31, మార్చి 2023, శుక్రవారం

సూక్ష్మక్రిమి పరిజ్ఞానం -

 ఆయుర్వేదం నందు గల సూక్ష్మక్రిమి పరిజ్ఞానం - 


     ఇప్పటివరకు మనం అనుకుంటున్నట్టుగా సూక్ష్మక్రిములను కనుగొన్నది పాశ్చత్య శాస్త్రజ్ఞులు మాత్రం కాదు. వారికంటే కొన్ని వేల సంవత్సరాల మునుపే మన పూర్వీకులకు సూక్ష్మక్రిముల పైన మరియు అవి కలుగచేసే వ్యాధుల పైన సంపూర్ణ అవగాహన కలదు. ఈ విషయాల గురించి నేను తెలుసుకొవడానికి కొన్ని అత్యంత పురాతన ఆయుర్వేద గ్రంథాలు పరిశీలిస్తున్నప్పుడు వాటిలో కొన్ని చోట్ల ఈ సూక్ష్మక్రిమి సంబంధమైన అనేక విషయాలు నేను తెలుసుకోవడం జరిగింది. ఆ విలువైన సమాచారాన్ని మీకు కూడా తెలియచేయుటకు ఈ పోస్టు పెడుతున్నాను .


         సుశ్రుతునకు సూక్ష్మక్రిములుకు సంబంధించిన పరిజ్ఞానం అపారంగా ఉన్నది అని చెప్పవచ్చు. రోగానికి కారణం అయ్యే సూక్ష్మక్రిములను గురించిన జ్ఞానమునకు "భూతవిద్య " అని పేరుకలదు . అష్టాంగహృదయములో ఇది ఒక ప్రత్యేక భాగముగా పరిగణించబడినది. భూతవిద్యా లక్షణమును చెప్పునప్పుడు దేవాసుర , గంధర్వ , యక్ష , రక్ష , పితృ , పిశాచ , నాగ అనే భూత గ్రహాలుగా సూక్ష్మజీవులను వర్ణించాడు. కొన్ని మంత్రగ్రంధాలలో పైన చెప్పిన పేర్లు కలవారు వేరే లోకమునకు సంభంధించినవారుగా దుష్టశక్తులుగా వర్ణించి వారు మానవులను పట్టి పీడించువారుగా ఉన్నది. కాని సుశృతుడు దీనికి ఒప్పుకోడు వారు దేవాసుర , గంధర్వులు ద్యులోక వాసులు వారు భూలోకమునకు వచ్చి మనుష్యులతో కలిసి ఎన్నటికీ నివసించరు అని ఆయన అభిప్రాయం .


       సుశ్రుతుడు సూక్ష్మజీవుల గురించి వివరిస్తూ వాటిని గ్రహములగా పిలుస్తూ ఈ విధముగా చెప్పుచున్నాడు. కోట్లకొలది అసంఖ్యాకముగా ఉన్న ఈ గ్రహములు రక్తము , మాంసములను భుజించి వృద్ది అగుచుండెను . అవి మహాపరాక్రమము కలిగినవి. అయినను అవి సూర్యుని వెలుగుకు జడిసి రాత్రుల యందు సంచరించుచుండును . చీకటి , నీడగల తావుల యందు పగలంతా ఉండును. ఈ సూక్ష్మక్రిములు నేలమీదను , అంతరిక్షము నందు , అన్ని దిక్కుల లోను పాడిపడిన చీకటి గృహముల యందు నివాసము ఉండును. ఈ సూక్ష్మక్రిములు ఒకొక్క కాలము నందు విజృంభించి జనులను పీడించునని సుశృతుడు తెలియచేసెను .


         వ్రణసంబంధ ఇన్ఫెక్షన్స్ గురించి సుశృతుడు వివరించుతూ ఈ సూక్ష్మక్రిములకు మాంస , రక్తం ప్రియం అగుటచేత గాయములలోకి తరచుగా ప్రవేశించి సమస్యలను కలుగచేయునని తెలుపుతూ ఈ రోగకారణమగు సూక్ష్మక్రిములను మూడు ప్రధాన గణములుగా గుర్తించారు. 


            ఇప్పుడు సుశృతుడు రోగహేతుకారణాలైన సూక్ష్మజీవులను మూడు రకాలుగా వర్గీకరించారు. వాటి గురించి మీకు వివరిస్తాను. అవి 


 1 - పశుపతి అనుచరులు .


 2 - కుబేర అనుచరులు .


 3 - కుమార అనుచరులు .


 * పశుపతి అనుచరులు -


      మనస్సు , ఇంద్రియములను వికలమొనర్చి భ్రమ , ప్రలాప , ఉన్మాదములను కలిగించును. 


 * కుబేర అనుచరులు - 


       ఇవి యక్షరక్షో గణములకు చెందిన క్రిములు . శారీరక బాధలను మాత్రమే కలిగించును.


 * కుమార అనుచరులు -


       పసిపిల్లలను వశపరుచుకొని బాధించును . వీటినే బాలగ్రహములుగా పిలుస్తారు . 


         పైన చెప్పినవిధముగా సుశ్రుతుల వారు సూక్ష్మక్రిములను మూడు రకాలుగా వర్గీకరించారు . మలేరియా జ్వరమునకు రురుజ్వరం అని తక్ష్మ జ్వరం అనియు అధర్వణవేదములో వ్యవహరించబడినది. ఈ జ్వరమును కలిగించే సూక్ష్మక్రిములు ఉండు నివాసస్థలము గురించి చెప్పుతూ గుడ్లగూబ , గబ్బిలము , కుక్క , తోడేలు , డేగ , గద్ద ఈ జంతుపక్షి శరీరాల్లో మలేరియా క్రిములు ఎల్లప్పుడూ ఉండి వాటి మలముతో బయటకి వచ్చి జనులు తాగే నీటిలో కలిసి మనుష్యులకు సంక్రమించునని ఉన్నది.


           ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో కొన్నింటిలో ఈ విధముగా ఉన్నది. క్రిములు శరీరం నందు ప్రవేశించినంత మాత్రాన రోగము రాదు . శరీరము నందు ఓజస్సు మిక్కిలిగా అభివృద్ధిచెందిన ఊర్జశక్తి అన్ని రకముల క్రిములను జయించుచున్నది. ఇక్కడ మనశరీరములోని రోగనిరోధక శక్తి గురించి వివరణ ఇవ్వడం జరిగింది. శరీరానికి హితమైన ఆహారం సేవించకుండా విరుద్ద ఆహారాలను సేవించువారికి , ప్రకృతివిరుద్ధ నియమాలు పాటించువారికి క్రిములు బాధించును గాని అగ్నిదీప్తి చక్కగా ఉండి యవ్వనంలో ఉన్నవారికి , స్నిగ్ధ శరీరులకు , వ్యాయమం చేయుచుండువారికి , శరీరబలం అధికంగా ఉన్నవారికి క్రిములు ఏమి చేయలేవు .


               క్రీ . శ 18 వ శతాబ్దములో మైక్రోస్కోప్ యంత్రము కనిపెట్టబడిన పిమ్మట సూక్ష్మజీవులను కనుగొన్నారు అని మన పాఠ్యపుస్తకాలలో చదువుతున్నాం .కాని కొన్నివేల సంవత్సరాలకు పూర్వమే మన మహర్షులు ఈ సూక్ష్మక్రిమి విజ్ఞానం సంపాదించారు. మన మహర్షులు దివ్యజ్ఞాన సంపన్నులు వారు తమ మనోనేత్రముతో అన్నింటిని దర్శించగలరు మరియు కనుగొనగలరు. మైక్రోస్కోప్ గురించి దానికి పాశ్చాత్యులు కనుగొన్నారు అని గొప్పగా చెప్పుకుంటాం కాని అధర్వణవేదము నాలుగోవ కాండ ఇరవైవ సూక్తములో పిశాచక్షయ మంత్రములో మైక్రోస్కోప్ వంటి "బిబిర్హిని " అను ఒక దివ్య ఔషధి లభించినట్టు కశ్యప మహాముని ఈ ఔషదీ సహయముతో భూమి మరియు అంతరిక్షంలో వ్యాపించి ఉన్న సర్వరోగ క్రిములను చూడగలిగెను అని ఈ మంత్రం చెప్పుచున్నది. క్రీ .శ మూడొవ శతాబ్దములో బింబసారుని ఆస్థాన వైద్యుడు అయిన జీవకునికి ఇట్టి మహత్తర ఔషధి లభించెనని గ్రంధస్థం చేయబడి ఉన్నది. దీని సహాయముతో నేటి ఎక్సరే యంత్రము వలే శరీర అంతర్భాగము నందలి శరీరభాగాలను చూస్తూ పేగులలో చిక్కుకున్న రాళ్లను తీసివేశారు అని ఎన్నో పురాతన గ్రంథాలలో కలదు.


               సమాప్తం 


    

      

ఏది ఉచితంగా రాదు

ఏది ఉచితంగా రాదు  

మనం ఉంటున్న ప్రపంచం ఒక చిత్రమైనదిగా తోస్తుంది. బాహ్యంగా కనపడేది ఒకటి ఉంటే అంతరంగికంగా ఇంకొక విధంగా ఉంటుంది. కొన్ని సమయాలల్లో బాహ్యానికి అంతర్యానికి పూర్తిగా వ్యతిరేకంగా భిన్నంగా వుండే సంఘటనలు కూడా లేకపోలేదు. 

ఒక వ్యాపార ప్రకటన ఇట్లా ఉంటుంది మీరు రెండు కొంటె ఒకటి ఉచితం అని వ్రాసి ఉంటుంది. విషయం ఏమిటంటే రెండు కొంటె ఒకటి అనే పదాలను చిన్న అక్షరాలలో పేర్కొని ఉచితం అనే పదాన్ని మాత్రం పెద్దగా వ్రాస్తారు. తీరా నీవు అక్కడికి వెళ్లి చుస్తే ఆ స్టాకు పూర్తిగా పాతది పారేయటానికి మాత్రమే పనికి వచ్చేదిగా వుండి వుంటుంది. చౌకగా వస్తుంది అని నీవు వస్తువు సామర్ధ్యాన్ని గణనలోకి తీసుకోకుండా నీకు సదరు వస్తువు అవసరమా కాదా అనేది కూడా ఆలోచించకుండా తీసుకొని వస్తావు చివరకు నీ భార్య ఆగ్రహానికి లోనౌతావు. తరువాత వాటిని తీసుకొని వాపసు ఇవ్వటానికి దుకాణానికి వెళితే సారీ సారూ క్లీరెన్సు సేలు వాపసు తీసుకోము అని చెప్పి పంపిస్తాడు. దీనిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే నిజానికి షాపువాడు ఒక్కటి కూడా నీకు ఉచితంగా ఇవ్వలేదు. ఒక తక్కువ నాణ్యత కలిగిన వస్తువును అమ్ముకోవటానికి వేసిన పధకం అని తరువాత మనకు తెలుస్తుంది. కాబట్టి ఏదయినా వస్తువు కొనేటప్పుడు దాని ధర చౌకగా వున్నదని వైపోచించకుండా దాని నాణ్యత అది ఎంతవరకు మనకు ఉపయోగకరం అనే విషయాలను కూడా అలోచించి కొనటం చాలా అవసరం. ఈ రోజుల్లో ప్రలోభాలకు గురిచేసే వ్యాపార ప్రకటనలు అనేకం మనం చూస్తున్నాము వాటి ప్రభావానికి లోనయి నష్టపోయిన సందర్భాలు ప్రతి మనిషికి అనుభవమే.

మనషులలోని మానసిక బలహీనతలను ముఖ్యంగా మధ్యతరగతి మనుషులను గురిచేసి వ్యాపారవేత్తలు ఇలాంటి ప్రలోభాలకు గురిచేస్తుంటారు.మధ్యతరగతి వారికి ఎన్నిసార్లు మోసపోయిన మరల మరల తెలియకుండా మోసపోతూనే వుంటారు. 

బజారులో చిన్న చిన్న సంచులలో కేవలం బత్తాయి పండ్ల బైటి వైపు మాత్రమే కనిపించే విధంగా ఉంచి అమ్ముతారు.  వాటిని చూసి ఆ పండ్లు మంచివని అనుకోని మనం కొనుక్కొని వస్తాము. ఆ సంచి చించి చుస్తే అన్ని పండ్లు క్రుళ్ళి పోయి ఉంటాయి. మన కళ్ళను మైమరిపింపచేసి చెడిపోయిన వస్తువులను అమ్మటం వాళ్ళు మోసం అనుకోవటం లేదు అది వారి చాకచక్యం అని తలుస్తూ విశేష లాభాలను గణిస్తున్నారు. 

మార్కెట్లో కూరగాయలు కొనటానికి వెళితే అక్కడ ఒక్కడు మిగిలినవారి కన్నా తక్కువ ధరకు అమ్ముతుంటారు. కూరలు చుస్తే తాజాగా కనిపిస్తాయి వాటిని చూసి నీవు తక్కువ ధరకు లభిస్తున్నాయని అక్కడ కొంటావు.  తీరా ఇంటికి వస్తే నీ భార్య ఏమండీ వంకాయలు కిలో తెచ్చారా అరకిలో తెచ్చారా అంటే కాయలు తాజాగా ఉన్నాయని కిలో తెచ్చాని నీవు బదులు ఇస్తావు.  మిమ్మల్ని కూరగాయలవాడు మోసం చేసాడు నిజానికి ఇవి కిలో లేవు అని ఆమె చెపితే ప్రక్కనే వున్న కిరాణాషాపుకు వెళ్లి తూకంవేయిస్తే 600-700 గ్రాములు మాత్రమే ఉంటాయి. అప్పుడు నీకు కళ్ళు తెరుచుకుంటాయి ఆ వ్యాపారి తక్కువ ధరకు ఎందుకు అమ్మాడో అని. 

వ్యాపారవేత్తలు వారి వారి లాభాలకొరకు ప్రజలను మోసం చేయటం పరిపాటే కానీ ఇతరులు అలా కారు అని అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. ప్రస్తుతం రాజకీయ నాయకులు కూడా మనకు ఉచితాలను చూపెట్టి తమ పబ్బం కడుపుకుంటున్నారు. ఒక సమర్ధమైన ప్రభుత్వం ప్రజలలో ఎలాంటి విభేదాలను చూడకుండా లేక చూపకుండా అందరిని తన కన్నా పిల్లలవలె పరిపాలించాలి అని కదా రాజనీతి తెలుపుతుంది. మరి ఆలా జరుగుతున్నదా అంటే లేదు అని ప్రతి మనిషికి తెలుసు పూర్తిగా స్వార్ధపూర్తితంగా, వోటురాజకీయంగా రాజకీయ నాయకులు తమ తమ స్థానాలను గెలవటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల సంక్షేమం కన్నా స్వా సంక్షేమానికే వారు విలువని ఇస్తున్నారు. ఉచితంగా ఇవ్వాలి అంటే యెంత దానం ప్రభుత్వానికి కావలి అని మనం ఆలోచించకుండా ఉచిత పథకాలకు అలవాటు పది ఓటువేసి పన్నుల ఊబిలో కూరుకొని పోతున్నాము.  రాత్రి 8 గంటల సమయంలో ప్రతి కూడలిలో పోలీసువారు వాహనాలను అపి జరిమానాలు విధించటం మనమెరుగుదము. అవి ఉచిత పథకాల ప్రభావమే కావచ్చు.

కొందరు అనవచ్చు తల్లిదండ్రుల ప్రేమలో స్వార్ధం ఉండదు అది కేవలం ఉచితంగా లభిస్తుంది  అని. అట్లా అనుకుంటే పొరపాటే అవుతుంది  అదెట్లో పరిశీలిద్దాం. బాల్యంలో తల్లిదండ్రులు పిల్లలను ఏంతో ప్రేమగా చూసుకొని వేలు, లక్షలు ఖర్చు పెట్టి విద్యావంతులను చేస్తారు.  అదంతా ఉచ్చితమే అని పిల్లలు అనుకోవచ్చు కానీ నిజనికి తల్లిదండ్రులు వృద్దులు అయినప్పుడు వారిని ప్రేమతో చూసుకొని వారసంతోషానికి పాత్రులు కావలి. ఎంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులను ప్రేమతో చూసుకుంటున్నారన్నది మనం రోజు చూస్తున్నాము. ఎప్పుడో శతక కారుడు చెప్పాడు 

తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు 
పుట్ట నేమి వాడు గిట్టనేమి
పుట్టలోని జెదలు పుట్టవా? గిట్టవా?
విశ్వదాభిరామ వినురవేమా!

 చిన్నతనంలో తల్లిదండ్రులు చూపిన ప్రేమకు పర్యవసానంగా వాళ్ళు వృద్దులు అయినప్పుడు పిల్లలు వారి తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవటం కనీస బాధ్యత.  ఈ బాధ్యతను ప్రతివారు విస్మరించకుండా ఉండాలి. 

కొందరు తల్లిదండ్రులు బాల్యంలో వారి పిల్లలపట్ల ప్రేమాభిమానాలు సరిగా చూపకపోవటంతో వారు పెద్దవారైనాతరువాత పిల్లల్నుండి ప్రేమను పొందలేక బాధపడితే ప్రయోజనం ఉండదు. కాబట్టి తల్లి దండ్రులు ఎల్లప్పుడూ బిడ్డలను కంటికి రెప్పగా చూసుకోవాలి అప్పుడు మాత్రమే వారి పిల్లల ప్రేమను పొందటానికి అర్హులు అవుతారు. 

నిజానికి భూమి మీద మనకు గాలి నీరు కూడా ఉచితంగా లభించదు అది ఎట్లాగో చూద్దాం. పరిసరాలలో వున్న గాలిని మనం మన శక్తిని వుపయోగించి మాత్రమే పొందుతాము. ఊపిరితిత్తులు వాటి శక్తిని వాడకపోతే గాలి శరీరానికి వెళ్ళదు.  శక్తి కావాలంటే ఆహరం తీసుకోవాలి ఆహరం సంపాయిస్తేనే వస్తుంది అది మనకు తెలుసు.  ఇక నీటి విషయానికి వస్తే నీరు భావిలోనో లేక నదిలోనో వున్నాయనుకోండి అప్పుడు కూడా మీరు మీ శక్తిని ఉపయోగించి మాత్రమే నీటిని పొందగలరు. ఈ రోజుల్లో మనం త్రాగే నీటిని కొనుక్కొని త్రాగుతున్నామన్నది సర్వులెఱింగినదే. 

ఈ ప్రపంచంలో ఏది కూడా ఉచితంగా లభించదు మనం ఒకటి పొందాలంటే ఒకటి కోల్పవాలి అన్నది అనాదిగా వస్తున్న నానుడి. ఇది ముమ్మాటికీ నిజం. ఆహరం ఎక్కడ ఉచితంగా లభిస్తుంది అంటే ఎలుకల బోనులో అని ఒకడు అన్నదాత దాని అర్ధం బోనులోకి ఎలుకలను రప్పించటానికి ఆహారాన్ని ఉంచారన్నది విషయం.  కాబట్టి ఏదయినా ఉచితంగా వస్తున్నది అంటే నిజానికి అది ఉచితం కాదు దాని వెనుక నీకు తెలియని ఒక విషయం దాగి వున్నది అని తెలుసుకోవాలి.. 

ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ

 

30, మార్చి 2023, గురువారం

ఆమెను భర్త దగ్గరకు వదిలి రా...

 ఆమెను భర్త దగ్గరకు వదిలి రా...


చాలా సందర్భాల్లో, ఇతరులపైన పరమాచార్య స్వామివారి ప్రేమ బహిర్గతం అవ్వదు. కాని ఒకసారి మహాస్వామివారు శ్రీమఠం బాలు మామని ఒక పని చెయ్యమని ఆదేశించారు. ఆ సంఘటన వివరాలు బాలు మామ మాటల్లో.


శ్రీమఠం మకాం షోలాపూర్ లో విడిది చేసి ఉన్నప్పుడు, ఒక సాయంత్రం మహాస్వామి వారు బాలు మామను పిలిచి, “. . . ఇతని ఇంటికి వెళ్లి, వారి అమ్మాయిని తీసుకుని తన భర్త ఇంటిలో వదిలిరా!” అని ఆజ్ఞాపించారు.


ఆ మాట విని బాలు మామ నిశ్చేష్టుడయ్యాడు.


