21, మే 2026, గురువారం

*🪷22, మే, 2026🪷* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🌹శుక్రవారం🌹*

 *🪷22, మే, 2026🪷*  

 *దృగ్గణిత పంచాంగం*             


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం -:గ్రీష్మ ఋతౌః*

*అధిక జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం* 


*తిథి : షష్ఠి* ఉ 06.24 ఉపరి *సప్తమి* రా.తె 05.04 వరకు

*వారం    : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం  : ఆశ్లేష* రా 02.08 వరకు ఉపరి *మఖ* 

*యోగం : వృద్ధి* ఉ 08.19 వరకు ఉపరి *ధ్రువ*

*కరణం  : తైతుల* ఉ 06.24 *గరజి*;సా 05.38 ఉపరి *వణజి* రా.తె 05.04 ఆపైన *భద్ర*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 06.00 - 08.00 సా 05.00 - 06.00*     

 అమృత కాలం  : *రా 12.34- 02.08*

 అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.30*

*వర్జ్యం    : మ 03.15 - 04.48*

*దుర్ముహూర్తం  : ఉ 08.11 - 09.03 మ 12.30 - 01.22* 

*రాహు కాలం  : ఉ10.27- 12.04*

గుళికకాళం      : *ఉ 07.12 - 08.50*

యమగండం    : *మ 03.19 - 04.56*

సూర్యరాశి : *వృషభం*                               

చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 05.42*  

సూర్యాస్తమయం :*సా 06.43*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం        :*ఉ 05.35 - 08.11*

సంగవ కాలం        :*08.11 - 10.46*

మధ్యాహ్న కాలం    :*10.46 - 01.22*

అపరాహ్న కాలం   :*మ 01.22- 03.58*

*ఆబ్ధికం తిధి        : అధిక జ్యేష్ట శుద్ధ సప్తమి*

సాయంకాలం     :*సా 03.58- 06.33*

ప్రదోష కాలం     :*సా 06.33 - 08.46*

రాత్రి కాలం        :*రా 08.46 - 11.42*

నిశీధి కాలం       :*రా 11.42 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.51*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*


  *గాయత్రీ సోమసంభూతి*

    *స్సావిత్రీ ప్రణవాత్మికా*

           

               *🪷ఓం🪷* 

*🌷శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః🌷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

21-05-2026 రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

21-05-2026 రాశి ఫలితాలు


మేషం


వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.  

--------------------------------------- 


వృషభం


కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

---------------------------------------


మిధునం


నూతన ఋణాలు చేస్తారు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కొన్ని పనులు మధ్యలో వాయిదాపడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

---------------------------------------


కర్కాటకం


ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. 

---------------------------------------


సింహం


నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

---------------------------------------


కన్య


ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. మిత్రులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. గృహ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------


తుల


వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. అనారోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమౌతుంది.  

---------------------------------------


వృశ్చికం


ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆప్తులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. 

---------------------------------------


ధనస్సు


చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------


మకరం


వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

---------------------------------------


కుంభం


ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు. కొన్నిపనులు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

---------------------------------------


మీనం

 

విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దాయాదులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

---------------------------------------

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*గురువారం 21 మే 2026*


      *శ్రీ మహావిష్ణు పురాణం*                              

           *95వ భాగం*


*శ్రీకృష్ణావతారము                      యదువంశ కథ!*```


యయాతి ప్రథమ పుత్రుడైన యదువుకి సహస్రజిత్తు,క్రోష్టుడు, అనలుడు, నహుషుడు అనే నలుగురు కుమారులు ఉన్నారు.  సహస్రజిత్తుకి శతజిత్తుడు జన్మించగా, శతజిత్తుకి హేహయ, తాళజంఘ, వేణు హయులని ముగ్గురు కుమారులు జన్మించారు.

హేహయునకు ధర్ముడు, ధర్మునికి కుంతలుడు జన్మించారు. కుంతలుడి పేరుతో వారి రాజ్యానికి కుంతలదేశము అని పేరు వచ్చింది కుంతలుని కుమారుడు సభాజిత్తు. సభాజిత్తుని కుమారుడు మహిష్మంతుని పేరుతో మహిష్మతిపురం నిర్మించబడింది.

మహిష్మంతుని పుత్రుడు భద్రశోణి, భద్రశోణి కుమారుడు దుర్దముడు, దుర్దముని కొడుకు, ధనకుడు. ధనకునికి కృతవీర్యుడు కృతాగ్ని, కృతధర్ముడు, కృతాజుడు అనే నలుగురు కుమారులు కలిగారు. కృతవీర్యునికి వేయి చేతులు గల కార్తవీర్యార్జునుడు జన్మించాడు. కార్తవీర్యార్జునుడు పరశురాముని చేతిలో మరణించాడు.


కార్తవీర్యార్జునుడికి గల నూరుగురు కుమారులలో శూరసేనుడు, వృషసేనుడు,మధువు, జయధ్వజుడు ముఖ్యమైనవారు. జయధ్వజుని కుమారుడు తాళజంఘుడు. తాళజంఘునికి నూరుగురు కుమారులు జన్మించారు. వారిలో మొదటి వాడు వీతిహోత్రుడు,రెండవవాడు భరతుడు. భరతునికి వృషుడు, వృషునికి మధుడు,మధునికి వృష్ణి జన్మించారు. వృష్ణి పేరుతో వృష్ణి వంశం ప్రసిద్ధి చెందింది.


యదువుకి మరో పుత్రుడైన క్రోష్ఠునికి ధ్వజినీశుడు జన్మించాడు. ధ్వజినీశునికి స్వాతి,  ఋశంకుడు జన్మించారు. ఋశంకునికి చిత్రరథుడు జన్మించారు. చిత్రరథునికి జన్మించిన శశిబిందుడు చక్రవర్తిగా భూమినంతా పరిపాలించాడు. శశిబిందుని కుమారులలో పెద్దవాడు పృథుశ్రవుడు. పృథుశ్రవునికి కుమారుడు దముడు, దమునికి పుట్టిన ఉశనుడు పది అశ్వమేధాలతో సహా అనేక యజ్ఞయాగాదులు చేశాడు.


ఉశనునికి ఇతవుడు, ఇతవునికి మధువు, మధువుకి పరాజితుడు, రుక్ముడు,పృథురుక్ముడు,జ్యామఘుడు, ఫలితహరితుడు అనే ఐదుగురు కుమారులు జన్మించారు. వీరిలో జ్యామఘుడు శైబ్య అనే కాంతను మోహించి వివాహం చేసుకున్నాడు. వారికి చాలా కాలం తరువాత విదర్భుడు అనే కుమారుడు జన్మించాడు. విదర్భుని చక్కటి పరిపాలనతో ఆ దేశానికి విదర్భ దేశం అని పేరు వచ్చింది.


విదర్భునికి క్రథకైశుడు, రోమపాదుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. రోమపాదుని కుమారుడు విభ్రుడు, విభ్రుని కుమారుడు ధృతి, ధృతి కుమారుడు కౌశికుడు. కౌశికుడి కుమారుడు చేదితో చేది వంశం, చేది దేశం ఏర్పడ్డాయి. కృథకైశునికి కుంతి అనే కుమారుడు, ఇందుమతి అనే కుమార్తె కలిగారు.


ఇందుమతి సూర్యవంశజుడైన అజునికి భార్య అయ్యింది. కుంతికి వృష్ణి, వృష్ణికి ధృతి, ధృతికి దాశార్హుడు, దాశార్హునికి వ్యోముడు, వ్యోమునికి అనుడు, అనునికి పూరుహోత్రుడు, పూరుహోత్రునికి అంశుడు, అంశునికి సత్వతుడు, సత్వతునికి ఉత్వకుడు జన్మించారు.


ఉత్వతుడికి భజమాన, దివ్యాంధ, దేవావృధ, మహాభోజ, వృష్ణులని కుమారులు కలిగారు. భజమానునికి నిమి, వృక్షుడు, వృష్ణి, శతజిత్తు, సహస్రజిత్తు, యుతజిత్తు అనే ఆరుగురు కుమారులు పుట్టారు. దేవావృధునికి బభ్రుడు, దేవవిభుడు జన్మించారు.  మహాభోజునికి భోజమూర్తులు జన్మించారు. భోజ వంశం వృద్ధి చెందింది. 


వృష్ణి కుమారుడు సుమిత్రుడు, సుమిత్రునికి అమిత్రుడు, శిని అని కుమారులు కలిగారు. అమిత్రుని పుత్రుడు నిఘ్నుడు, నిఘ్నుని కుమారులు సత్రాజిత్తు ప్రసేనుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. సత్రాజిత్తుని కుమార్తె సత్యభామ శ్రీకృష్ణునికి మూడవ పత్ని అయ్యింది.


అమిత్రుని కుమారుడు శినికి సత్యకుడు, సత్యకునికి సాత్యకి జన్మించారు. సాత్యకికి యయు ధానుడు అనే మరోపేరు ఉంది.  శ్రీకృష్ణునికి సాత్యకి సోదరుడు అవుతాడు.


అంధకుని  రుచికంబళ, కుకుర బర్వులు అనే కుమారులు జన్మించారు. అంధకుని వంశములో పుట్టినవారు అంధకులుగా ప్రసిద్ధి చెందారు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

20, మే 2026, బుధవారం

*సంపూర్ణ మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*బుధవారం 20 మే 2026*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                        2️⃣3️⃣1️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *231 వ రోజు*                   

*భీష్మ పర్వము ప్రథమాశ్వాసము*


*ధర్మరాజు పితామహ గురువుల వద్ద యుద్ధానికి అనుమతి తీసుకొనుట*```


కృష్ణార్జునులు పాంచజన్యం, దేవదత్తాలు పూరించగా అవి పాండవ సైన్యంలో ఉత్సాహాన్ని కౌరవ సైన్యంలో కలతను కలిగించాయి. కౌరవ సైన్యాలకు ఉత్సాహం కలిగించే విధంగా మంగళ తూర్యనాదాలు మ్రోగించారు. ఆ సమయంలో ధర్మరాజు తన ఆయుధములను కవచాన్ని రథంలో వదిలి భీష్ముని వైపు పాదచారి అయి నడువ సాగాడు. అది చూసిన కృష్ణ, సాత్యకి ఇతర ధర్మరాజ సన్నిహితులు కలవర పడి రథాలు దిగి ధర్మరాజును అనుసరించారు. “ఇందరం నీ వెంట ఉండగా నీవు ఇలా పాదచారివై వెడలుట ఏమి. శత్రువులు మనది పిరికితనం అని హేళన చేయరా” అని సోదరులు తలా ఒక విధంగా అడుగుతున్నా ధర్మరాజు మౌనం వీడక చేతులు ముకుళించి నడచి పోతునే ఉన్నాడు. 


అది చూసిన శ్రీకృష్ణుడు “ధర్మజుని తలపు నాకు తెలుసు. అతడు భీష్మ, ద్రోణ, కృపాచార్య, శల్యులకు నమస్కరించి యుద్ధం చేయడానికి అనుమతి తీసుకోవడానికి వెళుతున్నాడు. అలా చేస్తే విజయం తధ్యం" అన్నాడు. 


ఆ మాటలు విని అందరూ మౌనంగా జరిగేది వీక్షించ సాగారు. కృషార్జున, నకులసహదేవ, భీమాదులతో ధర్మరాజు భీష్ముని ఎదుట నిలువగా కౌరవ ప్రముఖులు మాత్రం ధర్మరాజులోని రాకకు అంతర్యం తెలియక భీమార్జున, నకులసహదేవ, ద్రుపద, సాత్యకుల అండ ఉన్న ధర్మరాజుకు భయమేల అని కొందరు అనుకోసాగారు. ధర్మరాజు పిరికి వాడు కాదు అయినా ఈ సమయంలో ఈ రాకలోని అంతర్యం ఏమిటో అనుకున్నారు. మానధనుడైన ధర్మరాజు ఏమి మాట్లాడతాడో, భీష్ముడు ఎలా సత్కరిస్తాడో, కృష్ణార్జునుల అంతర్యమేమిటో, భీమాదులు ఏమి చెప్తారో అని పలు పలు విధాలుగా ఆలోచించసాగారు. ధర్మరాజు భీష్ముని ఎదుట నిలిచి

"మహానుభావా! మీ ఎదుట నిలిచి యుద్ధం చేయవలసిన దుస్థితికి చింతిస్తున్నాను. మీ దీవెనలకు అనుమతికి వచ్చాను నాకు యుద్ధం చేయడానికి అనుమతి ఇచ్చి నన్ను దీవించండి. మీ దీవెనలు నాకు విజయాన్ని ప్రసాదిస్తుంది” అన్నాడు. 


భీష్ముడు ఆనందించి “ధర్మనందనా! ఈ సమయంలో నీ రాక సముచితమే కాక ఎంతో శ్రేయస్కరం కూడా. నీవిట్లు చేయకున్న నా శాపానికి గురికావలసి ఉండేవాడివి. ఇక నీకు జయం కలుగుతుంది. నీ పక్షాన యుద్ధం చేయడం తప్ప ఏదైనా వరం కోరుకో అనుగ్రహసిస్తాను. నీకు మేలు జరుగుతుంది" అన్నాడు. 


ధర్మరాజు "పితామహా! మీరు రారాజు తరఫున యుద్ధం చేయండి కాని మాకు మేలు చేయండి” అని కోరాడు. 


భీష్ముడు “ధర్మరాజా! నీ ఆంతర్యం వివరించు" అన్నాడు. 

ధర్మరాజు "పితామహా! మరేమి లేదు మీతో యుద్ధం చేసి గెలవడము ఎలాగో వివరించండి" అన్నాడు. 


భీష్ముడు చిరునవ్వుతో "ధర్మరాజా! నాతో రణరంగాన గెలవడం దేవతలకు కూడా సాధ్యం కాదు. అడిగావు కనుక చెప్తాను. నే చేతి ఆయుధం కింద పడిన కాని అది సాధ్యం కాదు. ఇప్పటికి ఇంతకంటే చెప్పను. ఈ సారి మన కలయిక నీ మనోరధాన్ని నెరవేర్చ గలదు" అన్నాడు. 


భీష్ముని వద్ద అనుమతి పొందిన ధర్మరాజు తన వారితో కలసి ద్రోణ, కృపాచార్య, శల్యులకు నమస్కరించి వారి అనుమతి పొందాడు. 


ద్రోణుడు “ధర్మజా! శ్రీకృష్ణుని అండ ఉన్న నీకు విజయం తధ్యం” అన్నాడు. 


ధర్మరాజు ద్రోణుని అతడిని గెలిచే ఉపాయాన్ని చెప్పమని ప్రార్ధించాడు. ద్రోణుడు "ధర్మరాజా! నా చేతిలో ఆయుధమున్నంత వరకు నన్ను గెలవడం సాధ్యం కాదు, కాని నేను అస్త్రసన్యాసం చేసినా ప్రాయోపవేశం చేసినా నన్ను వధించగలరు. అశుభ వార్త వినినంతనే అస్త్రసన్యాసం చేస్తాను" అన్నాడు. 


కృపాచార్యుని గెలిచే ఉపాయం అడుగగా అతడు "నేను ఎవరి చేత చంపబడను కాని నీకు జయం తథ్యం" అన్నాడు. 


శల్యుని చూసి ధర్మరాజు తనకిచ్చిన మాట గుర్తు ఉంచుకొమ్మని చెప్పగా. అతడు ధర్మరాజుతో అతడికి ఇచ్చిన మాట గుర్తు ఉన్నదని అలాగే చేస్తానని నిశ్చింతగా ఉండవచ్చని మాట ఇచ్చాడు. 

*(మహాభారతయుద్ధములో కౌరవ పక్షాన పోరాడి చావకుండా బతికి బయట పడ్డవాళు కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ మాత్రమే. వీళ్లనే రధిక త్రయము అన్నారు.).*

శ్రీకృష్ణుడు యుద్ధాన్ని కుతూహలంతో చూడవచ్చిన కర్ణుని చూసి "కర్ణా! భీష్ముని మీద కోపంతో అతడు పడిపోయే వరకు యుద్ధం చేయనని చెప్పావట కదా! అప్పటి వరకు పాండవ పక్షాన యుద్ధం చేస్తూ వినోదించవచ్చు కదా!" అన్నాడు. 


కర్ణుడు "కృష్ణా! నేను భీష్ముని మీద కోపంతో యుద్ధం నుండి వైతొలిగాను కాని సుయోధనునికి ఇచ్చిన మాట తప్పనని నీకు తెలియనిదా” అన్నాడు. 


ఆ పై ధర్మజుడు రధాన్ని అధిరోహించి కవచాన్ని ధరించి కౌరవ పక్షంవైపు కొంత ముందుకు వెళ్ళి "కౌరవ ప్రముఖులారా! మీలో ఎవరైనా నాపై ఉన్న అభిమానంతో నా పక్షంలోకి రావచ్చు నేను వారిని నా తమ్ముల వలె చూసుకుంటాను" అన్నాడు. 


