిక తీరని భరతుడు ఆ రామపాదుకలనే సేవించుచు, రాముడు సుఖముగా తిరిగి రావలెనని మనస్సులో కోరుకొనుచు, అయోధ్యాసమీపమున నున్న నంది గ్రామము అనెడు గ్రామములో నివసించి రాజ్యపాలనము చేసెను. శ్రీమద్రామాయణము 

బాలకాండము

మొదటి సర్గము  లోని ‘సంక్షిప్త రామాయణం’ (4/5)

(పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణం నుండి)


*నారదుడు వాల్మీకికి రామకథ సంక్షిప్తముగా తెలుపుట.*


*దండకారణ్యము*

భరతుడు వెళ్లగానే రాముడు, అయోధ్యాపౌరులును భరతాదులును మాటిమాటికి ఆ చిత్రకూటపర్వతమునకు వచ్చుచుందురు అని ఊహించి, పిత్రాజ్ఞాపాలనమునందు సావధానుడై దండకారణ్యమున ప్రవేశించెను. 

దండకారణ్యమును ప్రవేశించిన వెంటనే రాముడు విరాధుడను రాక్షసుని చంపి, శరభంగ - సుతీక్ష్ణ - అగస్త్యమహర్షులను, అగస్త్యుని సోదరుని చూచెను. అగస్త్యుడు తనకు ఇంద్రుడిచ్చిన ధనుస్సును, ఖద్గమును, తరగని బాణములుగల అమ్ములపొదులను రామున కీయగా అతడు సంతోషముగా వానిని గ్రహించెను. 

రాముడు శరభంగమహర్షి ఆశమములో నివసించుచుండగా ఆ చుట్టుప్రక్కలనున్నబుషులందరును, “అసురులను, రాక్షసులను సంహరింపుము.” అని ప్రార్ధించుటకై ఆతనివద్దకు వచ్చిరి. 

రాక్షసనివాసమైన ఆ అరణ్యములో అచ్చటి బుషులు చేసిన ప్రార్ధనను రాముడు అంగీకరించెను. “యుద్ధములో రాక్షసులను సంహరించెదను.” అని అగ్నితుల్యతేజస్సులైన ఆ దండకారణ్యవాసులైన మునులకు మాట ఇచ్చెను. 


*శూర్పణఖ*

దండకారణ్యములో జనస్థానము అను ప్రదేశములో నివసించు కామరూపిణియగు శూర్చణఖ అను రాక్షసిని ముక్కుచెవులు కోసి విరూపిణిగా చేసెను. 


శూర్చణఖ విరూపితయైన పిమ్మట ఆమె మాట విని యుద్ధమునకు వచ్చిన ఖరుని, త్రిశిరసుని, దూషణుని, వారి అనుచరులైన సకలరాక్షసులను రాముడు యుద్ధమునందు సంహరించెను. దండకారణ్యమునందు నివసించునపుడు రాముడు జనస్థానములో నివసించు రాక్షసులలో పదునాలుగువేలమందిని సంహరించెను. 

తన జ్ఞాతుల మరణవార్త వినిన రావణుడు మిక్కిలి కోపించి తనకు సాహాయ్యము చేయుమని మారీచుడను రాక్షసుని కోరెను, 


“రావణా! బలవంతుడైన రామునితో వైరము పెట్టకొనకుము.” అని మారీచుడు రావణుని అనేక పర్యాయములు వారించెను. మృత్యువు సమీపించి ఉండుటచే రావణుడు మారీచుని మాటలు వినలేదు. అతనిని వెంటబెట్టుకొని రాముని ఆశ్రమమునకు వెళ్లెను. 


*సీతాపహరణ*

మాయావియైన మారీచునిద్వారా రామలక్ష్మణులను పర్జశాలనుండి చాలదూరము వెళల్లిపోవునట్లు చేసి, రావణుడు రాముని భార్యయగు సీతను అపహరించెను. ఆమెను విడిపించుటకై వచ్చిన జటాయువును వధించెను. 