పరమాచార్య స్వామివారు చెబుతున్న వ్యక్తీ స్వామివారికి పరమ భక్తుడు, వైశ్య కులానికి చెందినవాడు; పెద్ద సంసారం కలవాడు; ఏవో కారణాల వల్ల అతని కుమార్తె భర్త నుండి విడువడి, తల్లితండ్రుల వద్దే ఉంటోంది. కాని ఈ విషయం ఎవరూ మహాస్వామివారికి తెలుపలేదు. కాని స్వామివారి నుండి ఇటువంటి ఆదేశం వచ్చింది.


“ఏమిటి ఈ ఆదేశం? మరొకరి కుటుంబ విషయాల్లో నేను జోక్యం చేసుకోవడం ఎలా? ఆ అమ్మాయిని తీసుకునివెళ్ళి భర్త ఇంటిలో వదిలిరావాలా? ఇది సరైనదేనా?” అని పరిపరివిధాల ఆలోచిస్తున్నాడు బాలు మామ. ఎటువంటి ఆజ్ఞనైనా స్వామివారి నుండి వెలువడితే, సహాయకులెవ్వరూ మరొక్క ఆలోచన లేక అమలుచేస్తారు. కాని ఈ విషయంలో బాలు మామ సంకోచిస్తున్నాడు.


బాలు మామ ఇబ్బందిని అర్థం చేసుకున్న స్వామివారు అతనికి ధైర్యంగా ఉంటుందని, “నీతోపాటు బ్రహ్మచారి రామకృష్ణన్ ని కూడా వెంట తీసుకునివెళ్ళు” అని చెప్పారు.


వారు ఆ ఇంటికి వెళ్లి, స్వామివారి ఆదేశాన్ని వారికీ తెలిపారు. స్వామివారి ఆదేశాన్ని వినగానే అందరూ ఏడవడం మొదలుపెట్టారు. అమ్మాయిని అక్కడకు పంపడం అంటే, ప్రేమతో పెంచుకున్న చిలకను పిల్లి వద్దకు పంపడమే అని వారికి తెలుసు.


కాని వారికి మహాస్వామి వారిపై ఉన్న నమ్మకం, భక్తి చేత ఎటువంటి అనుమానానికి తావివ్వకుండా మనస్సును స్థిమితపరచుకున్నారు. పరమాచార్య స్వామివారే ఇలా ఆదేశించారంటే అందులో ఎదో ఉంటుందని వారికి తెలుసు. అమ్మాయిని పంపడానికి నిర్ణయించుకున్నారు.


ఆ అమ్మాయి ఎంత ఆలోచిస్తున్నాడో తన భర్త ఇంటికి వెళ్ళడానికి, బాలు మామ కూడా అంతే  తటపటాయిస్తున్నాడు. కాని అది స్వామివారి ఆజ్ఞ కావడంతో ఇక బయలుదేరింది. ఏమి జరుగుతుందో అని భయపడుతూ ముగ్గురూ బయలుదేరారు.


వీళ్ళు అక్కడకు వెళ్ళగానే అత్తింటి వారు ఎంతో సాదరంగా వాళ్ళను ఆహ్వానించారు. వీరు ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఆమె భర్త కూడా తనని ప్రేమతో ఆదరించి, ఇక్కడే ఉంచుకుంటాను అని ప్రమాణం చేశాడు.


--- శ్రీ రా. గణపతి, “శంకరర్ ఎండ్ర సంగీతం” నుండి.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కాచి రక్షించవే

 భువనమ్ములేలేటి కంచి కామాక్షమ్మ 

నాబిడ్డనయిన నిను కాచి రక్షించవే ||


1) కనుపాపలోనున్న శక్తివి నీవమ్మా 

    కామితములీడేర్చు కల్పవృక్షమ్ము 

    కలనైన నీ రూపు మరపురానట్టి 

    స్థిరమయిన వరమును ఇయ్యవే జననీ ||


2) కడసారి నిన్ను నే తలతునో లేనో 

    కాలకాలుని పత్ని దయజూడవమ్మా 

    కరమున విల్లును జేపట్టి నీవు 

    కామమును నీ వశము గావించితీవి ||

పరమాచార్య వారి ఆదేశం

 పరమాచార్య వారి ఆదేశం... ఆంజనేయస్వామి వారి ప్రతిష్ట...

బెల్గామ్ కు దగ్గరలో, బ్రిటిష్ వారినీ గడగడ లాడించిన రాణి చెన్నమ్మ పరిపాలించిన కిత్తూరు లో పరమాచార్య వారు మకాం చేసిన రోజులలో జరిగిన సంఘటన..

స్వామి వారు ఒక పెద్ద చెట్టు నీడన కూర్చోని ఉన్నారు.వారికీ దూరంగా చాలా మంది భక్తులు కూర్చోని ఉన్నారు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ స్వామి దర్శనానికి వచ్చారు. వారు, సాష్టాంగం చేయటానికి ప్రయత్నించగానే స్వామి "వద్ధని "వారిస్తూ సైగ చేసారు.మఠం మేనేజర్ దగ్గరకు వచ్చి "స్వామి కఠిన ఉపవాసం లో ఉన్నారు. మీరు సాష్టాంగం చేస్తే వారు ఈ స్థితిలో ఆశీర్వదించలేరు. అందుకే వద్దన్నారు "అని చెప్పి స్వామి వారి వద్దకు తీసుకోని వెళ్ళాడు.

స్వామి చీఫ్ విజిలేన్స్ ఆఫీసర్,రాజగోపాల్ తో వారి పేరు, జన్మస్థలం అడిగారు.

"తంజావూరు లోని

అడుతురై "

"అది నీ జన్మ స్థలం ఎలా అవుతుంది."

"నేను చిన్నప్పుడు అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాణ్ణి."

"జన్మస్థలం మీ నాన్న గారి స్వస్థలం అవుతుంది కానీ అమ్మమ్మ గారి ఊరు కాదు."

స్వామి వారు అనేక గుర్తులు చెప్పినప్పటికి రాజగోపాల్ స్వస్థలం గుర్తించలేదు.

స్వామి "మీ తాత గారు ఆ ఊళ్ళో ఒక దేవాలయం నిర్మించారు. కానీ అందులో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట చెయ్యలేక పోయినారు. నీవు ఆ ఊరు వెళ్లి ఆలస్యం చెయ్యకుండా ఆగమ శాస్త్ర ప్రకారం విగ్రహ ప్రతిష్ట చెయ్యి."అని ఆదేశించారు.

రాజగోపాల్ వెంటనే తొంభై సంవత్సరాల వాళ్ళ అత్తయ్య ను కలిసి తన స్వస్థలం మన్నార్ గుడికి వెళ్లే దారిలో ఉన్న కుదమరట్టి నదిని ఆనుకొని ఉన్న త్తిళ్ళాంబుర్ తన స్వస్థలం అని తెలిసింది.వెంటనే ఆ ఊరు వెళ్లి చూస్తే స్వామి వారు చెప్పినది సత్యమని తెలిసింది.

గ్రామాధికారి కుమారుడు కృష్ణస్వామి మరి కొందరు కలిసిరాగా ఆగమశాస్త్ర ప్రకారం ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట జరిపించారు . రెండు దశాబ్దాలుగా ఆ గ్రామం, దేవాలయం అభివృద్ధి కి కృషి చేసి నేడు ఆంజనేయస్వామి వారి ఆలయం సుప్రసిద్దమై పెళ్లికాని అమ్మాయిల తల్లిదండ్రులు ఆరు శనివారాలు పూజ చేసి తమ బిడ్డల పెళ్లిళ్లు జరిగాయని సంతోషం గా తెలిపారు.

***స్వస్థలమే తెలియని రాజగోపాల్ గారికి వారి తాత అంతే రెండు తరాల ముందు జరగవలసిన విగ్రహ ప్రతిష్ట గురించి చెప్పారంటే స్వామి వారి దివ్యత్వం మన ఊహకు

 కూడ అందనిది.

తండ్రికి కొడుకు మీదున్న ప్రేమ

 ఒక తండ్రికి కొడుకు మీదున్న ప్రేమ... ఒక కొడుక్కి తండ్రిమీదున్న గౌరవం... ఒక భర్తకు భార్యమీద ఉన్న బాధ్యత...                                               ఒక భార్యకు భర్తమీద ఉన్న నమ్మకం...                                           


ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం...                                            ఒక తమ్ముడికి అన్నమీద ఉన్న మమకారం...    


అన్నీ కలకగలిపి మనిషి బతకడానికి అవసరమైనదే *రామాయణం* ..


పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాల మధ్య జరిగే శ్రీరాముని పెళ్లి ప్రతీసారి ఘనంగా జరగాలని కోరుకుంటూ...


హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది *రామతత్వం* !!


కష్టంలో కలిసి నడవాలన్నది *సీతాతత్వం* !


 *అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు*

🌹 శుభోదయం 🙏

శ్రీరామ నవమి నాడు పూజ ఎలా చేయాలి

 శ్రీరామ నవమి నాడు పూజ ఎలా చేయాలి? ఏమేమి స్తోత్రములు వినాలి, అనే అనేక అంశాలన్నీ ఒకే చోట. 


శ్రీరామనవమి పూజా విధానం 

https://youtu.be/c7UixQ53xPE


సంక్షిప్త రామాయణం 

https://youtu.be/FvdLi4z4FUQ


సీతారాముల కల్యాణ ఘట్టం, శ్లోక పారాయణ

https://youtu.be/fgU7RoFWA2Q


పట్టాభిషేక ఘట్టం, శ్లోక పారాయణం

https://youtu.be/tuKgCxpOY-Q


పట్టాభిషేక ఘట్టం (రామనవమి నాడు తప్పక వినవల్సినది) https://youtu.be/QvT8DAos1TY


శ్రీరామాయణ ఫలశ్రుతి 

https://youtu.be/qqBdKSZDjeQ


హనుమాన్ చాలీసా

https://youtu.be/c1NoGxTZ5wg


వ్యాధులు ప్రబలినపుడు రామరక్ష గా ఏమేమి చేస్తే మంచిది ?

https://youtu.be/Jrvvh4rcwvc

శ్రీ రామ నవమి*

 

 30.03.2023 (గురువారం) శ్రీ రామ నవమి* 

🌼🌿 *శ్రీ రామ నవమి విశిష్టత మరియు ప్రాముఖ్యత ...* 🌼🌿

 

 శ్రీ రామ  నవమి  హిందువులకు  అత్యంత  ముఖ్యమైన  పండుగ .....   హిందువులు  ఈ  పండగను అత్యంత  భక్తి  శ్రద్దలతో   ఈ  పండగను జరుపుకుంటారు....   శ్రీరాముడు  వసంత ఋతువులో  చైత్ర  శుద్ధ  నవమి,  గురువారము నాడు  పునర్వసు  నక్షత్రపు  కర్కాటక  లగ్నంలో సరిగ్గా  అభిజిత్  ముహూర్తంలో  అంటే  మధ్యాహ్మం 12 గంటల  వేళలో  త్రేతాయుగంలో  జన్మించినాడు ....  ఆ  మహనీయుని  జన్మ దినమును  ప్రజలు  పండుగగా  జరుపుకుంటారు... పదునాలుగు  సంవత్సరములు  అరణ్యవాసము, రావణ  సంహారము  తరువాత  శ్రీరాముడు సీతాసమేతంగా  అయోధ్యలో  పట్టాభిషిక్తుడైనాడు.. ఈ  శుభ  సంఘటన  కూడా  చైత్ర  శుద్ధ  నవమి నాడే  జరిగినదని  ప్రజల  విశ్వాసము.... శ్రీ  సీతారాముల  కళ్యాణం  కూడా  ఈరోజునే  జరిగింది...  ఈ  చైత్ర  శుద్ధ  నవమి  నాడు  తెలుగు ప్రజలు  భద్రాచలమందు  సీతారామ  కళ్యాణ ఉత్సవాన్ని  వైభవోపేతంగా  జరుపుతారు... రామా  అనే  రెండక్షరాల  రమ్యమైన  పదం  పలుకని జిహ్వ -- జిహ్వే  కాదు..   శ్రీరామ  నవమి పండుగను  భారతీయులందరూ  పరమ  పవిత్రమైన దినంగా  భావించి  శ్రీ  సీతారాముల  కళ్యాణ మహోత్సవాన్ని  అతి  వైభవంగా  పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ  రమణీయంగా  జరుపుకోవడం ఓ  సంప్రదాయం .....  భక్తుల  గుండెల్లో  కొలువై, సుందర  సుమధుర  చైతన్య  రూపమై,  కోట్లకొలది భక్తుల  పూజ లందుకొంటున్నాడు  శ్రీరామచంద్రుడు .. శ్రీ రామ చంద్రుడిని  తెలుగువారు  ప్రతి  ఇంటా  ఇంటి ఇలవేలుపుగా  కొలుస్తారు .....   నేటికి  భ్రధ్రాచలంలో శ్రీరాముడి  పర్ణశాల  భక్తులకు  దర్శనమిస్తూ వుంటుంది ..... భధ్రాచలంలో అంగరంగ  వైభవంగా  కన్నుల  పండుగగా  జరిగే సీతారాముల  కళ్యాణ  మహోత్సవానికి  లక్షలాది

 భక్తులు  తరలి  వస్తారు .....   కళ్యాణంలో  పాల్గొని దానిని  తిలకించి  శ్రీరాముని  దర్శించి  ఆ  దేవ దేవుడి  ఆశీస్సులు పొందుతారు .....  సీతారామ కళ్యాణం  లోక  జీవన  హేతుకం,  సకల  దోష నివారణం,  సర్వ  సంపదలకు  నిలయం,  సకల జన  లోక  సంరక్షణమే  శ్రీరామనవమి  పండుగ పరమార్థం .....  శ్రీ రామచంద్రుని  క్షేత్రాలలో  అత్యంత  వైశిష్ట్య  ప్రాధాన్యత  ప్రాశస్త్యముగల  క్షేత్రం  భద్రాచలం  దివ్య  క్షేత్రం .....   భద్రుడు  అనగా రాముడు  అని  అచలుడు  అంటే  కొండ  అని అందుకే  రాముడు  కొండపై  నెలవై  ఉన్న  దివ్య ధామము  కనుక  ఈ   క్షేత్రం  భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన  పుణ్య  క్షేత్రం.... ! శ్రీరామచంద్రుడు  తన  వనవాస  జీవితం  ఇక్కడే గడపడమే  ఈ  పుణ్య  క్షేత్రం  యొక్క  వైశిష్ట్యం... శ్రీరామ  నామము  సకల  పాపాలను పోగొడుతుందని  సకల శాస్త్రాలూ చెబుతున్నాయి..   భక్త  రామదాసు  చెరసాలలో

 ఉండిపోయిన  కారణంగా  పూర్వము  సీతారాముల కళ్యాణము  మార్గశిర  శుద్ధ  పంచమినాడు జరిగినట్లుగా,  అయితే  తాను  చెరసాలనుండి తిరిగి  వచ్చాక  చైత్రశుద్ధ  నవమినాడు  శ్రీరామ చంద్రుని  పుట్టినరోజు  వేడుకలు,  కళ్యాణ  వేడుకలు ఒకేసారి  జరిపించారు....  శ్రీ సీతారామ కళ్యాణము,  రాముడు  రావణున్ని  సంహరించి అయోధ్యకు  తిరిగి  వచ్చింది  శ్రీరామనవమినాడే... ఆ మరునాడు  దశమి  శ్రీరామ  పట్టాభిషేకం రామునికి  జరిగింది....    కోదండ  రామకళ్యాణాన్ని చూసేందుకు  మనమే  కాదు  సకల  లోకాల దేవతలు  దివి  నుంచి  భువికి  దిగివస్తారంటా…. శ్రీరామచంద్రుని  దివ్య  దర్శనం  మహనీయంగా, నేత్ర  పర్వంగా  పట్ట్భాషేక  సమయాన  తిలకించి పులకితులవుతారట..   ఆంజనేయుని  పదభక్తికి మెచ్చి,  హనుమ  గుండెల్లో  కొలువైన శ్రీరాముని భక్త  పోషణ  అనన్యమైనదై  గ్రామగ్రామాన రామాలయం  నెలకొని ఉన్నాయి....  శ్రీరాముడు సత్యపాలకుడు  ధర్మాచరణం  తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు,  

 పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ  సద్గుణాలు  మూర్త్భీవించిన  దయార్ద హృదయుడు.....    శ్రీరామనవమి  రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ  సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము  నైవేద్యముగా సమర్పించుకుంటారు ....

ప్రతియేడు భద్రాచలంలో జరిగే  

శ్రీ  సీతారామ కళ్యాణము చూసి  తరించిన వారి జన్మ సార్థకం

చెందుతందనేది  భక్తుల  విశ్వాసం... !!!


*సర్వే జనా  సుఖినో భవంతు*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

పసివాడి జీవితం

 పసివాడి జీవితం


పరమాచార్య స్వామివారి భక్తులు కుంబకోణం శ్రీనివాస శాస్త్రి గారు చెప్పిన ఈ సంఘటన.


శ్రీ ఆదిశంకరాచార్య శిష్యులైన శ్రీ పద్మపాదాచార్యులు వారి రచనల్లో ఒకచోట, ఆదిశంకరుల గురించిన విశేషణాలు చెబుతూ, “ఆయన అపూర్వ శంకరులు, సాక్షాత పరమేశ్వరుల అవతారం. నాగాభారణాలను, ఏనుగు చర్మాన్ని, పులి చర్మాన్ని, అష్ట ఐశ్వర్యాలను విడిచిపెట్టి, సన్యాస రూపంతో శిష్యులతో వచ్చినవారు ఆదిశంకరులు” అని అంటారు.


ఇప్పుడు శ్రీనివాస శాస్త్రి గారి అనుభవంలో శ్రీ శ్రీ శ్రీ చన్ద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, మన పరమాచార్య స్వామివారు కూడా అపూర్వ శంకరులే అని. 


అప్పుడు మహాస్వామివారు శివాస్థానంలో మకాం చేస్తున్నారు. పన్నెండు సంవత్సరముల బాలుడు అక్కడకు వచ్చి స్వామివారి ముందు నిలబడ్డాడు. ఏడుస్తూ స్వామివారికి తన బాధను చెప్పుకుంటున్నాడు. “శ్రీ పెరియవ! నాకు తండ్రి లేడు. మా అమ్మ, చెల్లి బాంబేలో ఒక ఇంటిలో ఉన్నారు. ఆ ఇంట్లో మా అమ్మ వంటమనిషిగా చేస్తోంది. నన్ను ఇక్కడ మద్రాసులో ఒక క్రైస్తవ పాఠశాల వేశారు. ఇప్పుడు నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. మంచి మార్కులు తెచ్చుకుంటున్నాను. ఇప్పుడ అక్కడ నన్ను వారు క్రైస్తవంలోకి మారమని, అలా మతం మారితే ఎం.ఏ. డిగ్రీ దాకా చదివించి ఉద్యోగం కూడా ఇప్పిస్తామని చెబుతున్నారు. 


కాని నాకు మతం మారడానికి ఇష్టం లేదు. నాకు ఉపనయనం చేసుకోవాలని ఉంది. నలుగు నెలల నుండి మా అమ్మ దగ్గర నుండి నాకు ఎటువంటి సమాచారము, ఉత్తరాలు రాలేదు. మ తల్లికి, చెల్లికి ఏమి జరిగిందో నాకు తెలియడంలేదు”.


మొత్తం విషయం అంతా స్వామివారికి చెప్పి, ఏడుస్తూ నిలబడ్డాడు. ఆ పిల్లాణ్ణి శివాస్థానంలోనే ఉండమని ఆదేశించారు స్వామివారు. పది, పదిహేను రోజులు గడిచిపోయాయి. ఆ పిల్లాణ్ణి స్వామివారు ఎలా కరుణిస్తారో ఎవరికీ అర్థం కావడంలేదు.


ఒకరోజు పరమాచార్య స్వామివారి దర్శనం కోసం శివాస్థానానికి నలభై మంది భక్తులు వచ్చారు. వారందరూ బాంబే నుండి వచ్చామని, స్వామివారి దర్శనం ముగించుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళని వెనక్కు పిలవమని శిష్యులను ఆదేశించారు స్వామివారు. అందరూ మరలా స్వామివారి వద్దకు వచ్చారు. స్వామివారు వాళ్ళందరిని పేర్లు ఇతర వివరాలు తెలపమని అడిగారు. అందుకు వారు ఎంతగానో సంతోషించారు.


