7, ఫిబ్రవరి 2022, సోమవారం

అష్టస్థాన పttరీక్ష

 అష్టస్థాన పttరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 3 . 


 నాడి చూడకూడని వారు - 


      అప్పుడే స్నానం చేసినవారికి , భుజించిన వారికి , ఆకలిగొన్నవానికి , దప్పికతో ఉన్నవానికి , నిద్రనుండి లేచినవారికి నాడిని పరీక్షించిన ఫలితం స్పష్టముగా తెలియదు . కావున ఆ సమయములలో నాడిని పరీక్షించరాదు . 


  నాడుల పేర్లు - వాటి స్థానములు . 


    నాభికందము నందు ఉండు నాడి సుషుమ్న . ఇది బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించి ఉండును . మానవుని స్థూల సూక్ష్మ నాడులు అన్ని కలసి మొత్తం 3 1/2 కోట్లు . ఇవి అన్నియు నాభికూర్మము నుంచి 10 నాడులు పైకి , 10 నాడులు కిందకి , 4 నాడులు అడ్డముగా బయలుదేరి శరీరము అంతయు మితిమీరిన సంఖ్యగలవై వ్యాపించుచున్నవి . 


           ఈ సుషమ్న నాడి యందే జీవుని నివాసము . ఈ సుషమ్న నాడి యందలి జీవునకు ఇ ళ , పింగళ నాడులచే తృప్తి కలుగుచుండును . వాటికి సరస్సులు అని పేరు . శరీరమునందు త్రిదోషములు ఎలా ప్రధానమో అదే విధముగా ఈ నాడులు కూడా ప్రధానములు . మన ఉచ్చ్వాస నిశ్వాసమునకు హంస యని పేరు . 


       ఈ మూడు నాడులు వేణి బంధము వలే కలిసిమెలిసి త్రివేణి సంగమము పేరుతో లలాటం నందు కలిసి ఉండును . నాడి యందలి హంస యొక్క గతిని బట్టి మనము త్రిదోషముల హెచ్చు తగ్గులుగా ఉండు సంచారములను తెలుసుకోగలము . 


              సుషమ్న నాడి వెన్నుపూసలో నుండి మెడమార్గములో బ్రహ్మ రంధ్రము చేరును . వెన్నుపూసకు బ్రహ్మదండము అని పేరు కలదు . అందులో ఉండు సుషమ్న నాటికి బ్రహ్మ నాడి అని పేరు కలదు . బ్రహ్మనాడి యందు ఉన్న జీవుడు షట్చక్రముల యందు తిరుగుతూ ఇళ , పింగళ నాడులతో తృప్తిపొందుచుండును . 


     ఇళ నాడి నాభికూర్మము నుండి హృదయము వద్దకు వచ్చి మెడమార్గముగా ఎడమ ముక్కు రంధ్రము వద్దకు వచ్చును . అదేవిధముగా పింగళ నాడి కుడి ముక్కు రంధ్రమును ఆశ్రయించి ఉండును . పంచభూతాలు , లోకములు , నదులు , కులములు , గుణములు మొదలగునవన్ని సుషమ్న నాడి యందు ప్రతిష్ఠములు అయి ఉన్నవి . 


                        తరవాతి పోస్టు నందు మరింత విలువైన సమాచారం మీకు అందిస్తాను . ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  గమనిక -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు 550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

ఓపెన్ లెటర్

 *బెంగళూరుకు చెందిన ఒక అమ్మాయి ఇంగ్లీషులో ఓపెన్ లెటర్ (రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ) మీడియాలో వైరల్‌గా మారింది. రాహుల్ గాంధీని పిఎం నరేంద్ర మోడీతో పోల్చవచ్చా అని తనను తాను నిర్ణయించుకోవాలని ఆమె కోరింది… లేఖ ఈ క్రింది విధంగా ఉంది*


*"ప్రియమైన మిస్టర్ రాహుల్ గాంధీ"*


*లక్షలాది మంది ప్రజలు తమ నాయకుడిగా నరేంద్ర మోడీని అనుసరిస్తారు, వారు అతనిని తమ ఆదర్శంగా భావిస్తారు. మన దేశంలో ఎంత మంది మిమ్మల్ని (రాహుల్ గాంధీ) తమ ఆదర్శంగా భావిస్తారు?*


*రాజవంశ అనుచరులకు అధికారాన్ని అప్పగించడానికి ఇష్టపడని దేశంలోని వ్యక్తి, నరేంద్ర మోడీని ఎన్నుకున్నారు మరియు ప్రజలు తిరస్కరించిన అదే రాజవంశానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గాంధీ ట్యాగ్ కాకుండా, జీవితంలో ఏ రంగంలోనైనా మీరు సాధించిన విజయం ఏమిటి? వాస్తవానికి, చాలా కాలం నుండి ప్రజలను మోసం చేశారు, దయచేసి మాకు చెప్పండి మీరు నిజంగా ఏమి సాధించారు?*