ప్రాణములు విడుచుటకు సిద్ధముగా ఉన్న జటాయువును రాముడు చూచెను. సీతను రావణుడు అపహరించినట్లు జటాయువు చెప్పగా విని, రాముడు మిక్సిలి దుఃఖితుదై ఇంద్రియములను వశములో ఉంచుకొనజాలక విలపించెను. 

రాముడు జటాయువునకు దహనసంస్కారము చేసెను. 


*కబంధుడు*

పిమ్మట సీతకై వెదకుచు, ఆ వనములో వికృతమైన ఆకారముతో, భయంకరముగా ఉన్న కబంధుదనెడి రాక్షసుని చూచెను. బలిష్టములైన బొహువులుగల రాముడు ఆ కబంధుని చంపి దహనసంస్కారము చేయగా అతడు స్వర్గమునకు వెళ్లెను. 


అతడు స్వర్గమునకు పోవుటకు ముందు, “రామా! ధర్మమును ఆచరించుటయందు నేర్పు కలదియు, ధర్మమును ఆచరించునదియు అగు ఒక శబర స్రీ సన్న్యాసాశమమును స్వీకరించి ఈ ప్రాంతమునందే యున్నది. ఆమె వద్దకు వెళ్ళుము.” అని చెప్పెను. 

రాముడు శబరి వద్దకు వెళ్లెను. శబరి ఆ రాముని చక్కగ పూజించెను. 


*హనుమత్సుగ్రీవుల పరిచయము*

రాముడు పంపాసరోవరతీరమున హనుమంతునితో పరిచయ మేర్చరచుకొని పిదప ఆతని మాట ప్రకారము సుగ్రీవునితో స్నేహము చేసికొనెను. రాముడు తన వృత్తాంతమునంతను మొదటి నుండియు సుగ్రీవునకు, హనుమంతునకు చెప్పెను, సీతావృత్తాంతమును విశేషించి తెలిపెను. సుగ్రీవుడు రాముని వృత్తాంతమంతయు విని, అగ్నిసాక్షికముగా రామునితో మైత్రి చేసికొనెను. 


“నీకును వాలికిని విరోధమెట్లు ఏర్పడినది?” అని రాముడు ్రశ్నింపగా, సుగ్రీవుడు దుఃఖించుచు, స్నేహముతో రామునకు ఆ వృత్తాంతమునంతయు తెలిపెను. వాలిని చంపెదనని రాముడు ప్రతిజ్ఞ చేసెను. సుగ్రీవుడు కూడ రామునకు వాలియొక్క బలమును వర్ణించి చెప్పెను.


*రామునికి పరీక్షలు*

సుగ్రీవుడు రాముని చూచినది మొదలు, “ఇతడు వాలిని చంపుటకు సమర్ధుడో, కాడో” అని సందేహించుచుందెను. అతడు రాముని విషయమున తనకు నమ్మకము కలుగుటకై, కొండవలెనున్న దుందుభి యను రాక్షసుని కళేబరమును రామునకు చూపెను.


ఊహింపరాని బలము కల రాముడు ఎముకల పోగయి ఉన్న ఆ దుందుభి కళేబరమును చూచి, “ఇది ఎంత?” అన్నట్లు నవ్వి దానిని తన కాలి బొటనవేలితో ఎత్తి పదియోజనముల దూరము పడునట్లు విసరెను. సుగ్రీవునకు ఇంకను నమ్మకము కలుగుటకై ఒకే బాణముచే ఏడు మద్దిచెట్లను, ఒక పర్వతమును, పాతాళమును కూడ భేదించెను. 

రాముడు ఆ పనులు చేసిన పిమ్మట సుగ్రీవునకు నమ్మిక కుదిరెను. తనకు రాజ్యము లభించునని అతడు సంతసించి, రాముని వెంటబెట్టుకొని గుహవలె నున్న కిష్కింధాపట్టణమునకు వెళ్లిను. 


