18, మార్చి 2026, బుధవారం

జీవితంలో

 శ్రీరామ (115)


                             శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏



( జీవితంలో చెప్పుకోదగ్గదేదీ సాధించకుండానే యౌవ్వనమంతా గడిచి పోయింది. వార్ధక్యం రానే వచ్చింది. ఇప్పుడేంచెయ్యాలి ? )


శ్లో//జీర్ణా ఏవ మనోరధాశ్చ హృదయే యాతంచ తద్యౌవ్వనం/

హంతాంగేషు గుణాశ్చ వంధ్యఫలతాం యాతా గుణజ్ఞైర్వినా/

కిం యుక్తం, సహసాభ్యుపైతి బలవాన్ కాలః కృతాంతో ౽ క్షమీ/

హా ! జ్ఞాతం ! మదనాన్తకాంఘ్రి యుగళం ముక్త్వాస్తి నాన్యా గతి://


( వార్ధక్యం వల్ల ఏ కోరికా తీర్చుకునే సామర్ధ్యం ఇప్పుడు నాకు లేదు.

అందువల్ల కోరికలన్నీ మనస్సులొనే జీర్ణించి పోతున్నవి.

ఆహా ! ఎంతో ఉజ్జ్వలమైన నా యౌవ్వనం చెప్పుకోదగినదేదీ సాధించకుండానే గతించిపోయింది గదా !

అంతేకాదు, సంగీత, సాహిత్యాది విషయాలలో నేను సంపాదించిన ప్రతిభ, 

గుణజ్ఞులు,రసజ్ఞులు లేనందు వల్ల అంతరించిపోతున్నది (కవిసార్వభౌమునికి చివరి దశలో సంభవించినట్లు)

కాలపురుషుడు సర్వము నశింపజేసే వాడు,

ఆయనకు ఏ ప్రాణిమీద ఎంతమాత్రము దయలేదు.

మహా బలవంతుడైన ఆ కాలుడు, వేగంగా మీది మీదికి వస్తున్నాడు.

ఈ దీనస్థితిలో ఇప్పుడు నేను ఏమి చెయ్యాలో తెలియడం లేదు.

ఓహో! విచారణ చేయగా ఇప్పటికి తెలిసింది.

మన్మధుని అంతం చేసిన ' ఈశ్వరుని ' పాద పద్మములను ఆశ్రయించడం కన్న నాకు వేరే గతి ఏదీ లేదు).

(భర్తృహరి మహాయోగి)


శుభమస్తు.

తూములూరి మధుసూదన రావు.

18-3-'26.

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*మంగళవారం 17 మార్చి 2026*

``

    *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!


                     1️⃣6️⃣7️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*      

      

                    *167 వ రోజు*                    

*విరాట పర్వము ప్రథమాశ్వాసము*


*సహదేవుడు కొలువులో చేరుట*```


సహదేవుడు చేతిలో ముల్లుగర్రతో, తలమీద తాళ్ళ మూటతో గోపాలుడి వేషంలో విరాటుని వద్దకు వచ్చాడు. సహదేవుడు విరాటునితో.. “మహారాజా! నాపేరు తంత్రీ పాలుడు. నేను ఆల మందలను చక్కగా పెంచుతాను. నాకు పశువులలో ఉన్న రకాలు తెలుసు. పశువుల వ్యాధులకు చికిత్స చేయగలను. ఇంతకు ముందు ధర్మరాజు పాలనలో పశు పాలకుడిగా ఉండే వాడిని. నన్ను తమరి కొలువులో పశు పాలకునిగా నియోగించండి” అని కోరాడు. 


విరాటుడు అతని మాటలకు మెచ్చి అతనిని కొలువులో పశు పాలకుడిగా నియోగించాడు. 


ఈ విధంగా పాండవులు అయిదుగురు కొలువులో చేరారు.```


*ద్రౌపది అంత:పురంలో చేరుట*```


ద్రౌపది సైరంధ్రి వేషానికి తగినట్లుగా తలకు కొప్పు పెట్టుకుంది. మాసిన చీర కట్టుకుంది. దాసీభావాన్ని మనసులో నింపుకుంది. విరాటనగర రాజవీధిలో నడుస్తూ అంత:పురం చేరుకుంది. ఆ సమయంలో విరాట రాజపత్ని సుధేష్ణాదేవి విహారనిమిత్తం రాజప్రాసాదం పైకి ఎక్కి విహరిస్తూ రాజవీధి వెంట విహరిస్తున్న సైరంధ్రిని చూసింది. ఆమె అందానికి ఆశ్చర్యపోయింది. ఆమెను తీసుకు రమ్మని చెలికత్తెలను పంపింది. వారు వెళ్ళి సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపదిని సుధేష్ణ సముఖానికి తీసుకు వచ్చారు. సుధేష్ణ ద్రౌపదితో “మానినీ నీవు ఎవరు? ఏమి కులం? నీ పేరేమి? ఏ పని మీద ఈ నగరానికి వచ్చావు?” అని అడిగింది. 


ద్రౌపది “అమ్మా! సైరంధ్రీ జాతి స్త్రీని. నా పేరు మాలిని. నాకు అయిదుగురు భర్తలు. నేను ఒక కారణంపై నా భర్తల ముందే అవమానింప బడ్డాను. భర్తలతో అడవులలో నివసించాను. బ్రహ్మచారిగా కాలం గడిపాను. నాకు ఇంకొక్క వ్రతం ఉంది. మీరు ధర్మ వర్తనులు అని విని వ్రతకాలం మీ రాణివాసంలో గడపాలని వచ్చాను. నేను ఇంతకు ముందు శ్రీకృష్ణుని భార్య సత్యభామ వద్దా, పాండవ పత్ని ద్రౌపది వద్దా పనిచేసాను. నాకు పూలమాలలు, చెండ్లు కట్టడం తెలుసు. రకరకాలుగా తిలకం దిద్దగలను. అందంగా కురులను అల్లగలను ముడువ గలను” అన్నది. 


ఆమెను అంతఃపురంలో చేర్చుకోవడానికి సుధేష్ణకు కొంత సందేహం ఉంది “సైరంధ్రీ! నీవు అందగత్తెవు. నిన్ను చూసి మహారాజు నీ మీద మనసు పడితే నేను ఏమి చేయాలి? ఆడవాళ్ళే నీపై చూపు మరల్చలేక పోతున్నారే ఇక మగవాళ్ళ విషయం చేప్పేదేముంది. నిన్ను అంతఃపురంలో ఉంచుకోవడం అంటే నా వినాశనం నేను కోరుకోవడమే” అన్నది సుధేష్ణ. 


ద్రౌపది “అమ్మా! తమరు అలా అనవలదు. నా భర్తలు బలవంతులు. నా విషయంలో అప్రమత్తంగా ఉంటారు. ఎవరైనా నన్ను నీచభావంతో చూసినా చాలు వారిని సంహరిస్తారు. కనుక ఎవరూ నన్ను దుర్బుద్ధితో చూడరు. నాకు అలాంటి నీచ బుద్ధులు లేవు. నన్ను మీరు నమ్మి మీ సేవకురాలిగా స్వీకరించండి. కాని నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. నేను ఇతరుల ఎంగిలి తినను. నీచపు పనులు చేయను” అని పలికింది. 


సైరంధ్రి మాటలకు సుధేష్ణ సంతోషించి ఆమెను తన పరిచారికగా స్వీకరించింది. అలా ద్రౌపది కూడా విరాటుని కొలువులో చేరింది. పాండవులు,ద్రౌపది విరాటుని కొలువులో సంతోషంగా కాలం గడుపుతున్నారు.```


        *విరాట పర్వము* 

 *ప్రథమాశ్వాసము సమాప్తం*


            *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

18మార్చి2026🪷* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🌷 *బుధవారం*🌷 

   *🪷18మార్చి2026🪷*  

    *దృగ్గణిత పంచాంగం*  

                   

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*ఫాల్గుణమాసం - కృష్ణ పక్షం*


*తిథి  : చతుర్దశి* ‌ఉ 08.25 వరకు ఉపరి *అమావాస్య*

*వారం    : బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం  : పూర్వాభాద్ర* రా.తె 05.21 వరకు ఉపరి *ఉత్తరాభాద్ర*

*యోగం : శుభ* రా.తె 04.01 వరకు ఉపరి *శుక్ల*

*కరణం  : శకుని* ఉ 08.25 *చతుష్పాద* రా 07.43 ఉపరి *నాగ*

*సాధారణ శుభ సమయాలు*

          *-ఈరోజు లేవు-*               

అమృత కాలం  : *రా 09.37 - 11.10*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం    : మ 12.20 - 01.53*

*దుర్ముహూర్తం: ప 11.51-12.40*

*రాహు కాలం  :మ 12.16- 01.46*

గుళికకాళం      : *ఉ 10.45 - 12.16*

యమగండం    : *ఉ 07.44 - 09.14*

సూర్యరాశి : *మీనం*                  

చంద్రరాశి : *కుంభం/మీనం*

సూర్యోదయం :*ఉ 06.22*

సూర్యాస్తమయం :*సా 06.27*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం         :*ఉ 06.13- 08.38*

సంగవ కాలం       :*08.38 - 11.03*

మధ్యాహ్న కాలం    :*11.03 - 01.28*

అపరాహ్న కాలం   :*మ 01.28- 03.53*

*ఆబ్ధికం తిధి  :ఫాల్గుణ అమావాస్య*

సాయంకాలం      :*సా03.53- 06.18*

ప్రదోష కాలం       :*సా 06.18 - 08.41*

రాత్రి కాలం        :*రా 08.41 - 11.51*

నిశీధి కాలం        :*రా 11.51 - 12.39*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.37 - 05.25*

☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆

        🌹*ప్రతినిత్యం*🌹

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీ వేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్*


*రాజరాజేశ్వరీ రాజరాజార్చితా*

*పద్మనేత్రోజ్జ్వలా చంద్రికాహాసినీ*


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌷🌷🍃🌷

🌹🌷🪷🪷🪷🪷🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*మంగళవారం 17 మార్చి 2026*


        *శ్రీ మహావిష్ణు పురాణం*

`` *28వ భాగం*``


*నారద మహర్షి కథ*```


నారద మహర్షి తండ్రి బ్రహ్మదేవుని ఆహ్వానం మేరకు తన సహోదరులు, బ్రహ్మ మానస పుత్రులైన తొమ్మిది మంది ప్రజాపతులకు, కర్దమ మహర్షి, దేవహూతిల తొమ్మిది మంది కుమార్తెలకు జరిగిన వివాహ మహోత్సవం చూడటానికి

వచ్చాడు. 

శ్రీమహావిష్ణువు అంశ అయిన కపిల మహర్షిని దర్శంచుకున్నాడు.


కపిల మహర్షి బోధించిన అష్టాక్షరి నారాయణ మంత్రంతో శ్రీహరి దర్శనం కోసం తపస్సు చేయాలని నారదుడు మానస సరోవర తీరానికి వెళ్లాడు. చాలాకాలం నారాయణమంత్రం జపిస్తూ కఠోర తపస్సు చేశాడు. నారాయణుడు ప్రసన్నుడైనాడు. నారదుని పరీక్షించి అనుగ్రహించాలని మానస సరోవరంలో హంస రూపం దాల్చి తీరాన తపస్సులో ఉన్న నారదుని ముందుకు వచ్చి “నారదా! నారదా!” అని మధుర స్వరములో పిలిచాడు.


చెవులకు మృదుమధురంగా తన పేరు వినిపించడంతో కన్నులు తెరచి హంసను చూసి ఆశ్చర్యపడ్డాడు. మరింతవిస్మయానికి గురి చేస్తూ ఆ హంస మానవ భాషలో “నారదా! నీ కఠోర తపస్సు చూస్తుంటే ముచ్చట వేస్తోంది, ఆందోళన కలిగిస్తోంది. ఎవరి అనుగ్రహం కోసం అన్నపానాదులు, సమస్త సుఖాలు వదిలివేసి దేహాన్ని శుష్కింపచేసుకుంటూ తపస్సు చేస్తున్నావు?” అని అడిగింది.


నారదుడు “హంసరాజమా! మానవ భాషలో పలుకుతూ ఆశ్చర్యపరుస్తున్నావు. ఎవరు నీవు? నాకఠోర తపస్సుకి జాలిపడుతున్నావు. శ్రీమన్నారాయణుని అనుగ్రహం కోసం చేస్తున్న తపస్సు ఎందుకు ఆపుతున్నావు?" అని ప్రశ్నించాడు.


హంస “నారదా! అనాదికాలం నుండి ఈ మానస సరోవరంలో ఉంటున్నాను. ఈ మానస సరోవరం బ్రహ్మ మానసం నుండి ఉద్భవించింది. బ్రహ్మదేవుడు నారాయణుని నాభికమలం నుండి జన్మించాడు. నిత్యం బ్రాహ్మి ముహుర్త సమయంలో బ్రహ్మదేవుడు ఈ మానస సరోవరానికి వచ్చి స్నానం చేసి నారాయణ మంత్రం జపం చేస్తూ ధ్యానంలో నిమగ్నుడవుతాడు.


ధ్యానంలో ఆనాడు చేయబోయే సృష్టికార్యంగురించి ఆలోచిస్తాడు. సృష్టించబోయే జీవుల పూర్వ, పరాజన్మలను దివ్య జ్ఞాన దృష్టి తో వీక్షిస్తాడు. పిదప బ్రహ్మలోకం వెళ్లి జీవసృష్టి ప్రారంభిస్తాడు. నిత్యం బ్రహ్మదేవుడు చేసే ధ్యాన దీక్షను నేను ఆసక్తితో గమనించేవాడిని. ఆ క్రమంలో నాకు తెలియకుండానే అప్రయత్నంగా బ్రహ్మ దేవుని దివ్యజ్ఞానశక్తి నాకు కలిగింది. జీవుల భూత వర్త మాన భవిష్యత్తులు చూడ గలిగిన దివ్య దృష్టి వచ్చింది.


ఆ దివ్యదృష్టితోనే నీ విషయం తెలిసి నిన్ను పలకరించడానికి వచ్చాను" అని పలికింది.  


హంస మాటలు నమ్మలేక “హంసరాజమా! నిజంగా నీవుబ్రహ్మదేవునికి గల దివ్యజ్ఞానదృష్టి కలిగి ఉన్నావా? అయితే నాపూర్వ జన్మవృత్తాంతం చెప్పు" అని అడిగాడు. 


నారదునిలో తాను బ్రహ్మమానస పుత్రుడిని అనే అహంకారం ఉంది. తాను బ్రహ్మ నుంచి మాత్రమే జన్మించానని, తనకు పూర్వ జన్మలు లేవని నమ్మకం.


హంస నారదుని అహంకారపు మాటలకు నవ్వి నమ్మకాన్ని పటా పంచలు చేస్తూ "నారదానీపూర్వ జన్మ గురించి నాకు బాగా తెలుసు. చెబుతాను. వినుము. గడచిన మహాకల్పంలో నీవు ఒక గంధర్వుడుగా జన్మించావు. నీ తండ్రి మహావిష్ణువుకి పరమ భక్తుడు. నిరంతరం నారాయణ అష్టాక్షరి మంత్రోపాసన చేసే వాడు. ఆయన భక్తికి మెచ్చి వైష్ణవాంశతో పుత్రుడిగా జన్మించావు.


నీ నామధేయము ఉపబహర్హణుడు. శ్రీహరి అంశావతారమైన నీవు అపూర్వ సౌందర్యం,గాత్రం కలిగి ఉండేవాడివి. నీ గంధర్వ మధురగానం అందరినీ ఆకర్షించేది. స్త్రీలు నీ సౌందర్యం, గాత్రం,బుద్ది చాతుర్యం,మాటకారితనం చూసి అమితంగా ప్రేమించేవారు. నీ చుట్టూ చేరేవారు. నీవు నీతండ్రి హితోక్తులు పక్కనపెట్టి, వైష్ణవాంశ అని మరచి పోయి భ్రమరంలా స్త్రీల చుట్టూ తిరిగేవాడివి. క్రమంగా దేహసుఖాలకు అలవాటు పడిపోయావు. విశ్వశాంతి కోసం సప్తర్షులు దేవవ్రతం అనే యాగం ఆరంభించారు. యాగప్రదేశంలో శ్రీమన్నారాయణ కథ గానం చేయడానికి ఆహ్వానం పై నీవు, నీ తండ్రి ఇతర గంధర్వులతో కలసి అక్కడకు వెళ్లారు. శ్రీమన్నారాయణ నామగాన సంకీర్తనతో యాగశాల పరవశించ సాగింది. గానం చేస్తున్న నీ దృష్టి అక్కడఉన్న అందమైన యోగినుల పై పడింది. అందరం గానమాధుర్యంలో మైమరచి ఉన్నసమయంలో నీవు ఆ యోగినుల వద్దకువెళ్లి నీ హావభావచేష్టలతో కామాసక్తిని ప్రదర్శించావు.


త్రికాలజ్ఞులైన మహర్షులు గమనించి ఆగ్రహం చెందారు. నిన్ను చూసి “ఉపబర్హణా! శ్రీమన్నారాయణ నామ గానామృతంతో పవిత్రమైన యాగ ప్రదేశాన్ని పరస్త్రీ వ్యామోహంలో అపవిత్రం చేసావు. ఫలితంగా నీవు నీ సహజ తేజస్సు కోల్పోయి భూలోకంలో మానవు నిగా జన్మించుము" అనిశపించారు. 

ఫలితంగా నీవు గంధర్వ జన్మ వదలి భూమిపై ఒక వేద పండితుని గృహంలో సేవ చేసే స్త్రీకి పుత్రుడిగా జన్మించావు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