ఆ మాటలు విన్న *యుయుత్సుడు (ధృతరాష్ట్రుని వేరే భార్య కొడుకు)* ధర్మరాజు పక్షంలో చేరటానికి అంగీకరించాడు. యుయుత్సుడు సుయోధనుని దుష్కృత్యములను నిందిస్తూ పాండవులను పొగుడుతూ తన సైన్యాలతో పాండవ పక్షంలో చేరాడు. ధర్మరాజు సంతోషంగా యుయుత్సుని ఆహ్వానించాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం  చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

గురువారం🌷* *🌹21, మే, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

   *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    *🌷గురువారం🌷*

 *🌹21, మే, 2026🌹*   

 *దృగ్గణిత పంచాంగం*               


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*అధిక జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం* 


*తిథి : పంచమి* ఉ 08.26 వరకు ఉపరి *షష్ఠి*

*వారం   : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : పుష్యమి* రా 02.49 వరకు ఉపరి *ఆశ్లేష*

*యోగం : గండ* ఉ 10.58 వరకు ఉపరి *వృద్ధి*

*కరణం  : బాలువ* ఉ 08.26 *కౌలువ* రా 07.20 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 08.30 - 09.30 సా 04.00 - 06.00*     

అమృత కాలం  : *రా 08.47 - 10.18*

అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.30*

*వర్జ్యం    : ప 11.44 - 01.15*

*దుర్ముహూర్తం  : ఉ 09.55 - 10.46 మ 03.06 - 03.57* 

*రాహు కాలం   : మ 01.41 - 03.19*

గుళికకాళం      : *ఉ 08.50 - 10.27*

యమగండం    : *ఉ 05.35 - 07.13*

సూర్యరాశి : *వృషభం*               

చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 05.43* 

సూర్యాస్తమయం :*సా 06.43*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      :*ఉ 05.35 - 08.11*

సంగవ కాలం        :*08.11 - 10.46*

మధ్యాహ్న కాలం    :*10.46 - 01.22*

అపరాహ్న కాలం   :*మ 01.22- 03.57*

*ఆబ్ధికం తిధి  :అధిక జ్యేష్ట శుద్ధ షష్ఠి*

సాయంకాలం   :*సా 03.57- 06.33*

ప్రదోష కాలం     :*సా 06.33- 08.45*

రాత్రి కాలం        :*రా 08.45- 11.42*

నిశీధి కాలం       :*రా 11.42 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.51*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌹🕉️ఓం శ్రీ సద్గురుబ్యోనమః.🕉️🌹*


*సర్వపాపం శమం యాతి* 

*దత్తాత్రేయ నమోఽస్తుతే*

           