*వాలివధ*

కిష్కింధ ప్రవేశించి సుగ్రీవుడు గర్జించెను. ఆ మవానాదమును విని వాలి గృహమునుండి బయటకు వచ్చెను. యుద్ధమునకు వెళ్లవద్దని నివారించుచున్న తారను ఒప్పించి, వాలి సుగ్రీవునితో యుద్ధమునకు తలపడెను. అచట రాముడు ఒక్క బాణముతో వాలిని చంపెను. అనంతరము సుగ్రీవుని వానరరాజ్యమునందు పట్టాభిషిక్తుని చేసెను.

విభూతి ( భస్మం )....!

 🎻🌹🙏 విభూతి ( భస్మం )....!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿హోమంలో దర్బలు, ఇతర హోమ వస్తువులు దహించగా మిగిలిన హోమభస్మాన్ని విభూతి అని కూడా అంటారు. చాలా పవిత్రంగా భావించబడే విభూతి ( భస్మం ) ప్రతి శివాలయంలోనూ తప్పక ఉంటుంది.


🌸వేదములు, పురాణములు ఏకకంఠముతో విభూతి యొక్క మాహిమను చాటుచున్నవి. భస్మ స్నానము చేసినవారు సర్వతీర్ధాలు చేసినవారితో సమానము. భస్మధారణ చేసిన వారికి దుష్ట గ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగ్ను. బాహ్య ప్రపంచ జ్ఞానం కలుగును. 


🌿విభూది నొసట ధరించి శివపంచాక్షరి మంత్రము ప్రతిదినము పఠిచుచుండిన లలాటమున్ బ్రహ్మవ్రాసిన వ్రాత కూడా తారుమారగును.


🌸అగ్నికి దహించే గుణం ఉంది. కట్టెలు, పిడకలు మొదలైన వాటికి దహనమయ్యే గుణం ఉంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఉద్భవించిన విభూతి, ఆ రెండు గుణాలనూ త్యజించి శాశ్వత రూపాన్ని సంతరించుకుంది. 


🌿విభూతి దహించదు, దహనమవదు. ఇది నిర్గుణత్వాన్ని సంతరించుకుంది. హోమగుండంలో హోమం చేసినప్పుడు, ధునిలో కొబ్బరికాయలు మొదలైనవి భస్మం అయినప్పుడు వచ్చిన బూడిదను విభూతి అంటారు.


🌸 హోమగుండం, ధుని – రెండూ పరమ పవిత్రమైనవి. హోమగుండంలో మోదుగ, రావి సమిధలు, ఆవునెయ్యి ఉపయోగిస్తారు. ధునిలో పీచు తీయని కొబ్బరికాయలు (Hairy Coconuts), పిడకలు (cakes made of cows dung), రావి, తులసి, మేడి చెట్ల కొమ్మలు (Pieces of Peepal, Tulasi and Medi), నవధాన్యాలు (Nine different grains), 


🌿గంధపుచెక్కలు (Pieces of Sandal wood), నేరేడు (Camphor ), సాంబ్రాణి (Sambrani), ఆవునెయ్యి (Cows ghee ), సాంబ్రాణి sambrani powder), అగరొత్తులు (Incense Sticks) వేస్తారు. ఇవన్నీ కాలగా మిగిలిన బూడిద విభూతి. విభూతిని విషెషమైన ఐష్వర్యము అని అందురు.


🌸విభూతి ధరించే విధానం

కుడిచేతి మధ్యమ, అనామికా వేళ్ళ సాయంతో విభూతిని చేతిలోకి తీసుకోవాలి. నుదుటిపై పెట్టుకోవడం కూడా ఎడమవైపు నుండి కుడివైపుకు విభూతి రేఖలు తీర్చిదిద్దాలి. 


🌿అప్పుడు అంగుష్టముతో విభూతి రేఖలపై కుడివైపు నుండి ఎడమవైపుకు మూడు రేఖలుగా ధరించడాన్ని త్రిపుండ్రం అంటారు. త్రిపుండ్రం అంటే అడ్డబొట్టు అని అర్థం. 