*ప్రతి సంవత్సరం, నరేంద్ర మోడీ, తన పుట్టిన రోజున, తన తల్లిని కలుస్తాడు మరియు తల్లి సరైన మార్గంలో నడవడానికి సంకేతంగా భగవద్గీత కాపీని అందజేస్తాడు. మీ అమ్మగారు ఏం చేస్తుంటారు*


*నరేంద్ర మోడీ మొదటిసారి పార్లమెంటులోకి ప్రవేశించినప్పుడు, ఆయన సభకు నమస్కరించారు మరియు దానిని ప్రజాస్వామ్య దేవాలయం అని పిలిచారు. మీరు అదే నమ్ముతారా? మీరు ఎప్పుడైనా పార్లమెంటును గౌరవించారా?*


*ప్రధాని అయిన తరువాత, గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు తన జీతం రూ. 21,00,000 ను పిల్లల విద్యా నిధికి విరాళంగా ఇచ్చారు. రాహుల్ మీరు ఎప్పుడైనా దేశం కోసం ఏదైనా సహకరించారా?*


*ప్రధాని మోడీ నాయకత్వంలో కేవలం 4 సంవత్సరాలలో 600 మంది ఉగ్రవాదులు నిర్మూలించబడ్డారు. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఉగ్రవాదులు చంపబడ్డారు?*


*స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, పేదలకు వంట గ్యాస్ కనెక్షన్లు లభించలేదు, కానీ 4 సంవత్సరాల కాలంలో, 50 మిలియన్లకు పైగా పేద ప్రజలకు మోడీ వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు.*


*అదే విధంగా, గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిర్ధారించబడింది, మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయింది?*


*మోడీ ఏ కుటుంబానికి అనుకూలంగా లేదా స్వపక్షపాతాన్ని ప్రోత్సహించరు, కానీ మీ కుటుంబం మొత్తం పార్టీపై ఆధిపత్యం చెలాయించింది మరియు పార్టీని వారి వ్యక్తిగత ఆస్తిగా భావిస్తుంది. ఎందుకు? మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, రాబర్ట్ వాద్రాకు ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం ఎలా వచ్చింది?*


*ప్రధాని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డోక్లాం సమస్య ప్రారంభం కాలేదు. ఇది చాలా సంవత్సరాల క్రితం ప్రారంభమైంది, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. తమ సైనికులను తిరిగి పిలవాలని చైనీయులను బలవంతం చేసినది ప్రధాని మోడీ. మీ ప్రభుత్వం మరియు మీరు దీన్ని చేయగలిగారు?*


*6 సంవత్సరాల కాలంలో ప్రధాని మోడీ లేదా ఆయన ప్రభుత్వంపై ఒక్క అవినీతి కేసు కూడా లేదు. అవినీతి లేనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు దశాబ్దాలలో (60 సంవత్సరాలు) ఏదైనా కాలాన్ని చూపించగలరా? లేదు!*


*మీరు మరియు మీ పార్టీ ప్రజలు పిఎం మోడిని చైవాలా అని పిలుస్తారు. అవును, అతను టీ అమ్మినట్లు ఒప్పుకున్నాడు. మేము వారి ఆదాయాన్ని మరియు నిజాయితీతో కూడిన జీవితాన్ని ఏదైనా తప్పుగా పరిగణించము. మీ ఆదాయం మరియు జీవనం కోసం మీరు ఏ పని చేశారో మాకు చెప్పగలరా?*


*నరేంద్ర మోడీ దేశ ప్రయోజనాల కోసం వివిధ దేశాలకు వెళతారు. మీరు ఏ ప్రయోజనం కోసం విదేశాలకు వెళతారో మాకు చెప్పగలరా?*


*ప్రధాని మోడీ సైనికుల కోసం OROP ను ఆమోదించారు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు మరియు మా సైనికులకు ఇతర భద్రతా, సైనిక సామగ్రిని కొనుగోలు చేశారు. మీ ప్రభుత్వం వారి కోసం ఏమి చేసింది?*


*అతను 3 సంవత్సరాలలో 300 మిలియన్లకు పైగా ప్రజలను "జన ధన్ యోజన" లో చేర్చాడు. మీ పార్టీ పదేళ్ల పాలనలో ఇది ఎందుకు సాధ్యం కాలేదు?*


*ఆడపిల్లలను కాపాడటానికి పిఎం మోడీ "బేటీ బచావో, బేటి పధావో" ప్రచారాన్ని ప్రారంభించారు. దేశంలో బాలికలను కాపాడటానికి కాంగ్రెస్, లెఫ్ట్, ఆప్, 🥄🥄లు ఏమి చేశారు?*