*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*బుధవారం 20 మే 2026*


      *శ్రీ మహావిష్ణు పురాణం*                                   

             *94వ భాగం*


*గయా శ్రాద్ధఫలం -*

*అశ్వత్థ(రావి చెట్టు) వృక్ష మహత్మ్యం*

```

తమపితృదేవతలకుపుణ్యలోకాలు ప్రాప్తి కలగాలంటే గయకు వెళ్లి శ్రాద్ధం పెట్టాలి. పూర్వపుణ్యఫలం ఉన్నవారు గయకు వెళ్లి పితృదేవ తలకు శ్రాద్ధం పెడతారు. వారికి కోటి జన్మల పుణ్యఫలం కలుగు తుంది అంటారు. అంతేకాదు గయలో శాస్త్రోక్తంగా శ్రాద్ధ కర్మలు నిర్వహించిన వారిపితృదేవతలు తప్పక వైకుంఠప్రాప్తిపొందుతారు.

గయలో పిండ ప్రదానం ఎవరికి పెడతారో వారు ఎటువంటి వారైనా మోక్షం పొందుతారు అని చెప్పడానికి ఒక కథ ఉంది.


పూర్వం కన్యాకుబ్జంలో చిత్రరథుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆతని భార్య పేరు చిత్రసేన. చిత్రరథుడు మహా ధనవంతుడు కావాలని అనేక పాప కార్యాలు చేసి ధనం, ఆస్తులు సంపాదించారు.. చిత్రరథుడు చేసిన పాపాలకు ఘోర వ్యాధికి గురి అయి చాలాకాలం బాధ పడి మరణించాడు.


యమభటులు అతనిని పాశాలతో కట్టి కొట్టుకుంటూ నరకలోకానికి తీసుకు వెళ్లారు. యముడు చిత్రగుప్తుని చిత్రరథుడు చేసిన పాప పుణ్యాల లెక్కలు అడిగాడు. చిత్రగుప్తుడు చిట్టా చూసి చిత్రరథుడు చేసినవన్నీ భయంకరమైన పాపాలే గాని పుణ్యం ఒక్కటి కూడా లేదని చెప్పాడు.


యమధర్మరాజా అతనిని చేసిన పాపాలు శిక్షగా కుంభీపాక నరకంలో వేసి ఘోరాతిఘోరంగా శిక్షించమని ఆదేశించాడు. యముడి ఆదేశం విని చిత్రరథుడు భయంతో వణికిపోతూ ఏడవ సాగాడు. చిత్రగుప్తుడు చూసి జాలిపడి "నీ కుమారులలో ఒకరు త్వరలో గయకు వెళ్లి శ్రాద్ధ కర్మలు చేస్తాడు. అప్పుడు నీకు కుంభీపాక నరకం నుండి విముక్తి లభిస్తుంది" అని చెప్పాడు.


భూమి పై ఒకరోజు చిత్రరథుని కుమారులలో పన్నెండేళ్ళ ఆఖరివాడు స్నేహితులతో ఆటపాటలలో మునిగి పోయి ఇంటికి భోజనానికి వెళ్లికుండా చాలా పొద్దుపోయిన తరువాత ఆలశ్యంగా ఇంటికి వచ్చాడు. వాడి తల్లి వాడిని నానాతిట్లు తిట్టి కర్ర తీసుకుని దేహశుద్ది చేసింది.


తల్లి మీద కోపం వచ్చి వాడు ఇల్లు, ఊరు వదలి వేసి పారిపోయి దేశమంతా తిరగసాగాడు. ఆ క్రమంలో అనేక తీర్థ స్థలాలు, పుణ్య స్థలాలు దర్శిస్తూ సేవిస్తూ మంచివాడు అయ్యాడు. దేశమంతా తిరుగుతూ గయ క్షేతం చేరాడు. అక్కడకు వచ్చిన వారు తమ పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేయడం చూసాడు. తనూ గంగలో స్నానం చేసి పితృదేవతలకు శాస్త్రోక్తంగా శ్రాద్ధ కర్మలు చేశాడు.


కుమారుడి గయలో చేసిన శ్రాద్ధకర్మల ఫలంగా, చిత్రరథుడు, అతని పితృదేవతలు కుంభీపాకం మొదలైన నరకాల నుంచి విముక్తి పొంది వైకుంఠ ప్రాప్తి పొందారు" అని గయ మహత్మ్యం చెప్పిన తరువాత సూత మహర్షి అశ్వత్థ వృక్ష మహిమ గురించి చెప్పారు.


     *అశ్వత్థ వృక్ష మహిమ*


శ్రీమహావిష్ణువు లోకంలో ప్రజల పాపాలను నశింపచేసి ఉద్దరించడానికి వృక్ష రూపం దాల్చి వెలిశాడు. ఆ వృక్షమే అశ్వత్థ వృక్షము. ఆశ్వత్థ వృక్షాన్ని దర్శించినా, పూజించినా, ప్రదక్షిణం చేసినా, నీరు పోసినా పాపాలన్ని నశిస్తాయి. అంతేకాదు! ఇలా చేసినవారు మహావిష్ణువుని ప్రత్యక్షంగా సేవించిన పుణ్య ఫలం పొందుతారు.


అశ్వత్థ వృక్షము అనగా రావిచెట్టుకి నిత్యం నీళ్లు పోసి పూజించేవారు ధర్మ అర్థ కామ మోక్షాలు తప్పక పొందుతారు. చెట్టు చుట్టూ వేదిక కట్టించిన వారి సకల జన్మల పాపాలు నశిస్తాయి అంటారు. అశ్వత్థ వృక్షంలో శ్రీహారి సదా నివాసము ఉంటాడని పెద్దలు చెబుతారు. ఇందుకు నిదర్శనంగా ఒక పురాతన ఇతిహాసం ఉంది.


త్రేతాయుగంలో సౌరాష్ట్ర రాజ్యంలో ధనంజయుడు అనే బ్రాహ్మణులకు భిక్షాటనతో జీవన యాత్ర చేసేవాడు. అతని భార్య పేరు సుశీల. భార్యాభర్తలిద్దరు విష్ణుభక్తి పరాయణులు. పేదరికంలో ఉన్నప్పటికీ అతిథి అభ్యాగతులను తమ శక్తి మేరకు సేవించేవారు. భిక్ష దొరకని రోజు పస్తులుండి నారాయణ స్మరణ చేస్తూ గడిపేవారు. 


చలికాలంలో సరియైన దుస్తులు లేనందు వలన భిక్షాటన తరువాత ధనంజయుడు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి ఇంటిలో మంట వేసుకుని దంపతులు చలి కాచుకునేవారు. ఒకరోజు భిక్షాటన చేసి ఆలస్యంగా రావడం వలన అడవికి వెళ్లే సమయం లభించలేదు. ఆ రాత్రి చలి బాగా ఎక్కువగా ఉండటంతో తట్టుకోలేక ఇంటికి ఎదురుగా ఉన్న రావిచెట్టు యొక్క ఎండిన కొమ్మను గొడ్డలితో కొట్టాడు.


రావిచెట్టు కొమ్మ నేల మీద పడగానే రావిచెట్టు నుండి శ్రీమహావిష్ణువు చతుర్భుజుడై శంఖ చక్ర గదా పద్మాలతో ధనంజయుడు ముందు ప్రత్యక్షమైనాడు. కానీ మహావిష్ణువు శరీరం నుంచి రక్తం కారుతోంది. ధనంజయుడు చూసి భయపడి గొడ్డలి వదిలేసి శ్రీహరి పాదాల పై పడి "నారాయణా! నా మీద దయతో దర్శన భాగ్యం కలిగించావు. కానీ ఈ రక్తం ఏమిటి? దేవాధిదేవుడవు! నిన్ను ఆయుధంతో ఎవరు గాయపరచగలరు?" అని దుఖిస్తూ అడిగాడు.


మహావిష్ణువు చిరునవ్వుతో "ధనుంజయా! నీ వన్నది నిజం! నన్ను ఏ శత్రువు గాయపరచలేడు. కానీ నా భక్తుడు చేసిన పని ఇది. తెలియక చేశాడు. అందుకే సహిస్తున్నాను. నేను ఈ అశ్వత్థ వృక్షంలో నివసిస్తూ ఉంటాను. నీవు గొడ్డలితో కొమ్మ నరికావు కదా! అందుకే గాయమై రక్తం కారుతోంది" అనగానే ధనంజయుడు శ్రీహరి పాదాలను కన్నీళ్లతో అభిషేకం చేస్తూ క్షమించమని ప్రార్ధించాడు.


శ్రీహరి ధనుంజయుని లేవనెత్తి "జరిగినదానికి దుఖపడకు ధనుంజయా! నా భక్తులు ఏమి చేసినా నాకు ప్రియంగానే ఉంటుంది. పైగా ఈ గాయం వలన నీకు నా దర్శనం లభించింది కదా! నీ భక్తి నాకు నచ్చింది. వరం కోరుకో! అనుగ్రహిస్తాను" అన్నాడు. ధనంజయుడు ధన సంపదలు కోరలేదు. "పరమాత్మా! సదా నీ పాదపద్మాలపై నాకు భక్తి ప్రపత్తులు ఉండేటట్టు అనుగ్రహించు!" అని కోరుకున్నాడు.


మహావిష్ణువు ధనుంజయుని నిర్మల భక్తికి ప్రసన్నుడై విశ్వకర్మను పిలిచి ధనంజయుడు నివసించడానికి భవ్యమైన భవంతి నిర్మాణం చేయించాడు. అనంత సంపదలు, సుఖభోగాలు ఇచ్చి మరణానంతరం వైకుంఠం ప్రాప్తి కలిగేటట్టు వరమిచ్చి అదృశ్యమయ్యాడు. ధనంజయుడు, సుశీల అశ్వత్థ వృక్షాన్ని నిత్యం నియమ నిష్టలతో పూజిస్తూ సంతానం పొందారు. సుఖ జీవితం గడిపి వైకుంఠం చేరి ముక్తి పొందారు.


కనుక అశ్వత్థ వృక్షము పరమ పూజనీయం. "మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శ్శివరూపాయ వృక్షరాజాయతే నమః" అని ధ్యానిస్తూ అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేయాలి.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

దృష్టి

 *మన దృష్టి ఎలా వుండాలి ?**

 

ముందు మనం పొగడ్తలకు 

పొంగి పోయి, నిందలకు కృంగిపోకూడదు, 


ఏది మంచి? 

ఏది చెడ్డ? 

అనే విషయానికి వస్తే,

 ఏది నీకు మంచిదో 

అది ఇతరులకు చెడ్డ కావచ్చు, ఇతరులకు ఏది చెడ్డదో అది నీకు మంచి కావచ్చు. 


*ఉదా!!*

ఒకరి ఇంట్లో పెళ్ళి జరుగుతోంది, వారు వాన రాకూడదని ప్రార్ధిస్తున్నారు, 


కాని, వానలు లేక పైర్లు ఎండి పోతున్నాయి,

 కాబట్టి వ్యవసాయం చేసేవారు వానలు రావాలని ప్రార్ధిస్తున్నారు...


చూశారా! 

వాన రావటం ఒకరికి మంచిది, మరొకరికి చెడ్డది, 

అందుచేత వాటి గురించి పట్టించుకోవద్దు"... 


అయితే రెండు కరెక్ట్, 

మరి ధర్మం మాటేమిటి? 

దైవం ఎవరి మాట వింటాడు  ?అని అడిగితే,

"నిజంగా నీవు అందరి మంచీ కోరుకుంటే, అందరి క్షేమాన్ని కోరి ప్రార్ధిస్తే, నీ పొలం పైన వాన కురుస్తుంది;  


గాలికి మేఘము తొలగి పోయి ఊరిలో వాన పడకుండా, పెళ్ళి వారికి ఇబ్బంది లేకుండా  కూడా ఉంటుంది. 

ఇద్దరికీ మంచిదే జరుగుతుంది, అట్లు కాకుండా నీ ప్రార్థనలో సంకుచితమై మైన బుద్ధి ఉంటే అంతటా వర్షం పడినా, నీ పొలం పైన కురవదు...కనుక విశాలమైన దృష్టి అవసరము. 


        *_శుభమస్తు_*

🙏 *శ్రీ సద్గురు  పీఠం ద్వారా* ...✍️

సమస్త లోకా సుఖినోభవంతు 🙏

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము


శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి ।

శబ్దాదీన్విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి ।। 26 ।।



ప్రతిపదార్థ:


శ్రోత్ర-ఆదీని — వినికిడి ప్రక్రియ వంటి; ఇంద్రియాణి — ఇంద్రియములు; అన్యే — ఇతరులు; సంయమ — నిగ్రహించి; అగ్నిషు — యజ్ఞాగ్నిలో; జుహ్వతి — సమర్పణ; శబ్ద-ఆదీన్ — శబ్దము మొదలైన; విషయాన్ — ఇంద్రియ తృప్తి నిచ్చే వస్తు-విషయములు; అన్యే — మరి కొందరు; ఇంద్రియ — ఇంద్రియముల; అగ్నిషు — అగ్నిలో; జుహ్వతి — సమర్పణ.



తాత్పర్యము : 


మరికొందరు శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియనిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు. మరికొందరు శబ్దాది ఇతర ఇంద్రియ విషయములను ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు.

   


వివరణ:


అగ్ని అనేది తనలో సమర్పించబడిన వస్తువుల స్వభావాన్ని మార్చివేస్తుంది. బాహ్యమైన వైదిక కర్మకాండ యజ్ఞంలో, భౌతికంగా తనకు సమర్పించబడిన వాటిని అగ్ని భక్షించివేస్తుంది. అంతర్గత ఆధ్యాత్మిక సాధనలో అగ్ని అనేది సంకేతాత్మకమైనది. ఆత్మ-నిగ్రహం అనే అగ్ని, ఇంద్రియ వాంఛలను దహించివేస్తుంది.


ఇక్కడ, శ్రీ కృష్ణుడు, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఉన్న రెండు పూర్తి విరుద్ధమైన మార్గాల తేడాను వివరిస్తున్నాడు. ఒకటి, ఇంద్రియములను తిరస్కరించటం, ఈ పద్ధతిని హఠయోగ అభ్యాసంలో అనుసరిస్తారు. ఈ రకమైన యజ్ఞంలో, అత్యంత ఆవశ్యకమైన శరీర నిర్వహణకి తప్ప, మిగతా అన్ని ఇంద్రియముల క్రియలను ఆపివేస్తారు. సంకల్పబలంతో మనస్సుని పూర్తిగా ఇంద్రియముల నుండి వెనక్కి మరల్చి, అంతర్ముఖంగా ఉంచుతారు.


దీనికి వ్యతిరేకమైనది భక్తి యోగ అభ్యాసము. ఈ రెండవ రకమైన యజ్ఞంలో, ఇంద్రియములను, ప్రతి పరమాణువులో కనిపించే ఆ సృష్టికర్త యొక్క అద్భుతమైన కీర్తిని ఆరాధించటానికి వాడతారు. ఇంద్రియములు ఇక భౌతిక సుఖములు ఆనందించటానికి పనుముట్లగా వాడబడవు; సర్వత్రా భగవంతుని దర్శించటానికే అవి పరిష్కృతం చేయబడతాయి. 7.8వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు అంటాడు, ‘రసోఽహం అప్సు కౌంతేయ ’ అని, ‘అర్జునా, నీటి యందు రుచిని నేనే అని తెలుసుకో.’ ఈ ప్రకారంగానే, భక్తి యోగులు, అన్ని ఇంద్రియముల ద్వారా భగవంతుడిని దర్శించటానికే అభ్యాసం చేస్తారు.- చూసే, వినే, రుచిచూసే, భావించే, ఆఘ్రాణించే అన్నిటిలో కూడా. ఇటువంటి భక్తి యజ్ఞము హఠయోగ మార్గం కన్నా సులువైనది; పాటించటానికి ఆహ్లాదకరమైనది, మరియు ఈ మార్గం నుండి పతనమవటానికి తక్కువ అవకాశం కలది. ఒకవేళ ఎవరైనా సైకిలు తొక్కుతూ ఉన్నప్పుడు, ముందుకు వెళ్ళటం ఆగటానికి బ్రేకులు గట్టిగా వేస్తే, వారు పడిపోయే అవకాశం ఉంటుంది; కానీ దీనికి బదులుగా సైకిలు తొక్కేవాడు తన హేండిల్‌ని కుడి పక్కకో, ఎడమ పక్కకో తిప్పితే, సైకిలు సునాయాసంగా ముందుకు వెళ్ళటం ఆగిపోతుంది మరియు సమతుల్యత తోనే ఉంటుంది.

అమ్మ ఏం చ‌దివింది*🙏

 🙏*అమ్మ ఏం చ‌దివింది*🙏


నాన్న పేరు ప‌క్క‌న డిగ్రీలు చూసిన‌ప్పుడ‌ల్లా

అమ్మ ఏం చ‌దివిందో తెలుసుకోవాల‌నిపిస్తుంది.


వంటింట్లో త‌న ఒంటిచేతి విన్యాసం చూస్తే...

గిన్నెలూ, గ‌రిటెల‌తో కూర ప‌ట్టు యుద్ధం చేస్తే..

హోటెల్ మేనేజ్‌మెంట్‌లో వంద డిగ్రీలైనా

హోల్‌సేల్‌గా క‌ట్ట‌బెట్టార‌నిపిస్తుంది.


ఇద్ద‌రికే స‌రిప‌డా కూర‌

న‌లుగురుకి తృప్తిగా వ‌డ్డించిన‌ప్పుడు

మ‌రో డిగ్రీ నెత్తిమీద పెట్టాల‌నిపిస్తుంది.


సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని

ఇంద్ర‌భ‌వ‌నంలా స‌ర్దిన‌ప్పుడు

పెర‌ట్లో పూసిన పిచ్చి పూల‌ను

ఖాళీ సీసాల్లో పేర్చి ఫ్ల‌వ‌ర్ వాజ్ గా మార్చిన‌ప్పుడు

ఇంటీరియ‌ర్ కోర్సేదో త‌న కొంగున‌

ముడివేసుకొందా అనే అనుమానం వేస్తుంది.


చాలీ చాల‌ని జీతంతో

నెలంతా స‌ర్దుకోలేక‌ నాన్న స‌త‌మ‌త‌మ‌వుతుంటే..

చిటికెలో ప‌ద్దులేసి చిల్ల‌ర మిగిల్చిన అమ్మ‌

క‌చ్చితంగా ఎక‌నామిక్స్ లో మాస్ట‌ర్ డిగ్రీ కొట్టేసుంటుంది.


నాన్న చేసే త‌ప్పుల్ని క‌నిపెడుతూ

నా అల్ల‌రిని అదుపు చేస్తూ

అమ్మ జడ్జిమెంట్ల‌ని పాస్ చేస్తున్న‌ప్పుడు

లా కూడా ఆమె ముందు

బ‌లాదూర్ కాకుండా ఎందుకు ఉంటుంది?


అమ్మ ద‌గ్గు చూడ‌లేక‌

డాక్ట‌ర్ ఖ‌రీదైన మందులు రాసిస్తే..

న‌వ్వుతూ ఆ చీటి డ‌స్ట్ బిన్ లో వేసేసి

పంటికింద లవంగాన్ని ప‌డేసిన అమ్మ‌...

ఎంబీబీఎస్‌ల‌కు అంద‌ని చ‌దువేదో చ‌దివేసింద‌నే నా న‌మ్మ‌కం.


బ్యాంకు ఎకౌంటు ఖాళీ అయినప్పుడు

నాన్న జేబులు నిండుకొన్న‌ప్పుడు

అమ్మ మెడ‌లో న‌గ‌లు మాయం అపోవ‌డం చూస్తే..

తాంత్రిక విద్య‌లోనూ పీహెచ్‌డీ క‌ట్ట‌బెట్టార‌న్న భ‌యమూ వేస్తుంది.


ఇన్ని చేసినా

నీకేం తెలీదెహె.. ఊరుకో అన్న‌ప్పుడు

ముసిముసిగా న‌వ్వుకొంటూ,

అల‌వాటు ప్ర‌కారం మ‌మ్మ‌ల్ని క్ష‌మించేస్తూ

మ‌ళ్లీ అమ్మ‌లా మారిపోతుంటే..

త‌త్వ‌శాస్త్ర‌మేదో ఔపోసన ప‌ట్టిన‌ట్టే ఉంటుంది.


ఇంతా చూసి ఉండ‌బ‌ట్ట‌లేక‌

ఓసారి అడిగేశా.. ఏం చ‌దివావ్ అని?!


ఆరో గ‌ళాసు.. అని ముసిముసిగా న‌వ్వేసింది.


త‌న‌కేం తెలుసు..?


ఎవ‌రికీ అంతుప‌ట్ట‌ని మ‌ధ్య‌త‌ర‌గతి జీవితాన్ని

అంద‌రికీ అర్థం కాని పేద‌రిక‌పు ప‌రిమ‌ళాన్నీ

పూర్తిగా చ‌దివేసింద‌న్న నిజం.. అమ్మ‌కు కూడా తెలీదు.🙏🙏🙏

20-05-2026 బుధవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

20-05-2026 బుధవారం రాశి ఫలితాలు