అందరూ వారి వారి వివరాలు చెబుతున్నప్పుడు, ఒక వ్యక్తి పేరు చెప్పగానే, ఆ పిల్లవాణ్ణి తీసుకురమ్మని శిష్యులకు చెప్పారు స్వామివారు. తన పరిస్థితిని అతనికి చెప్పమని ఆ అబ్బాయిని ఆదేశించారు స్వామివారు. పిల్లవాని పరిస్థితి విని అతను కదిలిపోయాడు. ఆ పిల్లాణ్ణి ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు, కాని అతను చెప్పిన వివరాల ప్రకారం అతని తలి, చెల్లి పనిచేస్తున్నది తన ఇంటిలోనే అని అతను అర్థం చేసుకున్నాడు.


ఆ పిల్లాణ్ణి తను ఇంతకుముందెప్పుడు చూడలేదని, అతని తల్లి, చెల్లి తన ఇంట్లోనే ఉంటారని తెలిపాడు. కాని నాలుగు నెలల క్రితం ఆమె చనిపోయిందని చెప్పాడు. పిల్లాడి పాఠశాల యాజమాన్యానికి చెప్పినా వాళ్ళ నుండి స్పందన లేదని చెప్పాడు. మొత్తం కార్యక్రమాలను పిల్లాడి చెల్లి చేత చేయించాడు. పరమాచార్య స్వామివారి దర్శనం తరువాత మద్రాసుకు వెళ్లి అబ్బాయి గురించి విచారించాలనుకున్నట్టు తెలిపాడు. కాని మహాస్వామివారి అనుగ్రహం వల్ల పరమాచార్య స్వామివారి సన్నిధిలోనే ఆ పిల్లవాడు లభించాడు.


తరువాత మహాస్వామివారు ఇలా ఆదేశించారు. “నీతోపాటు ఈ పిల్లవాణ్ణి బాంబే తీసుకునివెళ్ళు. తన తల్లికి జగవలసిన కార్యక్రమలన్నిటిని ఈ పిల్లాడి చేత చేయించు. నీ స్వంత బిడ్డలాగా ఆదరించు. ఇతని చెల్లి పెళ్లి చేసే బాధ్యత కూడా నీదే”

ఎవరో తెలియని ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడం ఇతరలుక సాధ్యం కాదు, కేవలం అది ఈశ్వరునికే సాధ్యం.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ఓం శ్రీరామచంద్రాయ నమః

 🌹ఓం శ్రీరామచంద్రాయ నమః 🌹


క.  మంగళ మో నారాయణ !

     మంగళ మో రామచంద్ర ! మహనీయగుణా !

     మంగళ మో సీతాపతి !

     మంగళ మో దివ్యనామ ! మదినెంతు సదా !    


మం.ద్వి.

      మంగళమో రామ ! మహానీయ నామ !

      కౌసల్య నందనా ! కమనీయ రామ !

      చక్రవర్తి తనూజ ! జానకీ రామ !

      శ్రితజన మందార !  శ్రీసార్వభౌమ !

      వినుతింతు త్వన్నామ ఘనత శ్రీరామ !

      ప్రణతుల నర్పింతు పరమాత్మ ! రామ !        


                🌻మంగళమ్🌻


అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు.అభినందనలు 


గోపాలుని మధుసూదన రావు

               సులోచనా రాణి

రఘువరం

 రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరమ్ 

కాకుత్థ్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ 

రాజేంద్రం సత్యసంధం  దశరథతనయం శ్యామలం శాంతమూర్తిమ్ 

వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్🙏🙏🙏

రామో రామో రామయితి ప్రజానాం అని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం లో చెప్పినట్లు ఈ రోజు దేశం మొత్తం రామనామ జపంలో మునిగితేలుతుంది. నిజానికి రామ అనేది రెండక్షరాల నామం మాత్రమే కాదు, ఈ జాతి గుండె చప్పుడు. అటువంటి అద్భుత నామాన్ని మనకందించిన వసిష్ఠులవారిని కూడా స్మరించుకుంటూ, ఆనామాన్ని తారక మంత్రంగా ఇచ్చి మనల్ని యుగ యుగాలుగా తరింప చేస్తున్న ఆ శ్రీ రామ దివ్య పాదారవిందాలను స్మరించుకుంటూ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు 💐💐💐

🌼శ్రీ రామ జయం🌼

   🌸శుభోదయం🌸

29, మార్చి 2023, బుధవారం

సద్వినియోగపరచుకోగలరు

 *గాలి బుడగ జీవితం అంటే ఇదే!*



శ్వాస రూపంలో మనం తీసుకున్న  వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోయి....

1. ప్రాణము 2. అపానము 3. వ్యానము 4. ఉదానము 5. సమానము అను ఐదు ప్రాణములుగా మారిపోతుంది.

1.ప్రాణము:-  అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకొని వాయువు.

2. అపాన వాయువు:- బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. ఈ వాయు సహాయంతోనే మల మూత్ర విసర్జనలే కాక శరీరంలోని సమస్త మాలిన్యాలను బయటకు నెట్టబడుతున్నాయి.

3. వ్యాన వాయువు:- మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు.  ఈ వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం (మరుగుజ్జుతనం) ప్రాప్తించును.

4. ఉదాన వాయువు:- దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగును.

5. సమాన వాయువు:- దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి ఏ ఏ భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలుగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలి పడటం సంభవించును.

శ్వాస - చక్రాలు:-

ఈ శ్వాస ప్రతిరోజు ఉదయము సరిగ్గా 6 గంటలకు మొదలై 

➡️ మూలాధార చక్రము నందు - 600 సార్లు

➡️ స్వాధిష్ఠాన చక్రము నందు - 6000 సార్లు

➡️ మణిపూరక చక్రము నందు - 6000సార్లు

➡️ అనాహత చక్రము నందు - 6000 సార్లు

➡️ విశుద్ధి చక్రము నందు - 1000 సార్లు

➡️ ఆజ్ఞా చక్రము నందు  - 1000 సార్లు

➡️ సహస్రారము నందు - 1000 సార్లు 

అనగా, రోజుకు 21600 సార్లు పయనిస్తోంది.


శ్వాస - అంగుళాలు:-

సాధారణంగా శ్వాసను సాధకుడు 12 అంగుళాలు వదులుతాడు.  శ్వాసను ఎవరైతే లోతుగా - నిదానంగా - దీర్ఘంగా తీసుకొని దానిపై దృష్టి ఉంచి విడవటం చేస్తుంటే శ్వాస యొక్క అంగుళాలు తగ్గును.

➡️ శ్వాసను 11 అంగుళాలకు కుదిస్తే - ప్రాణం స్థిరమవుతుంది.

➡️ శ్వాసను 10 అంగుళాలకు కుదిస్తే - మహాకవి అవుతాడు.

➡️ శ్వాసను 9 అంగుళాలకు కుదిస్తే -  బ్రహ్మానందం కలుగుతుంది.

➡️ శ్వాసను 8 అంగుళాలకు కుదిస్తే - దూరదృష్టి కలుగును.

➡️ శ్వాసను 6 అంగుళాలకు కుదిస్తే - ఆకాశగమనం చేయగలుగుతాడు.

➡️ శ్వాసను 4 అంగుళాలకు కుదిస్తే - సర్వ సిద్ధులు ప్రాప్తిస్తాయి.

➡️ శ్వాసను 2 అంగుళాలకు కుదిస్తే - కావలసిన రూపం ధరించిగలుగుతాడు.

➡️ శ్వాసను 1 అంగుళానికి కుదిస్తే -  అదృశ్యం అవ్వగలరు.

   మరింత సాధన చేయగా శ్వాస అవసరమే వారికి ఉండదు.  అలాంటి వారు అమరులు అవుతారు.

శ్వాస - సృష్టి వయస్సు:-

 మనము రోజుకు తీసుకునే శ్వాసలను (21600) రెట్టింపు చేసి ఒక సున్నను చేర్చిన

➡️ కలియుగం - 4,32,000 సంవత్సరాలు.

➡️ రెట్టింపు చేసిన ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు.

➡️ మూడు రెట్లు చేసిన త్రేతా యుగము- 12,96,000 సంవత్సరాలు.

➡️ నాలుగు రెట్లు చేసిన కృత యుగము - 17,28,000 సంవత్సరాలు.

➡️ పది రెట్లు చేసిన చతుర్ యుగము ( కలి+ద్వాపర+త్రేతా+ కృతయుగములు) -  43,20,000 సంవత్సరాలు.

శ్వాస - సాధన:-

సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని, మృదువుగా కళ్లుమూసుకుని, మన నాశికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాశికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్లడాన్ని గమనిస్తుండాలి. ఇలా చేయగా, చేయగా మనస్సు యొక్క పరుగు క్రమేపీ తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన విశ్వమయప్రాణశక్తి లభ్యమౌతుంది.


     మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేందుకు మనము ఏ హిమాలయాలకు, ఏ అరణ్యాలకు వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు.  ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటూ, ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటూ, మనం చేసే పనులు ఏవి మానుకోకుండానే, ఖాళీగా ఉన్న సమయంలో ఈ అద్భుత సాధన సులువుగా చేసుకోవచ్చు.  దీనిని చిన్న పిల్లల (5 సం"ల) నుండి ముసలి వారి దాకా ఎవరైనా చేయవచ్చును.


     84 లక్షల జన్మల తరువాత లభ్యమైన ఈ మానవ జీవితమును వృధా చేయకుండా, వివేకవంతులముగా దీనిని సద్వినియోగపరచుకోగలరు.💐



సేకరణ రాధ 🙏

శ్రగేరి శారద పీఠః జగదగురువులుప్రణాళి

 శ్రగేరి శారద పీఠః జగదగురువులుప్రణాళి (CE)


1. శ్రీ శంకర భగవత్పాద 820 (విదేహ-ముక్తి)


2.శ్రీ సురేశ్వరాచార్య 820 – 834


3.శ్రీ నిత్యబోధగన్ 834-848


4.శ్రీ జ్ఞానఘన్ 848 – 910


5.శ్రీ జ్ఞానోత్తం 910 – 954


6.శ్రీ జ్ఞానగిరి 954 – 1038


7.శ్రీ సింహగిరి 1038 – 1098


8.శ్రీ ఈశ్వర తీర్థ 1098 – 1146


9. శ్రీ నృసింహ తీర్థ 1146 – 1229


10. శ్రీ విద్యా తీర్థ 1229 – 1333


11. శ్రీ భారతీ తీర్థ 1333 - 1380


12.శ్రీ విద్యారణ్య 1380 – 1386


13.శ్రీ చంద్రశేఖర భారతి I 1386 – 1389


14.శ్రీ నృసింహ భారతి I 1389 – 1408


15.శ్రీ పురోషోత్తమ భారతి I 1408 – 1448


16.శ్రీ శంకర భారతి 1448 – 1455


17.శ్రీ చంద్రశేఖర భారతి II 1455 – 1464


18.శ్రీ నృసింగ్ భారతి II 1464 – 1479


19.శ్రీ పురోషోత్తం భారతి II 1479 – 1517


20. శ్రీరామచంద్ర భారతి 1517 – 1560


21.శ్రీ నృసింగ్ భారతి III 1560 – 1573


22.శ్రీ నృసింహ భారతి IV 1573 – 1576


23. శ్రీ నృసింగ్ భారతి V 1576 – 1600


24.శ్రీ అభినవ్ నృసింగ్ భారతి 1600 – 1623


25.శ్రీ సచ్చిదానంద భారతి I 1623 – 1663


26.శ్రీ నృసింగ్ భారతి VI 1663 – 1706


27.శ్రీ సచ్చిదానంద భారతి II 1706 – 1741


28.శ్రీ అభినవ్ సచ్చిదానంద భారతి I 1741 – 1767


29.శ్రీ నృసింగ్ భారతి VII 1767 – 1770


30.శ్రీ సచ్చిదానంద భారతి III 1770 – 1814


31.శ్రీ అభినవ్ సచ్చిదానంద భారతి II 1814 – 1817


32.శ్రీ నృసింగ్ భారతి VIII 1817 – 1879


33.శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి 1879 – 1912


34.శ్రీ చంద్రశేఖర్ భారతి III 1912 – 1954


35.శ్రీ అభినవ్ విద్యాతీర్థ 1954 – 1989


36. శ్రీ భారతీ తీర్థ 1989 - ప్రస్తుతం


37. శ్రీ విధుశేఖర్ భారతి - ఉత్తరాధికారి

మనవెంట నడిచిన దేవుడు.

 Our Life – Ramayana: ఒక దేశానికి , జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి. మనకు అలాంటిది రామాయణం. ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు. విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు. మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం రాముడు. ధర్మం పోత పోస్తే రాముడు. ఆదర్శాలు రూపుకడితే రాముడు. అందం పోగుపోస్తే రాముడు. ఆనందం నడిస్తే రాముడు. వేదోపనిషత్తులకు అర్థం రాముడు. మంత్రమూర్తి రాముడు. పరబ్రహ్మం రాముడు. లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు.


ఎప్పటి త్రేతా యుగ రాముడు? ఎన్ని యుగాలు దొర్లిపోయాయి? అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే.


చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట – శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.

బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట – రమాలాలి – మేఘశ్యామా లాలి.

మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు – శ్రీరామ రక్ష – సర్వ జగద్రక్ష.

మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట – అయ్యో రామా.

వినకూడని మాట వింటే అనాల్సిన మాట – రామ రామ.

భరించలేని కష్టానికి పర్యాయపదం – రాముడి కష్టం.

తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే – రాముడు.

కష్టం గట్టెక్కే తారక మంత్రం – శ్రీరామ.

విష్ణుసహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట – శ్రీరామ శ్రీరామ శ్రీరామ. అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట – అన్నమో రామచంద్రా!

వయసుడిగిన వేళ అనాల్సిన మాట – కృష్ణా రామా!

తిరుగులేని మాటకు – రామబాణం.

సకల సుఖశాంతులకు – రామరాజ్యం.

ఆదర్శమయిన పాలనకు – రాముడి పాలన.

ఆజానుబాహుడి పోలికకు – రాముడు.

అన్నిప్రాణులను సమంగా చూసేవాడు – రాముడు.


రాముడు ఎప్పుడు మంచి బాలుడే.

చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా – రామా కిల్డ్ రావణ ;

రావణ వాజ్ కిల్డ్ బై రామా.


ఆదర్శ దాంపత్యానికి – సీతారాములు.

గొప్ప కొడుకు – రాముడు.

అన్నదమ్ముల అనుబంధానికి – రామలక్ష్మణులు.

గొప్ప విద్యార్థి – రాముడు (వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు).

మంచి మిత్రుడు – రాము (గుహుడు చెప్పాడు).

మంచి స్వామి రాముడు (హనుమ చెప్పాడు).

సంగీత సారం రాముడు (రామదాసు , త్యాగయ్య చెప్పారు).

నాలుకమీదుగా తాగాల్సిన నామం రాముడు (పిబరే రామ రసం – సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పాడు).

కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం – రాముడు .

నోరున్నందుకు పలకాల్సిన నామం – రాముడు .

చెవులున్నందుకు వినాల్సిన కథ – రాముడు .

చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు – రాముడు .

జన్మ తరించడానికి – రాముడు , రాముడు , రాముడు .

రామాయణం పలుకుబళ్లు


మనం గమనించంగానీ… భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ , ప్రతిబింబిస్తూ ఉంటుంది . తెలుగులో కూడా అంతే.


ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే – రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని అడిగినట్లే ఉంటుంది .

చెప్పడానికి వీలుకాకపోతే – అబ్బో అదొక రామాయణం .

జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే – సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ .

ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే – అదొక పుష్పకవిమానం .

కబళించే చేతులు , చేష్ఠలు కబంధ హస్తాలు .

వికారంగా ఉంటే – శూర్పణఖ .

చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ).

పెద్ద పెద్ద అడుగులు వేస్తే – అంగదుడి అంగలు .

మెలకువలేని నిద్ర – కుంభకర్ణ నిద్ర .

పెద్ద ఇల్లు – లంకంత ఇల్లు.

ఎంగిలిచేసి పెడితే – శబరి.

ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే – ఋష్యశృంగుడు.

అల్లరి మూకలకు నిలయం – కిష్కింధ కాండ.

విషమ పరీక్షలన్నీ మనకు రోజూ – అగ్ని పరీక్షలే.

పితూరీలు చెప్పేవారందరూ – మంథరలే.

యుద్ధమంటే – రామరావణ యుద్ధమే.

ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ – రావణ కాష్ఠాలే.

కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం).

సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు. బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు. ఒక ఊళ్లో పడుకుని ఉంటారు. ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు. ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు. ఒంటిమిట్టది ఒక కథ. భద్రాద్రిది ఒక కథ . అసలు రామాయణమే మన కథ. అది రాస్తే రామాయణం – చెబితే మహా భారతం.

మిత్రులెవరు

 శ్లోకం:☝️

*కిం మిత్రమంతే సుకృతం న లోకాః*

*కిం ధ్యేయమీశస్య పాదం న శోకాః |*

*కిం కామ్యమవ్యాజసుఖం న భోగాః*

*కిం జల్పనీయం హరినామ నాన్యత్ ||*


భావం: మిత్రులెవరు? వ్యక్తులు కాదు మన సత్కర్మలే మిత్రులు. పరిశీలింపవలసినవి, పరిగణించవలసినవి, పరమాత్ముని పాదాలు కానీ మనల్ని చుట్టుకొన్న కష్టాలు కావు. కోరవలసినది అనిర్వచనీయమైన ఆనందముగానీ అల్పమైన క్షణిక సుఖాలు కాదు. ఫలప్రదమైనది భగవన్నామ స్మరణము కాని అన్యవిషయాలు కావు.🙏

గీత చదవండి

 *రండి భగవద్గీత నేర్చుకుందాం* 📖

*ఉచిత ఆన్‌లైన్ తరగతులు 👩‍🏫👩‍💻*

         

*మంగళవారం, 18-ఏప్రిల్-2023 నుండి ప్రారంభం*

స్థాయి 1️⃣ - 25 వ బ్యాచ్ - రజత వర్గం 


🌻 *20 రోజుల్లో 2 అధ్యాయాలు* శుద్ధ సంస్కృత ఉచ్చారణ తో చదవడం నేర్చుకుందాం. 

🌻 పఠన పరీక్షలో ఉత్తీర్ణులు అయిన వారికి *"గీతా గుంజన్"* ఈ-ప్రశస్తి పత్రం ఇవ్వబడును. 

🌻 భగవద్గీతను సంపూర్ణంగా నేర్చుకొనుటకు తరువాత 3 స్థాయిలకు (3 Levels) ప్రవేశం ఉచితం.