*దేశంలోని లక్షలాది మందికి లబ్ధి చేకూర్చే "ముద్ర జీవన్ బీమా యోజన" ను ప్రారంభించారు.*

*దేశ ప్రజల ప్రయోజనాల కోసం, పదేళ్లలో మీ కాంగ్రెస్ ప్లభుత్వంఎన్ని పథకాలను తీసుకువచ్చింది?*


*సరిహద్దులను రక్షించడానికి పాకిస్తాన్‌లో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడానికి సాహస నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సరిహద్దులను రక్షించడానికి మీ పార్టీ ఏం చేసింది?*


*తమతమ పార్లమెంటులల్లో ప్రసంగించడానికి అమెరికా, యుకె, ఆస్ట్రేలియా, కెనడా, భూటాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ మరియు జపాన్ ఆయనను ఆహ్వానించారు. ప్రధాని మోడీ కృషి మరియు నాయకత్వాన్ని ప్రశంసించారు.*

*కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అప్పటి ప్రధానమంత్రి*

*"మౌన మైనపు సింగ్" ని*

*ఎన్ని దేశాలు, ఇలా ఆహ్వానించాయి?*


*ఏడేళ్లలోనే, మన ప్రధాని ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అయ్యారు.*

*"టైమ్స్ పర్సన్ ఆఫ్ ది వరల్డ్" గా పేరు పొందారు.*

 

*మీరు 2004 నుండి రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటివరకు ఏమి సాధించారు?*


*న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో 22,000 మంది ప్రజల ముందు నరేంద్ర మోడీ ప్రకటించారు, "మేము బిచ్చగాళ్ళం కాదూ.. మాదిపాములాడించే దేశం కాదు,విశ్వాన్ని ఏలబోయే దేశం.." అని!*

*రాహుల్! మన దేశకీర్తిని ఇలా స్తుతించే ధైర్యం, స్థైర్యం నీకు ఉందా?*


*స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, మీ కుటుంబ-ప్రభుత్వాలు "పేదరికాన్ని తొలగించు" అని చెప్పడంలోనే బిజీగా ఉన్నాయి, మరియు మనదేశం చాలా పేదదేశం అని ప్రపంచానికి చాటడంలో మాత్రమే విజయం సాధించింది.*

*విదేశాలలో మనదేశం యొక్క ప్రభావాన్ని మెరుగుపరచడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా?*


*ప్రతిరంగంలో మీ పార్టీ.. కార్యకర్తల సహకారం కోసం ప్రాకులాడుతూ ఉంటుంది! కానీ.., కేవలం 6సం" లలో, నరేంద్రమోడిజీ...*

*మీరు 60ఏళ్లగా జపంచేస్తు.. కోరుతూనే ఉండిన "ఆ-మార్పు" ను ఎలా తీసుకురాగలిగారు.*


 *పీఎం మోడీ రోజుకు 18 గంటలు పనిచేస్తారు, సమయమూ, డబ్బు ఆదాచేయడానికే ఫ్లైట్ లోనే నిద్రపోతాడు. రాహుల్! మీరు దేశం కోసం రోజుకు ఎన్ని గంటలు పని చేయగలరు?*


*ప్రధానికి బలమైన రాజకీయ నేపథ్యం లేదు. ఆయన కృషి, నిబద్ధత, అంకితభావం వల్లనే.దేశప్రధాని అయ్యారు. గాంధీ-ట్యాగ్‌ను వదలిపెట్టి, మీ సామర్ధ్యం, బలం, కృషి తో మీరు ఏదైనా సాధించగలిగారా?*


*18 ఏళ్ళ వయసులో, దేశసేవ చేయడానికి నరేంద్రమోడీ ఇల్లు వదిలి ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. రాహుల్ గాంధీ 18 ఏళ్ళ వయసులో మీరు ఏమి చేస్తుండినారో చెప్పగలరా?*


*ఈ దేశంలోని మెజారిటీ పౌరులు ప్రధాని నరేంద్రమోడీ గారి లాగా సాధించాలని కలలుకంటున్నారు. మరి.., ఎంత మంది మిమ్మల్ని అనుసరించాలని, మీలా ఉండాలని కోరుకుంటారు?*


*ఈ దేశాన్ని నడపడానికి గాంధీ ట్యాగ్ అవసరమే లేదు, కానీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పం, నిబద్ధత ఉన్న ఒక వ్యక్తి అవసరం.*

         *అతనే నరేంద్రమోడీ!*



గమనిక:-

-------------

  *దేశం మొత్తం దీన్ని చదవాలి, కాబట్టి దయచేసి మిగతా ప్రాంతీయ భాషలలో కూడా అనువాదించి, పోస్ట్ చేయండి.*

*కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వ కథ

 _*మాఘమాసం*_

_*ఫిబ్రవరి 7వ తేది 2022*_


   _*🕉️మాఘ పురాణం*🕉️

   _*🚩6 వ అధ్యాయము🚩*_


🕉🌴🎋🕉️🕉️🎋🌴🕉️


*కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వ కథ*


☘☘☘☘☘☘☘☘


మునిశ్రేష్ఠా ! నా వృత్తాంతమును తెలియజేయుదును గాన ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామము , నా తండ్రి పేరు హరిశర్మ , నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరితీరవాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవభక్తుడు , జ్ఞాని , నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరి కొన్నాళ్ళకు మాఘమాసము ప్రవేశించినది. 


ఒకనాడు నా భర్త *"సఖీ ! మాఘమాసము ప్రవేశించినది , యీనెల చాల పవిత్రమైనది , దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరమూ మాఘ స్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును యీ మాఘమాసమంతయు యీ కావేరీ నదిలో స్నానమాచరింపుము. ప్రతిదినము ప్రాతఃకాలమున నిద్రలేచి , కాలకృత్యములు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికిపోయి నదిలో స్నానము చేయుదము. ప్రభత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోను , మంచి గంధము , అగరు , ధూప దీపములతోను పూజించి స్వామికి ఖండచెక్కర , పటికబెల్లం నైవేద్యమిచ్చి నమస్కరింతుము. తరువాత తులసితీర్థము లోనికి పుచ్చుకొందుము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠింతము. దీని వలన మనకు చాలా ఫలము కలుగును. నీ అయిదవతనము చల్లగా వుండును"* అని హితబోధ జేసెను.


నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి , అతనిని నీచముగా జూచితిని , నా భర్త చాలా శాంతస్వరూపుడు. అయిననూ నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపము వచ్చి *"ఓసీ మూర్ఖురాలా ! నా యింటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషిణివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా , అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని , మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానదీతీరమందున్న రావిచెట్టు తొర్రలో మండూకమువై పడిఉందువుగాక"* అని నన్ను శపించెను.


*"అమ్మాయీ ! భయపడకుము , నీకీశాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్తయును యేకాంతముగా చాలకాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యెను. అతడిప్పుడు వైకుంఠములోనున్నాడు. నీవు నీ పతిమాటలు విననందున యెంత కష్టపడినావో తెలిసినదికదా ! మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు , పుత్రసంతతి , ఆరోగ్యము కలుగుటయేగాక మోక్షసాధనము కూడ నీకీ మాఘమాస వ్రతము మించిన మరి యొక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతియైనది వ్రతము నీ భర్త దూరదృష్టి కలజ్ఞాని , అతని గుణగణాలకు అందరూ సంతసించెడి వారు నిన్ను పెండ్లి యాడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకొనవలయుననెడి ఆశతో నుండెడివాడు. కానీ , నీ వలన అతని ఆశలన్నీ నిరాశలయిపోయినవి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్ళలో స్నానము చేయమన్నాడు , నీవు చేయనన్నావు. అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టుతొర్రలో జీవించుమని శపించాడు.


ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరల నీ నిజరూపమును పొందగలిగినావు అందునా యిది మాఘమాసము కృష్ణానదీ తీరము కాన మాఘమాస వ్రత సమయము నీకన్ని విధములా అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము. స్త్రీలుకాని , పురుషులుకాని యీ సమయములో ప్రాతఃకాలమున స్నానము చేసినయెడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. *ఎవరైనా తెలిసి కాని , తెలియక కాని మాఘశుద్ధ సప్తమి , దశమి , పౌర్ణమి లయందునూ , పాడ్యమి రోజుననూ నదీ స్నానమాచరించినయెడల వారి పాపములు నశించును. మాఘ సుద్ధ పాడ్యమినాడునూ , అటులనే దశమి , ఏకాదశి , ద్వాదశి దినముల లోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి , పురాణ కాలక్షేపము చేసినయెడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునటుల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘ పురాణము వినిన మోక్ష ప్రాప్తి కలుగును"* , అని గౌతమ ముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను.


      🌷🌷 *సేకరణ*🌷🌷

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

అష్టస్థాన పరీక్ష

 అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 2 . 


    ఆయుర్వేద శాస్త్రము అనుసరించి నాడిని 8 చోట్ల పరీక్షించవలెను . అవి 


  * హస్తము . 


  * పాదము . 


  * కంఠము . 


  * నాస 2 వైపులా . 


  * 2 చేతుల మణి బంధనముల యందు . 


  * 2 పాదముల చీలమండల యందు . 