మేషం


ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి.  

---------------------------------------


వృషభం


సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

---------------------------------------


మిధునం


చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో సన్నిహితుల నుంచి అందిన సమాచారం నిరాశ కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో వ్యయప్రయాసలు తప్పవు. ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

---------------------------------------


కర్కాటకం


ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం అవుతాయి. 

---------------------------------------


సింహం


వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

---------------------------------------


కన్య


ప్రయాణాలలో శ్రమ మరింత అధికమవుతుంది. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఆప్తులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగాలలో చికాకులు అధికమవుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

---------------------------------------


తుల


ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులు ఒత్తిడులు పెంచుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు.  

---------------------------------------


వృశ్చికం


దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. 

---------------------------------------


ధనస్సు


కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆప్తుల నుంచి అవసరానికి ధనం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

---------------------------------------


మకరం


ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

---------------------------------------


కుంభం


ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

---------------------------------------


మీనం

 

పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సంఘంలో సరైన గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు.

---------------------------------------

పంచాంగము

 



19, మే 2026, మంగళవారం

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*మంగళవారం 19 మే 2026*


     *శ్రీ మహావిష్ణు పురాణం*                              

              *93 వ భాగం* 

       

            *జగన్నాథ క్షేత్రం*```


పూర్వం శ్రీమన్నారాయణుడు మూర్తి (విగ్రహ) స్వరూపంలో లవణ సముద్రానికి ఉత్తరాన గల నీలాద్రి పర్వతం పై స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఇక్కడ మహావిష్ణువుకి దేవాలయాన్ని విశ్వకర్మ స్వయంగా నిర్మించాడు. పురుషులందరిలోను ఉత్తమ పురుషుడైన మహావిష్ణువు నివాసం కనుక ఈ క్షేత్రానికి పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శ్రీహరి యొక్క నివాసము కనుక రెండవ వైకుంఠం అని, భూలోక 

వైకుంఠం అని పిలుస్తారు.


ఈ క్షేత్ర మహిమ వర్ణించడం బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. ఇక్కడ శ్రీమహావిష్ణువుకి లక్ష్మీదేవి స్వయంగా వండి  భోజనం పెడుతుంది అంటారు. స్వామి ఆరంగించగా మిగిలిన శేషాన్ని ప్రసాదంగా పెట్ఠేవారు. 

ఆ ప్రసాదం వర్ణ కుల భేదం లేకుండా జనులందరు ఆరగించే వారు. ప్రజలందరు తిని పాపాలు పోయి పుణ్యాత్ములు అయి స్వర్గానికి పోతుండటంతో స్వర్గం నిండి పోయింది. దేవతలందరు విష్ణుమూర్తి వద్దకు వెళ్లి సమస్య చెప్పి పరిష్కారం చూపమని ప్రార్ధించారు.


మహావిష్ణువు దేవతల ప్రార్ధన పై తన స్వయంభువ విగ్రహాన్ని క్షేత్రం నుండి లవణ సముద్ర తీరం అడుగున దాచాడు. ఉత్కళ దేశాన్ని పాలించే ఇంద్రద్యుమ్న మహారాజు శ్రీమహావిష్ణువు మూర్తిని పునఃప్రతిష్టించాలని సంకల్పించి స్వామి మూర్తి కోసం తపోదీక్ష చేశాడు. శ్రీమహావిష్ణువు కలలో కనిపించి సముద్ర తీరాన వనాలలో ఉండే వృక్షములతో బలభద్ర, జగన్నాథ, సుభద్ర మూర్తులను తయారు చేసి ప్రతిష్టించమని చెప్పాడు. సముద్ర తీరానికి వెళ్లి వెతుకు తున్న మహారాజుకి బ్రాహ్మణ రూపంలో విశ్వకర్మ వచ్చి తాను తగిన వృక్షాలతో మూర్తులను తయారు చేసి ఇస్తాను అని చెప్పి బలభద్ర జగన్నాథ సుభద్ర మూర్తు లను తయారు చేసి ఇచ్చాడు.


ఇంద్రద్యుమ్న మహారాజు దేవాలయం పై శ్రీహరి సుదర్శన చక్రం కూడా ప్రతిష్టించాలని సంకల్పించి నిరాహారుడై కటిక నేలపై ధ్యాన దీక్షలో కూర్చు న్నాడు. నారాయణుడు రాత్రి కలలో బ్రాహ్మణ రూపంలో కనిపించి "రాజా! నీలగిరిలో దేవాలయం నిర్మించినపుడు అక్కడ నివసించే ఒక సర్పము సముద్రతీరానికి పారిపోయి అక్కడే చనిపోయింది. దాని తలపై ఉన్న మణి అక్కడే తీరంలో పడి ఉంది. ఆ మణి తెస్తే చక్రం తయారవుతుంది. 

ఆ చక్రం దేవాలయం పై స్థాపిస్తే ఆలయం నిర్మాణం పూర్తి అవుతుంది" అని చెప్పి అదృశ్యమయ్యాడు.


మరుసటి రోజు ఉదయం ఇంద్రద్యుమ్న మహారాజు సముద్ర తీరానికి వెళ్లి వెతకగా మణి కనిపించింది. నీలవర్ణములో ప్రకాశిస్తున్న మణిని భూమి నుండి తీసుకుని వెళ్ళదామని ప్రయత్నిస్తే ఎవరూ దానిని ఎత్తలేక పోయారు. మహారాజు మహావిష్ణువుని ధ్యానించాడు.


ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి అక్కడికి వచ్చి "మహారాజా! నేను ఆ మణి పై కూర్చుంటే, 

ఆ మణి తనంతతానే లేచి ఆలయం వద్దకు వస్తుంది" అని చెప్పాడు. మహారాజు అది భగవంతుని సందేశం అని అంగీకరించాడు. మణిపై పట్టువస్త్రము పరచి బ్రహ్మచారి కూర్చోగానే ఆ మణి లేచి కదిలి దేవాలయం వరకు వచ్చింది. కానీ దేవాలయం దగ్గరకు రాగానే మణి, దానిపై కూర్చున్న బ్రాహ్మణ బ్రహ్మచారి ఇద్దరు అదృశ్యమయ్యారు.


ఇంద్రద్యుమ్నుడు నిరాశ చెంది నిరాహారియై అక్కడే దర్భశయ్య పై నిదురించాడు. నారాయణుడు నిద్రలో కనిపించి "రాజా! బ్రాహ్మణ బ్రహచారి మణితో చక్రం తయారుచేసి ఉదయాన్నే పంపుతాడు. చింతించకు. చక్ర ప్రతిష్టాపనకు ఏర్పాట్లు చేయుము" అని అదృశ్య మయ్యాడు.


మరుసటి రోజు ఉదయం మహారాజు మంత్రి పరివారంతో దేవాలయం వద్దకు వెళ్లగా ముఖ ద్వారం వద్ద చక్రముతో ఒక వ్యక్తి వేచివున్నాడు.మంగళవాయి

ద్యాలు, శంఖనాదాల మధ్య దేవాలయంపై నీలమణి చక్రం ప్రతిష్టించబడింది. పెద్ద ఉత్సవం ఇంద్రద్యుమ్న మహారాజు జరిపాడు. దేవాలయం పై గల చక్ర మహిమ నారద పురాణంలో చెప్పబడింది. 


జగన్నాథ క్షేత్రంలో మార్కండేయం, ఇంద్రద్యుమ్నం, రోహిణి కుండం, శ్వేతకుండం, సముద్ర తీరం మొదలైన పుణ్య తీర్థాలు ఉన్నాయి. ఈ తీర్థాలలో స్నానం చేసి త్రిమూర్తులను పూజించి వటవృక్షాన్ని, మార్కండేయుని, యముని, హనుమంతుని, పాతాళేశ్వరుని, లక్ష్మీదేవిని, విమలాదేవిని దర్శించాలి. సముద్రతీరంలో తీర్థ శ్రాద్ధం చేయాలి.


ఈ విధంగా చేసినవారు పునర్జన్మ పొందకుండా వైకుంఠం చేరి మోక్షము పొందుతారు. జగన్నాథ క్షేతంలో పన్నెండు నెలలలో పదమూడు యాత్రలతో సందడిగా ఉంటుంది. వీటిలో చైత్ర మాసంలో జరిగే వారుణి యాత్ర, వైశాఖంలో జరిగే చందన యాత్ర, జేష్ఠ మాసంలో జరిగే అభిషేక యాత్ర, ఆషాఢంలో జరిగే రథయాత్ర, కార్తీకంలో జరిగే దామోదర యాత్ర, మాఘమాసంలో జరిగే మకర యాత్ర ముఖ్యమైనవి. ఫాల్గుణ మాసంలో డోలోత్సవము జరుగుతుంది.


రథయాత్రలో ఉన్న బలభద్ర స్వామిని దర్శించిన సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. ఈ క్షేత్రంలో చేసిన దానధర్మాలు కోటి రెట్ల ఫలం ఇస్తుంది.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

*శ్రీ మహావిష్ణు పురాణం*

  🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*సోమవారం 18 మే 2026*


     *శ్రీ మహావిష్ణు పురాణం*                                 

              *92వ భాగం*


          *భక్త అంబరీష చరిత్ర*```


మత్స్యావతారంలో శ్రీమహా విష్ణువు అనుగ్రహం పొందిన సత్యవత్ర మహారాజు తరువాత జన్మలో సూర్యుని పుత్రుడిగా జన్మించాడు. అతనికి 

‘శ్రాద్ధ దేవుడు’ అని నామకరణం చేశారు. అతడే ‘వైవస్వతుడు’

గా వైవస్వంత మన్వంతరానికి మనువు అయ్యాడు. సూర్య వంశము ఇతని ద్వారా విస్తరించింది.


వైవస్వతునికి ఇక్ష్వాకువు, నాభాగుడు మొదలైన పది మంది కుమారులు జన్మించారు. శ్రీరామచంద్రుడు జన్మించిన ఇక్ష్వాకు వంశం గురించి మీరు ముందుగానే విన్నారు. వైవస్వత మనువు మరో పుత్రుడైన నాభాగుడికి నభగుడు అనే కుమారుడు జన్మించాడు. నభగుడి కుమారునికి తాత నాభాగుడి పేరే పెట్టారు. మహా పండితుడు, విష్ణుభక్తుడు అయిన ఇతనికి అంబరీషుడు కుమారుడిగా జన్మించాడు.


అంబరీషుడు రాజర్షియై నిరంతరం శ్రీమన్నారాయణ నామ స్మరణ చేస్తుండేవాడు. విష్ణుమూర్తికి ప్రియభక్తుడైన అంబరీషుడు భూమండలానికి రాజైనా భౌతిక సుఖములందు కోరిక ఉండక, హరి నామ స్మరణ తో హరిభక్తులను సేవిస్తూ ఉండే వాడు. రాజ్యపాలనచక్కగాచేస్తూ ప్రజపాలన జనరంజకంగా చేస్తూ విష్ణుభక్తి, విరక్తి వలన రాజర్షిగా ప్రసిద్ది చెందాడు.


అంబరీషుని నిర్మల భక్తికి ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు తన భక్తుని రక్షణకు సుదర్శన చక్రాన్ని నియమించాడు. అంబరీషుడు తన ధర్మపత్నితో కలసి శ్రీమహా విష్ణువు ప్రీతి కోసం ఏడాది పాటు సాగే ద్వాదశీ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించాడు. వ్రతం పరిసమాప్తి అయిన కార్తీక మాసంలో మూడు రాత్రులు ఉపవాసం ఉండి కాళింది నదిలో స్నానం చేసి, మధువనంలో శ్రీహరికి అభిషేకం చేసి గంధాక్షలతో, పుష్పాలతో పూజించాడు. వ్రత ఉద్యాపన చేసి ఉపవాస దీక్ష ముగించాలి.


బ్రాహ్మణులకు గోదానం చేసి బ్రాహ్మణ సమారాధన చేసిన తరువాత అంబరీషుడు ఉపవాస దీక్ష విరమించడానికి సిద్దమైయ్యాడు. ఆ సమయానికి ఈశ్వరాంశ సంభూతుడు, మహా తపస్వి, మహా క్రోధి అయిన దూర్వాస మహర్షి అంబరీషుడి వద్దకువచ్చాడు. మహర్షికి స్వాగతం పలికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి ఉన్నతాసనం ఏర్పాటు చేశాడు. ద్వాదశి వ్రత పారణ లో తనతోటి భోజనం చేయవలసిందిగా కోరాడు. దూర్వాస మహర్షి అంగీకరించి నదికి వెళ్లి స్నాన సంధ్యాదులు ముగించి వస్తానని వెళ్లాడు. నదికి వెళ్లిన మహర్షి ఎంతకి రాలేదు. అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఏకాదశి ఉపవాసానంతరం ద్వాదశీ ఘడియలు ముగియక ముందే భోజనం (పారణ) చేసి ముగించ వలసి ఉంటుంది.


అతిథి అయిన దూర్వాస మహర్షి రాకుండ భోజనం చేస్తే మహర్షికి ఆగ్రహంవస్తుంది. సమయం లోపల మహర్షి రాకపోతే సంవత్సరo పాటు చేసిన ద్వాదశి వ్రతం వ్యర్ధమవుతుంది. సమయం ముగియటానికి అర్థ ముహుర్త కాలం మాత్రమే ఉండటంతో అంబరీషుడు పండితులను పిలిచి తన ధర్మ సంకటం వివరించి ఏమి చేయాలో చెప్పమని అడిగాడు.


శాస్త్రం తెలిసిన పండితులు ఆలోచించి "ఆహ్వానించిన అతిథి రాకుండా భోజనం చేయకూడదు. ద్వాదశి ఘడియలు దాటితే వ్రత భంగం అవుతుంది. మధ్యమార్గంగా ద్వాదశి ఉండగానే మీరు జలభక్షణ (జలము స్వీకరణ) చేస్తే వ్రతభంగం కాదు. భోజనం కాదు గనుక అతిథిని అగౌరవించినట్టు కాదు. ద్వాదశి వ్రత పారణ దక్కుతుంది" అని ఉపాయం చెప్పారు.


అంబరీషుడు ఆ మాటలను విష్ణువు ఆదేశంగా భావించి కొద్దిగా జలము స్వీకరించి మహర్షి కోసం నిరీక్షించసాగాడు. 


దూర్వాస మహర్షి నది నుంచి వచ్చాడు. జరిగింది తన దివ్య దృష్టితో గ్రహించి తను రాకుండానే జలభక్షణ చేసిన అంబరీషుని పై ఆగ్రహించాడు.

“అంబరీషా! అతిథిగా నన్ను భోజనానికి పిలిచి వేచి చూడకుండానే జలభక్షణ చేశావు. ఇంత గర్వము, అహంకారం ఉన్న నీవు విష్ణుభక్తుడివి, ధర్మపాలకుడివి కాదు. తగిన శిక్ష విధిస్తాను” అంటూ తన జడలలో ఒకటి పెరికి మంత్రించి భూమి పై విసిరాడు. అది కృత్య అనే మహారాక్షసిగా మారి అంబరీషుడి పైకి తినడానికి రాసాగింది.


ప్రజలందరు హాహాకారాలు చేస్తున్నా అంబరీషుడు కన్నులు మూసుకుని చేతులు జోడించి విష్ణునామం ధ్యానం చేస్తూ నిలిచాడు. 


వైకుంఠవాసుడైన శ్రీహరి గ్రహించి భక్తునికి రక్షణగా సుదర్శన చక్రం ప్రయోగించాడు. అగ్నిజ్వాలలు చిమ్ముతూ వచ్చిన సుదర్శన చక్రం కృత్య రాక్షసిని భస్మం చేసింది. తరువాత రాక్షసిని ప్రయోగించిన దూర్వాస మహర్షిని శిక్షించడానికి వెంట పడింది.


దూర్వాస మహర్షి సుదర్శన చక్రం నుంచి తప్పించుకోవడానికి మేరు పర్వత గుహలలోకి వెళ్లి దాక్కున్నాడు. అయినా సుదర్శన చక్రం వెంట పడటం మానలేదు. మహర్షి ఎక్కడికి వెళ్లినా అక్కడికి వెంట వస్తోంది. సత్యలోకంలో బ్రహ్మ దగ్గరకు వెళ్లి చక్రం నుంచి రక్షించమని ప్రార్ధించగా బ్రహ్మ “దేవదేవుని సుదర్శన చక్రాన్ని ఆపే శక్తి నాకు గానీ, ఇంద్రాది దేవతలకు గానీ లేదు” అని చెప్పాడు.


వెంటనే దూర్వాస మహర్షి తన పుట్టుకకు కారణమైన పరమేశ్వరుడి వద్దకు వెళ్లి సుదర్శన చక్రం నుంచి తనను రక్షించమని ప్రార్ధించాడు. శివుడు "సుదర్శనాన్ని ఆపడం దానికి స్వామి అయిన మహావిష్ణువు వలనే అవుతుంది” అని విష్ణువు వద్దకు వెళ్ళమన్నాడు.  


సుదర్శనం వెంట వస్తుండగా దూర్వాస మహర్షి వైకుంఠంలో శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్లాడు. సుదర్శనం ద్వారం వద్ద ఆగి వేచి చూస్తోంది.


శ్రీహరి పాదాలకు ప్రణమిల్లి దూర్వాస మహర్షి "నారాయణా! నీ సుదర్శనం నుంచి నీవే కాపాడగలవు. నా తప్పు మన్నించి రక్షింపుము” అని ప్రార్ధించాడు. 