🌻 వారానికి 5 రోజులు, ప్రతి రోజు కేవలం 40 నిమిషాలు మాత్రమే

🌻 మీ సౌలభ్యం 18 టైమ్ స్లాటల నుండి ఎంపిక చేసుకోవచ్చు (ఉదయం 5:00 గం॥ నుండి రాత్రి 2:00 గం॥ వరకు IST)

🌻 గీత తరగతులు 13 భాషల్లో అందుబాటులో ఉన్నాయి (हिंदी, English, मराठी, ગુજરાતી, తెలుగు, தமிழ், ಕನ್ನಡ, മലയാളം, বাংলা, ଓଡିଆ, नेपाली, অসমীয়া, सिंधी)

🌿 *ప్రత్యేకం:* నిత్య దైనందిన జీవితంలో భగవద్గీతను ఆచరించుటకు, చాలా సులభమైన మరియు ఆసక్తికరమైన వారాంతపు (శనివారం-ఆదివారం) గీత అర్థ వివేచనము 


*మీ మొబైల్ నుండి ఫారము పురించండి, వెంటనే WhatsApp సమూహంలో చేరండి*

reg.learngeeta.com 


*🌸 || గీత చదవండి, చదివించండి, జీవితంలో   అన్వయించండి || 🌸* 


ప్రచార విభాగము

*లర్న్ గీతా, గీతా పరివార్*🚩

సుభాషితము



             _*సుభాషితము*_


*ఆరోగ్యం ధృఢగాత్రత్వం*

*ఆనృణం అఘమోచనమ్!*

*అపారవశ్యం నైశ్చింత్యం*

*ఆస్తిక్యం స్వర్గ ఏవ హి!!*


తా𝕝𝕝

*ఆరోగ్యం, గట్టి శరీరం, ఋణం లేకపోవడం, పాపముక్తి, పరతంత్రం లేకపోవడం, నిశ్చింతత, ఆస్తికత - ఇవన్నీ సాక్షాత్తు స్వర్గముతో సమానమైనవే కదా !*

============================


 𝕝𝕝శ్లో𝕝𝕝


*వనాని దహతే వహ్నేః*

*సఖా భవతి మారుతః।*

*స ఏవ దీపనాశాయ*

*కృశే కస్యాస్తి సౌహృదమ్॥*


తా𝕝𝕝 

*అడవిని దహించే సమయంలో  అగ్నికి వాయువు స్నేహితుడౌతాడు.....ఆ అగ్ని కృశించి చిన్న దీపంలా వెలిగేటప్పుడు ఆ వాయువే దాన్ని నశింపజేస్తున్నాడు*.... *ఇలాంటి వారికి స్నేహ మేమిటి??*


                  _*సూక్తిసుధ*_


*సమయమునందు ఉపకరించునవి:* 

వయస్సున పుట్టిన పుత్రుడును కాలమునందు పెట్టిన పైరును నాణ్యముగల వాని వద్దనుంచిన ధనమును, బాల్యమునందు అభ్యసించిన విద్యయు సత్పురుషుల సఖ్యమును మంచివానికి చేసిన ఉపకారమును సమయమునందు ఉపకరించును.



*సమయమునందు ఉపకరింపనివి:*

ముదిమిని పుట్టిన పుత్రుడును, అకాలమునందు పెట్టిన పైరును, మోసగాని వద్ద ఉంచిన ధనము, పుస్తకమందున్న విద్యయును, కపటము గలవాని సఖ్యమును, చెడువానికి చేసిన ఉపకారమును, దేశాంతరమునందున్న పుత్రుని సంపదయును, అప్పిచ్చిన ధనమును సమయమునందు ఉపకరింపవు.

ఈశ్వరేచ్ఛ

 నేను లేకపోతే


అశోక వనంలో రావణుడు... సీతమ్మ వారి మీదకోపంతో... కత్తి దూసి, ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు.... హనుమంతుడు అనుకున్నాడు 'ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని  రావణాసురుని తలను ఖండించాలి' అని


కానీ మరుక్షణంలోనే మండోదరి... రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు! 

 ఆశ్చర్య చకితుడయ్యాడు. 


'"నేనే కనుక ఇక్కడ లేకపోతే... సీతమ్మను  రక్షించే వారెవరు... అనేది నా భ్రమ అన్నమాట" అనుకున్నాడు హనుమంతుడు! 


బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం,  'నేను లేకపోతే ఎలా?' అని. 


 సీతామాతను రక్షించే పనిని, ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు. 


అప్పుడు హనుమంతుడు కి అర్థమైంది  'ఎవరి ద్వారా ఏ కార్యాన్ని  చేయించుకోవాలో... వారి ద్వారానే ప్రభువు ఆపని చేయించుకుంటాడు' అని. 


**మరింత ముందుకు వెళితే 

త్రిజట ....తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందనీ, అది లంకను కాల్చివేస్తుందనీ..దాన్ని నేను చూశాను ....అనీ చెప్పింది. 

అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు, అంతేకానీ లంకను కాల్చి రమ్మని చెప్పలేదు. 

తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం.. అనుకున్నాడు


అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను ...అని చెప్పింది. హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు... తను ఇప్పుడు ఏం చేయాలి? సరే, ప్రభువు ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది.... అనుకున్నాడు. 


హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు... హనుమంతుడు ఏమి చేయలేదు. అలా నిలబడ్డాడు. 

అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి 'అన్నా! దూతను చంపటం నీతి కాదు' అన్నాడు. 

అప్పుడు హనుమంతునికి అర్థమైంది, తనను రక్షించే భారం ప్రభువు విభీషణుని  పై ఉంచాడు అని. 


ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే .... విభీషణుడు ఆ మాట చెప్పగానే... రావణుడు  ఒప్పుకుని 'కోతిని చంపొద్దు. కోతులకు తోకంటే మహా ఇష్టం . తోకకు నిప్పు పెట్ట0డి' అన్నాడు.


అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని. "ప్రభువు నాకే చెప్పి ఉంటే... నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి! "ఆలోచనల వరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు.


పరమాశ్చర్యం ఏంటంటే... వాటన్నిటికే ఏర్పాట్లు... రావణుడే స్వయంగా చేయించాడు. 

అంటే, రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు ....తనకు"లంకను చూసి రా"అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది! 


అందుకే ప్రియ మిత్రులారా! ఒకటి గుర్తుంచుకోండి. 


ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం .

అందువల్ల 


నేను లేకపోతే ఏమవుతుందో


అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు 

'నేనే గొప్పవాడి'నని గర్వపడవద్దు. 


భగవంతుడి కోటానుకోట్ల దాసులలో 

అతి చిన్నవాడను అని ఎఱుక కలిగి ఉందాం.

రాముడిని ఎందుకు ఆరాధించాలి -*

*రాముడిని ఎందుకు ఆరాధించాలి -*?


ఆయన 

రాముడు సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ ...


1) ధర్మం అంటే ఏమిటి? - అమరకోశం ప్రకారం ధ్రియతేవా జన ఇతి ధర్మం 

2) మనకు తెలిసినది ధర్మం కాదు - మనం ఆచరించేదాన్ని ధర్మం అంటారు

3) ధర్మం ఎక్కడ నుండి వచ్చింది? 

4) ధర్మం వేదాల ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది. 

5) ఈ వేదాలు అపౌరిషేయం - అవి శివుని ఊపిరి. 

6) వేదాలు తప్ప ధర్మం అంటే ఏమిటో నిర్ణయించే హక్కు ఎవరికీ లేదు .

7) శ్రీరామాయణంను వేదం అని కూడా అంటారు. శ్రీరామాయణం వినడం/చదవడం & వేదాలు వినడం/చదవడం - రెండూ ఒకటే.

8) రావణుడిని చంపడం రామావతారం యొక్క ఏకైక లక్ష్యం అయితే, రావణుడిని చంపిన తరువాత శ్రీరాముడు తన అవతారాన్ని ముగించాలి. 

9) కానీ రాముడు 11,000 సంవత్సరాలు భూమిపై ఉండి, భార్యను కలిగి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు.

10) ధర్మాన్ని అనుసరించి మనిషి జీవితాన్ని ఎలా గడపవచ్చో చూపించాడు.


రామో విగ్రహావాన్ ధర్మః- రాముడు అంటే ధర్మం యొక్క మానవ రూపం


1) సీతారాముల కంటే ఆదర్శ దంపతులు ఈ విశ్వంలో లేరు

2) భార్య, తండ్రి, తల్లి & కుటుంబ సభ్యులను ఎలా ప్రేమించాలో రాముడు చూపించాడు. 

3) రాముడు ఒక రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో చూపించాడు (శ్రీరామ రాజ్యం) 

4) కష్ట సమయాల్లో జీవితాన్ని ఎలా గడపాలో రాముడు చూపించాడు. 

5) శ్రీరామ పట్టాభిషేకం / కళ్యాణం చేయడం అంటే ఈ భూమి మొత్తాన్ని ఆయనకు అప్పగించడం. 

6) తాను దేవుడని రాముడు ఎప్పుడూ అంగీకరించలేదు.

7) రాముడు మనిషిగా పుట్టి తన జీవితాంతం మనిషిగా మాత్రమే జీవించాడు.

8) ధర్మాన్ని అనుసరించే వారికి - చెట్లు,జంతువులు దేవతలు & మొత్తం ప్రకృతి కూడా వారికి సహాయం చేస్తాయి.


శ్రీరామ నవమి

 - 30 Mar, గురువారం


రామో విగ్రహావాన్ ధర్మః- రాముడు అంటే ధర్మం యొక్క మానవ రూపం


ఒకప్పుడు పార్వతి దేవి ఈ ప్రశ్నను శివుడికి వేసింది -

 

విష్ణు సహస్రనామం చాలా సులభంగా చదివిన ప్రయోజనం ప్రజలకు ఎలా లభిస్తుంది? 

 

అప్పుడు శివుడు ఇలా సమాధానమిచ్చాడు - ఈ క్రింది శ్లోకం ద్వారా లభిస్తుంది - 


‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే’ 


అక్షరాలను సంఖ్యలుగా మార్చినట్లయితే, అప్పుడు


 రా = 2 & మా = 5 

 

రామ రామ రామ 


2 × 5 × 2 × 5 × 2 × 5 = 1000.


రామో విగ్రహావాన్ ధర్మః- రాముడు అంటే ధర్మం యొక్క మానవ రూపం


*శ్రీరామాయణం ఎలా పుట్టింది*


1) ఎవరు గుణవంతుడు? 

2) ఎవరు గొప్పపరాక్రమము కలిగినవాడు?

3) ఎవరు ధర్మము తెలిసినవాడు?

4) ఎవరు కృతజ్ఞుడు?

5) ఎవరు సత్యమైన వాక్కులు మాత్రమే కలవాడు?

6) ఎవరి సంకల్పము అత్యంత దృఢమైనది?

7) ఎవరు మంచి నడవడి కలవాడు?

8) ఎవరు అన్ని ప్రాణులకు హితము గూర్చే వాడు

9) ఎవరు విద్వాంసుడు?

10) ఎవరు ఎంతటి కార్యాన్నయినా సాధించేవాడు?

11) ఎవరు చూసే వారికి ఎల్లప్పుడు సంతోషము కలిగించేవాడు?

12) ఎవరు ధైర్యము గలవాడు?

13) ఎవరు కోపమును జయించిన వాడు?

14) ఎవరు కోపించినప్పుడు దేవతలు సైతం గజగజ వణకుతారు?

15) ఎవరు అసూయలేనివాడు?

16) ఎవరు కాంతి కలవాడు?


ఇన్ని లక్షణాలు ఒకే మనిషిలో ఉండి ! 

ఆ మనిషి భూమిమీద ఎప్పుడయినా నడయాడినాడా?


అసలు అలాంటివాడు ఒకడుండటం సాధ్యమయ్యేపనేనా?

అలాంటి వాడినెవరినయినా బ్రహ్మగారు సృష్టించారా? 


*ఇలా వాల్మీకి మహర్షి నారద మునిని అడిగారు - పై ప్రశ్నలకు సమాధానం శ్రీరామాయణం యొక్క మూలం*.


రామో విగ్రహవాన్ ధర్మః- రాముడు అంటే ధర్మం యొక్క మానవ రూపం


 *శ్రీరామాయణం నుండి సమాజంలో ప్రస్తుత సమస్యలకు పరిష్కారాలు*


1) ఎటువంటి నియమ నిబంధనలను పాటించకుండా కొంతమంది సంతోషంగా జీవిస్తున్నట్లు మనం చూస్తాము. 

2) అవినీతికి గురైన & చట్టవిరుద్ధంగా డబ్బు సంపాదించేవారు

3) చెడు అలవాట్లు ఉన్నవారు చాలా ఆనందిస్తున్నారు.


4) ధర్మంగా సంపాదించే ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు & ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 

5) ఈ ధర్మాన్ని ఆచరించడం వల్ల ఉపయోగం ఏమిటి? 


6) ధర్మాన్ని ఆచరించడం వ్యవసాయం సాగు చేయడం లాంటిది.

7) విత్తనాలు నాటే వాడు చివరికి పంటను ఖచ్చితంగా పొందుతాడు.


8) కానీ అధర్మం ఇంటికి చిన్న అగ్నిని పట్టుకోవడం లాంటిది.

9) ఇది చిన్న అగ్ని అని మనం విస్మరిస్తే, అది మొత్తం ఇంటిని కాల్చేస్తుంది. 


*మనం ధర్మాన్ని పాటిస్తే, ధర్మం మనలను రక్షిస్తుంది*..


రామో విగ్రహవాన్ ధర్మః- రాముడు అంటే ధర్మం యొక్క మానవ రూపం


1) కొన్ని కోట్ల కోట్ల కోట్ల జన్మల తరువాత, మానవ పుట్టుక బహుమతిగా ఉంటుంది.

2) ఇందులో, భారతదేశంలో జన్మించడం ఇంకా కష్టం.

3) ఇందులో, సనాతన ధర్మంలో జన్మించడం ఇంకా కష్టం.

4) ఇందులో, అన్ని అవయవాలతో పుట్టడం ఇంకా కష్టం.

5) ఇందులో, రామ నామం చెప్పడం ఇంకా కష్టం.

6) ఇందులో, మానవ విలువలను కలిగి ఉన్న మంచి కుటుంబంలో జన్మించడం చాలా కష్టం.

7) ఇందులో, పరోపకార విలువలతో మంచి తల్లిదండ్రులను కలిగి ఉండటం ఇంకా కష్టం.

8) ఇందులో, భక్తి ఆలోచన కలిగి ఉండటం ఇంకా కష్టం.

9) ఇందులో శ్రీరామాయణం వినడం, రాముడి గురించి తెలుసుకోవడం ఇంకా కష్టం. 


*10) వశిష్ట మహర్షి శ్రీరామ అనే పేరును ఉంచడానికి దశరథ మహారాజు - ఇక్ష్వాక రాజ్యంలో వేల సంవత్సరాలు గడిపారు*


రామో విగ్రహవాన్ ధర్మః- రాముడు అంటే ధర్మం యొక్క మానవ రూపం


*రాముడి గురించి ఎవరికి తెలుసు?*


శివుడికి / సీతమ్మకి / హనుమకి - ఈ ముగ్గురికి మాత్రమే రాముడి గురించి పూర్తిగా తెలుసు

 

మీరు రాముడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?


శ్రీరామాయణం వినండి / శ్రీరామాయణం చదవండి

 

*మనం శ్రీరామాయణం వింటే -*


1) మన మాటలు మారుతాయి 

2) మన భాష మారుతుంది 

3) మన జీవితం మారుతుంది 

4) మన విధి మారుతుంది 

5) మన జీవన విధానం మారుతుంది 

6) మన ప్రాధాన్యతలు మారుతాయి 

7) మన పాత్ర మారుతుంది 

8) మన అలవాట్లు మారుతాయి 

9) మన సంబంధాలు మారుతాయి 

10) మన వైఖరి మారుతుంది


*శ్రీరామాయణం సాహిత్యానికి ఆ శక్తి ఉంటుంది*


కాబట్టి అందరికీ 

సర్వేజనాసుఖినోభవంతు !!

కోవిడ్ కొత్త మార్గదర్శకాలివే..

 *కోవిడ్ కొత్త మార్గదర్శకాలివే..*



1. వెంటిలేషన్ తక్కువగా ఉన్న చోట పెద్ద ఎత్తున గుమిగూడకుండా జాగ్రత్త పడాలి. దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడే వారి మరింత అప్రమత్తంగా ఉండాలి.

2.బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఖర్చీఫ్ వాడాలి.

3.చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలి. పబ్లిక్ ప్లేసెస్లో ఉమ్మివేయకూడదు. టెస్టింగ్ సంఖ్యను పెంచాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోవాలి.

4.లక్షణాలు కనిపిస్తే ఎవరినీ కలవకుండా జాగ్రత్తపడాలి.


పంచ సూత్రాలు..


అన్ని రాష్ట్రాలు 5 సూత్రాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఇటీవలే ఆదేశించింది కేంద్ర ఆరోగ్య శాఖ. కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఇవే సూత్రాలు అమలు చేయాలని స్పష్టం చేసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్తో పాటు కొవిడ్ నిబంధనలు పాటించాలని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి మాక్ డ్రిల్ కూడా చేస్తామని కేంద్రం వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇది అమలవుతుందని తెలిపింది. వీటితోపాటు కొవిడ్, ఇన్ఫ్లుయెంజా మందులు అందుబాటులో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని ఆదేశించింది కేంద్రం. అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇవి తప్పకుండా అందుబాటులో ఉండాలని చెప్పింది. ఒకవేళ ఉన్నట్టుండి బాధితుల సంఖ్య పెరిగితే..అందుకు తగ్గట్టుగా పడకలు ఉన్నాయో లేదో ముందే జాగ్రత్త పడాలని తెలిపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 220 కోట్లకుపైగా వ్యాక్సిన్లు అందించినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.


"ప్రస్తుతానికి హాస్పిటలైజేషన్ పెరుగుతున్నట్టు ఎక్కడా ఆధారాలు లేవు. ఏదేమైనా ప్రికాషనరీ డోస్లు తీసుకోవాలి. వీటి సంఖ్య పెంచాలి. టెస్టింగ్ల సంఖ్య కూడా పెంచాలి. ఎప్పటికప్పుడు వైరస్ వ్యాప్తిపై నిఘా పెట్టాలి"


- కేంద్ర ఆరోగ్య శాఖ

*సేకరణ*

28, మార్చి 2023, మంగళవారం

శరీరం కర్మలు

 *శరీరం కర్మలు చేసే ఒక పరికరం*


*పునర్విత్తం పునర్మిత్రం* 

*పునర్భార్య పునర్మహి*

*ఏతత్సర్వంపునర్లభ్యం*

*న శరీరం పునఃపునః।।*


 🌷పోయిన *ధనం* మళ్లీ చేరుతుంది. 


🌷*దూరమైన మిత్రుడు* మళ్లీ చేరువఅవుతాడు.      

         

🌷*భార్య* గతిస్తే మరొక భార్య లభిస్తుంది.


🌷*భూసంపద* మళ్లీ ప్రాప్తిస్తుంది. 


పోయినవన్నీ మళ్లీ తిరిగి రాబట్టుకోవచ్చు! 


కాని *మానవ శరీరం మాత్రం మళ్లీ మళ్లీ తిరిగి రాదు.*



అందుకే 

*శరీరం ఖలు ధర్మసాధనం* అన్నారు.


 కేవలం *శరీరం* ఉంటేనే ధార్మిక పనులు చేయవచ్చు.


 *శరీరం* ఉంటేనే నాలుగు మంచి పనులు చేసే అవకాశం వస్తుంది.


 *శరీరం* ఉంటేనే హితవాక్యాలు చెప్పవచ్చు.

ఏ పని చేయడానికైనా *శరీరం* కావాలి.


 కనుక *శరీరము* ను రక్షించుకోవాల్సింది మానవ జన్మ ఎత్తినవాళ్లే.


జంతువులకు *శరీరం* ఉంటుంది, కాని, వాటికి ఆలోచన ఉండదు.


పైగా కొద్దోగొప్పో ఆలోచన కలిగినా దాన్ని అమలు చేయడానికి *శరీరం* సహకరించదు.


*బుద్ధి, ఆలోచన, మాట్లాడే శక్తి, కావలసినది సంపాదించుకొనే జ్ఞానం *తగిన అవయవ నిర్మాణం*

ఉండేది ఒక్క *మనుష్యులకే.*


వాటిని అమలు చేసే నైపుణ్యమూ మనుష్యులకే ఉంటుంది.

కనుక మనమందరం శరీరాన్ని కాపాడుకోవాలి.


*అతిగా తిన్నా,*

*అతిగా ఆలోచించినా,*

*అతిగా సుఖించినా,*

*అతిగా దుఃఖించినా,*                    

*ఏదైనా అతిగా చేస్తే ఈ "శరీరం" కాస్తా పుటుక్కుమంటుంది*. 


ఇక *శరీరం* చేజారిపోయాక చేసేది ఏమీ ఉండదు. 


కనుక ముందు *శరీరము* ను జాగ్రత్తగా చూసుకోవాలి.    

                                   

*దీనికి*

 

*సత్యం,* 

*ధర్మం*,

*శాంతి*,

*ప్రేమ,*

*అహింసలను*


 *పాటించడమే "మహా ఔషధంగా" భావించాలి.*


*విస్తరాకు*


విస్తరి ఆకుని ఎంతో శుబ్రoగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటారు. 


బోజనము తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము,


తినిన మరుక్షణం ఆ విస్తరాకును మడిచి, దూరంగా *మురికి పెంటపై పడేసి వస్తాము.*


 తర్వాత ఆ ఎంగిలి ఆకును ముట్టుకోము కూడా.