  * ముక్కు రెండుప్రక్కల యందును కంఠము నందలి ఉండకు రెండు వైపులా నాడీపరీక్ష తెలుసుకొనవలెను . 


  హస్తనాడి - 


      శరీరము అంతయు వ్యాపించి ఉండు ఈ నాడి వాత,పిత్త , కఫములను , రసరక్తములకు సంబంధించి ఉండును . ఇది బ్రొటనవేలి మూలము నందు 3 వ్రేళ్లు పట్టుచోట ధాన్యపుగింజ పరిమితిన చరించుచుండును . దీని ద్వారా ఉచ్చ్వాస , నిశ్వాసముల గమనము బాగుగా తెలియును . 


         ఇది జీవసాక్షిలా శరీరము యొక్క ఆరోగ్య అనారోగ్యములను తెలుపుచుండును . ఉచ్ఛ్వాస నిశ్వాసములు నాసిక ద్వారా శరీరమంతయు వ్యాపించుచుండెను . అలా వ్యాపించునప్పుడు ఎటువంటి ఆటంకము లేకుండా సరిగా వ్యాపించుచుండిన యెడల ఈ నాడి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సమముగా ఉండును . అలా జరగకుండా ఈ ఉచ్చ్వాస నిశ్వాసముల వ్యాప్తి చెందుతున్నప్పుడు త్రిదోషముల ( వాత పిత్త కఫ ) లలో ఏదైనా దోషము అడ్డువచ్చిన యెడల ఉచ్ఛ్వాసనిశ్వాసములు కంగారుపడి జలగ , పాము మున్నగు వాటి నడక ఎలా ఉండునో అలా కష్టముగా లేక నెమ్మదిగా లేక త్వరత్వరగా ఎగురుచున్నట్లు నాడి యొక్క గమనంలో తేడా వచ్చును . 

  

       హస్తనాడి వలన అజీర్ణము , ఆమదోషము , జ్వరము రాబోవు సంగతి , ఆకలిగొనుటను , చెడిపోయిన వాత , పిత్త , కఫముల గురించి తెలియచేయును . వైద్యులు ప్రధానముగా దీనినే 

పరీక్షించెదరు .


  పాదనాడి - 


        పాదనాడి వలన ఎంతకాలము జీవించునది , శరీరము బరువు లేక తేలికగా ఉండుటయు , జ్వరము తగ్గిన సంగతి తెలియును . ఆరోగ్యవంతునికే ఇది చూడవలెను  


  కంఠనాడి -  


        గాయములు , భయము మున్నగు బాహ్య కారణముల మూలముగా వచ్చు జ్వరము , తృష్ణ , ఆయాసము , స్త్రీసంగమము , అలయిక , దుఖఃము , కోపము అనువాటి గురించి కంఠనాడి తెలుపును . దీనిని నాడీపరీక్ష యందు నిపుణులు మాత్రమే ఈ నాడిని ప్రత్యేకముగా పరీక్షించి ఫలితాలు తెలుసుకోగలరు . 


  నాసా నాడి - 


       చనిపోవుటయు , జీవించిఉండుటయు , కామము , నేత్రవ్యాధులను , తలనొప్పిని , కర్ణముఖరోగములు ముక్కునందలి నాడి తెలియచేయును . 


  నాడిని పరీక్షించు విధానము - 


     వైద్యుడు నాడిని ఉదయము పూట పరగడుపున పరీక్షించవలెను . ముందు రోగి యొక్క మోచేతి భాగము పట్టుకొని పిసికి తన కుడిచేతి 3 బ్రొటనవ్రేళ్ళతో బ్రొటనవేలి మొదటి భాగమున నాడిని చక్కగా పరీక్షించవలెను . 


  స్త్రీపురుషుల నాడి బేధము - 


       పురుషులకు కుడిచేతి యందు కనిపించు నాడి , స్త్రీలకు ఎడమచేతి యందు కనిపించును . కారణమేమన పురుషులకు నాభి కూర్మ అధోముఖముగా ఉండును . స్త్రీలకు నాభి కూర్మ ఊర్ధ్వముఖముగా ఉండును . ఈ భేదము చేతనే స్త్రీ పురుషుల హస్తనాడులు భేదించుచున్నవి . 


         అనుభవమును బట్టి శాస్త్రము నందు చెప్పబడిన చేతి యొక్క నాడిని పరీక్షించి అనంతరము రెండోవ చేతి యందలి నాడిని కూడా పరీక్షించుట మంచిది . 


     తరవాతి పోస్టు నందు మరింత విలువైన సమాచారం మీకు అందిస్తాను . ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  గమనిక -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు 550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

ఒకసారి ఆలోచించాలి.