మహావిష్ణువు మందహాసంతో “మహర్షీ! నేను నా భక్తుల హృదయంలో బందీ అయ్యి ఉంటాను. అంబరీషుడి రక్షణ కోసం నియమింపబడిన సుదర్శనం ఆ భక్తుడు చెబితేనే వింటుంది.


అంబరీషుడు మహా భక్తుడు, ధార్మికుడు. ఎవరికీ హాని తలపెట్టని వాడు. అటువంటి మహాభక్తునికి ఆపద తలపెట్టి నీవు ఆపదలో చిక్కుకున్నావు. నిన్ను సుదర్శన చక్రం శిక్షించ కుండా ఉండాలంటే అంబరీషుని శరణు వేడి క్షమించమని కోరుము. అతను మాత్రమే నిన్ను కాపాడగలడు” అని చెప్పి పంపాడు.


దూర్వాస మహర్షి సుదర్శన చక్రం తరుముతుంటే అంబరీషుడి వద్దకు వచ్చి శరణు కోరి “అంబరీష చక్రవర్తీ! నా తప్పును మన్నించి నన్ను సుదర్శన చక్రం నుండి రక్షించుము” అని ప్రార్ధించాడు. 


మహర్షి తన పాదాల పై పడినందుకు అంబరీషుడు బాధపడి ఆయనను లేపి ఉచితాసనుని చేశాడు. సుదర్శన చక్రానికి నమస్కరించి

“చక్రరాజమా! శ్రీహరి ఆదేశంతో నీవు భక్తులను రక్షిస్తూ దుష్టులను శిక్షిస్తావు. దూర్వాస మహర్షి దుష్టుడు కాదు మహాతపస్వి. శివాంశ సంభూతులు. క్షణిక ఆగ్రహంలో తప్పు చేశారు. సహృదయంతో మన్నించి ఆయనను శిక్షించకుండా వదిలి వేయుము” అని ప్రార్ధించడంతో సుదర్శన చక్రం శాంతించి అదృశ్యమయ్యింది.


దుర్వాస మహర్షి అంబరీషుడి ఆతిథ్యం స్వీకరించి దీవించి వెళ్లి పోయాడు. 


రాజర్షి అయిన అంబరీషుడికి ముగ్గురు పుత్రులు కలిగారు. పెద్దవాడైన విరూపునికి రాజ్యం అప్పగించి అంబరీషుడు ధర్మపత్నితో వానప్రస్థానికి వెళ్లి పోయాడు. తపస్సుతో శ్రీహరిని మెప్పించి వైకుంఠప్రాప్తిపొందాడు. చిన్నవారైన కేశుమంతుడు, శుంభుడు తండ్రి వలెనే విష్ణు భక్తులై తపస్సుకి వెళ్లారు. 


విరూపుని వంశంలోని రథీతరుడి సంతతి వారు బ్రాహ్మణులై రథీతరగోత్రులుగా ప్రసిద్ధి చెందారు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

శ్రీ హనుమాన్ చాలీసా🍁*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

     *మంగళవారం 19 మే 2026*


 *🙏శ్రీ హనుమాన్ చాలీసా🍁*

*🍁 జ్ఞాన యజ్ఞం - 15వ రోజు🍁*


గత చౌపాయిలో శ్రీరామచంద్రుడు హనుమంతుని తన సోదరుడైన భరతునితో సమానంగా గౌరవించడం చూశాం. ఆ క్రమంలోనే రాముడు హనుమను అక్కున చేర్చుకుని, ఆయన కీర్తిని ఇంకా ఎలా కొనియాడారో ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడి నుంచి వచ్చే మూడు నాలుగు చౌపాయి లు హనుమ స్వామిని ఎవరెవరు కీర్తించారు అనే విషయాన్ని చెపుతారు.


         **13వ చౌపాయి**


 **సహస బదన తుమ్హరో జస గావైం |**

 **అస కహి శ్రీపతి కంఠ లగావైం ||**


          **ప్రతిపదార్థం**


       * **సహస బదన** 

     వేయి నోళ్లతో (వేనోళ్లతో)

      * **తుమ్హరో జస** 

  నీ యొక్క కీర్తిని/యశస్సును

           * **గావైం** 

      గానం చేసి (కీర్తించాలి)

           **అస కహి* 

            అని చెబుతూ

            * **శ్రీపతి** 

లక్ష్మీనాథుడైన ఆ శ్రీరామచంద్రుడు

        * **కంఠ లగావైం:** 

హనుమంతుడిని గాఢంగా కౌగిలించుకున్నాడు.


               **వివరణ**


**1. వేనోళ్లతో కీర్తన (శ్రీరాముని ప్రశంస)**


శ్రీరామచంద్రుడు హనుమంతునితో ఇలా అంటున్నాడు.

ముందు చౌపాయి లో చెప్పిన హరషి ఉర లాయే కు కొనసాగింపు ఇది.


కంఠంతో ఆలింగనం చేసుకోవడం అనే ఘట్టంలో రాముడు వెయ్యి నోర్లతో నీ కీరిని గానం చేశాడు. శ్రీపతి అంటే లక్ష్మిపతి రాముడు నారాయణుడు ఆయన నిన్ను ఆలింగనం చేసుకున్నాడు. 'సహసబదన్' సహస్రముఖః సహస్రాక్షః సహస్రకరః ఈయనని కీర్తించడానికి ఒక్క నోరు చాలదేమో వెయ్యి నోళతో నిన్ను కీరించాడంటే అనంతంగా నిన్ను కీరించాడని అర్థం. వేనోళ్ళ పొగడాలి అంటే అర్థం. నిరంతరం పొగడడం బహు విధాలుగా పొగడడం


 "హనుమా! నీవు చేసిన సహాయానికి, నీ భక్తికి నేను ఇచ్చే ఏ ప్రశంస కూడా సరిపోదు. నీ కీర్తిని వర్ణించడానికి ఒక నోరు సరిపోదు అని రాముడు అన్నాడు. అంతే కాదు వేయి నోళ్లు ఉన్నవాడే నీ గుణగణాలను పూర్తిగా గానం చేయగలడు."అని కూడా చెప్పవచ్చు.


అంటే భగవంతుడు తన భక్తుని గొప్పతనాన్ని వేనోళ్లతో కొనియాడే అంతటి ఉన్నత స్థితికి హనుమంతుడు చేరుకున్నాడు.


శ్రీపతి అని చెప్పడంలో మరొక చమత్కారం ఉంది ఆయన కీరించడమే కాదు. ఆవిడ కూడా కీర్తించింది. రామాయణంలో శ్రీ అనే మాట ఎక్కడ వచ్చినా సీతమ్మ అనే అర్థం. 'రామ అంటే నా మంత్రం, శ్రీరామ అంటే సీతారామ మంత్రం' అన్నాడు రాముడు. అందుకే శ్రీరామ జపం చాలా శ్రేష్ఠం.


ఇక్కడ ఇంకొక అర్థాన్ని కూడా చెప్పవచ్చు- 'సహసబదన' అని విడిగా చెప్తే హనుమంతుని సంబోధిస్తూ వేయిముఖములవాడా! అనే అర్థం వస్తుంది. వేయి ముఖాలవాడైనా ఆంజనేయుడా..! నీ కీర్తిని శ్రీపతి కీర్తించి నిన్ను ఆలింగనం చేసుకున్నాడు అనే అర్ధాన్ని కూడా కొందరు వ్యాఖ్యాతలు చెప్పారు.


ఆంజనేయస్వామి బహుముఖాలుగా గోచరిస్తారు. ఆయనకు పంచవదనం. సప్తవదనం. ఏకాదశ వదనం ఉంది. బహు వదనాలు ఉన్నాయి. ఆయన విరాడ్రూపుడు. భీముడంతటి వాడే హనుమ విరాట్ రూపం చూడలేక పోయాడు. స్వామి రూపం ఊహకు అందదు.


సహస బదన్' అన్నప్పుడు బహు ముఖములుగా భాసించిన నీ స్వరూపాన్ని సీతమ్మ, రామచంద్రమూర్తి కీర్తించారు. ఎందుకంటే వారు ఆ స్వరూపాన్ని చూశారు కనుక అని భావించ వచ్చు.


**2. దైవిక ఆలింగనం**


'శ్రీపతి' (విష్ణుస్వరూపుడైన రాముడు) హనుమంతుడిని కౌగిలించుకోవడం అనేది భక్తుడికి లభించే అత్యున్నత పురస్కారం. సేవలో అహంకారం లేనప్పుడు, ఆ యజమానే సేవకుడిని వెతుక్కుంటూ వచ్చి అక్కున చేర్చుకుంటాడని ఈ ఘట్టం నిరూపిస్తుంది.


**తులసీదాసు గారి సందేశం**


మనం చేసే పనిలో నిజాయితీ, నిష్కామ బుద్ధి ఉంటే.. లోకం మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా, సాక్షాత్తు ఆ పరమాత్మే మనల్ని వేనోళ్లతో కీర్తిస్తాడు. భగవంతుని ప్రేమను పొందడానికి కేవలం 'సేవ' మరియు 'శరణాగతి' ఉంటే సరిపోతుందని తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా మనకు తెలియజేశారు.


*జై శ్రీరామ్!జై హనుమాన్!*

        🍁🌹🙏🌷🍁


          *🌷సేకరణ🌷*

      🌹🌷🍁🍁🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🍁🙏🍁🙏🍁🙏🍁🙏

మనభాషలను

 *మనభాషలను మనమే రక్షించుకోవాలి,ప్రభుత్వాలు కూడా రక్షించడం లేదు*

    జనబాహుళ్యంలో *బండి ర* గా పేరొందిన ఆ అక్షరం అసలు పేరు ఏమి టో తెలుసా??? *బండ ర*.

మన *ర* కారాలు(రకారాన్ని సంస్కృత భాషలో రేఫ అంటారు) మూడు రకాలు.

    మొదట ది *సున్నితమైన రకారం...ఋ*. దీనిని సున్నితంగా పలకాలి,

ఉదా:-- ఋషి, కృషి, తృష్ణ, మాతృభాష, పితృదేవతలు....

రెండవ ది *సామాన్య రకారం*. ఇది కొంచెం నొక్కి(బలం గా) పలికేది. ఉదా:-- రాముడు, తరంగాలు, శ్రుతి, శ్రమ,అక్రమ, విక్రమ, ...,

మూడవ ది *బండ ర కారం*. దీని ని బాగా బలం గా/బండగా నొక్కి పలకాలి.

ఉదా:-- కఱ్ఱ, బుఱ్ఱ, నఱ్ఱ,చెఱకు,అఱుగు.....

ఎవరో ఈ బండ ర ను బండి లా ఉండటంతో బండి ర అనడం, తద్వారా సంస్కృత మున కూడా దీనిని శకట రేఫ అని ప్రస్తావించడం జరిగింది. ఇదీ దీని అసలు కథ. 

*అయితే ఈ బండ ఱకారం తెలుగు భాషలో మాత్రమే ఉంది అని ఎంతమంది కి తెలుసో!!!???*

శివభక్తి

 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


          🔱*శివభక్తి*🔱

         

    🌲 *భవిష్య పురాణం* 🌲


✴️ *శివార్చన లేని జన్మ నిరర్థకం* ✴️


❇️ *యేన రానార్చయంతీహ శివం త్రిభువనేశ్వరం| న తే స్వర్గస్య మోక్షస్య రాజ్యస్యాపి న భాజనం||* ❇️


🌻*ఈ లోకంలో త్రిభువనేశ్వరుడైన ఆ పరమశివుడిని ఎవరైతే ఆరాధించరో, వారు స్వర్గానికి గానీ, మోక్షానికి గానీ, కనీసం ఈ లోకంలోని రాజ్య భోగాలకు గానీ అర్హులు కారు.* 


🌻 *అంటే, సకల శుభాలకు మూలం శివారాధన అని భావం.*


🔱 *నియమబద్ధమైన ఆరాధన* 🔱


❇️ *వరం ప్రాణపరిత్యాగః శిరసో వాపి కర్తనం| నత్వ సంపూజ్య భూంజీత భగవంతం త్రిలోచనం||* ❇️


🌻 *ముక్కంటి దేవుడైన ఆ పరమేశ్వరుడిని పూజించకుండా భోజనం చేయకూడదు*. 


♀️ *శివార్చన చేయకుండా తినడం కంటే, ప్రాణాలను వదలడం లేదా శిరచ్ఛేదనం చేసుకోవడం మేలు (ఇది శివారాధన పట్ల ఉండవలసిన నిష్ఠను, పట్టుదలను సూచించే తీవ్రమైన ఉదాహరణ).* ♀️


🔱 *శివభక్తుడే శివుడు* 🔱


❇️ *స్ఫుటం నిర్వహతే యస్య యావజ్జీవం శివార్చనం| మనుష్య చర్మణానద్ధః స రుద్రో నాత్ర సంశయః||* ❇️


🌻 *ఎవడైతే తన జీవితాంతం నిరంతరం శివార్చన చేస్తాడో, వాడు మనుష్య చర్మం ధరించిన సాక్షాత్తు ఆ రుద్రుడే*. 


🌻 *ఇందులో ఎటువంటి సందేహం లేదు. శివభక్తుడు శివస్వరూపమే అని దీని అర్థం.*


🔱 *లింగం అంటే ఏమిటి* 🔱


❇️ *ఆకాశం లింగమిత్యాహుః పృథివీ తస్యపీఠికా| ఆలయః సర్వభూతానాం లయనాల్లింగ ముచ్యతే||* ❇️


🔱*ఆకాశమే లింగం, పృథ్వి (భూమి) దాని పీఠం.* 🔱


🌻*సకల ప్రాణులు దేనియందు లయమవుతాయో (ఐక్యమవుతాయో) దానినే 'లింగం' అంటారు. అంటే అనంతమైన విశ్వమే శివలింగ స్వరూపం.*


🔱 *సర్వదేవతా స్వరూపం* 🔱


❇️ *అర్చాయాం పూజయేద్యోమాం విష్ణుర్భవతి పూజితః| అర్చితా మూర్తయః సర్వాయోమేలింగం సమర్చయేత్||* ❇️


🌻 *శివలింగ రూపంలో నన్ను (శివుడిని) పూజించేవాడు విష్ణువును కూడా పూజించినట్లే.*


🌻 *ఎవరైతే శివలింగాన్ని అర్చిస్తారో, వారు సకల దేవతా మూర్తులను అర్చించినట్లే అవుతుంది.* 


🌻 *శివుని యందే సమస్త దేవతలు కొలువై ఉన్నారని దీని అర్థం.*


🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

18, మే 2026, సోమవారం

అమ్మ "కొంగు"

 జీన్స్‌లో అమ్మ "కొంగు" ఎక్కడ దొరుకుతుంది? 🤔


పాఠశాలలో, ఉపాధ్యాయురాలు విద్యార్థులను "అమ్మ కొంగు" పై ఒక వ్యాసం రాయమని అడిగారు.

ఒక విద్యార్థి రాసిన విషయం ఎంత హృదయానికి హత్తుకునేలా ఉందంటే, అది మీ మనసును భావోద్వేగాలతో నింపేస్తుంది... 😭


గౌరవనీయ ఉపాధ్యాయురాలీ,


అమ్మ కొంగు కేవలం ఒక వస్త్రపు ముక్క మాత్రమే కాదు; అది అమ్మ యొక్క గౌరవం మరియు ఔన్నత్యం.


పొయ్యి మీద ఉన్న వేడి పాత్రలను దించడానికి అమ్మ కొంగునే ఉపయోగించేవారు.


అది పిల్లల చెమటను, కన్నీళ్లను తుడిచేది; మురికి పట్టిన ముఖాలను, చెవులను, చిట్టి చేతులను శుభ్రం చేసేది.


భోజనం చేసిన తర్వాత, అమ్మ కొంగుతో మా ముఖాలను తుడిపించుకోవడంలో ఒక ప్రత్యేకమైన హాయి ఉండేది.


మా కళ్ళలో ఏదైనా పడినప్పుడు, అమ్మ కొంగును మెలివేసి, తన ఊపిరితో దాన్ని మెల్లగా వెచ్చబరిచి, కంటిపై ఉంచేది — ఎందుకో తెలియదు గానీ, ఆ నొప్పి వెంటనే మాయమైపోయేది.


అమ్మ ఒడిలో నిద్రించే పిల్లలకు, ఆమె ఒడి మృదువైన పడకగా, ఆమె కొంగు హాయినిచ్చే దుప్పటిగా మారేది.


ఇంట్లోకి ఎవరైనా కొత్తవారు వచ్చినప్పుడు, పిల్లలు భద్రత కోసం అమ్మ కొంగు వెనుక దాక్కునేవారు.


పిల్లలకు సిగ్గు అనిపించినప్పుడు, వారు అమ్మ కొంగుతో తమ ముఖాన్ని కప్పుకునేవారు.


పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు, వారు అమ్మ కొంగును పట్టుకునేవారు; అది వారికి మార్గదర్శిగా, రక్షణ కవచంగా నిలిచేది.


పిల్లలు అమ్మ కొంగును పట్టుకుని ఉన్నంత సేపు, ఈ ప్రపంచమంతా తమ చేతిలోనే సురక్షితంగా ఉన్నట్లు వారికి అనిపించేది.


చలికాలంలో, చలి నుండి రక్షించడానికి అమ్మ తన కొంగుతో పిల్లలను నలువైపులా చుట్టేసేది.


మరియు భారీ వర్షం కురిసినప్పుడు, అదే కొంగు గొడుగులా మారి పిల్లల ముఖాన్ని కప్పేది.


చేతులు తుడుచుకోవడానికి అమ్మ కొంగును తువ్వాలులా కూడా ఉపయోగించేవారు.


చెట్ల కింద రాలిన పూలను, పండ్లను సేకరించి అందులోనే మోసుకొచ్చేది.


కొన్నిసార్లు, ధాన్యాన్ని, నైవేద్యాన్ని లేదా ప్రసాదాన్ని అందులోనే సేకరించేవారు.


ఇంటి సామాన్లను దుమ్ము దులపడానికి, శుభ్రం చేయడానికి కూడా దాన్ని ఉపయోగించేవారు.


ఏదైనా వస్తువు పోయినప్పుడు, అది త్వరలోనే దొరుకుతుందని నమ్మి అమ్మ తన కొంగుకు ఒక ముడి వేసేది — వింతగా అనిపించినా, అది సాధారణంగా దొరికిపోయేదే.


అమ్మ కొంగులోని ఆ ముడి ఒక కదిలే బ్యాంకు లేదా లాకర్ లాంటిది; పిల్లల అదృష్టం బాగుంటే, అందులో దాగి ఉన్న కొన్ని నాణేలు మాయాజాలంలా బయటపడేవి కూడా. అమ్మ చీర కొంగు కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు — అది ఒక అద్భుతమైన అనుభూతి, ఒక భావోద్వేగం, ఒక ఆశ్రయం, మరియు ప్రేమతో నిండిన ఒక ప్రపంచం.


నేటి తరం ఆ కొంగులోని వెచ్చదనాన్ని, దాని లోతైన అర్థాన్ని బహుశా ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు.

ఇప్పుడు పిల్లలకు ఆ అవకాశం లేదు అంతా నైటి ప్రపంచం.మరియు

ఇప్పుడు, అమ్మలు జీన్స్ ధరిస్తున్న ఈ రోజుల్లో...

మరి ఆ "కొంగు" ఎక్కడి నుండి వస్తుంది?


🙏 ప్రేమను, వెచ్చదనాన్ని, త్యాగాన్ని మరియు బాల్యపు లెక్కలేనన్ని మధుర స్మృతులను తనలో మోసుకున్న ప్రతి అమ్మ చీర కొంగుకు ఈ నివాళి. 🙏

18-05-2026 సోమవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

18-05-2026 సోమవారం రాశి ఫలితాలు


మేషం


పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు. గృహమున సొంత ఆలోచనలు అమలు చేస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.  

--------------------------------------- 


వృషభం


బంధువులతో అకారణ మాట పట్టింపులు ఉంటాయి. విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

---------------------------------------


మిధునం


బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.

---------------------------------------


కర్కాటకం


సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగుతారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. 

---------------------------------------


సింహం


ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో అవరోధాలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

---------------------------------------


కన్య


ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన శిరో బాధలు తప్పవు. వ్యాపారాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సంతానం విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది.

---------------------------------------


తుల


సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారస్థులు నూతన పెట్టుబడులు అందుకుంటారు. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.  

---------------------------------------


వృశ్చికం


భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించినట్టు అవకాశాలు లభిస్తాయి. 

---------------------------------------


ధనస్సు


స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సన్నిహితుల మీ మాటతో విబేదిస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని రంగాల వారికి సమస్యలు తప్పవు.

---------------------------------------


మకరం


చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగుల యత్నాలు నిరాశ కలిగిస్తాయి.

---------------------------------------


కుంభం


భూవివాదాల పరిష్కారమౌతాయి. వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహంకాలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------


మీనం

 

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విద్యార్థుల విదేశీ యత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. వ్యాపారమున భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

---------------------------------------

పంచాంగం

  🕉️


*పురుషోత్తమ/మల/అధికమాస మహాత్మ్యము*


భారతీయ కాలగణన (పంచాంగం) ప్రకారం చంద్రమానానికి, సౌరమానానికి మధ్య గల వ్యత్యాసాన్ని సరిచేయడానికి ప్రతి 32 నెలల 16 రోజులకు ఒకసారి అధిక మాసం వస్తుంది. జ్యేష్ఠ మాసంలో ఈ అధిక మాసం సంభవించినప్పుడు దానిని అధిక జ్యేష్ఠ మాసం అంటారు. పురాణాలు, స్మృతులు, ధర్మశాస్త్ర సూత్రాల ప్రకారం దీనికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. దీనినే "పురుషోత్తమ మాసం" అని కూడా పిలుస్తారు.

చంద్రమాన సంవత్సరానికి (354 రోజులు), సౌరమాన సంవత్సరానికి (365 రోజులు) మధ్య దాదాపు 11 రోజుల వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసం సరిగ్గా 33 మాసాలకు (దాదాపు 2 సంవత్సరాల 8 నెలల 16 రోజులకు) ఒక పూర్తి మాసంగా (30 రోజులుగా) మారుతుంది.


కాలచక్రంలో ఈ 'అధిక మాసం' ఏర్పడటానికి పట్టే కాలం 33 నెలలు. ఈ కాలగణన సూత్రానికి ప్రతీకగా కూడా వ్రత విధానంలో 33 సంఖ్యను నిర్దేశించారు.


అధిక మాసానికి అధిపతి లేకపోవడం వల్ల దీనిని అందరూ శుభకార్యాలకు వర్జ్యమని భావించి 'మల మాసం' అని పిలిచేవారు. అప్పుడు ఆ మాసం బాధపడి మహావిష్ణువును ఆశ్రయించగా, స్వామి అనుగ్రహించి, తన పేరైన "పురుషోత్తమ" నామధేయాన్ని దానికి ఇచ్చి, అన్ని మాసాల కంటే శ్రేష్ఠమైనదిగా మార్చాడని పద్మ పురాణ వచనం.


అహం చైవ యథా లోకే

పురుషోత్తమ ఇత్యుతే |

తథాయమపి లోకేషు

పురుషోత్తమ నామకః ||

మత్స సాదృశ్యమగమత్

మాసానామధిపో భవత్ |

జగత్పూజ్యో జగద్వంద్యో

మాసోఽయం చ భవిష్యతి ||

"లోకంలో నేను ఏ విధంగా 'పురుషోత్తముడు' అని పిలవబడుతున్నానో, అదే విధంగా ఈ మాసం కూడా లోకంలో 'పురుషోత్తమ మాసం' అని పిలవబడుతుంది. ఇది నా సారూప్యతను పొంది, అన్ని మాసములకు అధిపతియై, జగత్తు చేత పూజింపబడుతుంది.


మాసానాం ప్రవరో మాసః

పురుషోత్తమ సంజ్ఞకః |

అస్మిన్ మాసే కృతం పుణ్యం

కోటికోటి గుణం భవేత్ ||

( స్కాంద పురాణం)

మాసాలన్నింటిలోనూ పురుషోత్తమ మాసం అత్యంత శ్రేష్ఠమైనది. ఈ మాసంలో ఆచరించే ఏ పుణ్యకార్యమైనా (దానం, జపం, తపస్సు) కోట్లాది రెట్ల ఫలితాన్ని ఇస్తుంది.


యాదృశీ జాహ్నవీ గంగా 

సరితాం ప్రవరా స్మృతా |

తాదృశః సర్వమాసానాం 

ప్రవరో జ్యేష్ఠాఽధికో నృప ||

(నారద పురాణము)

నదులన్నింటిలోనూ గంగానది ఎంత శ్రేష్ఠమైనదో, చాంద్రమాన మాసాలన్నింటిలోనూ ఈ 'అధిక జ్యేష్ఠ మాసం' అంత శ్రేష్ఠమైనది." గంగలో స్నానం చేస్తే ఎలాంటి పాపాలు తొలగిపోతాయో, ఈ మాసంలో విష్ణు నామ స్మరణ చేయడం వల్ల అంతటి అంతఃశుద్ధి కలుగుతుంది.


మాసోఽయమధికో రాజన్

పురుషోత్తమ ఉచ్యతే |

అస్మిన్ కాలాచ్యుతం నత్వా

పునర్భవం న విందతి ||

ఈ అధిక మాసము సాక్షాత్తూ పురుషోత్తమ స్వరూపము. ఈ కాలంలో అచ్యుతుడైన ఆ శ్రీమహావిష్ణువును భక్తితో అర్చించి, నమస్కరించిన మానవుడు మరల జన్మ మృత్యు సంసార చక్రంలో పడకుండా మోక్షాన్ని పొందుతాడు.


గంగా సరస్వతీ రేవా 

యమునా చ ప్రయాగకా |

తాసాం స్నానాచ్చ యత్పుణ్యం

తదస్మిన్ మాస సేవయా ||

(బృహన్నారదీయ పురాణం)

గంగ, సరస్వతి, నర్మద (రేవ), యమున మరియు ప్రయాగ వంటి పవిత్ర తీర్థాలలో స్నానం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం లభిస్తుందో, ఈ పురుషోత్తమ మాసంలో నియమ పూర్వకంగా భగవత్ సేవ చేయడం వల్ల అంతటి పుణ్యఫలం లభిస్తుంది.


దేవదేవ జగన్నాథ

ప్రణతార్తివినాశన |

జ్యేష్ఠాఽధికే మయా దత్తం

గృహాణార్ఘ్యం నమోఽస్తుతే ||💧

అని భగవంతుడికి నిత్య‌ అర్ఘ్యం సమర్పించడం.


వాపీకూపతటాగాది 

ప్రతిష్ఠా యజ్ఞకర్మ చ |

మాంగల్యాని చ కర్మాణి 

మలమాసే వివర్జయేత్ ||

(నారద స్మృతి)

బావులు, చెరువులు తవ్వించడం, దేవాలయ ప్రతిష్ఠలు, యజ్ఞ యాగాలు, వివాహము, ఉపనయనము, గృహప్రవేశము, చౌలము (పుట్టువెంట్రుకలు తీయుట) వంటి మాంగల్య (శుభ) కార్యాలను మలమాసంలో/అధిక మాసంలో విడిచిపెట్టాలి.


నిత్యాని నైమిత్తికాని

ప్రకుర్యాదధికేఽపి చ |

కామ్యాని తు న కుర్వీత

 ప్రతిష్ఠాదీని కాన్యచిత్ ||

(స్మృతి కౌస్తుభం)

అధిక మాసము వచ్చినప్పటికీ నిత్య కర్మలను (సంధ్యావందనాది అనుష్ఠానాలు), నైమిత్తిక కర్మలను (గ్రహణ స్నానాలు, శ్రాద్ధాలు, తప్పనిసరి విధులు) యథావిధిగా ఆచరించాలి. కానీ, కామ్య కర్మలను (కోర్కెలు కోరుతూ చేసే యజ్ఞాలు, వ్రతాలు) మరియు దేవతా ప్రతిష్ఠలు, నూతన గృహారంభాలు వంటి వాటిని మాత్రం అస్సలు చేయకూడదు.


లౌకిక శుభకార్యాలు లేకపోవడం వల్ల మానవునికి సంసార పరమైన బాధ్యతల నుండి కొంత మానసిక విరామం దొరుకుతుంది. ఈ సమయాన్ని దైవచింతనలో, గ్రంథ పఠనంలో గడపడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

అధిక మాసంలో చేసే పూజలు కేవలం "శ్రీ పురుషోత్తమ ప్రీత్యర్థం" (భగవంతుని సంతోషం కోసం మరియు ఆత్మశుద్ధి కోసం) మాత్రమే చేస్తారు. ఇది మానవుడిని స్వార్థం నుండి నిష్కామ స్థితికి తీసుకెళ్తుంది.


జీవతో వా మృతస్యాపి 

యా గతిః పురుషోత్తమే |

న సా క్రతుసహస్రేణ 

లభ్యతే నృపసత్తమ ||

( నారద పురాణం)

పురుషోత్తమ మాసంలో జీవించి ఉన్నవారికి మాత్రమే కాదు, మరణించిన పితృదేవతల పేరిట చేసే పుణ్యకార్యాల వల్ల వారికి లభించే సద్గతి, వేయి యజ్ఞాలు చేసినా లభించదు. ఈ మాసంలో పితృదేవతలను తలుచుకుని దానాలు చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది.


యైర్న పూజిత ఈశానో 

మాసి పురుషోత్తమే |

దరిద్రా భవంతి తే నూనం

జన్మజన్మని మానవాః ||

(పద్మ పురాణము)

ఎవరైతే ఈ పరమ పవిత్రమైన పురుషోత్తమ మాసంలో జగదీశ్వరుడైన శ్రీహరిని పూజించకుండా, దానధర్మాలు చేయకుండా కాలం గడుపుతారో, వారు జన్మజన్మలందు దరిద్రాన్ని అనుభవిస్తారు. అంటే ఈ మాసంలో చేసే కొద్దిపాటి పూజ అయినా దరిద్ర నాశనం అవుతుంది.


ఏకభక్తేన నక్తేన తథైవాయాచితేన చ |

ఉపవాసేన కర్తవ్యో మలమాసః ప్రయత్నతః ||

అధిక మాస వ్రతాన్ని ఆచరించే శక్తులు గలవారు నెల రోజులు ఉపవాసం ఉండాలి. అది సాధ్యం కాని పక్షంలో రోజుకు ఒక పూట మాత్రమే భుజించడం (ఏకభుక్తం), లేదా రాత్రి వేళ మాత్రమే భుజించడం (నక్తం), లేదా అడగకుండా లభించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం (అయాచితం) అనే నియమాల ద్వారా ఈ మాసాన్ని భక్తి శ్రద్ధలతో గడపాలి.


అధిక మాసములో

ఉపవాసము, 

ఏకభుక్తము,

నక్త వ్రతము,

అయాచితము‌,

ధారణ పారణ వ్రతం, 

విష్ణుపంచక వ్రతము,

అలవణ వ్రతము,

లక్ష ప్రదక్షిణము, 

అయాచిత వ్రతము,

లక్ష వత్తుల వ్రతము,

దీప నమస్కారము,

లక్ష పుష్పార్చన,

అథఃశయనము,

మౌనవ్రతము,

ఇవన్నీ భగవత్ ప్రీతికరమైనందున

చేయవలెను. 


మలమాసే గతే ప్రాప్తే 

హరిముద్దిశ్య భక్తితః |

త్రయస్త్రింశదపూపానాం 

దానం కుర్యాద్విధానతః ||

కాంస్యపాత్రే నిధాయైతాన్

ఫలతాంబూల సంయుతాన్ |

దద్యాద్విప్రాయ శాంతాయ

పురుషోత్తమ తుష్టయే ||


33 అపూపాలను

(అరిసెలు) పళ్ళు, వెండి,

బంగారము మొదలగు దానాలు

బ్రాహ్మణ సువాసినీలకు భోజనము

వాయనాల దానాలు

నిష్కామముగా చేసినచో విశేష

ఫలము లభించును


అధిక మాసములో 33 దేవతలను

వారి అంతర్యామి 33

భగవద్రూపాలను ఆరాధించాలి.

12 ఆదిత్యులు, 

11 రుద్రులు, 

8 వసువులు, 

2 అశ్విని దేవతలు.

వీరిని అపూపాలలో ఆవాహన చేసి పూజించి దానము చేయాలి.


బ్రహ్మాండాన్ని దానం చేసే శక్తి

మానవునికి సాధ్యము కాదు.

పురుషోత్తమ మాసములో ఇది

సాధ్యము. 33, అరిసలను ఒక

కంచు పాత్రలో పెట్టి ఇంకొక కంచు

పాత్రను మూసిపెట్టి దానము

చేసినవారికి బ్రహ్మాండ దాన 

ఫలము నిశ్చయముగా లభిస్తుంది.


కాంస్యపాత్రం సమాదాయ 

తస్మిన్ పూపాన్ నిధాయ చ |

బ్రాహ్మణాయ ప్రదాతవ్యం

సర్వపాప విముక్తయే ||

​సువర్ణ లేదా కంచు పాత్రను (తామ్ర/కాంస్య పాత్ర) తీసుకుని, అందులో నెయ్యితో వండిన అప్పాలను (అరిసెలను) ఉంచి, సర్వ పాపాల నుండి విముక్తి కలగడం కోసం ఉత్తముడైన బ్రాహ్మణునికి దానంగా సమర్పించాలి.


(అపూప దాన శ్లోకం)

విష్ణురూపీ సహస్రాంశుః

సర్వపాపప్రణాశనః |

అపూపాన్న ప్రదానేన 

మమ పాపం వ్యపోహతు ||

సహస్ర కిరణాలు కలిగిన, సర్వ పాపాలను నాశనం చేసే విష్ణు స్వరూపుడైన ఓ పురుషోత్తమా! నేను సమర్పిస్తున్న ఈ అపూప (అరిసెల) దానం వల్ల నా పాపాలన్నీ తొలగిపోవు గాక.


అరిసెలు గుండ్రంగా ఉంటాయి. ఇది సూర్య మరియు చంద్ర బింబాలకు ప్రతీక. అధిక మాసం అనేది సూర్య, చంద్రుల గమనాల వ్యత్యాసం వల్ల (సౌర, చాంద్ర మానాల సమన్వయం) ఏర్పడేది కాబట్టి, ఈ గ్రహాల అనుగ్రహం కోసం వాటి రూపంలో ఉన్న అపూపాన్ని దానం చేస్తారు. నెయ్యిలో వేయించినప్పుడు అరిసెపై వచ్చే చిన్న చిన్న రంధ్రాలు లేదా దాని రూపం సూర్యుని సహస్ర కిరణాలకు (రశ్మి) సంకేతంగా భావిస్తారు.


*అధిక మాసం లో విశేష దానాలు*


అధిక మాసం సంపూర్ణముగా

ముగిసేంత వరకూ తాంబూల

దానం, బ్రాహ్మణ దంపతులకు

చేసినచో దౌర్భాగ్యము నశించి

సౌభాగ్య ప్రాప్తి కలుగును. ఒక నెల

ఆఖండ దీపము శాంతము

కాకుండా దీపారాధన చేయుట

వలన అంధకారము నశించి

జీవితము ప్రకాశవంతమై జ్ఞాన ప్రాప్తి

కలుగును. సువాసినీ స్త్రీలు 33

వాయన దానాలు చేయుట వలన

వంశాభివృద్ధి మరియు దీర్ఘ

సౌమంగల్యము సిద్ధించును.

ఇదేవిధముగా అనేక దానాలు

చేయవచ్చు. 33 సంఖ్య అని

చెప్పినది 33 కన్న తక్కువ

కారాదన్న అభిప్రాయముతో

చెప్పినదని తెలుసుకొనవలెను.

అధికమాసములో శ్రీమద్భాగవత

శ్రవణము చేయుటవలన

పురుషోత్తముని అనుగ్రహము

విశేషముగా లభించును.


*అధికమాసములో నిషిద్ధ కార్యములు*


అనిత్యమనిమిత్తంచ దానం మహాదానం|

ఆగ్య్నధానాధ్యరాపూర్వతీర్థయాత్రామరేక్షణం||

దేవారామతటాకాదిప్రతిష్టాం మౌంజి బంధనం |

ఆశ్రమ స్వీకృతం కామ్యపృషోత్వర్గంచ నిప్క్రమం||

రాజ్యాభిషేకం ప్రథమం చూడాకర్మ ప్రతానిచ| 

అన్నప్రాశన మారంభం గృహాణాం చ ప్రవేశనం||

స్నానం వివాహం నామాతిపన్నం దేవమహోత్సవం | వ్రతారంభం సమాప్తిం చ కామ్యకర్మచ పాప్మనాం I|

 ప్రాయశ్చిత్తం చ సర్వ స్యమల మాసే వర్జయేత్|| - 

(బృహస్పతిః- స్ర్మతి ముక్తావళి)


మహా దానములు, 

అగ్నాధానము, 

యజ్ఞము, 

ఉద్యానవనముల నిర్మాణము,

చెరువుల నిర్మాణము,

ఉపనయనము, 

సన్యాస స్వీకారము, 

జ్యోతిష్టోమాది కామ్యకర్మలు,

పసిపిల్లలను మొదటి సారి ఇంటి

నుండి బయటకు తీసుకువెళ్ళుట,

పట్టాభిషేక కార్యము, 

చౌలము, 

విశేష వ్రతాలు, 

అన్నప్రాశనము, 

గృహారంభము, 

గృహప్రవేశము, 

విశేష తీర్థస్నానము,

వివాహము, 

నామకరణము,

ప్రాయశ్చిత్త హోమాలు,

ఈ కార్యములను అధికమాసములో

చేయకూడదు.


పురుషోత్తమస్య మాసే తు

దీపదానం కరోతి యః |

ఘృతేన వాపి తైలేన తస్య

పుణ్యమనంతకమ్ |

పురుషోత్తమ మాసంలో ఎవరైతే ఆవు నెయ్యితో గానీ, లేదా నువ్వుల నూనెతో గానీ భగవంతుని సన్నిధిలో దీప దానం (దీపారాధన చేసి సమర్పించడం) చేస్తారో, వారికి అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. వారి వంశంలోని పితృదేవతలకు కూడా సద్గతులు కలుగుతాయి.


నెల రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం విష్ణు సన్నిధిలో లేదా తులసి కోట వద్ద అఖండ దీపం లేదా నిత్య దీపారాధన చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.


ఈమాసంలో సూర్యుడి తాపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో విష్ణువుకు జలాభిషేకం చేయడం, పురుష సూక్తం, విష్ణు సహస్రనామ స్తోత్రాలు పఠించడం వలన మనశ్శాంతిని ఇస్తుంది.