🌸విభూతి ధరించినపుడు నుదిటిపై కనుబొమ్మలు దాటి ప్రక్కలకు గాని కనుబొమ్మల క్రిందికిగాని ధరించకూడదు. విభూతిధారణ దేవతాపూజ, జపము, యజ్ణ్జము, హోమము, శుభకార్యముల్లో ధరించిన కార్యములు సిద్ధించును. తప్పక ధరించవలెను. విభూతి భస్మం, తిలకం కాని నొసట ధరించనిదే భగవంతుని తీర్ధప్రసాదములు స్వీకరించ కూడదు.


🌷విభూతి పేర్లు - వర్ణములు🌷


🌿1. భస్మం - శ్వేత వర్ణము


🌸2. విభూతి - కపిల వర్ణము,


🌿3. భసితము -కృష్ణ వర్ణము


🌸4. క్షారము - ఆకాశ వర్ణము


🌿5. రక్షయని - రక్త వర్ణము


🌸కొన్ని విశ్వాసాలు

హోమ భస్మం (విభూతి) ధారణతో నవగ్రహ బాధలు తొలగిపోతాయి.


🌿హోమ భస్మ ధారణతో మనిషిలో ఉండే అన్ని రకాల దోషాలు నివారించబడతాయి.

హోమ భస్మ ధారణతో దేవుని అనుగ్రహం కలిగి అన్ని పనులు నిరాటకంగా జరుగుతాయి.


🌸భస్మ ధారణతో అన్ని రకాల గోచర, అగోచర, దృశ్య, అదృశ్య రోగాలు తొలగిపోతాయి.

వివిధ హోమభస్మాలు చేసే మేలు:


🌷1.శ్రీ మహాగణపతి 🌷


🌿హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి.


🌷2.శ్రీ సుబ్రహ్మణ్య స్వామి 🌷


🌸హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది.


🌷3.శ్రీ దుర్గా 🌷


🌸హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశాంతత గల జీవితాన్ని సాగించవచ్చు.


🌷4.శ్రీ ధన్వంతరి 🌷


🌿 హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహం వజ్రసమానంగా మారుతుంది.


🌷5.శ్రీ నవగ్రహ  🌷


🌸హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎంటువంటి గ్రహాల చెడు ప్రభావం ఉండదు.


🌷6.శ్రీ మహా మృత్యుంజయ 🌷


🌿హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మృత్యువులు తొలగిపోతాయి.


🌷7.శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ గాయత్రి దేవి హోమం, 🌷


🌸శ్రీ చక్ర హోమాల్లోని భస్మాన్ని ధరిస్తే అన్ని పనుల్లో విజయం సిద్ధించడంతో పాటు జీవితాంతం సౌఖ్యదాయక జీవితాన్ని కలిగి వుంటారు.


🌷8.శ్రీ సుదర్శన 🌷


🌿 హోమం భస్మధారణతో శత్రువుల నిర్మూలనం జరుగుతుంది.


🌷9.శ్రీ లక్ష్మీ నారాయణ  🌷


🌸హోమంలోని భస్మాన్ని ధరిస్తే భార్యాభర్తల మధ్య స్పర్ధలు తొలగిపోతాయి.


🌷10.హోమ 🌷


🌿 భస్మధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృష్టి, శాపం, గ్రహ బాధలు వేధించవు.


🌸గమనిక : హోమభస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదు.


🌷విభూతి స్నానం :🌷


🌿స్నానం అంటే ఒంటి మీద నీళ్ళు పోసుకోవడం. ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు.


🌸ఏ వస్తువైనా సంపూర్ణంగా కాలితే మిగిలేది భస్మం, లేదా బూడిద. కాలడానికి మూడు హంగులు కావాలి. ఒకటి, కాలగలిగే పదార్థం.


🌿 రెండు, అది రాజుకుని అంటుకోడానికి తగినంత వేడి ఉండాలి. మూడు, ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా ఉండాలి. అప్పుడు ఆ వస్తువు కాలుతుంది. కాలగా మిగిలిన దానిని బూడిద అంటాం.