 🙏 పెళ్లి కావలసిన పిల్లల తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలి. కొంతమంది వధూవరుల వయస్సు ఒకసారి చూడండి. దాదాపు సగం జీవితం అయిపోయినా పెళ్ళిళ్ళు కాకపోవడానికి కారణం ఎవరు ? ఒకసారి ఆలోచించండి ? పాతకాలంలో పది మంది ఉన్న ఆడ పిల్ల తండ్రి కూడా ఏనాడు ఇంత మంది సంతానం ఉన్నా తను ఎప్పుడూ భాధపడలేదు. ఇప్పుడు ఒకరిద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు, కష్టపడుతున్నారు .. ఆలోచించండి ?? 


దయచేసి శాఖా పట్టింపులు మానండి. జాతకాల లోతులకు వెళ్లకండి. కొంతవరకు సబబే. ఆ అవరోధాల వలన పిల్లల దృష్టి మరలి కులాంతర వివాహాలకు మొగ్గుచూపుతున్నారు. అతిగా మూఢ విశ్వాసాలకు పోకుండా ... మంచి సాంప్రదాయం, మంచి గౌరవ మర్యాదలు, విలువలు కలిగిన సంబంధం చూడండి, వారి జీవితాలను ఉద్ధరించండి. 


👨‍👩‍👧‍👧ఒక కుటుంబం బ్రతకడానికి తగ్గ విద్యార్హతలు, సామర్ధ్యం, నైపుణ్యాలు, తెలివితేటలు, సంపాదన, మంచి కుటుంబ నేపథ్యం, విలువలు, ఆదరణ, తగిన జంట .... ఇవి ప్రాథమిక ప్రమాణాలు ఒక మంచి దాంపత్య జీవన శుభారంభానికి. మిగతా పట్టింపులు మనం మన కోసం పెట్టుకున్నవే ... అవి ఏవిధంగానూ వారి దాంపత్య ఔన్నత్యం, దీర్ఘకాల సంతోషాలకు కొలమానాలు కానే కావు. అది ఇరువురి అవగాహన మీద ఆధార పడి ఉంటుంది. గ్రహించగలరు 💝👍🏽


జాతకాలు చూడండి తప్పు లేదు. అబ్బాయి జీతం కన్నా అమ్మాయి జీతం ఎక్కువ అని వంకలు పెట్టడం, పెళ్ళి తర్వాత అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులను వదిలి వేరే కాపురం పెట్టమని చెప్పడం, అసలు ఆడపడుచులు ఉండకుండా ఉంటే సంబంధం అడగడం, ఆస్తి పాస్తులు అంతగా లేవని వెనుకాడడం ... ఇలాంటివి చూసినపుడు మన వివాహ - దాంపత్య వ్యవస్థ ఎటు పోతుందో అన్న భయం కలుగక మానదు. ఆలోచించండి 🙏


కారణం ఏదైనా ... మనం చేసే ఆలస్యం వారి భవిష్యత్తు మీద ప్రభావం చూపుతుంది.


మగ పిల్లలకు 26, ఆడపిల్లలకు 24 వయస్సు రాగానే సంబంధములు ప్రయత్నం మొదలుపెట్ట వచ్చు. పిల్లలకు అర్థం అయ్యే విధంగా నచ్చ చెప్పాలి. ఈ కాలంలో అప్పుడే వివాహం వద్దు అనే పిల్లలే ఎక్కువ. సమకాలీన పరిస్థితుల ప్రభావం వారి మీద ఎక్కువ ఉంది. అన్నీ అధిగమించి ఈ కాలంలో పిల్లల పెళ్లి చేయడం ఒక మహా యజ్ఞమే అవుతున్నది. 


కాబట్టి ... పట్టుదలలు, పట్టింపులు మాని కొంతవరకు కాంప్రమైజ్ అయ్యి పిల్లల వివాహ ప్రయత్నాల్లో నిమగ్నమవండి. అందుకే అన్నారు ... ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలి అని. దాని వెనుక చాలా అర్ధం దాగుంది. 


వయసు ప్రభావ రీత్యా ... తదనుగుణంగా పిల్లల ఉద్యోగ అవకాశాల రీత్యా ... స్నేహ సంబంధాల ప్రభావంతో .. బయట ప్రపంచంలో ఒకరికి ఒకరు ఆకర్షితులు అవుతారు. ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. ఏదో ఒక కారణంగా కుదరక అలా కాలం గడిచేకొద్దీ పిల్లల వయసు మీరి .. దాంపత్యానికి తగిన వయసు దాటిపోతున్న సమయంలో పిల్లలకు ప్రేమలు ఉత్పన్నమవుతాయి. అది ఒక భావజాలం ... వయసుతో పాటు సహజంగా కలిగే ఆలోచన. ఆ విధంగా కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు కోకొల్లలు. ఆ క్రమంలో పిల్లలు పెద్దలను ఎదిరించలేక, పెద్దలు పిల్లలకు సర్ది చెప్పలేక కక్కలేక మింగలేక అవస్థలు పడుతున్న కుటుంబాలు ఎన్నో. మన ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు ... వేడుకలు, నోములు, వ్రతాలు ఇలా ఎన్నో ఆయా కుటుంబాలలో కనుమరుగు అవుతున్నాయి.ఇదంతా కులాంతర వివాహాల ప్రభావమే.  