*మనిషి జీవితం కూడ అంతే*


*'ఊపిరి" పోగానే ఊరిబయట పారేసి వస్తారు*


విస్తరి ఆకు పారేసినప్పుడు సంతోష పడుతుంది, ఎందుకంటే పొయే ముందు *ఒకరి ఆకలిని తీర్చటానికి తను ఉపయోగ పడినాను అన్న తృప్తి ఆకుకు ఉంటుంది*,


*విస్తరాకుకు ఉన్న* 

*"ముందు ఆలోచన", తృప్తి భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ !*


*"" సేవ చేసే అవకాశము* *వచ్చినపుడు సేవ చేయండి""* *జారవిడుచుకోకూడదు* 


మళ్లీ ,

ఇంకొకసారి,

ఎప్పుడో చేయవచ్చు

అనుకొని వాయిదా వేయకండి, 

ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే....., 


*కుండ ఎప్పుడైనా పగలవచ్చు, అప్పుడు విస్తరికి ఉన్న తృప్తి కూడ మనకి ఉండదు.*


*ఎంత సంపాదించి ఏమి లాభం ?*


*ఒక్క పైసా కూడా తీసుకు పోగలమా?*


*మన చేత, మన వల్ల* *ప్రత్యక్షంగా,పరోక్షంగా ఓ 10 మందికి* 

*మంచి జరిగితే,* 

*మన ఈ జన్మ సార్థకమయినట్లే .....

👏 🙏🙏

శ్లోకం


 శ్లోకం:☝️

*సత్పాత్రాయ ప్రదాతవ్యమ్*

 *అపాత్రాయ కదాపి న |*

*పాత్రాఽపాత్రం ప్రసంగేషు*

 *నియోక్తుం ధర్మసంకటమ్ ||*


భావం: మనం సహాయం అందించాల్సినది అత్యంత అర్హత పాత్రత కలిగిన వ్యక్తికి. కానీ ఒక్కొక్కసారి అటువంటి వ్యక్తిని గుర్తించడం చాలా గమ్మత్తైనది కావచ్చు. (వీరిలో మీరు ఎవరికి సహాయం చేస్తారు? ఎందుకు?)

: 🔥బూరుగుచేట్టు🔥


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


హిమాలయ పర్వత శిఖరాల మీద ఒక బూరుగు చెట్టు ఉండేది. విశాలమైన శాఖలతో, విస్తారమైన కాండంతో ఆ బూరుగు చెట్టు తన తెల్లటి దూదితో మరో మంచుకొండను తలపిస్తూ ఉండేది.


ఒక రోజు అటువైపుగా వెళ్తున్న నారదుని దృష్టి ఆ బూరుగు చెట్టు మీద పడనే పడింది.


‘వేల అడుగుల ఎత్తున ఇంతటి మహావృక్షం మనుగడ సాగించడం సాధ్యమేనా!’ అనుకున్నాడు.

అనుకున్నదే తడవుగా బూరుగు చెంతకు వెళ్లి...


‘‘నువ్వు అల్లంత ఎత్తున ఇంతగా విస్తరించి ఉన్నావు కదా! మరి నీకు ఏనాడూ ఆ వాయుదేవుని వల్ల నష్టం వాటిల్లలేదా? ఆయన తన పవనాలతో నిన్ను విరిచేందుకు ప్రయత్నించలేదా! నీకూ వాయుదేవునికీ మధ్య ఏమన్నా బాంధవ్యం ఉందా ఏం?’’ అని అడిగాడు నారదుడు.


నారదుని మాటలతో బూరుగు చెట్టుకి పౌరుషం పొడుచుకువచ్చింది- ‘‘వాయుదేవుని స్నేహంతోనో, అతని దయాదాక్షిణ్యాలతోనో నేను మనుగడ సాగించడం లేదు. నన్ను కూల్చేంత సామర్థ్యం వాయుదేవునికి లేనే లేదు. నా బలంతో పోలిస్తే ఆయన బలం ఒక మూలకు కూడా సరిపోలదు,’’ అంటూ పరుషమైన మాటలెన్నో పలికింది.


బూరుగు చెట్టు మాటలను వినగానే కలహభోజనుడైన నారదునికి, మరో కథ నడిపేందుకు అవకాశం చిక్కింది. ‘‘నువ్వు ఇలా మాట్లాడటం సబబుగా లేదు! ఆ వాయుదేవుడు తల్చుకుంటే కొండలనైనా కదిలించేయగలడు. మరి నువ్వు ఇన్నేసి మాటలు అన్న విషయం తెలిస్తే ఆయన నీకు కీడు చేయక మానడు,’’ అంటూనే బూరుగు చెట్టు గర్వంతో వదరిన మాటలన్నింటినీ పూసగుచ్చినట్లుగా వాయుదేవునికి చేరవేశాడు.


బూరుగు చెట్టు తనని కించపరచడాన్ని వాయుదేవుడు సహించలేకపోయాడు.


వెంటనే ఆగమేఘాల మీద బూరుగుని చేరుకుని ‘‘ఒకనాడు బ్రహ్మదేవుడు నీ చెంత సేదతీరాడన్న కారణంగా, ఇన్నాళ్లూ దయతలచి నీ జోలికి రాలేదు. నేను చూపిన కరుణ నీలో కృతజ్ఞతను కలిగించకపోగా, గర్వాన్ని రగిలించింది. రేపు ఈపాటికి నిన్ను ఏం చేస్తానో చూడు!’’ అంటూ విసురుగా వెళ్లిపోయాడు.


వాయుదేవుని మాటలకు బూరుగు నిలువెల్లా వణికిపోయింది. ‘ఇప్పటివరకూ తనకు ఎదురులేదన్న పొగరుతో అనకూడని మాటలన్నీ అనేసింది. వాయుదేవునితోనే వైరం తెచ్చుకుంది. నారదుడు చెప్పినట్లు వాయుదేవుడు తల్చుకుంటే కొండలు కూడా కదిలిపోయే మాట వాస్తవమే! అలాంటి తాను మాత్రం ఆ ప్రభంజనుడికి ఎదురొడ్డి ఎలా నిలబడగలదు. ఇప్పుడేం చేయడం!’- ఇలా పరిపరి విధాలా ఆలోచించిన బూరుగు చివరికి ఓ నిశ్చయానికి వచ్చింది. వాయుదేవుడు తనకు నష్టం కలిగించే లోపుగా తానే తన కొమ్మలనీ విరిచేసుకుంది, రెమ్మలన్నింటినీ తుంచేసుకుంది, పూలన్నింటినీ రాల్చేసింది. చిట్టచివరికి ఒక మోడుగా మారింది. ‘ఇప్పుడిక వాయుదేవుడు నష్టపరిచేందుకు నా వద్ద ఏమీ మిగల్లేదు’ అన్న నమ్మకంతో పవనుడి రాక కోసం ఎదురుచూసింది.


మర్నాడు వాయుదేవుడు రానేవచ్చాడు. మోడులా నిలిచిన బూరుగుని చూసి జాలిపడ్డాడు. ‘‘నేను విధించాలనుకున్న శిక్షను నువ్వే స్వయంగా అమలుచేసుకున్నావు. ఇక మీదనైనా అహంకారాన్ని వీడి నమ్రతతో జీవనాన్ని సాగించు!’’ అంటూ సాగిపోయాడు.


పెద్దాచిన్నా తారతమ్యం లేకుండా, తన పరిమితుల గురించి ఆలోచించకుండా ఎవరితో పడితే వారితో విరోధం పెట్టుకుంటే ఏం జరుగుతుందో బూరుగు కథ తెలియచేస్తోంది.

గర్వం ఎప్పటికీ పనికిరాదనే నీతిని పదే పదే వినిపిస్తోంది...


మహాభారతంలోని శాంతిపర్వం నుండి..


👉ఈ గుడికి వెళ్ళాలంటే ప్రాణాలపై ఆశ వదులు కోవాల్సిందే..

👉మరణించిన వారిని బ్రతికించగలిగే మహా శక్తి ఉన్న సంజీవని పర్వతం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా ?


గుడి అంటే రోజూ పూజలు,నైవేద్యాలు ఇవన్నీ రోజూ మామూలే! 

కానీ ఓ దేవాలయం కేవలం 5 రోజులు మాత్రమే తెరచివుంటుంది. 

ఆ 5 రోజులులూ దేవుడికి పూజలు చేసి గుడిని మూసేస్తారు. 

మళ్ళీ తెరిచేది యాడాది తర్వాతే. 


ఎందుకంటే ఈ గుడికి వెళ్ళటం ఆషామాషీ వ్యవహారం కాదు. 

అక్కడికి వెళ్ళాలంటే గుండెలు అరచేత్తో పట్టుకుని అడుగులు వేయాల్సిందే. 

అడుగడుగునా పొంచివున్న ప్రమాదాలతో ఓ సాహసయాత్రను తలపించే ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే భక్తి ఒక్కటే చాలదు.


గుండె ధైర్యం కూడా పుష్కలంగా వుండాలి.

ఇంతకీ ఆ గుడి ఎక్కడ వుంది?

అక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలని వుంది కదూ!

సలేశ్వరం శ్రీశైలం దగ్గరలోని ఒక యత్రా స్థలము. 

ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, 

చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, 

ఆధ్యాత్మిక ప్రదేశం. 


ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యాత్రా స్థలము. 

ఇక్కడ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది. 

ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తోలి పౌర్ణమికి మొదలగుతుంది..


🙏 సర్వేజనాసుఖీ నో భవంతు 🙏

*చలించని హార్దికభక్తి ఒక్క భగవద్గీత  అధ్యయనం తోనే సాధ్యం!*


జీవులను ఉద్ధరించడానికి, భగవంతుడే స్వయంగా ఈ భూమిపై జన్మను తీసుకుని, 

వివరించిన యోగ సముదాయము, ప్రబోధ ఈ గీత......


భగవద్గీత శ్లోకాలను విడివిడిగా లేదా క్రమానుసారముకాక భావరీత్యా పరస్పర సమ్మతిగల శ్లోకాలను పఠించితే శ్రీకృష్ణపరమాత్ముని పరమభావం మరింత లెస్సగా స్పష్టంగా గ్రహించగల్గుతాము.


తద్వారా ఆ పరమభావాన్ని మన దైనందిక జీవితంలో వీలైంతమేరకు అనుకరించుట రోజురోజుకీ మరింత సులభమౌతుంది.


పదవ అధ్యాయపు ఈ రెండు శ్లోకాలను చూడండి :


*యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున*

*న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరమ్ (10:39)*


సర్వప్రాణులలో దివ్యమైన బీజమును నేనే. నేను లేకున్నచో చరాచరప్రాణి ఏదియునూ ఒక్క క్షణమైనా జీవించి ఉండలేదు.


*అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున*

*విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్ (10 :42)*


ఈ విశ్వమంతటా స్థితమొనర్చిన (వ్యాపింపజేసిన) నాయొక్క ఒక్క అంశతోడనే ఈ విశ్వాన్ని నేను ధరిస్తున్నాను -ఇంతకన్నా వివరంగా తెలుసుకొను అవసరం ఏముంది అర్జునా నీకు ?


*వివరణ:*


ఈ విశ్వంలో ఉన్నదంతటినీ ఆ పరమాత్ముడు తనయొక్క ఒక్క అంశతో ధరిస్తున్నానని చెప్పడమేకాకుండా, ఇక్కడ ఈ విశ్వమందు తనలో జీవిస్తున్న ప్రతీ చరాచరజీవియొక్క జీవబీజం - అంటే ప్రతీ జీవియొక్క జన్మకు కారణం అవ్యక్త అక్షర పరమభావమైన - తానేనని స్పష్టంగా వెల్లడిస్తున్నట్లేకదా *(7:10)* శ్లోకంలోకూడా ఈ విషయాన్నే వెల్లడిచేసాడు ఆ పరమాత్ముడు - *(బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనామ్)*


అలాంటప్పుడు కారణజన్ములు అన్న ఊతపదాన్ని వినియోగిస్తూ కొందరే కారణజన్ములని మిగతా మనం అందరమూ ఎందుకూ పనికిరాని అతి సామాన్యులం అని మరి ఎలా అంటున్నాము మనం ఈనాటికీ ?! అలా కొందరిని కారణజన్ములుగా సృష్టించి మరికొందరిని సామాన్యులుగా ఆ పరమాత్ముడు సృష్టించియుంటే తన అంశాలపై తానే నిష్పాక్షికము నిండియున్న సమభావదృష్టి కోల్పోతూ - *స మో హం సర్వభూతేషు న మే ద్వేష్యో స్తి న ప్రియహ్ (9:29) -* పక్షపాతవైఖరి కల్గియున్నాడని మనం ఆరోపిస్తున్నట్లు అర్థం రాటల్లేదా


అదికూడా నశ్వరమైపోయే ప్రాణులలో నశ్వరముకాని పరమేశ్వరుడు సమంగా కొలువైయున్నట్లు చూడగల్గుటయే - ఆ ప్రాణి సామాన్య చండాలుడైతేనేమి విద్యా వినయ సంపన్నుడైతేనేమి *(5:18) -* నిజమైన దృష్టి కలిగియుండుట - 

*సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి (13 :27 ) -* అని స్వయానా ఆ పరమాత్ముడే స్పష్టంగా చెబుతున్నప్పటికీ ?!


*(10 :42)* శ్లోకంలో - ఈ విశ్వమంతటా వ్యాపింపజేసిన నాయొక్క అంశను ఆధారం చేసుకొని ఈ విశ్వములో జీవిస్తున్న సర్వ చరాచర ప్రాణులలో జీవబీజమును - *(10 :39)* - నేనే అన్న వాస్తవ సత్యాన్ని తెలిసికొంటూ నన్నే భజించితే నువ్వు తప్పకుండా నన్ను చేరగలవు. ఇంతకు మించి తెలుసుకునే అవసరం ఏముంది అని ఈనాడు మనలనుకూడా ఆ పరమాత్ముడు ప్రశ్నిస్తున్నట్లేకదా ?


ఇదేకదా *2:46* శ్లోకపు భావం. ఇక్కడ ఈ విశ్వమంతా పరమాత్ముడే - పరబ్రహ్మమే - సజీవమైయున్న సర్వప్రాణులలో ఆత్మరూపాన్న ఇంకా ప్రాణుల బయట విశ్వమంతటా తన అవ్యక్తరూపాన్ని *(9:4 - మయా తతమిదం జగదవ్యక్తమూర్తినా)* వ్యాపించియున్నాడని తెలుసుకోగల్గిన బ్రహ్మజ్ఞానికి వేదాలు ఇంకా ఆవశ్యకమా - 


*యావానర్థ ఉదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః - ?!*


ఇప్పుడు పైన పేర్కొనబడిన *10 :39 , 42* శ్లోకాలలో ఉన్న భావమే *8 :22* మరియు *15 :7* శ్లోకాలలో ఎలా వెల్లడవుతోందో చూడండి :


*పురుషాహ్ స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా*

*యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతం (8 :22)*


*మమైవాంశో జీవలోకే* *జీవభూతః సనాతనః*

*మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్తాని కర్షతి (15:7)*


ఈ రెండు శ్లోకాలను కలిపి చదివితే :


ప్రకృతినుండి ఆరు ఇంద్రియములను తనయొక్క అంశతో ఆకర్షించి(నపిమ్మట) ఈ జీవలోకమున ప్రాణులలో సనాతన జీవాత్మగా నెలకొల్పి జీవింపజేసిన ప్రాణులన్నియునూ *(15:7)* ఏ పరమాత్మయందు నివసించుచున్నాయో (మరియు) ఏ పరమపురుషునిద్వారా ఈ సమస్త జగత్తు వ్యాపింపబడియున్నదో ఆ పరమపురుషుడు చలించని హార్దిక (హృదయపూర్వక) భక్తితో మాత్రమే పొందశక్యము *(8:22).*


అంటే పరమాత్ముడను భజించితే కేవలం అవ్యక్త అక్షర పరమాత్మగాకాక


సర్వప్రాణులలో ఆత్మగా కొలువైయుంటూ (అలా ఆ పరమాత్ముడను ఆత్మగా కలిగియున్న) ఆ సర్వప్రాణులనూ దారమునందు మణులవలె - *మత్తహ్ పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ *(7:7) -*


 తనలో కూర్చుకొనియున్న పరమాత్మునిగా వాస్తవ్య జీవితంలో వీక్షిస్తూ - అంటే ఎవరిని చూసినా మొట్టమొదట మనలో ఆ పరమాత్ముని అవ్యక్త రూపం దిద్దుకొనేటటువంటి భక్త్గి కల్గియుంటే ఆ పరమాత్ముడు నిశ్చితంగా నిస్సందేహముగా లభ్యమౌతాడని ఆ పరమాత్ముడే చెబుతున్నట్లు స్పష్టంకదా.


అయితే ఈ విధమైనటువంటి భక్తి కల్గియుండాలంటే ముందుగా మనలో ఉన్న పరమాత్మ అంశం సర్వవిశ్వవ్యాప్తమై సర్వప్రాణులకూ ఆశ్రయమిస్తున్న పరమపురుషుడు మాత్రమేకాకుండా సర్వప్రాణులలో ఆత్మగా కొలువైయున్న పరమాత్ముని అంశం అని గ్రహించాలికదా.


అంటే మన కంటికి ఎవరు కనపడుతున్నా (ఏ జీవి కనపడుతున్నా) వారి స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ వారిలో ఉన్న శ్రీకృష్ణపరమాత్ముడే నాలోనూ ఉన్నాడు గనుక వారందరి స్థితులలో నన్నునేను (అంటే వారి దేహాన్న ఉన్న వారి ఆత్మ స్థానంలో నా ఆత్మను) ఉహించుకోగల్గుతూ వారందరినీ నేనున్న స్థితిలో (నా దేహమందున్న ఆత్మ స్థానంలో వారి ఆత్మను) ఉహించుకోగల్గాలికదా. అప్పుడే మన భక్తి *8:22* శ్లోకంలో ఆ పరమాత్ముడు కల్గియుండమని ఆదేశిస్తున్న భక్తితో సరితూగే భక్తి అవుతోందని భావించగలముకదా.

అంటే, ఒక విధంగా ఆ అవ్యక్త అక్షర పరమపురుషుడు తననే - సర్వప్రాణులకూ ఆశ్రయమివ్వగల తన పరమతత్త్వాన్నే - అనుకరించమంటున్నాడని స్పష్టంకదా.


ఇదే *6:29* శ్లోకముయొక్క తాత్పర్యం చూడండి :


*సర్వభూతస్థమాత్మానం* *సర్వభూతాని చాత్మని*

*ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్రా సమదర్శనః*


యోగముతో గూడుకొనిన మనస్సుగలవాడు సమస్త ప్రాణులయందును సమదృష్టిగలవాడై తనను సర్వప్రాణులయందున్న వానిగాను సర్వప్రాణులను తనయందున్నవిగాను చూచుచున్నాడు. (విద్యా ప్రకాశానందగిరి స్వాములవారి అనువాదం, కొన్ని మార్పులతో)


యోగమందు పరిపక్వతపొందిన యోగి ఎక్కడైనాకూడా నిష్పాక్షికముగానే ప్రవర్తించును గనుక తననుతాను ఇతరులైన అందరిలోనూ మరియు ఇతరులైన అందరినీ తనలో చూచును.


అంటే మోక్షం పొందతలంచువారు ఆ పరమాత్ముని ఈ తత్త్వాన్నే అనుకరించమని - 

*జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్త్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున* - *4:9* శ్లోకంలో ఆ పరమాత్ముడు బోధిస్తున్నాడని స్పష్టంగా వెల్లడౌతోందికదా...


సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు...

🙏🙏


🙏 *ఓం నారాయణ- ఆది నారాయణ* 🙏


*గ్రంథం:* భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*ఓం నిత్యసత్యాయనమః*


ఆలపాటి శ్రీనివాస పూర్ణచంద్రరావు, మచిలీ పట్నం- పేర్ని కృష్ణమూర్తి కాలనీ, గవర్ణమెంటు హాస్పిటల్ వెనుక - తన దివ్యానుభవాన్ని ఇలా వివరిస్తున్నారు. వీరి అనుభవం *"చచ్చిబూడిదైనా రమ్మంటే వచ్చేదే గదయ్యా!"* అన్న శ్రీ స్వామివారి మాట అక్షరాల నిజమని సూచిస్తుంది.