సాధ్యమైనంత వరకు నదీ స్నానం చేయడం, నెలలో కనీసం ఒక రోజైనా (ముఖ్యంగా ఏకాదశి నాడు) ఉపవాసం ఉండి పురుషోత్తముడిని పూజించడం శాస్త్ర సమ్మతం.


అధిక మాసం అనేది లౌకిక శుభకార్యాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక ఎదుగుదలకు, పూర్వ జన్మ పాప పరిహారానికి, అక్షయ పుణ్య సంపాదనకు లభించిన ఒక అద్భుతమైన ‌"అదనపు" సమయం లాంటిది. ధర్మశాస్త్రాల ప్రకారం దీనిని భక్తి శ్రద్ధలతో వినియోగించుకోవడం ఉత్తమం.

🕉️


*పురుషోత్తమ/మల/అధికమాస మహాత్మ్యము*


భారతీయ కాలగణన (పంచాంగం) ప్రకారం చంద్రమానానికి, సౌరమానానికి మధ్య గల వ్యత్యాసాన్ని సరిచేయడానికి ప్రతి 32 నెలల 16 రోజులకు ఒకసారి అధిక మాసం వస్తుంది. జ్యేష్ఠ మాసంలో ఈ అధిక మాసం సంభవించినప్పుడు దానిని అధిక జ్యేష్ఠ మాసం అంటారు. పురాణాలు, స్మృతులు, ధర్మశాస్త్ర సూత్రాల ప్రకారం దీనికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. దీనినే "పురుషోత్తమ మాసం" అని కూడా పిలుస్తారు.

చంద్రమాన సంవత్సరానికి (354 రోజులు), సౌరమాన సంవత్సరానికి (365 రోజులు) మధ్య దాదాపు 11 రోజుల వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసం సరిగ్గా 33 మాసాలకు (దాదాపు 2 సంవత్సరాల 8 నెలల 16 రోజులకు) ఒక పూర్తి మాసంగా (30 రోజులుగా) మారుతుంది.


కాలచక్రంలో ఈ 'అధిక మాసం' ఏర్పడటానికి పట్టే కాలం 33 నెలలు. ఈ కాలగణన సూత్రానికి ప్రతీకగా కూడా వ్రత విధానంలో 33 సంఖ్యను నిర్దేశించారు.


అధిక మాసానికి అధిపతి లేకపోవడం వల్ల దీనిని అందరూ శుభకార్యాలకు వర్జ్యమని భావించి 'మల మాసం' అని పిలిచేవారు. అప్పుడు ఆ మాసం బాధపడి మహావిష్ణువును ఆశ్రయించగా, స్వామి అనుగ్రహించి, తన పేరైన "పురుషోత్తమ" నామధేయాన్ని దానికి ఇచ్చి, అన్ని మాసాల కంటే శ్రేష్ఠమైనదిగా మార్చాడని పద్మ పురాణ వచనం.


అహం చైవ యథా లోకే

పురుషోత్తమ ఇత్యుతే |

తథాయమపి లోకేషు

పురుషోత్తమ నామకః ||

మత్స సాదృశ్యమగమత్

మాసానామధిపో భవత్ |

జగత్పూజ్యో జగద్వంద్యో

మాసోఽయం చ భవిష్యతి ||

"లోకంలో నేను ఏ విధంగా 'పురుషోత్తముడు' అని పిలవబడుతున్నానో, అదే విధంగా ఈ మాసం కూడా లోకంలో 'పురుషోత్తమ మాసం' అని పిలవబడుతుంది. ఇది నా సారూప్యతను పొంది, అన్ని మాసములకు అధిపతియై, జగత్తు చేత పూజింపబడుతుంది.


మాసానాం ప్రవరో మాసః

పురుషోత్తమ సంజ్ఞకః |

అస్మిన్ మాసే కృతం పుణ్యం

కోటికోటి గుణం భవేత్ ||

( స్కాంద పురాణం)

మాసాలన్నింటిలోనూ పురుషోత్తమ మాసం అత్యంత శ్రేష్ఠమైనది. ఈ మాసంలో ఆచరించే ఏ పుణ్యకార్యమైనా (దానం, జపం, తపస్సు) కోట్లాది రెట్ల ఫలితాన్ని ఇస్తుంది.


యాదృశీ జాహ్నవీ గంగా 

సరితాం ప్రవరా స్మృతా |

తాదృశః సర్వమాసానాం 

ప్రవరో జ్యేష్ఠాఽధికో నృప ||

(నారద పురాణము)

నదులన్నింటిలోనూ గంగానది ఎంత శ్రేష్ఠమైనదో, చాంద్రమాన మాసాలన్నింటిలోనూ ఈ 'అధిక జ్యేష్ఠ మాసం' అంత శ్రేష్ఠమైనది." గంగలో స్నానం చేస్తే ఎలాంటి పాపాలు తొలగిపోతాయో, ఈ మాసంలో విష్ణు నామ స్మరణ చేయడం వల్ల అంతటి అంతఃశుద్ధి కలుగుతుంది.


మాసోఽయమధికో రాజన్

పురుషోత్తమ ఉచ్యతే |

అస్మిన్ కాలాచ్యుతం నత్వా

పునర్భవం న విందతి ||

ఈ అధిక మాసము సాక్షాత్తూ పురుషోత్తమ స్వరూపము. ఈ కాలంలో అచ్యుతుడైన ఆ శ్రీమహావిష్ణువును భక్తితో అర్చించి, నమస్కరించిన మానవుడు మరల జన్మ మృత్యు సంసార చక్రంలో పడకుండా మోక్షాన్ని పొందుతాడు.


గంగా సరస్వతీ రేవా 

యమునా చ ప్రయాగకా |

తాసాం స్నానాచ్చ యత్పుణ్యం

తదస్మిన్ మాస సేవయా ||

(బృహన్నారదీయ పురాణం)

గంగ, సరస్వతి, నర్మద (రేవ), యమున మరియు ప్రయాగ వంటి పవిత్ర తీర్థాలలో స్నానం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం లభిస్తుందో, ఈ పురుషోత్తమ మాసంలో నియమ పూర్వకంగా భగవత్ సేవ చేయడం వల్ల అంతటి పుణ్యఫలం లభిస్తుంది.


దేవదేవ జగన్నాథ

ప్రణతార్తివినాశన |

జ్యేష్ఠాఽధికే మయా దత్తం

గృహాణార్ఘ్యం నమోఽస్తుతే ||💧

అని భగవంతుడికి నిత్య‌ అర్ఘ్యం సమర్పించడం.


వాపీకూపతటాగాది 

ప్రతిష్ఠా యజ్ఞకర్మ చ |

మాంగల్యాని చ కర్మాణి 

మలమాసే వివర్జయేత్ ||

(నారద స్మృతి)

బావులు, చెరువులు తవ్వించడం, దేవాలయ ప్రతిష్ఠలు, యజ్ఞ యాగాలు, వివాహము, ఉపనయనము, గృహప్రవేశము, చౌలము (పుట్టువెంట్రుకలు తీయుట) వంటి మాంగల్య (శుభ) కార్యాలను మలమాసంలో/అధిక మాసంలో విడిచిపెట్టాలి.


నిత్యాని నైమిత్తికాని

ప్రకుర్యాదధికేఽపి చ |

కామ్యాని తు న కుర్వీత

 ప్రతిష్ఠాదీని కాన్యచిత్ ||

(స్మృతి కౌస్తుభం)

అధిక మాసము వచ్చినప్పటికీ నిత్య కర్మలను (సంధ్యావందనాది అనుష్ఠానాలు), నైమిత్తిక కర్మలను (గ్రహణ స్నానాలు, శ్రాద్ధాలు, తప్పనిసరి విధులు) యథావిధిగా ఆచరించాలి. కానీ, కామ్య కర్మలను (కోర్కెలు కోరుతూ చేసే యజ్ఞాలు, వ్రతాలు) మరియు దేవతా ప్రతిష్ఠలు, నూతన గృహారంభాలు వంటి వాటిని మాత్రం అస్సలు చేయకూడదు.


లౌకిక శుభకార్యాలు లేకపోవడం వల్ల మానవునికి సంసార పరమైన బాధ్యతల నుండి కొంత మానసిక విరామం దొరుకుతుంది. ఈ సమయాన్ని దైవచింతనలో, గ్రంథ పఠనంలో గడపడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

అధిక మాసంలో చేసే పూజలు కేవలం "శ్రీ పురుషోత్తమ ప్రీత్యర్థం" (భగవంతుని సంతోషం కోసం మరియు ఆత్మశుద్ధి కోసం) మాత్రమే చేస్తారు. ఇది మానవుడిని స్వార్థం నుండి నిష్కామ స్థితికి తీసుకెళ్తుంది.


జీవతో వా మృతస్యాపి 

యా గతిః పురుషోత్తమే |

న సా క్రతుసహస్రేణ 

లభ్యతే నృపసత్తమ ||

( నారద పురాణం)

పురుషోత్తమ మాసంలో జీవించి ఉన్నవారికి మాత్రమే కాదు, మరణించిన పితృదేవతల పేరిట చేసే పుణ్యకార్యాల వల్ల వారికి లభించే సద్గతి, వేయి యజ్ఞాలు చేసినా లభించదు. ఈ మాసంలో పితృదేవతలను తలుచుకుని దానాలు చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది.


యైర్న పూజిత ఈశానో 

మాసి పురుషోత్తమే |

దరిద్రా భవంతి తే నూనం

జన్మజన్మని మానవాః ||

(పద్మ పురాణము)

ఎవరైతే ఈ పరమ పవిత్రమైన పురుషోత్తమ మాసంలో జగదీశ్వరుడైన శ్రీహరిని పూజించకుండా, దానధర్మాలు చేయకుండా కాలం గడుపుతారో, వారు జన్మజన్మలందు దరిద్రాన్ని అనుభవిస్తారు. అంటే ఈ మాసంలో చేసే కొద్దిపాటి పూజ అయినా దరిద్ర నాశనం అవుతుంది.


ఏకభక్తేన నక్తేన తథైవాయాచితేన చ |

ఉపవాసేన కర్తవ్యో మలమాసః ప్రయత్నతః ||

అధిక మాస వ్రతాన్ని ఆచరించే శక్తులు గలవారు నెల రోజులు ఉపవాసం ఉండాలి. అది సాధ్యం కాని పక్షంలో రోజుకు ఒక పూట మాత్రమే భుజించడం (ఏకభుక్తం), లేదా రాత్రి వేళ మాత్రమే భుజించడం (నక్తం), లేదా అడగకుండా లభించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం (అయాచితం) అనే నియమాల ద్వారా ఈ మాసాన్ని భక్తి శ్రద్ధలతో గడపాలి.


అధిక మాసములో

ఉపవాసము, 

ఏకభుక్తము,

నక్త వ్రతము,

అయాచితము‌,

ధారణ పారణ వ్రతం, 

విష్ణుపంచక వ్రతము,

అలవణ వ్రతము,

లక్ష ప్రదక్షిణము, 

అయాచిత వ్రతము,

లక్ష వత్తుల వ్రతము,

దీప నమస్కారము,

లక్ష పుష్పార్చన,

అథఃశయనము,

మౌనవ్రతము,

ఇవన్నీ భగవత్ ప్రీతికరమైనందున

చేయవలెను. 


మలమాసే గతే ప్రాప్తే 

హరిముద్దిశ్య భక్తితః |

త్రయస్త్రింశదపూపానాం 

దానం కుర్యాద్విధానతః ||

కాంస్యపాత్రే నిధాయైతాన్

ఫలతాంబూల సంయుతాన్ |

దద్యాద్విప్రాయ శాంతాయ

పురుషోత్తమ తుష్టయే ||


33 అపూపాలను

(అరిసెలు) పళ్ళు, వెండి,

బంగారము మొదలగు దానాలు

బ్రాహ్మణ సువాసినీలకు భోజనము

వాయనాల దానాలు

నిష్కామముగా చేసినచో విశేష

ఫలము లభించును


అధిక మాసములో 33 దేవతలను

వారి అంతర్యామి 33

భగవద్రూపాలను ఆరాధించాలి.

12 ఆదిత్యులు, 

11 రుద్రులు, 

8 వసువులు, 

2 అశ్విని దేవతలు.

వీరిని అపూపాలలో ఆవాహన చేసి పూజించి దానము చేయాలి.


బ్రహ్మాండాన్ని దానం చేసే శక్తి

మానవునికి సాధ్యము కాదు.

పురుషోత్తమ మాసములో ఇది

సాధ్యము. 33, అరిసలను ఒక

కంచు పాత్రలో పెట్టి ఇంకొక కంచు

పాత్రను మూసిపెట్టి దానము

చేసినవారికి బ్రహ్మాండ దాన 

ఫలము నిశ్చయముగా లభిస్తుంది.


కాంస్యపాత్రం సమాదాయ 

తస్మిన్ పూపాన్ నిధాయ చ |

బ్రాహ్మణాయ ప్రదాతవ్యం

సర్వపాప విముక్తయే ||

​సువర్ణ లేదా కంచు పాత్రను (తామ్ర/కాంస్య పాత్ర) తీసుకుని, అందులో నెయ్యితో వండిన అప్పాలను (అరిసెలను) ఉంచి, సర్వ పాపాల నుండి విముక్తి కలగడం కోసం ఉత్తముడైన బ్రాహ్మణునికి దానంగా సమర్పించాలి.


(అపూప దాన శ్లోకం)

విష్ణురూపీ సహస్రాంశుః

సర్వపాపప్రణాశనః |

అపూపాన్న ప్రదానేన 

మమ పాపం వ్యపోహతు ||

సహస్ర కిరణాలు కలిగిన, సర్వ పాపాలను నాశనం చేసే విష్ణు స్వరూపుడైన ఓ పురుషోత్తమా! నేను సమర్పిస్తున్న ఈ అపూప (అరిసెల) దానం వల్ల నా పాపాలన్నీ తొలగిపోవు గాక.


అరిసెలు గుండ్రంగా ఉంటాయి. ఇది సూర్య మరియు చంద్ర బింబాలకు ప్రతీక. అధిక మాసం అనేది సూర్య, చంద్రుల గమనాల వ్యత్యాసం వల్ల (సౌర, చాంద్ర మానాల సమన్వయం) ఏర్పడేది కాబట్టి, ఈ గ్రహాల అనుగ్రహం కోసం వాటి రూపంలో ఉన్న అపూపాన్ని దానం చేస్తారు. నెయ్యిలో వేయించినప్పుడు అరిసెపై వచ్చే చిన్న చిన్న రంధ్రాలు లేదా దాని రూపం సూర్యుని సహస్ర కిరణాలకు (రశ్మి) సంకేతంగా భావిస్తారు.


*అధిక మాసం లో విశేష దానాలు*


అధిక మాసం సంపూర్ణముగా

ముగిసేంత వరకూ తాంబూల

దానం, బ్రాహ్మణ దంపతులకు

చేసినచో దౌర్భాగ్యము నశించి

సౌభాగ్య ప్రాప్తి కలుగును. ఒక నెల

ఆఖండ దీపము శాంతము

కాకుండా దీపారాధన చేయుట

వలన అంధకారము నశించి

జీవితము ప్రకాశవంతమై జ్ఞాన ప్రాప్తి

కలుగును. సువాసినీ స్త్రీలు 33

వాయన దానాలు చేయుట వలన

వంశాభివృద్ధి మరియు దీర్ఘ

సౌమంగల్యము సిద్ధించును.

ఇదేవిధముగా అనేక దానాలు

చేయవచ్చు. 33 సంఖ్య అని

చెప్పినది 33 కన్న తక్కువ

కారాదన్న అభిప్రాయముతో

చెప్పినదని తెలుసుకొనవలెను.

అధికమాసములో శ్రీమద్భాగవత

శ్రవణము చేయుటవలన

పురుషోత్తముని అనుగ్రహము

విశేషముగా లభించును.


*అధికమాసములో నిషిద్ధ కార్యములు*


అనిత్యమనిమిత్తంచ దానం మహాదానం|

ఆగ్య్నధానాధ్యరాపూర్వతీర్థయాత్రామరేక్షణం||

దేవారామతటాకాదిప్రతిష్టాం మౌంజి బంధనం |

ఆశ్రమ స్వీకృతం కామ్యపృషోత్వర్గంచ నిప్క్రమం||

రాజ్యాభిషేకం ప్రథమం చూడాకర్మ ప్రతానిచ| 

అన్నప్రాశన మారంభం గృహాణాం చ ప్రవేశనం||

స్నానం వివాహం నామాతిపన్నం దేవమహోత్సవం | వ్రతారంభం సమాప్తిం చ కామ్యకర్మచ పాప్మనాం I|

 ప్రాయశ్చిత్తం చ సర్వ స్యమల మాసే వర్జయేత్|| - 

(బృహస్పతిః- స్ర్మతి ముక్తావళి)


మహా దానములు, 

అగ్నాధానము, 

యజ్ఞము, 

ఉద్యానవనముల నిర్మాణము,

చెరువుల నిర్మాణము,

ఉపనయనము, 

సన్యాస స్వీకారము, 

జ్యోతిష్టోమాది కామ్యకర్మలు,

పసిపిల్లలను మొదటి సారి ఇంటి

నుండి బయటకు తీసుకువెళ్ళుట,

పట్టాభిషేక కార్యము, 

చౌలము, 

విశేష వ్రతాలు, 

అన్నప్రాశనము, 

గృహారంభము, 

గృహప్రవేశము, 

విశేష తీర్థస్నానము,

వివాహము, 

నామకరణము,

ప్రాయశ్చిత్త హోమాలు,

ఈ కార్యములను అధికమాసములో

చేయకూడదు.


పురుషోత్తమస్య మాసే తు

దీపదానం కరోతి యః |

ఘృతేన వాపి తైలేన తస్య

పుణ్యమనంతకమ్ |

పురుషోత్తమ మాసంలో ఎవరైతే ఆవు నెయ్యితో గానీ, లేదా నువ్వుల నూనెతో గానీ భగవంతుని సన్నిధిలో దీప దానం (దీపారాధన చేసి సమర్పించడం) చేస్తారో, వారికి అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. వారి వంశంలోని పితృదేవతలకు కూడా సద్గతులు కలుగుతాయి.


నెల రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం విష్ణు సన్నిధిలో లేదా తులసి కోట వద్ద అఖండ దీపం లేదా నిత్య దీపారాధన చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.


ఈమాసంలో సూర్యుడి తాపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో విష్ణువుకు జలాభిషేకం చేయడం, పురుష సూక్తం, విష్ణు సహస్రనామ స్తోత్రాలు పఠించడం వలన మనశ్శాంతిని ఇస్తుంది.


సాధ్యమైనంత వరకు నదీ స్నానం చేయడం, నెలలో కనీసం ఒక రోజైనా (ముఖ్యంగా ఏకాదశి నాడు) ఉపవాసం ఉండి పురుషోత్తముడిని పూజించడం శాస్త్ర సమ్మతం.


అధిక మాసం అనేది లౌకిక శుభకార్యాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక ఎదుగుదలకు, పూర్వ జన్మ పాప పరిహారానికి, అక్షయ పుణ్య సంపాదనకు లభించిన ఒక అద్భుతమైన ‌"అదనపు" సమయం లాంటిది. ధర్మశాస్త్రాల ప్రకారం దీనిని భక్తి శ్రద్ధలతో వినియోగించుకోవడం ఉత్తమం.


*అధికస్య అధికం ఫలం* 


🔯

*అధికస్య అధికం ఫలం* 


🔯

పంచాంగం

 ఈ రోజు పంచాంగం 18.05.2026  Monday,


స్వస్తి  శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం  గ్రీష్మ ఋతువు అధిక  జ్యేష్ఠ  మాస శుక్ల పక్ష ద్వితీయ తిథి ఇందు వాసర రోహిణి నక్షత్రం సుకర్మ యోగః బాలవ తదువరి కౌలవ తదుపరి తైతుల కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

  


శ్రాద్ధ తిథి: ద్వితీయ 


 

నమస్కారః , శుభోదయం

తల్లిదండ్రులు చేసిన పాపం

 *నిజంగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందా? లేక అలా చెప్తే భయపడి తప్పులు చేయరని ఆలోచిస్తున్నారా?* 



తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు. నన్నడిగా కన్నావా? కన్నప్పుడు భరించాలి అంటూ పిల్లలు అరవడం చూస్తుంటాము. అడిగి కనడం కాదు, వారిని తల్లిదండ్రులుగా నీవే ఎంచుకున్నావు. జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీశాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. సర్పాలను చంపినప్పుడు సర్పశాపం, పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహించనందువలన పితృశాపం సంక్రమిస్తాయి. వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చినా అభివృద్ధి ఉండదు; సంతానం కలగదు, వ్యాపరంలో నష్టం మొదలైనవి వస్తాయి. ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తర్వాతి తరం అనుభవిస్తుంది.


అలాగే గురుగ్రహం యొక్క అనుగ్రహం లేనప్పుడు పిల్లల జీవితంలో వృద్ధి ఉండదు. పిల్లలను చూసి తల్లిదండ్రులు బాధ పడతారు. నిజానికి అనుభవించేవారికంటే వారిని చూసేవారి బాధే అధికంగా ఉంటుంది. గురుధ్యానం ప్రపద్యామి పుత్ర పీడోపశాంతయే అని శాస్త్ర వాక్కు. గురు/బృహస్పతి ధ్యానం వలన సంతానం వలన కలిగే భాద తొలగుతుంది. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పుట్టినప్పుడు, అతడు తన కర్మతో పాటు ఆ కుటుంబానికి చెందిన కర్మను కూడా స్వీకరిస్తాడు. అతడిపై దాని ప్రభావం ఉంటుంది.


కొన్ని ఉదాహరణలు - ఈ లోకంలో ఉండే అన్ని జీవుల్లో దత్తుడు ఉన్నాడు. తెలిసో తెలియకో ఇతరులను విమర్శించడం అంటే దత్తుడిని అవమానించడం, విమర్శించడమే. అది కూడా కొంత పాపాన్ని సమకూర్చిపెడుతుంది. అది కూడా గురుశాపానికి కారణమవుతుంది.


పచ్చని చెట్ల పై గురు ప్రభావం ఉంటుంది. పచ్చని మొక్కలు/చెట్లను నరికితే, అది జాతకంలో గురుదోషంగా కనిపిస్తుంది. కళ్ళముందే పిల్లలు మరణించడం, #స్త్రీ సంతానం ఉంటే వారు వైధవ్యం పొందడం వంటివి జరుగుతాయి. అంటే ఆ పిల్ల పుటింట్లో కూర్చుని ఏడుస్తుంది, ఆమెను చూసి తల్లిదండ్రులు ఏడుస్తారు. అదే పండ్లు, కాయలు, పుష్పాలతో ఉన్న చెట్లను నరికితే సంతానం కూడా కలగని సందర్భాలుంటాయి. దానికి కారణం ఆ బిడ్డ తల్లిదండ్రులు చేసిన పాపం. అందుకే పిల్లలు కలవారు పచ్చని చెట్లు కొడుతుంటే, 'పిల్లలున్న వాడివి, పచ్చని చెట్లు కొడుతున్నావ్, ఎంత తప్పు చేస్తున్నావో' అని పెద్దలంటారు.


భూములు లాక్కుంటారు. ముఖ్యంగా రాజకీయనాయకులు, బడా వ్యాపారవేత్తలు తమ అక్రమసంపాదనను సక్రమంగా చూపించడం కోసం పేద రైతులను మోసం చేసో, మరొక విధంగానో భూమలను ఆక్రమించుకుంటారు. వ్యవసాయం మీద పన్ను లేదు కనుక ఆ భూమిలో పండిన దానిపై వచ్చిన ఆదాయంగా తమ అక్రమసంపాదనను చూపి సక్రమం చేసుకుంటారు. ఒక కుటుంబంలోని వారికి ఒక భూమి వంశపారంపర్యంగా సంక్రమించినప్పుడు, దానికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. భూమిని బలవంతంగా లాక్కుంటే, ఆ పితృదేవతలు ఏడుస్తారు. అది శాపంగా మారి లాక్కున వారి కడుపు కొడుతుంది. వారి పిల్లలు అకాల మరణం చెందుతారు, లేదా జీవచ్ఛవాలుగా మిగిలిపోతారు. దీనికి కారణం ఆ తల్లిదండ్రులు చేసిన పాపం. అసలు మనం ఒక భూమిని కొనాలన్నా, దానికి ముందు వెనుక బాగా ఆలోచించాలి. యోగులైతే ఒక భూమిని కొనెముందు పితృదేవతలను సంప్రదిస్తారు. మీరు ఉచితంగా ఇస్తానన్నా, వారు తీసుకోరు. ఎందుకంటే తమ వారసులు అనుభవించకుండా భూములు అమ్ముకోవడం పితృదేవతలకు ఇష్టం ఉండదు. విచిత్రం ఏమిటంటే మనదేశంలో ప్రభుత్వాలే భూములు లాక్కుంటాయి.


ఏ వ్యక్తి అయినా సంపాదించేది తన కోసం, తన పిల్లల కోసం. వారు బాగుండడం చూసి ఆనందించాలని అనుకుంటాడు. ఆ క్రమంలో అతడు అవినీతికి పాల్పడితే, ఇతరులకు ద్రోహం చేస్తే, వారి ఏడుపు వీరికి శాపంగా మారుతుంది. ఆ అవినీతి పరులు బాధపడేది వారి పిల్లలకు హాని కలిగినప్పుడే. అందుకే వారి పిల్లలు అకాలమరణాల పాలవుతారు.


ఇలా ఎన్నో రకాలుగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుంది. కాబట్టి, తస్మాత్ జాగ్రత్త.

17, మే 2026, ఆదివారం

సోమవారం*🕉️ *🌹18, మే, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

   🕉️ *సోమవారం*🕉️

 *🌹18, మే, 2026🌹*

 *దృగ్గణిత పంచాంగం*               


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*అధిక జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం* 


*తిథి : విదియ* సా 05.53 వరకు ఉపరి *తదియ*

*వారం    : సోమవారం* ( ఇందువాసరే )

*నక్షత్రం  : రోహిణి* మ 11.32 వరకు ఉపరి *మృగశిర*

*యోగం : సుకర్మ* రా 09.48 వరకు ఉపరి *ధృతి*

*కరణం  : బాలువ* ఉ 07.46 *కౌలువ* సా 05.53 ఉపరి

*తైతుల* రా.తె 04.03 ఆపైన *గరజి*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.00 - 07.00 & 11.00 - 12.00*     

 అమృత కాలం  : *ఉ 08.44 - 10.08 & రా 12.56 - 02.20*

 అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.30*

*వర్జ్యం    : సా 04.28 - 05.53 వరకు*

*దుర్ముహూర్తం  : మ 12.30 - 01.22 & 03.05 - 03.57* 

*రాహు కాలం   :ఉ 07.13- 08.50*

గుళికకాళం      : *మ 01.41 - 03.18*

యమగండం    : *ఉ 10.27 - 12.04*

సూర్యరాశి : *వృషభం*                  

చంద్రరాశి : *వృషభం/మిధునం*

సూర్యోదయం :*ఉ 05.43* 

సూర్యాస్తమయం :*సా 06.42*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     :*ఉ 05.36- 08.11*

సంగవ కాలం    :*08.11 - 10.46*

మధ్యాహ్న కాలం   :*10.46 - 01.21*

అపరాహ్న కాలం  :*మ 01.21- 03.57*

*ఆబ్ధికం తిధి :అధిక జ్యేష్ఠ శుద్ధ విదియ*

సాయంకాలం   :*సా 03.57- 06.32*

ప్రదోష కాలం    :*సా 06.32 - 08.45*

రాత్రి కాలం       :*రా 08.45 - 11.42*

నిశీధి కాలం     :*రా 11.42- 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.52*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


       *🔱రుద్ర స్తుతి🔱*


*త్ర్యంబకాయ త్రినేత్రాయ* 

 *యోగినాంపతయే నమః*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము



బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ ।

బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా ।। 24 ।।



ప్రతిపదార్థ:



బ్రహ్మా — బ్రహ్మన్; అర్పణం — యజ్ఞము యందు ఉపయోగించే గరిటె (స్రువము) మరియు ఇతర అర్పితములు; బ్రహ్మా — బ్రహ్మన్; హవిః — హోమద్రవ్యము; బ్రహ్మా — బ్రహ్మన్; అగ్నౌ — యజ్ఞాగ్ని యందు; బ్రహ్మణా — అతనిచే; హుతమ్ — సమర్పించి; బ్రహ్మ — బ్రహ్మన్; ఏవ — నిజముగా; తేన — దానిచే; గంతవ్యం — పొందబడును; బ్రహ్మ — బ్రహ్మన్; కర్మ — సమర్పణ; సమాధినా — సంపూర్ణముగా భగవత్ ధ్యాసలోనే ఉన్నవారు.



తాత్పర్యము : 


సంపూర్ణ భగవత్ ధ్యాస లోనే నిమగ్నమైన వారికి, హోమ ద్రవ్యము బ్రహ్మమే, దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే స్రువము బ్రహ్మమే, యజ్ఞ కర్మ బ్రహ్మమే, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే. ప్రతిదాన్నీ కూడా ఆవిధంగా భగవంతునిగా చూసే వారు భగవంతుడిని సునాయాసంగా పొందుతారు.

   


వివరణ:

నిజానికి ఈ ప్రపంచపు వస్తువులన్నీ భగవంతుని మాయ అనే భౌతిక శక్తి ద్వారా తయారుచేయబడ్డాయి. శక్తి అనేది శక్తిమంతునికి అభేదమైనది మరియు అదేసమయంలో ఆయన కంటే వేరైనది కూడా. ఉదాహరణకి, వెలుగు అనేది అగ్ని యొక్క శక్తి. అది అగ్ని కంటే వేరైనది అనుకోవచ్చు ఎందుకంటే అది అగ్నికి బాహ్యంగా ఉంటుంది. దానిని అగ్నిలో భాగమే అనికూడా అనుకోవచ్చు. కాబట్టి సూర్య కిరణాలు కిటికీ గుండా లోపటికి వచ్చినప్పుడు, జనులు, ‘సూర్యుడు వచ్చాడు’ అని అంటారు. ఇక్కడ సూర్య కిరణాలను సూర్యుడిని ఒక్కలాగే చూస్తున్నారు. శక్తి అనేది శక్తివంతునికి కన్నా వేరైనది మరియు ఆయనలో భాగమే కూడా.


ఆత్మ కూడా భగవంతుని శక్తి రూపమే — అది ఆధ్యాత్మిక శక్తి, దానినే జీవ శక్తి అంటారు. ఇదే విషయాన్ని శ్రీ కృష్ణుడు 7.5వ శ్లోకంలో వివరించాడు. చైతన్య మహాప్రభు ఇలా అన్నాడు:


జీవ-తత్త్వ శక్తి, కృష్ణ-తత్త్వ శక్తిమాన్

గీతా–విష్ణుపురాణాది తాహాతే ప్రమాణ


(చైతన్య చరితామృతము, ఆది లీల, 7.117)


 


‘శ్రీ కృష్ణుడు శక్తిమంతుడు, ఆత్మ అతని శక్తి. భగవద్గీత, విష్ణు పురాణం మొదలైన వాటిలో ఈ విషయం చెప్పబడింది.’ ఈ విధంగా ఆత్మ అనేది ఏక కాలంలో భగవంతుని నుండి వేరైనది కాదు మరియు భగవంతుని కన్నా భేదమే. కాబట్టి భగవంతుని యందే మనస్సు నిమగ్నమైనవారు, ఈ జగత్తుని అంతా భగవంతునితో ఒక్కటిగా, ఆయనకన్నా అభేదమైనదిగా చూస్తారు. శ్రీమద్ భాగవతం ప్రకారం:


సర్వ-భూతేషు యః పశ్యేద్ భగవద్-భావమాత్మనః

భూతాని భగవత్యాత్మన్యేష భాగవతోత్తమః (11.2.45)


‘భగవంతుడినే అంతటా చూసేవాడు, అందరిలో భగవంతుడినే చూసేవాడే, అత్యుత్తమ భాగవతుడు (ఆధ్యాత్మికవేత్త).’ భగవంతుని యందే ఎల్లప్పుడూ మనస్సు నిమగ్నమై ఉన్న ఇటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధకులకు, యజ్ఞము ఆచరించే వాడు, యజ్ఞ ద్రవ్యము, హోమ పరికరాలు, హోమ అగ్ని, యజ్ఞ ప్రక్రియ, ఇవన్నీ భగవంతుని కంటే అభేదమైనవే.


ఎలాంటి దృక్పథంతో యజ్ఞం ఆచరించాలో వివరించిన తరువాత, శ్రీ కృష్ణుడు ఇప్పుడు ఈ లోకంలో జనులు చిత్తశుద్ధి కోసం ఆచరించే వివిధ రకాల యజ్ఞాలని వివరిస్తున్నాడు.

17-05-2026 ఆదివారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

17-05-2026 ఆదివారం రాశి ఫలితాలు


మేషం


ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది.  

---------------------------------------


వృషభం


ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఇంటాబయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

---------------------------------------


మిధునం


సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి ఉన్నది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

---------------------------------------


కర్కాటకం


ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి అధికమవుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ తప్పకపోవచ్చు. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. 

---------------------------------------


సింహం


ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ఫలితం ఉండదు. వ్యాపార వ్యవహారాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు.

---------------------------------------


కన్య


దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. మిత్రుల నుంచి అవసరానికి ధనసహాయం లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.

---------------------------------------


తుల


కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.  

---------------------------------------


వృశ్చికం


బంధుమిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు అధికమవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు అమలు చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగాలలో అంచనాలను అందుకోవడంలో విఫలమవుతారు. 

---------------------------------------


ధనస్సు


బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ధన పరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనుకున్న వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఆర్థిక లావాదేవీలు మరింత మందగిస్తాయి. వ్యాపారాలలో భాగస్వాములతో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

---------------------------------------


మకరం


ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------


కుంభం


ముఖ్యమైన పనులలో శ్రమాధిక్యత అధికమవుతుంది. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి.

---------------------------------------


మీనం

 

ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సన్నిహితుల నుండి శుభవర్తమానాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి.

---------------------------------------

ఇతరులకు సహాయం ఇతరులకు సహాయం

 దయచేసి పూర్తిగా చదవండి🙏

ఇతరులకు సహాయం చేసిన వారిమి అవుతాం

🤝

హైదరాబాద్ లోని 

ఈ సి ఐ ల్ లో 

అత్యాదునిక సదుపాయలతో  300 పడకల  హాస్పటల్  ఉంది ...

కనుక  ఈ సి ఐ ల్ 

దిగీ ఎవరిని అడిగినా 

తులసి హాస్పటల్  

అడ్రస్ చెబుతారు 

అలాగే 15 సంవత్సరాల పై 

నుండి 80 సంవత్ష రాల  వరకు cardio(గుండె ) & ortho(విరిగిన ఎముకలు ) &Urology(కిడ్నీ రాళ్లు ) 

వైద్యమైనా సరే అంటే   

10 లక్షలు అయ్యే హార్ట్ సంబంధిత వ్యాదులైనా  ఉచితమే

సదుపాయాలు కార్పోరేట్   తరహాలో ఉంటాయి

కనుక  

మనలో మన పక్కన  

ఎంతో మంది పేదవాళ్ళు  జీవితంలో సంపాదించిందంతా  వైద్యానికే ఖర్చుచేసే మద్యతరగతి వారు ఉంటారు  

అలాంటి వారికి  

ఈ హాస్పటల్ గురించి దయచేసి చెప్పండి 

మనమంతా కలసి 

ఒక్క  ప్రాణాన్పి కాపాడినా చాలు    

ఎ ఒక్కరు కూడ 

టెన్షన్  పడకూడదనే 

నేను నా పోన్లో ఉన్న 550 వాట్సప్ మెంబర్స్‌కి 

ఈ మెసేజ్  పంపుతున్నాను

మీరు ఒక్కొక్కరు 200 మంది వాట్సప్ మెంబర్స్‌కు పంపితే  185000 మందికి 

ఈ విషయం తెలుస్తుంది

కనీసం 50 మంది  ప్రాణాలు కాపాడుదాం

తీసుకుని రావలసింది ఆరోగ్య శ్రీ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ 


Contact number 

040-49336699

9505108108

Hospital name 

Tulasi hospitals Ecil Hyderabad 

*Just forward please*🙏🏻