దానికి విరుద్ధంగా కొంతమంది పిల్లలకు ఆలస్యం అయ్యేకొద్ది .. అసలు వివాహ జీవితం మీద ఆసక్తి తగ్గిపోయి ఒక నిశ్శబ్ద జీవితం గడిపేస్తున్నారు. ఉద్యోగం - ఇల్లు - స్నేహితులు అన్న చందాన స్తబ్దుగా బ్రతికేస్తారు. వారిలో ఒక సొంత వ్యక్తిత్వం, స్వార్థ చింతన పెరిగి ఇంకొకరితో జీవితం పంచుకునే స్వభావం తగ్గిపోతుంది.


వీటన్నిటికీ కారణం ... వివాహం ఆలస్యంగా చేయడం. పిల్లలను తప్పు పట్టడం కాదు కానీ ... సరియైన సమయంలో వారికి మంచి జోడి కడితే ఒక కొత్త కుటుంబంతో అనుబంధం ఏర్పడి వారి జీవితం తప్పక సుఖమయం అవుతుంది. మన బ్రాహ్మణ కుటుంబాలలో కొంత వరకు వెసులుబాటు కలిగించుకుని ఉభయులూ మాట్లాడుకుని అమ్మాయిని అబ్బాయిని కలిపే ప్రయత్నం చెయ్యాలి. ఆ దిశగా పెద్దలు అనవసరపు ఆలోచనలు ఆశలు శాస్త్రాలు కొంత వదులుకుని పిల్లలకు సంబంధాలు కుదర్చాలి. 


అన్యధా భావించకండి🙏🏼 ఇది నేటి సమాజ స్థితిగతులకు అనుగుణంగా ఆలోచించి పంచుకొనిన స్వీయ అభిప్రాయం ☝

ధర్మరాజు అభిప్రాయం చక్కగా వివరించారు

 *పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసాడని పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇది ఆయనకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది. అందుకోసం కృష్ణుడు ధర్మరాజుని వేరే రాజ్యానికి తీసుకు వెళ్ళాడు.*

*ఆ రాజ్యం మహాబల చక్రవర్తి గారి పాలనలో ఉండేది.*

*అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు. ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది.*

*ధర్మరాజు ఆమెతో.. ఏంటమ్మా బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా.? అని చెప్పడంతో..*

*ఆమె, మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును మళ్ళీ వాడము అని బదులు చెప్పి లోనికి వెళ్ళిపోయింది.*

*ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు.*

*ఇక రాజును కలవడానికి ఇద్దరు వెళ్లారు. కృష్ణుడు మహాబలరాజుతో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేసాడు.*

*రాజా.! ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి. పేరు ధర్మరాజు అని చెప్పాడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు సరికదా కృష్ణుడితో ఇలా అన్నాడు.*

*కృష్ణా.! మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉన్నది, అందరి దగ్గరా సంపద బాగా ఉన్నది, నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం, ఇక్కడ బిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు, అందువల్ల దానధర్మాలకు ఇక్కడ తావులేదు, ఇక్కడ ఎవరికీ దానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు. అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో. ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను అన్నారు.*

*తన రాజ్యస్థితిని తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు ధర్మరాజు.*

*సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినేలా మార్చడం. ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే అని చక్కగా వివరించారు. మరి మన పాలకులు ఎప్పుడు తెలుసుకుంటారో.? ప్రజలు ఎప్పుడు మారుతారో.?*

**చిన్న విన్నపము🙏🙏* *విధిగా సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ సందేశం పంపండి.* *ఎందుకంటే కనీసం కొంతమందినైన మార్చాలని ఆశిస్తూ.🙏🙏*

రథసప్తమికి జిల్లేడtఆకుకి సంబంధం

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

🌞🌞🌞🌞🌞

రథసప్తమికి జిల్లేడtఆకుకి సంబంధం ఏమిటి?*


రథసప్తమినాడు స్నానసమయంలో నెత్తిపై జిల్లేడాకు పెట్టుకోవాలి. ఆ ఆకునే ఎందుకు పెట్టుకోవాలి? ఏ తమలపాకో చిక్కుడాకో ఎందుకు పెట్టుకోకూడదు అన్నసందేహమూ వస్తుంది.