1994 సం|| నాటికి నా కుమారుడు నాగ వెంకటచక్రవర్తి నాలుగు సంవత్సరముల పిల్లవాడు. విపరీతమయిన జ్వరం వల్ల మెదడు ఫెయిలయింది. ఎవరినీ గుర్తించలేడు, ఏమీ తినలేడు, ముక్కు ద్వారా ట్యూబు పెట్టి ద్రవాహారం పోస్తున్నాము. ఇరవైరోజులు ఎమ్.బి.బి.ఎస్. డాక్టరు గారి ఆస్పత్రిలో ఉంచినా ఏమినయంకాలేదు. విజయవాడకు తీసుకు వస్తే స్కానింగ్ చేయాలని వేల రూపాయలడిగారు. శక్తిలేక ఇంటికి వెళ్ళాము. 


మచిలీ పట్నం డాక్టర్లు మేమేమి చేయలేమని ఆశవదిలేశారు. మా స్నేహితుని సలహాపై శ్రీ వెంకయ్యస్వామి వారి భక్తురాలి దగ్గరకు తీసుకుపోతే ఆమె వెంటనే గొలగమూడికి పోండి బాగవుతుందని చెప్పారు. గొలగమూడి ఎక్కడుందో?, ఎలా పోవాలో?, ఎంతఖర్చవుతుందో తెలియక యోచనలో పడ్డాను. శ్రీ స్వామివారి దయవలన అక్కడున్న భక్తులు ఐదువందల రూపాయలిచ్చి వెంటనే గొలగమూడికి వెళ్ళి బిడ్డను బ్రతికించు కోమన్నారు. అది శ్రీ స్వామివారి దయయని గొలగమూడి చేరాను.


 అంతస్పృహలేని పరిస్థితిలో నున్నబిడ్డకు తలనీలాలు తీయించుటకు రెండు గంటలు పట్టింది. పిల్లవాని తలంతా గాయాలే. గాయాలకు విబూతి మాత్రం పూశాను. రెండుగంటలలో ఒక్క గాయం కూడా కనిపించకుండా పోవడమే చిత్రం. తెల్లవారి శనివారం విపరీత మైన రద్దీ. పిల్లవానిని ఎత్తుకొని కూర్చొని యున్నాను. ఒక్క క్షణంలో కళ్ళు మూతలు పడి మందిరం ముందు శ్రీ స్వామివారి దగ్గరున్నాను. ఆకరుణామయుడు కనిపించి *"బిడ్డకు బాగుంటుంది. నామార్గంలో నడుస్తావా?"* అని అడుగుతున్నాడు. నేను సరేననగానే నాకు మెలుకువ వచ్చింది. తెల్లవారినుండి పిల్లవాడు చిత్రంగా ఇడ్లీ దగ్గరనుండి సర్వం తింటూ చక్కగా నడిచి తిరుగుతున్నాడు. ఇన్నాళ్ళు ఆహారం లేక బలహీనంగా ఉండవలసిన వానికి ఆ లక్షణాలే లేవు. ఐదురోజులుండి ఇల్లు చేరాను.


శ్రీ స్వామివారి మార్గంలో ఎలా నడవాలో తెలియక స్నేహితుని సలహా పై శ్రీ స్వామి వారి మాల వేసుకొని నలబైరోజులు దీక్ష చేయాలనుకున్నాను. దీక్షా వస్త్రములతో సాయి మందిరానికి పోయాను. అక్కడ పూజారులు లేక నా మాల నేనే ధరించాలని బాదపడుతున్నాను. పట్టపగలే ఆశ్చర్యంగా శ్రీ స్వామివారు నాముందు కనిపించి *"ఆ డాలరు నామెడలో వేయయ్యా!"* అని చెప్పగా అలానే వేశాను. *"ఇప్పుడు తీసి నీమెడలో వేసుకో!"* అన్నారు. అలాగే వేసుకున్నాను. *“నలభై రోజులు బిక్షచేసి వచ్చిన డబ్బుతో పచ్చిగడ్డికొని ఆవులకు పెట్టు"* అని చెప్పి అదృశ్యమయ్యారు. ఇదంతా స్వప్నం కాదు, పట్టపగలు జరిగిన సంగతి. వారిదయవలన నేనలాగే నలబైరోజులు బిక్షచేసి ఆవులకు పచ్చిగడ్డి పెట్టాను. ఇలాంటి దివ్య అనుభవం ప్రసాదించినన్ను వారి భక్త కోటిలో చేర్చుకున్న శ్రీ స్వామివారికి నేను జీవితాంతం ఋణగ్రస్తుడను.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


భగవంతుని సంపూర్ణంగా విశ్వసించి, నిరంతరమూ గుర్తుంచుకుని, మన జీవితమంతటినీ ఆయనకు తృప్తికరమైన రీతిన గడుపుకోవడమే సర్వమతాల సారము. దీనిని సంపూర్ణంగా సాధించినవారే మహాత్ములు. ఆ స్థితి సాధించాకనే దుఃఖం, శాశ్వతంగా అంతమొందగలదని అన్ని మత గ్రంథాలు, అందరు మహాత్ములూ చెబుతున్నారు. ఎట్టి దుఃఖమూ, అసంతృప్తి లేకుండా వుండగలగాలనే జీవులన్నీ కోరేది. కాని దానిని సాధించే మార్గమెంతో సూక్ష్మమైనది. అది తెలియాలంటే దానిని తెలిసి సాధించినవారిని ఆశ్రయించాలి. కాని వారినాశ్రయించినా వారు మనకివ్వదలచినదంతా మనం పొందగలగాలంటే వారిని సేవించే పద్ధతి కూడా తెలియాలి. దానిని గూడా పూర్ణుడైన గురువు సరియైన పద్ధతిన సేవించి, వారి అనుగ్రహంతో ఆత్మజ్ఞానం పొందిన మహాత్ములే మనకు తెల్పాలి. అలా జరగకుండా వుండాలంటే మనం మరికొంతమంది సద్గురువుల చరిత్రలు, బోధలు చదవాలి. అనేకమంది సద్గురువులను దర్శించాలి. వారందరి రూపాలలోనూ ఒకే దైవమెలా ప్రకటమయ్యాడో వారి చరిత్రలనుండి మనం గమనించాలి, వారు మనకు తెలిపిన సద్గురు సేవా విధానం తెలుసుకొని మనమనుసరించాలి. టిబెట్్యగి మిలారేపా అట్టి సద్గురువులలో ఒకరు. ఈ మహనీయుని అద్భుత చరిత్ర చదివితే మానవ జీవిత లక్ష్యమేమిటో గమ్యమేమిటో, ఆ గమ్యం చేరడానికి మనం గురువును ఎలా సేవించాలో, ఎలా సాధన చేయాలో మనకు సంపూర్ణంగా తెలియగలదు. సాధన సక్రమంగా జరగడానికై తీసుకోవలసిన జాగ్రత్తలు ఆయన బోధలలో మనకు లభిస్తాయి. సామాన్య మానవునిలా జన్మించి, ఉత్తమ సాధకునిలా సాధన చేసి, గొప్ప మహాత్మునిగా రూపొందిన మిలారేపా దివ్య చరిత్ర మనలను సాధనకు, సద్గురు సేవకూ ఉన్ముఖులను చేస్తుంది.


- రచయిత


ఆన్లైన్ లో చదువు కొనుటకు పరిశీలించగలరు. జై సాయి మాస్టర్🙏

http://www.saibharadwaja.org/books/readbook.aspx?book=20

శ్రీ శివ స్తుతి: ...!!




వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం


వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిమ్,


వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం


వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. ... 1



వందే సర్వజగద్విహారమతులం వందేఽ న్ధక ధ్వంసినం


వందే దేవ శిఖామణిం శశినిభం వందే హరే ర్వల్లభమ్

🙏🙏

*చలించని హార్దికభక్తి ఒక్క భగవద్గీత  అధ్యయనం తోనే సాధ్యం!*


జీవులను ఉద్ధరించడానికి, భగవంతుడే స్వయంగా ఈ భూమిపై జన్మను తీసుకుని, 

వివరించిన యోగ సముదాయము, ప్రబోధ ఈ గీత......


భగవద్గీత శ్లోకాలను విడివిడిగా లేదా క్రమానుసారముకాక భావరీత్యా పరస్పర సమ్మతిగల శ్లోకాలను పఠించితే శ్రీకృష్ణపరమాత్ముని పరమభావం మరింత లెస్సగా స్పష్టంగా గ్రహించగల్గుతాము.


తద్వారా ఆ పరమభావాన్ని మన దైనందిక జీవితంలో వీలైంతమేరకు అనుకరించుట రోజురోజుకీ మరింత సులభమౌతుంది.


పదవ అధ్యాయపు ఈ రెండు శ్లోకాలను చూడండి :


*యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున*

*న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరమ్ (10:39)*


సర్వప్రాణులలో దివ్యమైన బీజమును నేనే. నేను లేకున్నచో చరాచరప్రాణి ఏదియునూ ఒక్క క్షణమైనా జీవించి ఉండలేదు.


*అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున*

*విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్ (10 :42)*


ఈ విశ్వమంతటా స్థితమొనర్చిన (వ్యాపింపజేసిన) నాయొక్క ఒక్క అంశతోడనే ఈ విశ్వాన్ని నేను ధరిస్తున్నాను -ఇంతకన్నా వివరంగా తెలుసుకొను అవసరం ఏముంది అర్జునా నీకు ?


*వివరణ:*


ఈ విశ్వంలో ఉన్నదంతటినీ ఆ పరమాత్ముడు తనయొక్క ఒక్క అంశతో ధరిస్తున్నానని చెప్పడమేకాకుండా, ఇక్కడ ఈ విశ్వమందు తనలో జీవిస్తున్న ప్రతీ చరాచరజీవియొక్క జీవబీజం - అంటే ప్రతీ జీవియొక్క జన్మకు కారణం అవ్యక్త అక్షర పరమభావమైన - తానేనని స్పష్టంగా వెల్లడిస్తున్నట్లేకదా *(7:10)* శ్లోకంలోకూడా ఈ విషయాన్నే వెల్లడిచేసాడు ఆ పరమాత్ముడు - *(బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనామ్)*


అలాంటప్పుడు కారణజన్ములు అన్న ఊతపదాన్ని వినియోగిస్తూ కొందరే కారణజన్ములని మిగతా మనం అందరమూ ఎందుకూ పనికిరాని అతి సామాన్యులం అని మరి ఎలా అంటున్నాము మనం ఈనాటికీ ?! అలా కొందరిని కారణజన్ములుగా సృష్టించి మరికొందరిని సామాన్యులుగా ఆ పరమాత్ముడు సృష్టించియుంటే తన అంశాలపై తానే నిష్పాక్షికము నిండియున్న సమభావదృష్టి కోల్పోతూ - *స మో హం సర్వభూతేషు న మే ద్వేష్యో స్తి న ప్రియహ్ (9:29) -* పక్షపాతవైఖరి కల్గియున్నాడని మనం ఆరోపిస్తున్నట్లు అర్థం రాటల్లేదా


అదికూడా నశ్వరమైపోయే ప్రాణులలో నశ్వరముకాని పరమేశ్వరుడు సమంగా కొలువైయున్నట్లు చూడగల్గుటయే - ఆ ప్రాణి సామాన్య చండాలుడైతేనేమి విద్యా వినయ సంపన్నుడైతేనేమి *(5:18) -* నిజమైన దృష్టి కలిగియుండుట - 

*సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి (13 :27 ) -* అని స్వయానా ఆ పరమాత్ముడే స్పష్టంగా చెబుతున్నప్పటికీ ?!


*(10 :42)* శ్లోకంలో - ఈ విశ్వమంతటా వ్యాపింపజేసిన నాయొక్క అంశను ఆధారం చేసుకొని ఈ విశ్వములో జీవిస్తున్న సర్వ చరాచర ప్రాణులలో జీవబీజమును - *(10 :39)* - నేనే అన్న వాస్తవ సత్యాన్ని తెలిసికొంటూ నన్నే భజించితే నువ్వు తప్పకుండా నన్ను చేరగలవు. ఇంతకు మించి తెలుసుకునే అవసరం ఏముంది అని ఈనాడు మనలనుకూడా ఆ పరమాత్ముడు ప్రశ్నిస్తున్నట్లేకదా ?


ఇదేకదా *2:46* శ్లోకపు భావం. ఇక్కడ ఈ విశ్వమంతా పరమాత్ముడే - పరబ్రహ్మమే - సజీవమైయున్న సర్వప్రాణులలో ఆత్మరూపాన్న ఇంకా ప్రాణుల బయట విశ్వమంతటా తన అవ్యక్తరూపాన్ని *(9:4 - మయా తతమిదం జగదవ్యక్తమూర్తినా)* వ్యాపించియున్నాడని తెలుసుకోగల్గిన బ్రహ్మజ్ఞానికి వేదాలు ఇంకా ఆవశ్యకమా - 


*యావానర్థ ఉదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః - ?!*


ఇప్పుడు పైన పేర్కొనబడిన *10 :39 , 42* శ్లోకాలలో ఉన్న భావమే *8 :22* మరియు *15 :7* శ్లోకాలలో ఎలా వెల్లడవుతోందో చూడండి :


*పురుషాహ్ స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా*

*యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతం (8 :22)*


*మమైవాంశో జీవలోకే* *జీవభూతః సనాతనః*

*మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్తాని కర్షతి (15:7)*


ఈ రెండు శ్లోకాలను కలిపి చదివితే :


ప్రకృతినుండి ఆరు ఇంద్రియములను తనయొక్క అంశతో ఆకర్షించి(నపిమ్మట) ఈ జీవలోకమున ప్రాణులలో సనాతన జీవాత్మగా నెలకొల్పి జీవింపజేసిన ప్రాణులన్నియునూ *(15:7)* ఏ పరమాత్మయందు నివసించుచున్నాయో (మరియు) ఏ పరమపురుషునిద్వారా ఈ సమస్త జగత్తు వ్యాపింపబడియున్నదో ఆ పరమపురుషుడు చలించని హార్దిక (హృదయపూర్వక) భక్తితో మాత్రమే పొందశక్యము *(8:22).*


అంటే పరమాత్ముడను భజించితే కేవలం అవ్యక్త అక్షర పరమాత్మగాకాక


సర్వప్రాణులలో ఆత్మగా కొలువైయుంటూ (అలా ఆ పరమాత్ముడను ఆత్మగా కలిగియున్న) ఆ సర్వప్రాణులనూ దారమునందు మణులవలె - *మత్తహ్ పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ *(7:7) -*


 తనలో కూర్చుకొనియున్న పరమాత్మునిగా వాస్తవ్య జీవితంలో వీక్షిస్తూ - అంటే ఎవరిని చూసినా మొట్టమొదట మనలో ఆ పరమాత్ముని అవ్యక్త రూపం దిద్దుకొనేటటువంటి భక్త్గి కల్గియుంటే ఆ పరమాత్ముడు నిశ్చితంగా నిస్సందేహముగా లభ్యమౌతాడని ఆ పరమాత్ముడే చెబుతున్నట్లు స్పష్టంకదా.


అయితే ఈ విధమైనటువంటి భక్తి కల్గియుండాలంటే ముందుగా మనలో ఉన్న పరమాత్మ అంశం సర్వవిశ్వవ్యాప్తమై సర్వప్రాణులకూ ఆశ్రయమిస్తున్న పరమపురుషుడు మాత్రమేకాకుండా సర్వప్రాణులలో ఆత్మగా కొలువైయున్న పరమాత్ముని అంశం అని గ్రహించాలికదా.


అంటే మన కంటికి ఎవరు కనపడుతున్నా (ఏ జీవి కనపడుతున్నా) వారి స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ వారిలో ఉన్న శ్రీకృష్ణపరమాత్ముడే నాలోనూ ఉన్నాడు గనుక వారందరి స్థితులలో నన్నునేను (అంటే వారి దేహాన్న ఉన్న వారి ఆత్మ స్థానంలో నా ఆత్మను) ఉహించుకోగల్గుతూ వారందరినీ నేనున్న స్థితిలో (నా దేహమందున్న ఆత్మ స్థానంలో వారి ఆత్మను) ఉహించుకోగల్గాలికదా. అప్పుడే మన భక్తి *8:22* శ్లోకంలో ఆ పరమాత్ముడు కల్గియుండమని ఆదేశిస్తున్న భక్తితో సరితూగే భక్తి అవుతోందని భావించగలముకదా.

అంటే, ఒక విధంగా ఆ అవ్యక్త అక్షర పరమపురుషుడు తననే - సర్వప్రాణులకూ ఆశ్రయమివ్వగల తన పరమతత్త్వాన్నే - అనుకరించమంటున్నాడని స్పష్టంకదా.


ఇదే *6:29* శ్లోకముయొక్క తాత్పర్యం చూడండి :


*సర్వభూతస్థమాత్మానం* *సర్వభూతాని చాత్మని*

*ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్రా సమదర్శనః*


యోగముతో గూడుకొనిన మనస్సుగలవాడు సమస్త ప్రాణులయందును సమదృష్టిగలవాడై తనను సర్వప్రాణులయందున్న వానిగాను సర్వప్రాణులను తనయందున్నవిగాను చూచుచున్నాడు. (విద్యా ప్రకాశానందగిరి స్వాములవారి అనువాదం, కొన్ని మార్పులతో)


యోగమందు పరిపక్వతపొందిన యోగి ఎక్కడైనాకూడా నిష్పాక్షికముగానే ప్రవర్తించును గనుక తననుతాను ఇతరులైన అందరిలోనూ మరియు ఇతరులైన అందరినీ తనలో చూచును.


అంటే మోక్షం పొందతలంచువారు ఆ పరమాత్ముని ఈ తత్త్వాన్నే అనుకరించమని - 

*జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్త్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున* - *4:9* శ్లోకంలో ఆ పరమాత్ముడు బోధిస్తున్నాడని స్పష్టంగా వెల్లడౌతోందికదా...


సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు...

🙏🙏

:

 శ్లోకం:☝️

*వేదన్తానామనేకత్వాత్*

 *సంశయానాం బహుత్వతః l*

*వేదాస్యాప్యతిసూక్ష్మత్వాత్*

 *న జానాతి గురుం వినా ll*


భావం: ఆధ్యాత్మికవిద్య గురుముఖతా రావాలి. వేతాంతమార్గములు అనేకములగుటచేతను, సంశయములు అనేకములగుటచేతను, తెలియదగిన బ్రహ్మము మిక్కిలి సూక్ష్మమగుటచేతను గురుదేవుడు వినా ఇది గోచారం కాజాలదు. 

భక్తులను తరింపజేయుటకోసం ఆ సర్వాంతర్యామి తన దివ్యత్వాన్ని గురురూపంలో వ్యక్తపరుస్తాడు.🙏

:

 ఓం నమః శివాయ 


నవ_దిన_కాశీ_యాత్ర


కాశీలో 9 రోజులు ఉండాలి అనడంలో ఆంతర్యం ఏమిటి


మనిషి తల్లి గర్భం లో తొమ్మిది నెలలు ఉంటాడు. జన్మ రాహిత్యం ఇచ్చేది కాశి ఒక్కటే.. అందుకని వ్యాస మహర్షి కాశీ లో తొమ్మిది నెలలు దీక్ష లో ఉండి, అ తర్వాత స్వగ్రామం చేరి మంచి రోజు చూసి పూజ చేయాలి అని చెప్పాడు..