దీని వెనుక ఒకకథ ఉంది. పూర్వం అగ్నిష్వాత్తులు అనే పండితులు మహానిష్ఠతో చాలా యజ్ఞాలు చేశారు.


ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది, వాళ్ళని స్వర్గానికి తీసుకురండని దేవవిమానం పంపించాడు. ఆ సమయానికి యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిష్వాత్తులు. ఆ దేవవిమానం చూసిన సంభ్రమంలో వారు ఆవునేతితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేశారు.


అయితే ఆసమయంలో పెద్దగాలిరావడంతో కొంత వేడివేడి నెయ్యి ప్రక్కనే ఉన్న ఒకమేకపై పడింది. ఆ వేడికి మేకచర్మం ఊడిపోయి మరణించి, దాని ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి3 దేవవిమానంలో కూర్చుంది. ఆచర్మం ప్రక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది.


అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్త్వం మారిపోయి, మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది.


అలా జిల్లేడాకు యజ్ఞంత సమయంలో ఆజ్యధారలు ధరించడంతో పరమపవిత్రం అయ్యింది. జిల్లేడు ఆకును ముట్టుకొంటే మేకచర్మంలా మెత్తగా ఉంటుందందుకే! జరిగిన దానికి అగ్నిష్వాత్తులు బాధపడ్డారు. అప్పుడు ఆకాశవాణి, "మీరు దుఃఖించాల్సిన పనిలేదు. మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి, దుర్లభమైన స్వర్గప్రాప్తి కలిగింది.


ఈ జిల్లేడు మేకచర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారింది" అని పలికింది. ఆ మాట అగ్నిష్వాత్తుల్ని సంతోషపరిచింది. అది మాఘశుద్ధ సప్తమీతిథి.


అప్పటి నుండి రథసప్తమినాడు నెత్తిపై జిల్లేడాకు పెట్టుకుని, సూర్యప్రీతి కోసం స్నానం చేసేవారికి లేశమాత్రం యజ్ఞఫలం లభిస్తోంది. ఏడుజన్మల పాపాలు పోతున్నాయి.

🙏🙏🙏🙏🙏🙏🙏

రథసప్తమి* పర్వము

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

*!!రథసప్తమి నిర్ణయః!!*{ధర్మసింధు} 


నిర్ణయ సింధౌః-

మాఘశుక్ల సప్తమీ 

రథసప్తమీ|

సా అరుణోదయ వ్యాపినీ గ్రాహ్యా!


సూర్య గ్రహణ తుల్యాత్ శుక్లామాఘస్య సప్తమీ|

అరుణోదయ వేలాయాం

తస్యాం స్నానం మహాఫలం||

ఇతి చంద్రి కాయం

విష్ణు వచనాత్


అరుణోదయ వేళాయాం శుక్లా మాఘస్య సప్తమీ|

ప్రయాగే యది లభ్యేత

కోటిసూర్య గ్రహైః సమా|| 

ఇతి వచనాచ్చ యత్తు

దివో దాసీయే 

  అచలా సప్తమీ దుర్గా

శివరాత్రిర్మహాభరః|

ద్వాదశీ వత్స పూజాయాం సుఖదా 

ప్రాగ్యుతా సదా||

   ఇతి షష్ఠీయుతత్వముక్తం!

 

 తత్ యదా,

పూర్వేహ్ని 

ఘటికాద్వయం షష్ఠీ,

సప్తమీ పరేద్యుః క్షయ వశాత్ అరుణోదయాత్పూర్వం సమాప్యతే తత్పరం జ్ఞేయం|

తత్ షష్ఠ్యాం సప్తమీ క్షయం ప్రవేశ్యారుణోదయే స్నానం కార్యం||


ఇత్యాది వచనముల చేత

 *షష్టి తో కూడి ఉన్న సప్తమి శ్రేష్టము* అన్న వచనము 

సూర్యోదయ కాలంలో రెండు ఘడియలు షష్ఠి ఉండి 

సప్తమితిథి మరుసటి రోజు అరుణోదయం కంటే ముందు సమాప్తమైనప్పుడు

 మాత్రమే

షష్ఠీ యుత *సప్తమి* ని గ్రహించవలెను!.... 


 అరుణోదయమున కు సప్తమి ఉన్న రోజుననే

 *రథసప్తమి* పర్వము ఆచరించవలెను

  కావున సోమవారం రోజున అరుణోదయ కాలంలో సప్తమి తిథి లేనందున

మంగళవారం రోజున అరుణోదయ కాలంలో సప్తమి ఉన్నందున

 

8/02/ 2022 మంగళవారమే, రథసప్తమి!