అయితే కలికాలం లో ఇంత శ్రద్ధతో అంతకాలం ఉండలేమని ఇంకేదైనా ఉపాయం చెప్పమని సామాన్యులు కోరారు.. దానికి అయన తొమ్మిది రోజులుంటే ఆ ఫలితం ఢోకా లేకుండా వస్తుంది అని చెప్పాడు. అలానే ఇప్పుడు సమయం ఉన్న వారందరూ కాశి లో తొమ్మిది రోజులుండి వస్తున్నారు


మరి ఆ రోజుల్లో ఏం చెయ్యాలి


విశ్వేశ్వర నామ స్మరణ,

దానాలు చేయటం,

ధర్మ ప్రసంగాలు వినటం,

ఏక భుక్తం,

ప్రాతఃకాల స్నానం,

ఉదయం, రాత్రి విశ్వేశ్వర దర్శనం,

కోపం లేకుండా ఉండటం,

అబద్ధమాడకుండా ఉండటం,

అనే ఎనిమిది అంశాలు ఖచ్చితంగా అమలు చేయాలి


మొదటి రోజు కార్యక్రమం


ఆగత్య మణి కర్న్యామ్తు –

స్నాత్వా దత్పధనంబహు –

వపనం కారయిత్వాతు –

స్నిత్వా శుద్ధాహ్ వయోవ్రతః

సచేల మభి మజద్యా ధ–

కృతా సంధ్యాధిక  క్రియాహ్

సంతర్ప్య తర్మ్యాద పిత్రూన్ –

కుశ గంధ తిలొదకైహ్’’


మొదటిగా మనసులో ముప్పది మూడు కోట్ల దేవతలు, తీర్ధాలతో సర్వ పరివారంతో సేవింప బడుతున్న...  శ్రీ కాశీ విశ్వేశ్వరా !శరణు !అనుజ్ఞ ! అని స్మరించుకొని మణి కర్ణికా తీర్దానికి వెళ్ళాలి. దీనినే చక్ర తీర్ధం అంటారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మహా దేవుని సేవలో ఇక్కడ ధన్యమైనాడు. శివుడికి పార్వతి తర్వాత ఇష్టమైన వాడు విష్ణువే . అందుకే ‘’నారాయణీ సహా చరయ నమశ్శివాయ ‘’అన్నారు.. 

విష్ణు సేవా ఫలితం గా ఏర్పడిన మణికర్ణిక కు గొప్పదనాన్ని ఆపాదించాడు విశ్వేశుడు.


యాత్రీకులు మణికర్ణిక లో స్నానం చేయాలి. బ్రాహ్మణులకు దానాలు చేయాలి..

కేశఖండనం చేసుకొని మళ్ళీ స్నానం చేయాలి..

మహేశ్వరాదులను అర్చించి మళ్ళీ స్నానం చేయాలి..

రుద్రాక్ష మాల ధరించి ఈ కింది శ్లోకం చదువు కోవాలి.


’కిము నిర్వాణ పదస్య భద్ర పీతం – మృదులం తల్ప మదోను మోక్ష లక్స్యః

అధవా మణి కర్ణికా స్థలీ పరమానంద సుకాండ జన్మ భూమి చరా చరేషు సర్వేషు- యావంతస్చ సచేతనః –తావంతిహ్ స్నాంతి మధ్యాహ్నే – మణి కర్నీజతే మలే.. 

ఆ గంగా కేశవస్చైవ –

ఆ హరిన్ద్రస్చ మండ పాత్ –

ఆ మద్ధ్యా ద్దేవ సరితః 

స్వర్ద్వారా న్మణికర్ణికా 

నమస్తే నమస్తే నమః‘’


అని నమస్కరించి అక్కడ నుండి డుండి వినాయకుడిని దర్శించి 21 గరికలను ,

21 కుడుములను సమర్పించి , 21 సార్లు గుంజీలు తీసి  21 రూపాయలు దక్షిణ గా సమర్పించాలి.


దున్దీ రాజ గణేశాన –

మహా విఘ్నౌఘనాశన –

నవాఖ్యాదిన యాత్రార్ధం –

దేహ్యాజ్ఞానం కృపయా విభో’’

అని ప్రార్ధించాలి . తర్వాతా అన్నపూర్ణా దేవిని సందర్శించాలి. ఆ తర్వాతా విశాలాక్షి , జ్ఞానవాపి, సాక్షి గణపతులను చూడాలి..

ఇది పూర్తీ చేసి నివాసం చేరి భోజనం చేయాలి. రాత్రికి విశ్వనాదుడిని దర్శించాలి..

ఫలాలు, పాలు ఆహారంగా గ్రహించాలి.


‘’హర సాంబ హర సాంబ సాంబ సాంబ హరహర –హర శంభో హర శంభో –శంభో శంభో హరహర మహాదేవ మహాదేవ విశ్వనాధ శివ శివ –

మహాకారి మహా కారి రక్ష రక్ష హరహర ‘’

అంటూ పదకొండు సార్లు భజన చేసి నిద్రపోవాలి.


రెండవ రోజు కార్యక్రమం


రెండో రోజు ఉదయానే గంగా స్నానం చేసి విశ్వేశ్వర , అన్నపూర్ణా దర్శనం చేయాలి.

మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణి కర్ణికా 

ఘట్టం లో స్నానం చేయాలి. తీర్ధ శ్రాద్ధం  చేయాలి.  వెయ్యి సార్లు గాయత్రీ జపం చేయాలి..  గురు ఉపదేశం తో ....

‘’శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః ‘’ అనే మంత్రాన్ని వెయ్యి సార్లు జపించాలి. మధ్యాహ్నం విశ్వేశుని దర్శించి సాయంత్రం కూడా మళ్ళీ దర్శించాలి.  రాత్రి ఫలహారం చేసి పడుకోవాలి 


మూడవ రోజు కార్యక్రమం


తెల్లవారక ముందే అసీ ఘాట్ లో సంకల్ప  స్నానం చేసి అక్కడున్న సంగమేశ్వర స్వామిని దర్శించాలి.. తర్వాత దశాశ్వ మేధ ఘాట్ కు చేరాలి. దీనికి ‘’రుద్ర సరోవర తీర్ధం ‘’అనే పేరు కూడా ఉంది.. ఇక్కడ స్నానం చేసి శీతలా దేవిని దర్శించాలి .

వరుణా ఘాట్ కు వెళ్లి స్నానం చేసి ఆదికేశవ స్వామిని దర్శించాలి.  పంచనదీ తీర్ధమైన బిందు మాధవ ఘట్టం లో సంకల్ప స్నానం చేయాలి. 

కిరణ దూత పాపాచ – పుణ్య తోయా సరస్వతీ గంగాచ యమునా చైవ –

పంచ నద్యోత్ర కీర్తితః ‘’

అని స్మరిస్తూ స్నానం చేయాలి .


తర్వాతా బిందు మాధవ సంగమేశ్వర దర్శనం చేసుకోవాలి. మణి కర్నేశుని, సిద్ధి వినాయకుని దర్శించి పూజించాలి.. అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం కావించి నివాస స్థలం చేరి భోజనం చేయాలి. రాత్రికి పాలు , పండ్లు మాత్రమె స్వీకరించాలి .


నాల్గవ రోజు కార్యక్రమం


ఉదయమే గంగా స్నానం విశ్వేశరుడి దర్శనం చేసి డుండి వినాయకుడిని చూసి దండ పాణి అయిన  కాల భైరవుని పూజించాలి..


కాశీ క్షేత్ర రాజ్యాన్ని మనసు లో స్మరించి..‘’ఓం కాశ్యై నమః ‘’అని 36 సార్లు అనుకోవాలి. తర్వాత బిందు మాధవుని దర్శించాలి.. గుహను, భవానీ దేవిని దర్శించాలి. ఇలా మధ్యాహ్నం వరకు తొమ్మిది దర్శనాలు చేసి మణి కర్ణిక చేరి మట్టి లింగాన్ని పూజించి మళ్ళీ అన్నపూర్ణా విశ్వేశులను దర్శించి  భోజనం చేయాలి.


రాత్రి నామ స్మరణ పాలు,పండ్లు ఆహారం... అంటే ఈ రోజు పది దర్శనాలన్న మాట.


అయిదవ రోజు కార్యక్రమం


ప్రాతఃకాలమే గంగా స్నానం చేసి కేదారేశ్వరుని దర్శించి అక్కడే రుద్రాభిషేకం నిర్వహించాలి.. తర్వాతా తిలా భాన్దేశ్వర , చింతామణి గణపతిని సందర్శనం చేయాలి.. దుర్గా దేవిని చూసి ఒడి బియ్యం దక్షిణా సమర్పించి గవ్వలమ్మ ను చేరి అదే విధంగా పూజ చేయాలి.. ఈమెనే కౌడీబాయి అంటారు..

అన్నపూర్ణా విశ్వనాధ దర్శనం చేసి, భోజనం చేసి రాత్రి పాలు, పండ్లు తీసుకోవాలి.


ఆరవ రోజు కార్యక్రమం


సూర్యోదయానికి పూర్వమే గంగా స్నానం చేసి బ్రాహ్మణ ముత్తైదువులకు పూజ చేసి ఆశీస్సులు పొంది, వైధవ్యం ఎన్ని జన్మలకైనా రాకూడదని దీవెనలు పొంది మూసి వాయన చేటల దానాన్ని చేసి, బేసి సంఖ్యలో జనానికి  వాయన దానాన్ని చేయాలి..

వ్యాస కాశీ చేరి వ్యాసుని, రామలింగేశ్వరుని,

శ్రీ శుకులను దర్శించి.., కాశీ వచ్చి అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేయాలి.. తర్వాత భోజనం చేయాలి.. రాత్రి సంకీర్తనతో కాలక్షేపం చేసి పాలు, పండ్లను స్వీకరించాలి.


ఏడవ రోజు కార్యక్రమం


గంగాస్నానం, నిత్య పూజా చేసి వెయ్యి గరిక లను ఏరి సిద్ధం చేసుకోవాలి. దొరక్కపోతే నూట ఎనిమిది తో సరి పెట్టుకోవాలి. ఇరవై  ఒక్క ఉండ్రాళ్ళను, నూట ఎనిమిది యెర్ర పూలతో పూజించాలి..  ముగ్గురు బ్రాహ్మణ ముత్తైదువు లకు భోజనం పెట్టి తాంబూలాలు ఇవ్వాలి..


డుండి వినాయకుడిని అర్చించి , అన్నపూర్ణా ఆలయంలో కుంకుమ పూజ చేయించాలి. అమ్మవారికి చీరా జాకెట్టు, ఒడిబియ్యం , గాజులు సమర్పించాలి... ఇలాగే విశాలాక్షి కీ చేయాలి . విశ్వేశునికి అభిషేకం చేయాలి. సహస్ర పుష్పార్చన.., సహస్ర బిల్వార్చన ,

హారతి ఇచ్చి తీర్ధ ప్రసాదాలను స్వీకరించాలి. హర సాంబ హర సాంబ అంటూ పదకొండు సార్లు జపం చేయాలి.


ఎనిమిదో రోజు కార్యక్రమం


గంగాస్నానం, నిత్యపూజా తర్వాత కాల భైరవుడిని దర్శించి వడలు, పాయసం నివేదించాలి. ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి. ఆ రోజంతా కాల భైరవ స్మరణతో నిష్టగా గడపాలి.. అయిదుగురు యతులకు, ముగ్గురు బ్రాహ్మణ స్త్రీలకూ భోజనం పెట్టాలి.

దక్షిణా తాంబూలం సమర్పించాలి...  భోజనం చేసి రాత్రి కాల భైరవ స్మరణ చేస్తూ 

నిద్ర పోవాలి.


తొమ్మిదో రోజు కార్యక్రమం


గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనం చేసి అన్నపూర్ణా దేవిని దర్శించి, పూజించి,

నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి.. జ్ఞానులైన దంపతులను పూజించి భోజనం పెట్టి దక్షిణ లివ్వాలి.. ఆశీస్సులు పొందాలి..

రాత్రి అన్నపూర్ణాష్టకం చేసి నిద్ర పోవాలి 


పదవ రోజు కార్యక్రమం


నవ దిన యాత్ర పూర్తీ చేసి పదవ రోజు గంగా స్నానం చేసి గంగను పూజించి సహస్ర నామ పూజ చేసి, అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేసి తలిదండ్రులను, గురు దంపతులను పూజించాలి.. అందరి ఆశీర్వాదాలు పొంది ఇంటికి ప్రయాణమవ్వాలి.


ఇలా చేస్తే విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.


ఓం శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః

సంప్రదాయంలో జడ ప్రాముఖ్యత

 *మన సంప్రదాయంలో జడ యొక్క ప్రాముఖ్యత*


గమనిక:- _*మన సంప్రదాయము వెనుక ఉన్న రహస్యమును తెలియజేసే ప్రయత్నమే తప్ప ఏ ఒక్కరినీ విమర్శించటం లేదా తప్పుపట్టటం నా ఉద్దేశ్యం కాదని మనవి.*_



            మానవశరీరము నుండి నిరంతరము విద్యుత్తు వంటి శక్తి విడుదల అవుతూ ఉంటుంది. దీనిని గమనించటానికి ఒక చిన్న పరీక్ష ఉన్నది. *మీ అరచేతిని వ్రేళ్ళను దూరంగా ఉంచకుండా ఒకవ్రేలికి మరొకవ్రేలు ఆనుకొనే విధంగా ఉంచి గమనించండి. మీ అరచేతి మధ్యభాగంలో ఒకరకమైన (దురద వంటి) స్పర్శ మీకు తెలుస్తుంది. అదే విధంగా రెండవ అరచేతిని కూడా సిద్ధపఱచండి. ఈ రెండు చేతులను ఒకదానికి ఒకటి ఎదురెదురుగా కొంతసేపు ఉంచి చూడండి. మీ రెండు చేతులమధ్య తేలికపాటి వికర్షణను మీరు గమనిస్తారు. అంటే మీ రెండు అరచేతుల నుండి శక్తి విడుదల అవటాన్ని మీరు గుర్తించారన్నమాట. ఇప్పుడు చేతులను అదేవిధంగా ఉంచి వ్రేళ్ళను దూరం చెయ్యండి. చేతులమధ్య ఏర్పడిన వికర్షణ శక్తి ఇప్పుడు ఉండదు.* దీనిని బట్టి ఏమి అర్థమైనది? *(చేతి వ్రేళ్ళ) కొసలు కలసి ఉన్నప్పుడు చేతులలో విడుదల అవుతున్న శక్తి నిలిపి ఉంచబడినది. వ్రేళ్ళు దూరంగా ఉంచినప్పుడు చేతులనుండి విడుదల అయిన శక్తి గాలిలో కలసిపోయినది.* మన పెద్దలు పిన్నలను ఆశీర్వదించే విధానంలో చేతివ్రేళ్ళను కలిపి ఉంచే ఆశీర్వదిస్తారు కదా! అంటే ఈ అరచేతులలోని శక్తిచేత పిన్నల తలభాగంలో ఉండే సహస్రారచక్రాన్ని ఉత్తేజితం చేస్తున్నారన్నమాట. 


          ఇదే విధంగా వస్త్రధారణ చేసేటప్పుడు వస్త్రముల కొసలను బయటకు వ్రేలాడకుండా దోపుకోవటమనేది సంప్రదాయంలో ఉన్నది. మన పెద్దలు కూడా ఆవిధంగా వస్త్రధారణ చేయాలని చెబుతూ ఉంటారు. దీని అంతరార్థం ఏమంటే?... మన శరీరమును ఆవరించి ఉన్న వస్త్రపుకొనలనుండి కూడా మన శరీరంలో ఉత్పన్నమయ్యే శక్తి బయటకు వెళ్ళిపోతుందన్నమాట. ఆవిధంగా శక్తి నష్టం జరుగకుండా వస్త్రధారణలో జాగ్రత్తలు అవసరం. 


           అదేవిధంగా జుట్టును విరబోసుకొన్నప్పుడు జుట్టు కొనలనుండి శరీరములోని శక్తి... ప్రథానంగా సహస్రారచక్రముతో సంబంధమున్న జుట్టు నుండి శక్తి నష్టం జరుగుతుంది. యోగవిధానంలో మన శరీరంలోని చక్రాలన్నిటిలో తలలో ఉండే సహస్రారచక్రం అత్యంత ప్రాధాన్యత కలది. ఈ సహస్రారచక్రము మన మెదడు(మనస్సు) తో సంబంధాన్ని కలిగి ఉంటుంది. జుట్టుకొనలనుండి శక్తిని మనం నష్టపోయినప్పుడు మెదడు (మనస్సు) ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రమాదం జరుగకుండా మన పెద్దలు జుట్టును అల్లుకొని కొనలను వదిలేయకుండా మడతపెట్టి కట్టుకోవటం లేదా ముడి (చుట్ట) చుట్టుకోవటం వంటి పద్ధతులను నేర్పారు. 


జడను అల్లుకోవటంలో మరొక సూత్రం ఉన్నది. జడను అల్లినప్పుడు మూడు పాయలు ఏర్పడతాయి. ఈ మూడు పాయలు మన వెన్నుద్వారా మూలాధారము నుండి సహస్రారము వరకు వ్యాపించి ఉన్న ఇళ పింగళ సుషుమ్న నాడులకు సంకేతములు. మూలాధార చక్రమునందు ఉండే కుండలినీశక్తి సహస్రారమునకు వెన్నులో వ్యాపించి ఉన్న ఇళ పింగళ సుషుమ్న నాడుల ద్వారానే సహస్రారమునకు ప్రయాణము చేస్తుంది. ఇటువంటి యోగరహస్యములను ముడిబెట్టి మన పెద్దలు జడలను అల్లుకోవలెనని, విరబోయకూడదని, జడను చుట్టగా చుట్టుకోవాలని చెప్పటం జరిగింది. 


ఈ రహస్యజ్ఞానాన్ని అందుకొన్నవారు అనుసరిస్తున్నారు. అనుసరించనివారు వారిదైన వాదములను వినిపిస్తున్నారు. ఎవరికీ ఏమీ చెప్పలేము కదా! అందరికీ నమస్కరించి ఊరుకోవటమే మన పని. 

మీ 

*~శ్రీశర్మద*

8333844664

నీతి వచనాలు

 .

               _*సుభాషితమ్*_


𝕝𝕝 శ్లో 𝕝𝕝

*వరం రామశరస్సహ్యో*

*న చ వైభీషణం వచః |*

*అసహ్యం జ్ఞాతిదుర్వాక్యం*

*మేఘాంతరితరౌద్రవత్ ||*


𝕝𝕝తా𝕝𝕝 

*రాముని బాణమైనా భరించవచ్చు గానీ విభీషణుని నీతి వాక్యాలు భరించలేక రావణుడు చింతించుచున్నాడు. శత్రువుతో యుద్ధము వలన వచ్చే శారీరిక బాధ కన్నా, స్వంత వారి నీతి వచనాలు, ఎత్తిపొడుపు మాటలు మేఘగర్జన వలే, పిడుగుపాటు వలే విన శక్యము కాదు అని భావం.*

27, మార్చి 2023, సోమవారం

Drinking Water

 Happy Sunday

—————————————-

1. The *STOMACH*

     is injured when

     you do not have

     breakfast in the

     morning.


2. The *KIDNEYS*

     are injured when

     you do not even

     drink 10 glasses

     of water in 24

     hours.


3. *GALLBLADDR* 

    is injured when

    you do not even

    sleep until 11

    o'clock and do not

    wake up to the

    sunrise.


4.  The *SMALL*

     *INTESTINE* is

      injured when you

      eat cold and stale

      food.


5.  The *LARGE*

     *INTESTINES* are

      injured when you

      eat more fried

      and spicy food.


6.  The *LUNGS* are

      injured when you

      breathe in smoke

      and stay in

      polluted

      environment of

      cigarettes.


7. The *LIVER* is

     injured when you

     eat heavy fried

     food, junk, and

     fast food.


8. The *HEART* is

     injured when you

     eat your meal with

     more salt and

     cholesterol.


9. The *PANCREAS*

     is injured when

     you eat sweet

     things because

     they are tasty and

     freely available.


10. The *Eyes* are

       injured when you

      work in the light

      of mobile phone

      and computer

      screen in the

      dark.


11. The *Brain* is

       injured when you

       start thinking

       negative

       thoughts.


12. The *SOUL* gets

       injured when you

       don't have family

       and friends to

       care and share

       with you in life

       their love,

       affection,

       happiness,

       sorrow and joy. 


     *All these body*

      *parts are NOT*

      *available in the*

      *market*. 


      So take good

      care and keep

      your body parts

      healthy.


EFFECT OF WATER                  

💐 We Know Water is 

       important but never 

       knew about the 

       Special Times one 

       has to drink it.. !!


       Did you  ???  


 💦 Drinking Water at the 

       Right Time ⏰ 

       Maximizes its 

       effectiveness on the 

       Human Body;


       1⃣  1 Glass of Water 

              after waking up -

             🕕⛅ helps to 

              activate internal 

              organs..


       2⃣  1 Glass of Water 

              30 Minutes  🕧 

              before a Meal - 

              helps digestion..


       3⃣ 1 Glass of Water 

              before taking a 

              Bath 🚿 - helps 

              lower your blood 

              pressure.


       4⃣ 1 Glass of Water 

              before going to 

              Bed - 🕙 avoids 

              Stroke  or Heart attack

పాత్రత కలిగిన వ్యక్తి

 శ్లోకం:☝️

*సత్పాత్రాయ ప్రదాతవ్యమ్*

 *అపాత్రాయ కదాపి న |*

*పాత్రాఽపాత్రం ప్రసంగేషు*

 *నియోక్తుం ధర్మసంకటమ్ ||*


భావం: మనం సహాయం అందించాల్సినది అత్యంత అర్హత పాత్రత కలిగిన వ్యక్తికి. కానీ ఒక్కొక్కసారి అటువంటి వ్యక్తిని గుర్తించడం చాలా గమ్మత్తైనది కావచ్చు. (వీరిలో మీరు ఎవరికి సహాయం చేస్తారు? ఎందుకు?)

ఇంద్రియములచేత

 .


               _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝


*ద్విషద్భిః శత్రుభిః కశ్చిత్* 

*కదాచిత్ పీడ్యతే న వా।*

*ఇన్ద్రియైర్బాధ్యతే సర్వః* 

*సర్వత్ర చ సదైవ చ॥*

                           ~సౌన్దరనన్దమ్


తా॥ 

ద్వేషపూరితుడైన శత్రువుచేత ఎవడైనా ఎప్పుడైనా బాధించబడవచ్చు. బాధించబడకపోవచ్చు. కానీ ఇంద్రియములచేత ప్రతి ఒక్కడు అన్నిచోట్లా అన్నివేళలా బాధించబడుతూనే ఉన్నాడు.

అంబికాతత్వము

 అంబికాతత్వము


అమెరికాదేశంలో ఫిలడెల్ఫియా అనే నగరంలో పెన్సిల్‌వేనియా యూనివర్సిటీ అనే సర్వకళాశాల ఒకటి ఉంది. అదే నగరంలో 'ఫిలడెల్ఫియా మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్' అనే ప్రదర్శనశాలకూడా ఒకటి ఉంది. దానిలో భగవత్పాదులు వ్రాసిన సౌందర్యలహరిలోని ఒక్కొక్క శ్లోకాన్ని అనుసరించి గీయబడిన చిత్రాలు ఉన్నాయట. అవి సర్వాంగ సుందరాలట! అచటి ప్రధాన సంస్కృతాచార్యులు మూడు చిత్రాలను ఫోటోతీసి మద్రాసు విశ్వవిద్యాలయం వారికి పంపి, ఆ చిత్రాల వివరణ ఏమిటని ప్రశ్నిస్తూ ఒక ఉత్తరం వ్రాశారట. ఆచిత్రాలలో ఒకటి ''మనస్త్వం వ్యోమత్వం'' అన్న శ్లోకానికి గీచిన చిత్రం. దానికి ముందున్న శ్లోకం ''శరీరం త్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం...'' 


పార్వతీ పరమేశ్వరుల సంబంధం - శరీర శరీరభావ సంబంధం; శేష శేషిభావసంబంధం. శరీరంలో ప్రాణం ఉంది. ఇవి రెండున్నూ ఒక దానిని విడచి మరొకటి ఉండటానికి వీలులేదు. 'శరీరం త్వం శంభోః' శంభునికి శరీరంగా అంబ ఉన్నదని ఆచార్యులంటున్నారు. 


మన కండ్లకు గోచరించే ఈ వ్యస్తప్రపంచం నిజానికి అంబికాస్వరూపమే. అఖండంగా సర్వత్ర వ్యాపించి సర్వ ప్రపంచాకృతిగ వెలుగుతూఉన్న ఆ పరదేవత యొక్క స్తనద్వయమే సూర్యచంద్రులు. సూర్యరశ్మి, వెన్నెల లేకపోతే అసలు జగత్తు అనేది ఉండదు. ప్రాణికోటి సమస్తమూ ఆ జగద్ధాత్రికి, శిశుప్రాయం అవటంచేత, తల్లి తన బిడ్డలకు స్తన్యమిచ్చే విధంగా సూర్యచంద్రులనే స్తనద్వయంతో అమృతధారలు వర్షిస్తుంది.


మనస్త్వం వ్యోమ త్వం మరు దసి మరుత్సారథి రసి 

త్వ మాప స్త్వం భూమి స్త్వయి పరిణతాయాం నహిపరమ్ 

త్వ మేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా 

చిదానందాకారం శివయువతిభావేన బిభృషే|| 


''అమ్మా! పంచభూతముల రూపు నీవై యున్నావు. వాని కతీతమైన మనస్సున్నూ నీవే. ఈ ఆకాశం, ఈ గాలి, ఈ భూమి, ఈ జలం, ఈ తేజస్సూ, ఈ మనస్సూ ఇవన్నీ నీవు కాకపోతే మరెవరు? 'త్వయి పరిణతాయాం నహింపరమ్' ''అన్ని స్వరూపాలున్నూ నీయొక్క పరిణామంగానే ఉన్నాయి. అంతేకాదు. మావద్ద ఉండే ఈ జ్ఞానలేశమూ, ఆనందమూ నీచిదానందచ్ఛాయలే నీవు శరీరము; శివుడు శరీరి. శివ యువతిభావం మీ యిద్దరిలోనూ ప్రస్ఫుటమౌతోంది'' అని ఆచార్యులు వర్ణిస్తారు. 


ఫిలడెల్ఫియా చిత్రాలను చూచినప్పు డీశ్లోకం గుర్తు వచ్చింది. 


లీయే పురహరజాయే మాయే తవ తరుణవల్గవచ్చాయే, 

చరణే చంద్రాభరణే కాంచీశరణే నతార్తిసంహారణే|| 


- మూకపఞ్చశతి. 


''అమ్మా! నీపాదాలు లేజిగుళ్ళవలె విలసిల్లుతున్నాయి. చంద్రావతంసవై కాంచీనగరాన్ని నీవాశ్రయించి, నీపాదాల నాశ్రయించినవారి దుఃఖాన్ని పోగొట్టుతున్నావు. నీ చరణాలపై నాచిత్తం హత్తుకొనిపోయింది. దానితోబాటు నా ఆత్మకూడా ఐక్యం అవుతూఉంది'' అని మూక కవి అంబికను స్తవంచేశాడు. ఇందు ''మాయే'' అనే పదం ఉంది. మాయ అంటే ఏమిటి? పురాణాలు మాయాశబ్దానికి అర్థం వివరిస్తూ 'యామా' ఏది లేదో అదే మాయ అని అన్నాయి. ఐతే లేని వస్తువుకు నామకరణ మెందుకు? ఉన్నదా లేదా అన్న విచికిత్స - ఒక వస్తువు ఉన్నట్లు తోస్తేనే కదా కలుగుతుంది? మాయావస్తువు ఉన్నట్లు కనిపిస్తుంది. పరిశీలన ప్రారంభిస్తే లేదని తేలుతుంది. అదే మాయ, మా శబ్దానికి లక్ష్మి అనికూడ ఒక అర్థం. 'విద్యుచ్చపలాలక్ష్మీః' మాయా గుణం లక్ష్మికి సంపూర్ణంగా అన్వయిస్తుంది. లక్ష్మి మన వద్ద ఉన్నట్లే ఉంటుంది. కాని ఉండదు. గోచరిస్తూ ఉంటుంది. తీరా చూస్తే మాయమౌతూ ఉంటుంది. 


లేని వస్తువు గోచరించడం దేనికి? పైగా చూడబోతే మాయ మవటమెందుకు? ఐతే ఇందులోనూ ఒక ఆనందం ఉందనక తప్పదు. ఇదీ ఒక ఉత్పాహమూ ఉల్లాసమూను. అంబిక ఆనందరూపిణి; ఆమె సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. సాధకుని ఆనందానికై తానొక రూపుదాల్చి, అనుగ్రహించడంకోసం అవతరిస్తూ ఉంటుంది. మన అల్పమైన మనస్సులకు ఒక ఆధారం కనిపిస్తేకాని ఆనందం కలగడం లేదుకదా! 


తల్లి వంటయింట్లో యేదో చక్క బెట్టుకొంటూ ఉంటుంది. వసారాలో బిడ్డ ఆడుకొంటూ ఉంటుంది. కాని బిడ్డకు తల్లి జ్ఞాపకం వచ్చినంతనే బొమ్మలను ఒక ప్రక్కకు నెట్టి ఏడుపు ప్రారంభిస్తుంది. లోపలనుండి తల్లివచ్చి సముదాయించేవరకు రోదనానికి ఉపసంహారం ఉండదు. అట్లే దర్శనానికి తహతహలాడే భక్తునికోసం నిరాకార అయిన అంబిక సాకార ఔతోంది. 'ఘృతకాఠిన్యవత్' - ద్రవరూపంలో ఉన్నప్పుడు నేతికి రంగులేదు. కాని చలికాలంలో నేయి పేరినప్పుడు లేదా గాలి తగిలినప్పుడు గడ్డకట్టి తెల్లనిరంగు ఏర్పడుతుంది. అట్లే భక్తకోటి హృదయసీమలో ప్రేమశైత్యం అధికమైతే, అఖండాకార నిరాకార పరమాత్మ ఘనీభూతమై ఒక రూపునెత్తి ఆవిర్భివిస్తూ ఉన్నది. ఆమెయే త్రిమూర్తి స్వరూపిణియూ అయిఉన్నది. 


'సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ, 

సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ, 

సదాశివానుగ్రహదా పంచకృత్యపరాయణా||' 


అని లలితాసహస్రనామములు చెప్పుతున్నాయి. మూడు మూర్తులనియు ఐదు మూర్తులనియు ఒక లెక్క లక్ష్మీ సరస్వతుల అష్టోత్తర శతనామావళులలో బ్రహ్మ విష్ణు శివాత్మికా అన్న సంబోధన ఒకేతీరుగా కానవస్తుంది. కార్యాల నుద్దేశించి ఆకారాలున్నా స్వరూపం ఒక్కటే. 

అనంతపద్మనాభస్వామికూడ త్రిమూర్తిస్వరూపమే. తిరువనంతపురంలో ఆయన శేషశయ్యపై పండుకొని ఉంటాడు. ఆయన నాభికమలంలో బ్రహ్మ శిరఃపార్శ్వాన లింగాకృతియై శివుడు కానవస్తారు. అశ్వత్థవృక్షం కూడా ఇదేవిధంగా బ్రహ్మ విష్ణు శివాత్మకమని ఈ క్రింది శ్లోకం చాటుతూ ఉంది. 


మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే, 

అగ్రతః శివరూపాయ వృక్షరాజాయతే నమః|| 


'నీవు నిరాకారవైనా నన్ను అనుగ్రహించే నిమిత్తం సాకార మవుతున్నావు; నీవు అనంతవు; నిరవధికవు! అని ఆచార్యులవారు అంబికను స్తవం చేస్తున్నారు. 


అంతములేనివాడనంతుడు.సంఖ్య ఒకటి, రెండు, మూడు అని పెరుగుతూపోతుంది. మరి అనంతానికి చిహ్నం ఏది? ఇన్ఫినిటీని (పారార్థ్యాన్ని) ఏ సంఖ్యతో చూపాలి? 


భాస్కరాచార్యులవారు బీజగణితాన్ని వ్రాశారు. దానిలో మంగళశ్లోకం వ్రాస్తూ - 'అనంతమైన పరమాత్మచాలు నష్టమౌతున్నాయి. సృష్టికాలంలో ప్రపంచాలు పుట్టుకొస్తున్నవి. కాని ఆయనలో మాత్రం అణుమాత్రమూ భేదంలేదు. సమస్తమూ ఆయనలోనుండి నిర్గమించి ఆయనలోకి లయం ఔతున్నవి. అందులో అల్పం అధికం అన్నది లేదు. ఆయనే అనంతుడు. అట్టి అఖండానంద పరమాత్మకు నాప్రణతులు.'అని పరమాత్మను ప్రార్థన చేశారు. 


దశోపనిషత్తులలో బృహదారణ్యకం ఒకటి. దానిపేరే దాని విస్తృతిని తెలుపుతుంది. ఆచార్యులు దీనికి భాష్యం కూడా విస్తారంగా వ్రాస్తూ సూక్ష్మంగా వ్రాస్తున్నానని సెలవిచ్చారు. తత్త్వంలో బృహదారణ్యం నిజంగా అరణ్యమే. అందులో శాంతిమంత్రం ఇలా ఉంది. 


ఓం పూర్ణ మదః పూర్ణ మిదం పూర్ణా త్పూర్ణ ముదచ్యతే, 

పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణ మేవావశిష్యతే|| 


'అది పూర్ణము, ఇదీ పూర్ణమే. ఈ ప్రపంచము నిరవధికం. ఈ నిరవధిక ప్రపంచం పరమాత్మలో ఉంది. ఆ పూర్ణంలో ఈ పూర్ణం కలిపినా తీసివేసినా మిగిలేది పూర్ణమే. 


'పరమాత్మ ఏకస్వరూపమూ అద్వితీయమూ అయిఉంది. లేనిదేదో అదే మాయ. ప్రకృతి మాయ. ప్రకృతిని తనలో కల పరమేశ్వరుడున్నూ మాయమే. అదీ లేనిదే, ఇతడూ లేనివాడే. పూజ్యమునకు పూజ్యముచేర్చిన మిగిలేది కూడ పూజ్యమేకదా! అందుచే ఎక్కువాలేదు. తక్కువా లేదు. అని ఆచార్యులన్నారు. పరమేశ్వరునే 'మాయ', 'లేనివాడు' అంటే మనల్ని పరిహసించరా? అని ఎవరో శంకిస్తే - పరమేశ్వరునే పరిహాసంచేస్తే మనలనూ చేయనీ - అని ఆచార్యులు బదులు చెప్పారట. 


రజ్జు సర్పన్యాయం మనమందరమూ ఎరిగినదే..రజ్జువులో సర్పాన్ని చూస్తే రజ్జువు ఏ విధంగానూ అధికంకాదు. మిథ్యాసర్పం రజ్జువుగా మారితే దానికి కలిగే కొరత కూడ ఏమీలేదు. 


సీతాదేవి ఎట్లున్నది? అని ఎవరో అడిగారట. దేవ మాయవలె ఉన్నదని సమాధానం. లేనివస్తువు ఉన్నట్లు కనబడితే ఎలా ఉంటుందో అలా ఉన్నదన్నమాట. చిత్రంలో దృశ్యాన్ని గీస్తారు. అది దృశ్యాన్ని స్ఫురింపజేస్తుంది. కాని దృశ్యంకాదు. సీతాదేవి విషయంకూడా అంతే. 


అన్ని సంఖ్యలకు సంకేతాలున్నాయి. అనంతానికి సంకేతం ఏమిటి? భాస్కరాచార్యులు ఒకటిని లవంగాను పూజ్యాన్ని హారంగాను గ్రహించి ఒక భిన్నం చూపితే అది అనంతానికి సంకేతం అవుతుందన్నారు.(1/0). రెండును రెండుచే భాగిస్తే విభక్తం ఒకటవుతుంది. 2 ను విభాజ్యంగా తీసుకొని 1, ½, ¼  సంఖ్యలను విభాజకాలుగా తీసికొని భాగిస్తే 2, 4, 8 సంఖ్యలు విభక్తాలవుతాయి. ఇట్లే 16ను 1/8 చే భాగిస్తే విభక్తం 128 అవుతుంది. విభాజకం పెరిగేకొద్దీ విభక్తం తగ్గుతుంది. విభాజకం తగ్గేకొద్దీ విభక్తం పెరుగుతుంది. విభాజకము అత్యంత కనిష్టమై అణుపరిమాణమై సూక్ష్మాతి సూక్ష్మమైతే విభక్తం 'అనంతమౌతుంది.' సున్న అతి సూక్ష్మసంఖ్య. 'ఖ' అనగా ఆకాశము, పూజ్యము. హారమనగా భాగించుట. సున్నను విభాజకంగా తీసుకొని ఎంతటి పెద్ద సంఖ్యనైనాసరే భాగిస్తే వచ్చే విభక్తం ఒకటే అవుతుంది. ఖహారమంటే ఇదే. 


ఏ సంఖ్యనైనా భాగించేవేళ మనం కనుగొన్న విభక్తం సరైనదోకాదో తెలుసుకొనడానికి విభాజకాన్ని విభక్తంతో గుణించి విభాజ్యం వస్తున్నదా లేదా అని పరిశీలిస్తాం. ఈ ఖహారంలో - అంతే ఏ సంఖ్యనైనా సున్నతో భాగించే దానిలో విభాజ్యం ప్రపంచతుల్యం అవుతుంది. నానా నామ రూపాలతో అనంతంగా ఉన్న ఈ విశ్వమే విభాజ్యం సున్న లేక పూజ్యం, గణితపరిభాషలో అనిర్వచనీయం అనగా దాదాపు ఏమీలేని 'మాయచే' భాగిస్తే వచ్చే ఫలము లేక జవాబు-అనంతము! 'సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ' ప్రపంచాన్ని సృష్టించడానికి బ్రహ్మ (బ్రహ్మ్స విభక్తము) తన్ను మాయతో (మాయ్స విభాజకము) గుణించుకొంటూ ఉంది. సున్నచే ఏ సంఖ్యను భాగించినా వచ్చే విభక్తం ఒకటే. ఒకటి, రెండు, మూడు మొదలైనవి భేదసంఖ్యలు. అని ప్రపంచంయొక్క నానాత్వ చిహ్నాలు. ఏకమే అనేకం అయింది. ఆ అనేకం కావడం మాయాసంపర్కంచేత. అనంతుడైన పరమాత్మ మాయా సంపర్కంతో తన్ను గుణించుకొంటూ ఒకటి రెండు మూడు అని అసంఖ్యాక నామ రూపాదులతో ఒప్పారుతున్నాడు. ఐతే ఏ విభక్తాన్నైనా సున్నతో పెంచితే సున్నయే వస్తుంది గనుక అనంతాన్ని మాయతో గుణిస్తే వచ్చేదీ మాయయే. అనంతుడు గుణ్యము; మాయ గుణకము; ప్రపంచము లబ్ధము. ఈ హారంలో విభాజ్యం ప్రపంచంయొక్క నానాత్వమే. అనగా నానాత్వంలోని ఏకత్వమే, విభక్తం అంటే బ్రహ్మ (అనగా సత్యము) అఖండమూ, అనంతమూ అయిఉంది. శాంతి మంత్రంలో 'పూర్ణం అదః' అంటే విభక్తం; అద్వితీయమైన అనంతం. 'పూర్ణం ఇదం' అంటే విభాజ్యము; నానారూపాత్మకమైన అనంతం అద్వైతానంతాన్ని పూజ్యంచే గుణిస్తే ద్వైతానంతం లభిస్తుంది. ద్వైతానంతాన్ని ఖహారంచేసి, సున్న లేక మాయచే భాగించి దాని నానాత్వాన్ని తొలగిస్తే అద్వైతానంతం వస్తుంది. అనంతానికి రూపంలేదు. అది అద్వితీయం. మాయ దానిని గుణించి నానావిధ రూపాలను ధరిస్తూఉంది. ఉన్నది ఒక్కటి, దానికే విలువ, నానాత్వం మాయాకార్యం కనుక, మాయ అంటే ఏమీలేనిది కనుక ఈ నానాత్వంకూడా ఏమీ లేనిదే; అంటే విలువ లేనిది, అందుచే మాయ గుణించినా భాగించినా ఆ బ్రహ్మలో ఏవిధమైనా మార్పూ ఉండదు. ప్రపంచంయొక్క సృష్టిప్రళయాలు ఆ అనంతునిలో ఏవిధమైన మార్పూ కలిగించలేకున్నాయి. 


ఆ జగజ్జనని, శివయువతి, పురహరజాయ, నానా నామరూప భేదాలతో ఏకాన్ని అనేకం చేస్తూ నిరాకారబ్రహ్మకు ఆకారాలు అంటగట్టుతూ, మన ఆనందానికి, మనలను అనుగ్రహించడానికి చిదానందాకారంలో విశ్వశరీరయై విలసిల్లుతూ ఉంది. ఆ మాయాశక్తియొక్క అనుగ్రహం లేనిదే, అనేకత్వం నుండి ఏకత్వానికి చేరలేము. అద్వైతసిద్ధిని అందుకోవాలంటే ఆ ఆదిశక్తి అనుగ్రహం అవసరం.                        


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- “జగద్గురు బోధలు” నుండి


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం