31, మే 2026, ఆదివారం

పంచాంగము


 

క్షేత్రసంకల్పాం

  (ప్రతాప వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి రచించిన ఋగ్వేద శ్రాద్ధప్రయోగమునుండి


క్షేత్రసంకల్పాం


కాశీ క్షేత్రే :


అద్య బ్రహ్మణః మేరోః దక్షిణదిగ్భాగే వింధ్యస్యోత్తరదిగ్భాగే ఆర్యావర్తికదేశే అవిముక్తవారాణసీక్షేత్రే అసివరుణయోర్మధ్యే ఆనందవనే మహాశ్మశానే గౌరీముఖే త్రికంటకవిరాజితే భాగీరధ్యాః పశ్చిమేతీరే ఉత్తరవాహిన్యాః బ్రహ్మనాళే మహామణికర్ణికాక్షేత్రే విశ్వేశ్వరాది త్రయస్త్రింశత్కోటి దేవతా గోబ్రాహ్మణ హరిహర గురుచరణసన్నిధౌ విక్రమశకీ బౌద్ధావతారీ బార్హస్పత్యమానేన నామసంవత్సర సౌరచాంద్రమానాభ్యాం ఋతౌ నామ సంవత్సరే అయనే మాసే పక్షే తిథా వాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం ।


ప్రయాగే :


అద్య బ్రహ్మణః.. . మేరోః దక్షిణదిగ్భాగే వింధ్యస్యోత్తరదిగ్భాగే ఆర్యావర్తాంతర్గత బ్రహ్మావర్తైకదేశే విష్ణు ప్రజాపతి క్షేత్రే షట్కూలమధ్యే అంతర్వేద్యాం భాగీరధ్యాః పశ్చిమేతీరీ కాళింద్యాః ఉత్తరీతీరే వటస్యపూర్వదిగ్భాగే సమస్తదేవతా గోబ్రాహ్మణ హరిహరగురుచరణ సన్నిధౌ అస్మిన్వర్తమానేన విక్రమశకీ ।


శ్లో ॥ త్రివేణీం మాధవం సోమం భరద్వాజం చ వాసుకిం | వందే అక్షయ వటం శేషం ప్రయాగం తీర్ధనాయకం ॥


గయాక్షేత్రే :


అద్య బ్రహ్మణః . మేరోః దక్షిణదిగ్భాగే వింధ్యస్యోత్తరదిగ్భాగే ఆర్యావర్తాంతర్గత మగధదేశే జంపకారణ్యే మధువనే కోలాహలపర్వతే గయాగదాధర క్షేత్రే ఉత్తరవాహిన్యాం ఫల్గున్యాః పశ్చిమేతీరే సమస్తదేవతా గోబ్రాహ్మణ హరిహరగురు చరణసన్నిధౌ అస్మిన్వర్తమానేన విక్రమశకీ


హరిద్వారే :


అద్య బ్రహ్మణః.. . మేరోః దక్షిణదిగ్భాగే వింధ్యస్యోత్తరదిగ్భాగే ఆర్యావర్తాంతర్గత హిమాలయదేశే కేదారఖండే మాయామండలే దక్షప్రజాపతి క్షేత్రే దక్షిణవాహిన్యాం భాగీరధ్యాః పశ్చిమేతీరే సమస్తదేవతా గోబ్రాహ్మణ హరిహర గురుచరణసన్నిధౌ అస్మిన్వర్తమానేన విక్రమశకే

సోమవారం*🕉️ *🌹01, జూన్, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

     🕉️ *సోమవారం*🕉️

 *🌹01, జూన్, 2026🌹*  

   *దృగ్గణిత పంచాంగం*                


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం*  

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*అధిక జ్యేష్ఠ మాసం - కృష్ణ పక్షం* 


*తిథి : పాడ్యమి* సా 04.37 వరకు ఉపరి *విదియ*

*వారం    : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం  : జ్యేష్ఠ* రా 07.08 వరకు ఉపరి *మూల*

*యోగం : సిద్ధ* ఉ 06.19 వరకు ఉపరి *సాధ్య*

*కరణం  : కౌలువ* సా 04.37 ఉపరి *తైతుల* పూర్తిగా రాత్రంతా 

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.00 - 07.00 & 11.00 - 12.00*     

 అమృత కాలం  : *ఉ 09.16 - 11.03*

 అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.31*

*వర్జ్యం    :రా.తె04.08-05.55 వరకు*

*దుర్ముహూర్తం  : మ 12.31 - 01.24 & 03.08 - 04.00*

*రాహు కాలం   :ఉ07.12 - 08.50*

గుళికకాళం      : *మ 01.43 - 03.21*

యమగండం    : *ఉ 10.27 - 12.05*

సూర్యరాశి : *వృషభం*                 

చంద్రరాశి : *వృశ్చికం/ధనస్సు*

సూర్యోదయం :*ఉ 05.41*

సూర్యాస్తమయం :*సా 06.47*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      :*ఉ 05.34 - 08.10*

సంగవ కాలం      :*08.10 - 10.47*

మధ్యాహ్న కాలం    :*10.47 - 01.23*

అపరాహ్న కాలం :*మ 01.23- 04.00*

*ఆబ్ధికం తిధి      : అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి*

సాయంకాలం    :*సా 04.00- 06.36*

ప్రదోష కాలం    :*సా 06.36 - 08.48*

రాత్రి కాలం       :*రా 08.48 - 11.43*

నిశీధి కాలం      :*రా 11.43 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.06 - 04.50*

■■■■■■■■■■■■■■■■■■■■

               *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


        *🔱రుద్ర స్తుతి🔱*


       *శంభవే స్థాణవే నిత్యం* 

       *శివాయ పరిమాత్మనే*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

అష్టాదశ ప్రజలు

   - అష్టాదశ ప్రజలు - కరండం - ఉగ్రాణం.

..........................................


(అ) ముఖ్యాగ్రహారమనేది అత్యున్నత స్థాయిలోవున్న అగ్రహారం.రాజులు సామంతులు మొ॥వారు హిందూశాస్త్రా

లలో విశేష పాండిత్యం కలిగిన బ్రాహ్మణులకు గ్రామాలను దానంగా ఇచ్చేవారు. అలాంటి దానగ్రామాలను అగ్రహారాలు అంటారు. వాటిలో అన్ని హక్కులు ప్రత్యేకాధికారాలు కలిగిన అగ్రహారాన్ని ముఖ్యాగ్రహారమని పిలిచేవారు. వారికి

భోగాష్టకములు అంటేఎనిమిది భోగాధికారాలుండేవి. (1)పౌరోవాత్యం – పురోహిత వృత్తి నిర్వహించే హక్కు (2) యాజకత్వం – యజ్ఞయాగాదులు నిర్వహించే అధికారం (3) ప్రభుత్వం – గ్రామ పరిపాలన లేదా స్థానిక అధికార హక్కు (4) జ్యోతిస్సారం – జ్యోతిష్య సేవలు అందించే హక్కు (5) హేమముద్రా పరీక్షా – బంగారు నాణేలు లేదా ధన ప్రమాణాల పరిశీలన హక్కు (6) సాముద్రికం – శరీర లక్షణాల ఆధారంగా ఫలితాలు చెప్పే విద్య అంటే సాముద్రిక శాస్త్రం. (7) లేఖకనం – పత్రాలు, శాసనాలు, లెక్కలు వ్రాసే అధికారం (8) యాజమానము – నిర్వహణ పర్యవేక్షణ నాయకత్వహక్కు. ఈ భోగాష్టకములతో పాటుగా

అష్టతేజస్వామ్యములు అగ్రహారానికి సంబంధించిన సంపదలు. ఈ అష్టతేజస్వామ్యముల వనరులపై వారికి హక్కులు ఉండేవి.(1) నిధి – భూమిలో దొరికే నిధులు (treasure trove) (2) నిక్షేప – భద్రపరచిన ధనం లేదా దాచిన వస్తువులు (3) జల – నీటి వనరులపై హక్కు (4) పాషాణ/ఆళ్మసార – రాళ్లు, ఖనిజాలు లేదా భూసంపదలపై హక్కు (5) అక్షీణ – ప్రస్తుతం ఉన్న స్థిర ఆదాయాలపై హక్కు (6) ఆగామి – భవిష్యత్తులో వచ్చే ఆదాయాలపై హక్కు (7) సిద్ధ – ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఆస్తులు, ఫలసాయం (8) సాధ్య – భవిష్యత్తులో అభివృద్ధి చేయగల సంపదలపై హక్కు.ముఖ్యాగ్రహారం అనేది కేవలం భూమి దానం కాదు. గ్రామంలోని ఆదాయాలు నీటి వనరులు, నిధులు పరిపాలనా అధికారాలు పురోహిత హక్కులు విద్యా సంబంధిత అధికారాలు మొదలైన సమగ్ర హక్కులతో కూడిన గ్రామదానం. ఇలాంటి అగ్రహారాలను రాజులు వేదవేదాంగాలలో, శాస్త్రాలలో ప్రావీణ్యం కలిగిన సద్బ్రాహ్మణులకు బహుమతిగా ఇచ్చేవారు.


(ఆ) మంగలమంటే బ్రాహ్మణ అగ్రహారాలకు సంబంధించిన పేరు.

మంగలమనేది గ్రామ నామాల చివర వచ్చే ఒక ప్రత్యేక అంత్యపదం 

ఉదాహరణకు

చతుర్వేది మంగలం

బ్రహ్మదేయ మంగలం

ఉత్తరమేరూరు మంగలం బ్రాహ్మణులకు దానంగా ఇచ్చిన గ్రామం. బ్రాహ్మణులు అధిక సంఖ్యలో నివసించే గ్రామాన్ని సూచిస్తుంది.శాసనాలలోని నిర్వచనం ప్రకారం

ఏబదియెనిమిది (58) బ్రాహ్మణ కుటుంబాలు కలిసి నివసించే గ్రామాన్ని మంగలము అంటారు.

అంటే ఒక గ్రామంలో కనీసం 58 బ్రాహ్మణ కుటుంబాలు స్థిరనివాసం ఏర్పరచుకొని వేదాధ్యయనం యజ్ఞయాగాలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ గ్రామం మంగలముగా పరిగణించబడేది.

చతుర్వేది మంగలమంటే నాలుగు వేదాలను అధ్యయనం చేసిన బోధించే బ్రాహ్మణులున్న చోటు.దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా చోళ పాండ్య విజయనగర కాలపు శాసనాల్లో చతుర్వేదిమంగలమనే పేరు చాలా సాధారణంగా కనిపిస్తుంది.

మంగలం అగ్రహారం బ్రహ్మదేయం మధ్య సంబంధమేమిటో చూద్దాం.బ్రహ్మదేయమంటే బ్రాహ్మణులకు దానం చేసిన భూమి లేదా గ్రామం.అగ్రహారమంటే బ్రాహ్మణ నివాస కేంద్రంగా ఏర్పడిన గ్రామం.మంగలమంటే నిర్దిష్ట సంఖ్యలో బ్రాహ్మణ కుటుంబాలు నివసించే బ్రాహ్మణ గ్రామం.చోళుల కాలం ACE 9–13వ శతాబ్దాలలో దక్షిణ భారతదేశంలో అనేక గ్రామాల పేర్లకు మంగలమనే ప్రత్యయం జతచేయబడింది. ఇది ఆ గ్రామం బ్రాహ్మణ దానగ్రామం లేదా విద్యా కేంద్రం అని సూచిస్తుంది.

కనుక మంగలము కనీసం 58 బ్రాహ్మణ కుటుంబాలు నివసించే బ్రాహ్మణ గ్రామమే మంగలం.


(ఇ) కరండబేదకుడు అంటే కరండమనే వాయిద్యాన్ని వాయించువాడు.కరండమంటే 18 వాయిద్యాలలో ఒకటి.

అష్టాదశ (పదునెనిమిది) వాద్యాలేమిటో గమనిద్దాం.

(1) భేరి (2) మృదంగం (3) పటహం (4) దుందుభి (5) మద్దెల (6) తిమిల (7) ఇడక్క (8) ఉడుక్కు (9) కాహళం (10) శంఖం (11) కొమ్ము (12) వేణువు (13) సన్నాయి (14) తాళం (15) ఘంట (16) చెంగిలగాంగ్వాయిద్యం (17) కరడిక / కరండం (18) డమరు.ఈ

కరండం అష్టాదశ వాద్యాలలో ఒకటిగా కొన్ని శాసనాలలో ప్రస్తావించబడింది. అయితే నేటికి కరండం వాడుకలో లేకపోవడం వల్ల దాని నిర్మాణ విశేషాలు పూర్తిగా తెలియదు. 

మధ్యయుగ దేవాలయాల్లో ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు రథయాత్రలు నిత్యసేవల సమయంలో అనేక వాద్యకారులు నియమించబడేవారు. అలా దేవాలయ సంప్రదాయంలో కరండవాదకుడు దేవాలయంలో, ఉత్సవంలో సంగీత బృందంలో కరండం అనే ప్రాచీన వాద్యాన్ని వాయించే కళాకారుడు అని అర్థం.


(ఈ) ఉగ్రాణము అనగా ధాన్యము ఇతర ఆహార నిల్వలు సరుకులను భద్రపరచే గిడ్డంగి.ఆంగ్లంలో దీనిని Granary అంటారు.గ్రామాలలో రైతులు పండించిన వరి, జొన్న, సజ్జ, గోధుమ, కొర్ర,సాములు, అరికెలు, అపరాలు వంటి ధాన్యాలను సంవత్సరమంతా నిల్వ ఉంచడానికి ప్రత్యేకంగా నిర్మించిన గృహాన్నే ఉగ్రాణము అని పిలిచేవారు.గరిసె అనేది ఉగ్రాణానికి తెలుగు పర్యాయపదం.గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ గరిసెలో ధాన్యం పోశారు. గరిసె నిండిపోయింది వంటి వాడుకలు కనిపిస్తాయి.ఉగ్రాణము అనే పదం సంస్కృతంలోని ఉగ్రాణ (Ugrāṇa) నుండి వచ్చింది.ధాన్యాగారం భాండాగారమనే అర్థాలు ఉన్నాయి.రాజ్యపాలనలో దేవాలయాలలో అగ్రహారాలలో ఉగ్రాణాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండేది.దేవాలయాలకు వచ్చిన ధాన్య దానాలు ఉగ్రాణాలలో నిల్వ చేసేవారు.రాజులు భూమిశిస్తుగా వసూలు చేసిన ధాన్యాన్ని రాజఉగ్రాణాలలో భద్రపరచేవారు.

కరువు కాలాల్లో ప్రజలకు పంపిణీ చేయడానికి ఉగ్రాణాలు ఉపయోగపడేవి.అందుకే కొన్ని శాసనాలలో ఉగ్రాణాధికారి (Granary officer) ఉగ్రాణపాలకుడు,ధాన్యాగారాధికారి వంటి పదాలు కనబడుతాయి.


(ఉ) అష్టాదశప్రజలు = గ్రామములోని 18 ప్రధాన సామాజిక (వృత్తి) వర్గాలకు చెందిన జనులను అష్టాదశ ప్రజలు అని పిలిచేవారు.

(1) బ్రహ్మ = బ్రాహ్మణులు (2) క్షత్రియ = పాలకులు యోధులు (3) వైశ్య = వ్యాపారులు (4) శూద్ర = వ్యవసాయ, సేవావర్గాలు (5) వ్యావహారిక = వర్తకులు, లావాదేవీలు నిర్వహించేవారు (6) గోరక్షక = పశుపోషకులు

(7) శిల్పక = శిల్పులు చేతివృత్తి నిపుణులు

(8) పంచాణ = విశ్వకర్మ వర్గానికి చెందిన ఐదు శిల్పకుల సముదాయం

(9) కుంభకార = కుమ్మరులు

(10) తంతువాయి = నేతలు (సాలెలు)

(11) క్షౌరక = మంగళ్లు (క్షురకులు)

(12) రజక = చాకళ్లు

(13) వస్త్రచ్ఛేదక – బట్టలు కుట్టేవారు (దర్జీలు)

(14) చర్మకార – చెప్పుల తయారీ, తోలు పనివారు

(15) తిలఘాతుక – గానుగలతో నువ్వులు ఇతర గింజలు ఆడించి నూనె తీసేవారు.(16) లబ్ధక – వేటగాళ్లు లేదా అటవీ ఉత్పత్తులు సేకరించేవారు (17) చండాల = గ్రామానికి చెందిన సమాచారాన్ని వార్తలను కొమ్ము లేదా తప్పెట ద్వారా చాటింపు వేయువారు.(18) మాతంగ – మాతంగ సమాజానికి చెందినవారు. వీరంతా కలసికట్టుగా స్థాయి భేదము లేకుండా గ్రామాభివృద్ధికి దేవాలయాల అభివృద్ధికి పాటుపడేవారు.


॥సేకరణII

................... జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.

శ్రీమహావిష్ణుపురాణం

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

      *ఆదివారం 31 మే 2026*


     *శ్రీమహావిష్ణుపురాణం*                         

           *105వ భాగం* 


*శ్రీకృష్ణావతారము -8*


*ధేనుకాసుర, ప్రలంబాసుర వత్సా సుర, బకాసుర సంహారం*```


కాళింది మడుగు నీళ్ళు కృష్ణ స్పర్శతో స్వచ్ఛమై పక్షులు, జంతువులు, మానవులు త్రాగడానికి అనుకూలంగా మారాయి. కాళింది మడుగు పరిసరాలు సందడి సందడిగా మారాయి. కృష్ణుడి వెంట ఉండే గోపబాలురు, వారి తల్లిదండ్రులు కృష్ణుడు దివ్యత్వం కలిగినవాడు అని తెలుసుకున్నారు. తమను ఎటువంటి ఆపద నుండి అయినా రక్షిస్తాడు అనే నమ్మకం, విశ్వాసం కలిగింది. నిర్భయంగా గోపాలురు, బలరామకృష్ణుల వెంట వనాలలో గోవులను కాస్తూ తిరగసాగారు.

గోకులం నుంచి మాయమైన బలరామ కృష్ణులు,గోకులవాసులు,కాళింది మడుగు సమీపాన బృందావనంలో నివసిస్తున్నారు అన్న సంగతి "కాళీయమర్ధన"విశేషాలు విన్న కంసుడికి తెలిసింది. 

తన సేవకులైన రాక్షసులనందరిని కృష్ణుని అంతం చేయమని ఆదేశించి బృందావనానికి పంపాడు.


బృందావనానికి అలా మొదట వచ్చిన రాక్షసుడు వత్సాసురుడు. ఆవుదూడ రూపం దాల్చి గోవుల మందలో చేరిపోయాడు. కృష్ణుని సమీపంలోనే ఉంటూ చంపడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. 

మందలో ఉండే గోవులు, గోవత్సాలు (లేగలు) కృష్ణుడికి తెలుసు. ప్రతి దానికి పేరు పెట్టి, ఆ పేరుతో పిలిచేవాడు. 

ఈ గోవత్సము కొత్తగా చేరింది. గోవుల సమీపంలో గోవత్సాలు

ఉంటాయి. ఈగోవత్సము మాత్రం కృష్ణుని వద్దనే ఉండేది. ‘వీడెవడో రాక్షసుడు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు’ అని అర్ధమైంది.


ఒకరోజు గోపబాలురు గోవులను, గోవత్సాలను కృష్ణుడికి దూరంగా మేతకు తీసుకెళ్లారు. వత్సాసురుడు వెళ్లినట్టే వెళ్లి తిరిగి కృష్ణుడి వద్దకు వచ్చాడు. కృష్ణుడు చూసి ఆ రోజు వాడికి మోక్షం కలిగించాలని అనుకున్నాడు. బలరామునికి కొద్దిదూరానికి వెళ్లి ఉండమని సైగ చేసాడు. బలరాముడు కొద్ది దూరం వెళ్లి చెట్టు చాటునుండి చూడసాగాడు.


ఎవరూ కృష్ణుడి పక్కన లేకపోవడం చూసి వత్సాసురుడు తన గిట్టలతో కుమ్మి చంపాలని వేగంగా కృష్ణుడి మీదకు రాసాగాడు. కృష్ణుడు వాణ్ణి దగ్గర వరకు రానిచ్చి చటుక్కున మెడను రెండు చేతులతో పట్టుకుని గాలిలో గిరగిరా వేగంగా తిప్పి తిప్పి విసిరివేసాడు. గడ్డిపోచలా ఆకాశంలో ఎత్తుకి ఎగిరిన రాక్షసుడు భూమి మీద పడి తల పగిలి రక్తం కక్కుకుని చచ్చి పోయాడు.


మరణించేటప్పుడు రాక్షసుని అరుపులు విని, రాక్షసుడి భారీ కాయము చూసి గోపబాలురు ఏమి భయపడలేదు. మరొక రాక్షసుడి పీడ మా కన్నయ్య వదిలించాడు అని సంబరపడ్డారు. బలరామ కృష్ణులు గోప బాలురను తల్లి తండ్రులకు, గ్రామంలోని వారికి ఏమి చెప్పవద్దని ఆదేశించారు. అందరు కలసి ఆ రాక్షసుడి దేహము దహనం చేశారు.


*తరువాత వచ్చినవాడు బకాసురుడు. పేరుకు తగ్గట్టే భయకర కొంగ రూపం దాల్చి గోపాలురు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత నీరు త్రాగే సరస్సువద్ద నిలిచాడు. గోపాలురు రోజూలాగానే మధ్యాహ్నభోజనం చేసి నీరుత్రాగుతున్నారు. పర్వతాకారంలో ఉన్న కొంగ వారిని తినాలని పరిగెత్తు కుంటూ వచ్చింది. గోపబాలురు ‘కృష్ణా కృష్ణా’అంటూ అరవసాగారు.


కృష్ణుడు పరుగున వచ్చి కొంగ ముందు నిలిచాడు. బకాసురుడు కృష్ణుని పట్టుకుని మింగటానికి ప్రయత్నించాడు.  


కృష్ణుడు నోటికి అడ్డంగా నిలిచాడు. తన ఆకారం పెంచాడు. బకాసురుడు మింగాలేక కక్కాలేక ఇబ్బంది పడుతు న్నాడు. కృష్ణుడు కిందభాగం నొక్కిపెట్టి పైభాగాన్ని చేతులతో పట్టుకుని చీల్చివేశాడు. బకాసురుడు అరుస్తూ తన రాక్షస రూపం దాల్చి చచ్చి పోయాడు.


*తరువాత కృష్ణుడి చేతిలో మరణించింది ధేనుకాసురుడు. బృందావనం సమీపంలో గల తాటివనం ఆక్రమించి తన సేవకులతో ఉంటూ ఎవరినీ రాకుండా చంపేసేవాడు. తాటి వనంలో తాటిఫలాలు మహారుచిగా ఉంటాయని గోపబాలురు చెప్పడంతో కృష్ణబలరాములు తాటివనంలో ప్రవేశించారు. అడ్డువచ్చిన వారిని కొట్టివనంలో తాటిచెట్లు ఎక్కి పళ్లు కోసి గోప బాలురకి ఇవ్వసాగారు.


దెబ్బలు తిని పారిపోయిన కాపాలావాళ్ళు ధేనుకాసురుడికి చెప్పారు. ధేనుకాసురుడు, తన తోటి రాక్షసులు గార్ధభ రూపం దాల్చి గోపబాలురని తరుముతూ బలరాముడు,కృష్ణుడి వద్దకు వచ్చారు. బలరాముడు మిగిలిన రాక్షసుల పని పట్టగా, కృష్ణుడు ధేనుకాసురుడి ముందు రెండు కాళ్లు పట్టుకుని గిరగిరా తిప్పి ఆకాశంలోకి విసిరేశాడు.  


వాడు రాక్షస రూపం దాల్చి భూమి మీద పడి రక్తం కక్కుకుని చచ్చిపోయాడు. ధేనుకాసురుని తాటివనం అందరిది అయ్యింది. 


*ధేనుకాసురుడి మరణవార్త విని కంసుడు ప్రలంబాసురుడు అనే మరో రాక్షసుని పంపాడు. వాడు ఒక గోపబాలుని రూపం ధరించి గోపబాలురిలో కలసి బలరామ కృష్ణుల వెంట వనాలలో తిరుగసాగాడు. సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో అదృశ్యమై వనంలో ఉండేవాడు. 


ప్రలంబాసురుడు గోపబాలునిగా బాగా కలసి పోయి ఆటలు ఆడుతుండంతో గోపబాలురు అతనెవరో పట్టించు కోలేదు. కాని బలరామ కృష్ణులు గ్రహంచారు. సమయం చూసి భరతం పడదామని ఉన్నారు.


బలరాముడు కృష్ణుని ఈసారి రాక్షసుని చంపే అవకాశం తనకి ఇవ్వమని కోరాడు.  


ఆ రోజు బల రామ కృష్ణులు తమ రూపాలు మార్చుకున్నారు. బలరాముడు కృష్ణుడయ్యాడు. కృష్ణుడు బల రాముడయ్యాడు. ప్రలంబాసురుడు గోపబాలురతో గోపబాలుడిగా ఆడుతూ, ఆటలో ఓడిపోయిన వారు, గెలిచిన వారిని భుజాలపై ఎత్తుకుని వనం చివరన ఉన్న వృక్షము దాకా వెళ్లివెనక్కురావాలి అని నియమం పెట్టాడు.


ఆటలో ప్రలంబుడు కావాలనే కృష్ణుని చేతిలో ఓడిపోయాడు. అది చూసి బలరాముడు కూడా ఒక గోపబాలుడి చేతిలో ఓడి పోయాడు. ఆట నియమం ప్రకారం ప్రలంబుడు కృష్ణుని భుజాలపైకి ఎత్తుకుని వేగంగా వెళ్ళ సాగాడు. బలరాముడు గోపబాలుని ఎక్కించుకుని ప్రలంబుడి వెంట వెళ్ళసాగాడు. దూరంగా వనం చివరకు తీసుకెళ్లి రాక్షసరూపందాల్చి కృష్ణుని చంపేయాలని అనేది ప్రలంబుడి పన్నాగం.


కానీ ఆ రాక్షసుడికి తెలియనది బలరామ కృష్ణులు తమ ఆకారాలు మార్చుకుని ఉన్నారన్న సంగతి.  


గోపబాలురకు కనపడకుండా దూరంగా వేగంగా వెళ్ళుతున్న ప్రలంబుడినిచూసి బలరాముడి రూపంలోని కృష్ణుడు చూసి "అన్నా! బలరామ! ప్రలంబాసురుని చంపేయి" అని వినపడేంత గట్టిగా అరిచి ఆగిపోయాడు.


ప్రలంబుడు "నేనుఎక్కించుకుంది కృష్ణుని కదా! బలరామా అని బలరాముని పిలుస్తాడేమిటి!" అని ఆశ్చర్యంగా పరిగెడుతునే తలెత్తి చూశాడు. 


పైన కృష్ణుడి మాటలతో కృష్ణ రూపం వదలిన బలరాముడు కనిపించాడు. కృష్ణుడి మాటలు విని బలరాముడు ప్రలంబాసురుడు మెడలు విరిచి తలపై చావు దెబ్బ కొట్టి సంహరించాడు.  


చనిపోయిన రాక్షసుడి దేహాన్ని గోపబాలురు కాల్చివేశారు.


బలరామ కృష్ణులు ఊరిలో చెప్పవద్దన్నా వత్సాసుర, బకాసుర, ధేనుకాసుర, ప్రలంబాసుర సంహారాలు నంద యశోదలతో పాటు గ్రామంలోని వారందరికి తెలిసాయి. బలరామ కృష్ణుల బలపరాక్రములు నంద గ్రామంలో అందరికి తెలుసు కాబట్టి ఎవరు భయపడలేదు. బృందావనం రాక్షసుల పీడ నుంచి విముక్తి చెందినందుకు సంబరాలు చేసుకున్నారు. 


కానీ కంసుడిలో అసహనం పెరిగి పోతోంది. చివరగా మిగిలిన తృణావర్త, అజగర, కేసి నామ రాక్షసులను కృష్ణుని అంతమొందిం చటానికి పంపాడు.


*తరువాత కథ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారిసౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

భక్తి

 _*భక్తి*_

ఈశ్వరుని కృప పొందడానికి ఉత్తమ మార్గం నిస్వార్థ , నిర్మలమైన భక్తి. 

ఆ భక్తి కనక ఉన్నట్లయితే వేరే అర్హతలు ఏమీ అవసరం లేదు, వనంలోని నిషాదుడు కూడా అందరి గౌరవాన్ని పొందే స్థాయికి ఎదుగుతాడు.

మనం అందరం కన్నప్పగురించి విన్నాము. 

అతడికి చదువు,ఆచారం, సంపత్తు ఏమీ లేదు, కానీ అతడి భక్తి అనన్యసామాన్యమైనది...

కన్నప్ప అడవిలో ఎవరూ అర్చించని శివలింగాన్ని చూశాడు, దాన్ని పూజించాలని నిశ్చయించుకున్నాడు. 

శివలింగం పైన దుమ్మును దేనితో శుభ్రం చెయ్యాలో తెలియక తన పాదరక్షలను ఉపయోగించాడు, నదినుండి నీటిని పుక్కిలి పట్టి నోటితో తెచ్చి అభిషేకిమ్చాడు, అంతకుముందు తాను వేటాడిన మృగమాంసం నివేదించాడు, కన్నప్పలాగ మనం కూడా ఆచారం లేకుండా పూజ చేయ్యగలము అనుకునే వారికి కొంచెం హెచ్చరించాలి. 

శివుని కన్నులనుండి నీళ్ళు కారటం చూసి తన కన్నులు పేరకి అక్కడ పెట్టాడు. 

అతడి శ్రద్ధాభక్తి అలాంటిది, అందుకే శివుడు మోక్షమిచ్చాడు, మనకు అటువంటి భక్తి ఉన్నదా అటువంటి సేవ చేస్తే సరిపోతుందని అనుకోవడానికి?

భక్తి అందరికీ ముఖ్యమే. 


శాస్త్రాలు నవవిధభక్తుల గురించి చెబుతాయి, కొంతమందికి భగవంతుని మీద ప్రవచనం వినడంలో సంతోషం లభిస్తుంది, కొందరికి నిరంతర భగవన్నామ పారాయణ ఇష్టం. 


గోపికాస్త్రీలకు శ్రీకృష్ణ భగవానుడంటే విపరీతమైన భక్తి, ఓక గోపిక తాము తీసిన పాలు, పెరుగులు అమ్ముతూ పాలు, పెరుగు అని అరవడం బదులు “గోవిందా, దామోదరా, మాధవా...” అంటూ అరుస్తోందిట.

 

అందరూ ఆవిడకు పిచ్చెక్కిందా అనుకున్నారట, కానీ ఆ గోపస్త్రీ మనస్సు పూర్తిగా భగవంతుని యందు నిమగ్నమైవున్నది, 


మహాత్ముడైన శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్రులు గొప్ప జీవన్ముక్తులు, వారి ప్రవర్తన పరికించిన వ్యక్తులు ఆయనకు మతి చలించిందని భావించి వారి గురువు గారిదగ్గరకు వెళ్లి విన్నవించారట. దానికి గురువుగారు విచారంగా “మా శిష్యుడికి పిచ్చేక్కిన్దంటున్నారు. 

ఆ పిచ్చి నాకేక్కలేదే అని నాకు బాధగా వుంది. 


నన్ను నేను గురువు అని చెప్పుకుంటున్నా, ఆ దశకు ఇంకా చేరుకోలేదు. 

ఆయన మహాత్ముడు” అని చెప్పారట. 

 

ఏ పని చేసినా భగవంతుని ధ్యానిస్తూ చెయ్యడం కూడా ఒక గొప్ప భక్తియే.


కొంతమందికి భగవంతుని పూజలో సమయం గడపడం చాలా ఇష్టం. 

ఎటువంటి ఆటంకం లేకుండా పూజగదిలో గడపడానికి వారు సంతోషపడతారు.

వీళ్ళకు విరుద్ధంగా కొంతమంది పట్టుమని పది నిముషాలు గడపడానికి ఎంతో అసహనం ప్రదర్శిస్తారు.

 

వాళ్ళు తమ పురోహితుడిని సహస్రనామం బదులు శతనామం, లేదా ఇంకా లఘువుగా ముగించమని తొందర చేస్తుంటారు. 


పూజా సమయంలో కూడా వాళ్ళు ఇతర విషయాల గురించి ఆలోచిస్తుంటారు. 

శ్రద్ధ గలిగిన వాడు పూజలో కూర్చున్నప్పుడు సమయం గడచిపోవదాన్ని గుర్తించడు,


పూజించడం ఒక విధమైన భక్తి,

ఆంజనేయుని వంటి భక్తులకు స్వామి సేవయే పరమావధి.


 ఆత్మనివేదన విషయంలో అన్నీ అర్పించిన బలి చక్రవర్తి మనకు స్ఫూర్తి.


*నవవిధ భక్తులు:*

1. భగవంతుని గురించి వినడం ( శ్రవణం )*

2. భగవంతుని స్తుతించడం (కీర్తనం)

౩. భగవంతుని మనస్సునందు నిలుపుకోవడం ( స్మరణం)

4. భగవంతుని పాద సేవనం

5. భగవంతునిరూపాన్ని పూజించడం ( అర్చనం )

6. భగవంతుని ముందు సాష్టాంగ ప్రణామం (వందనం)

7. భగవంతుని ముందు దాసుని వలె సేవించడం ( దాస్యం)

8. భగవంతుని స్నేహితునిగా భావించడం ( సఖ్యం)

9. భగవంతుని సర్వదా శరణు చొచ్చటం(ఆత్మ నివేదనం )

వీనిలో ఏ భక్తి మార్గాన్ని ఆశ్రయించినా మనకు శ్రేయస్సు లభిస్తుంది.


         *_శుభమస్తు_*

🙏 శ్రీ సద్గురు పీఠం ద్వారా....✍️

సమస్త లోకా సుఖినోభవంతు 🙏

సామాజిక స్పృహ

 *సామాజిక స్పృహ - పూర్ణ నాగరికతా చైతన్యము 10*




ఆసేతు హిమాచలం విభిన్న సంస్కృతుల, మతాల కులాల , వర్గాల సంప్రదాయాల సమాహారమే మన భారత దేశం. వివిధ సిద్ధాంతాల ననుసరించి భారతీయ సమాజ నిర్మాణంపై ప్రజలలో విరుద్ధ భావాలున్నవి. చక్కని శ్రమ విభజనతో, పరస్పర గౌరవం లభించేలా వివిధ జీవన విధానాలను ఏర్పరచిన మన వర్ణ వ్యవస్థను, అసహనంతో వికృతంగా వక్రీకరించి *కులవివక్షగా* చిత్రించడం చాలా దారుణం, దురదృష్టకరమే గాక *అనాగరికం కూడా*. 

చాలా మంది సభ్యులు ఈ పాటికి ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు, అవును నిజమే. ఈ దురాగతాలన్నీ అరికట్టాలని ఉన్నది. *నిశ్చయంగా ఈ నిర్ణయం నాగరికత లక్షణమే*. కాని వెంటనే *నా ఒక్కరి వల్ల ఏమవుతుంది అని* కూడా తలపోస్తూ ఉంటారు కూడా. ఈ దేశంలో అధిక సంఖ్యాకుల స్తబ్ధత, నిర్లిప్త ధోరణి, స్వార్థాలు, అన్నిటికంటే మించి *స్వప్రయోజనాలు మాత్రమే* అను ధోరణి *అనాగరికానికి హేతువు*


 *The mountain is you* అను పుస్తకంలో మహిళా రచయిత్రి (అమెరికన్) *BRIANNA WEIST* ఒక చోట ఇలా అంటారు There is nothing *holding* you *back* in life *more* than *you". ఇది ముమ్మాటికీ వాస్తవము. మన వెనుకబాటుకు మనమే కారణము*.  

ఈ రచయితనే ఇంకొక మాట గూడా చెబుతారు *Transform self SABOTAGE into self MASTERY*. మన *తప్పిదాలను* మన *విజయాలుగా* మార్చుకుందాము. మన పెద్దలు గూడా చెబుతూ ఉంటారు *ఒక అడుగు ముందుకు మైళ్ళు మైళ్ళు దాటగలవు* అని. 


రెండు విషయాలు మనం జ్ఞాపకముంచుకుందాము.

1) *సాధనాథ్ సాధ్యతే సర్వం*

2) *షడ్భాగంతు మనుష్యానామ్ సప్తమం దైవ చింతనమ్* 


సమాజ శ్రేయస్సు విషయమై ముందుకు వచ్చే సభ్యులందరికి మా అందరి అభినందనలు. *పూర్ణ నాగరికతా చైతన్య లక్ష్య* సాధనలో 

 *మీ కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని మా అందరి ఆకాంక్ష*. 


విజ్ఞులైన సభ్యులకు ఇంతకంటే అధికముగా వివరించుట దుస్సాహసమే అవుతుందని భావిస్తున్నాను. నా మనోగతం తో సెలవు.

*శుద్ధము మనస్సును, పరిశుద్ధము ప్రవర్తనమును, ప్రణాళికాబద్ధము అహర్నిశమును, సుతిబద్ధము నా వచోవిధానమును, సంసిద్ధుడను దేనికైనను* 


ధన్యవాదములు.

*(స్వస్తి)*

🙏🙏🙏

సంపూర్ణ మహాభారతము*

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

      *ఆదివారం 31 మే 2026*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                         2️⃣4️⃣2️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *242 వ రోజు*                   

*భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము*```


విరాటుడు, ఉపపాండవులు, అభిమన్యుడు అక్కడకు చేరుకుని భీష్మునికి తోడుగా ఉన్న వారిపై లంఘించారు. భీష్ముడు ఏభై బాణాలతో అర్జునిని బాధించాడు. ఆ బాణములను లక్ష్య పెట్టక అర్జునుడు కౌరవ సేనలపై విజృంభించి వారిని తరిమి తరిమి కొట్టాడు. అర్జునుడు తన రధాన్ని కౌరవ సేనల మధ్యకు నడిపి వారిని విచక్షణా రహితంగా చీల్చి చెండాడాడు. రధికులను సారధులను హయములను తెగ నరికాడు. అర్జునిని పరాక్రమానికి కౌరవ సేనలు భయపడ్డాయి. ఇది చూసిన దుర్యోధనుడు "అర్జునుడు మన సేనలను విచక్షణా రహితంగా చంపుతున్నాడు అతడిని ఎదుర్కొన గలిగిన కర్ణుని యుద్ధానికి రానివ్వక మీరూ ఇలా చూస్తూ ఊరు కోవడం ఏమన్నా బాగా ఉందా" అన్నాడు. 


భీష్ముడు "నా శాయ శక్తులా యుద్ధంచేస్తున్నా ఇలా అంటున్నాడేమిటి" అని అనుకుని అర్జునుని వైపు రథం మళ్ళించి వికర్ణుడు, అశ్వధ్ధామ వెంట రాగా అర్జునిపై ఒక్క సారిగా లంఘించి బాణ వర్షం కురిపించాడు. అర్జునునికి సాయంగా నకుల సహదేవులు, భీముడు, ధర్మరాజు వచ్చారు. అర్జునినికి గాంగేయునకు మధ్య పోరు లోకభీకరంగా జరిగింది. 

భీష్ముడు శ్రీకృష్ణుని గుండెలకు తాకేలా బాణప్రయోగం చేసాడు. అది శ్రీకృష్ణుని గుండెను చీల్చి రక్తం పైకి చిమ్మింది. అది చూసిన అర్జునుడు కోపంతో ఊగిపోతూ భీష్మునిపై బాణవర్షం కురిపించాడు. ఆ బాణములను తిప్పికొట్టడమే కాక అర్జునుని రథాన్ని శరములతో ముంచెత్తాడు. 

ఇలా ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తుండగా మధ్యాహ్నం అయింది.```


*పాంచాల సేనలు ద్రోణుల మధ్య సమరం*``


మధ్యాహ్నసమయం వరకు యుద్ధం సాగిన పిదప ధృష్టద్యుమ్నుడు ద్రోణుని ముందుకు రథాన్ని పోనిచ్చి ద్రోణుని తన నిశిత శరములతో నొప్పించాడు. 


ద్రోణుడు కోపించి దృష్టద్యుమ్నుని సారథిని కొట్టి, తరువాత నాలుగు బాణాలు వేసి అశ్వాలను చంపాడు. అతడి విల్లును నడిమికి విరిచి కేతనమును విరిచాడు అయినా ధృష్టద్యుమ్నుడు బెదరక అమిత కోపంతో ద్రోణుడిని ఎదిరించాడు. ద్రోణుని పైన శరపరంపర కురిపించాడు. ద్రోణాచార్యుడు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని ధృష్టద్యుమ్నునిపై శరపరంపర కురిపించాడు. ధృష్టద్యుమ్నుడు వాటిని సర్ధవంతంగా ఎదుర్కొని ద్రోణునిపై శరపరంపర కురిపించాడు. ఇలా ఇరువురి నడుమ భంయంకరమైన పోరు కొనసాగింది. ధృష్టద్యుమ్నుడు ద్రోణునిపై గదాయుధం ప్రయోగించాడు ద్రోణుడు దానిని పొడి చేసాడు. ధృష్టద్యుమ్నుడు బల్లెం విసిరాడు. ద్రోణుడు దానిని కూడా విరిచాడు. మరొక విల్లు తీసుకుని ధృష్టద్యుమ్నుడు ద్రోణునిపైన శరపరంపర కురిపించాడు. ద్రోణుడు ధృష్టద్యుమ్నుని సారథిని, హయములను చంపి విల్లును విరిచాడు. ధృష్టద్యుమ్నుడు రథము దిగి గదను తీసుకుని గిరగిరా తిప్పి ద్రోణుని పై విసిరాడు. ద్రోణుడు దానిని బాణములతో నుగ్గు చేసాడు. ధృష్టద్యుమ్నుడు కరవాలంతో విజృంభించాడు. ఇలా ఇరువురి నడుమ ఘోర యుద్ధం కొనసాగింది. ద్రోణుని శరపరంపరకు ధృష్టద్యుమ్నుడు తట్టుకోలేక పోయాడు. ఇది చూసిన భీముడు ధృష్టద్యుమ్నునికి సాయం వచ్చాడు. ద్రోణునిపై ఏడు బాణములు వేసి ధృష్టద్యుమ్నుని వేరు రథం ఎక్కించాడు. ఇది చూసిన సుయోధనుడు కళింగ రాజుకు సైగ చేసి భీముని ఎదుర్కొనమని చెప్పాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ!   జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

మూక పంచశతి*

 *మూక పంచశతి*


 *ఉపోద్ఘాతము* 


*ఆయన మూకశంకరేంద్ర సరస్వతీ స్వామి. ఆయనే (మూగవాడైన ) మూకశంకరులు. కామాక్షీమాత దివ్యానుగ్రహంతో మాటలు వచ్చి మహాకవియై ఆశువుగా 500 శ్లోకాలను అమ్మవారిపై అనర్గళంగా చెప్పి “మూక పంచశతి” అనే స్తుతి కావ్యానికి తెరదీసిన యోగీశ్వరుడు. కంచికామకోటి పీఠానికి 20వ పీఠాధిపతిగా పనిచేసి, అమ్మవారిలో ఐక్యత నొందిన దివ్యపురుషుడు మూకశంకరులు.*


*మనకున్న శక్తిపీఠాలలో ప్రసిద్ధమైంది కాంచీపురం. ఇక్కడ శక్తిపీఠం ఇతర శక్తిపీఠాలకు శక్తి, దీప్తి, స్పూర్తులను సదా అందిస్తోందని ప్రతీతి. కాంచీపురం మోక్షపురిగా ప్రసిద్ది. ఇక్కడున్న మహాశక్తి అమ్మవారు కామాక్షీ మాత. స్వామి ఏకామ్రేశ్వరుడు. కామేశ్వరునే కనులలో దాచుకున్న తల్లి కామాక్షి. సకల కామితాలకు సాక్షియై అనుగ్రహించే తల్లి కామాక్షి. త్రిమూర్తులే త్రినయనాలుగా కల్గిన తల్లి కామాక్షీ మాత అని అంటారు. కామునకు పునర్జన్మనిచ్చి, అనంగునిగా మార్చి, రతీదేవికి సంతృప్తిని కల్గించిన తల్లి కామాక్షి అనికూడా పండితులు సెలవిస్తున్నారు. ఆ కామకోటి పీఠానికి గురుపరంపరలో 20వ పీఠాధిపతి మూకశంకర సరస్వతీస్వామి పుంభావ వాగ్దేవీ మాత. క్రీ.శ. 398 నుండి క్రీ.శ 437 వరకు 39 సం||లు కంచిపీఠమును నిర్వహించిన మహాయోగి మూకశంకరులు.*


*ఖగోళ శాస్త్ర పండితులైన శ్రీ విద్యాపతికి జన్మించినవారు మూకశంకరులు. పుట్టుకతో మూగతనం, చెవుడు ఉన్నాయి. అయినా ఆదినుండి అమ్మవారి ధ్యానంతో పెరిగాడు. ఒకమారు తన మిత్రునితో కంచికి పోయి, అమ్మవారి ఎదుట ధ్యానంలో మూకశంకరులు నిమగ్నమైనారు. ఇంతలో కాంచీపుర పీఠ శిఖాధిరూఢయైన ఆదిమశక్తి కామాక్షీమాత సామాన్యకాంతగా, పండు ముత్తైదువగా ఆలయంలోనికి వచ్చి మూకశంకరులను సమీపించింది. తాను నములుతున్న తాంబూలం ఎంగిలి పిడచను నోటినుండి తీసి ఎదురుగా ఉన్న శంకరుల మిత్రునకివ్వబోయింది. అమ్మవారిని గుర్తించలేని ఆ సాధకుడు, ఆ ముత్తైదువ ఎంగిలిని తిరస్కరించాడు. అప్పుడు ఆ తల్లి ప్రక్కన ఉన్న మూకశంకరులకిచ్చింది. మూకశంకరులు భక్తితో తీసుకుని, కళ్ళకద్దుకుని, ఎదురుగా ఉన్న అమ్మకు (పండు ముత్తైదువకు ) నమస్కరించి నోటిలో వేసుకొని నమిలినాడు. అంతే శంకరుల మూగతనం మాయమైంది. మాటల ప్రవాహం పెల్లుబికి వచ్చాయి. కనులు వర్షించాయి. ఒళ్ళు పులకరించింది. భావావేశం, సాహిత్యాభినివేశం, భక్త్యార్ద్రతలు సమ్మిళితమై అతని నోట ఆశువుగా ఛందోబద్దమైన శ్లోకాల జలపాతం ప్రారంభమైంది. 500 శ్లోకాలు ఆలపిస్తే గాని మూకశంకరుల భావావేశం శాంతించలేదు. ఇంతలో అమ్మ “నాయనా! ఏమైనా వరం కోరుకో. అనుగ్రహిస్తా”నంది. అప్పుడు మూకశంకరులు “అమ్మా! నీ నామ మహిమ, నీ పాద మహిమ, నీ కటాక్ష వైభవం, నీ మందస్మితం, నీ దివ్యత్వాలను సంస్తుతించిన నోటితో లౌకికాలు మాట్లాడలేను. కనుక అమ్మా! తిరిగి నాకు మూగతనాన్ని అనుగ్రహించ”మని కోరినాడు. అమ్మ “తథాస్తు" అంది. పారలౌకికం మాత్రమే కోరిన భక్తుడు మూకశంకరులు. ఇది తెలిసి కంచిపీఠం స్వామి శ్రీ మార్తాండ విద్యాఘనేంద్ర సరస్వతి, మూకశంకరులను పిలిపించి, ఆయన తల్లితండ్రుల అనుమతితో సన్యాసదీక్ష, ఉత్తరాధికారిగా చేయడం, అనంతరం మూకశంకరులు కంచిపీఠం అధిపతిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది.మూక పంచశతి గురించి ఎందరో పెద్దలు వివరించారు, ఐతే ముఖ్యంగా మూక శంకరుల పరంపరనుంచీ ఎందరో పెద్దలు చెప్పే విషయం ఒకటున్నది. మూక పంచశతి వైభవం అంతలా ఎందుకున్నదో ప్రతిపాదిస్తూ పండితులు ఉపాసకులు చెప్పే మాట అది. శివానందలహరి పారాయణ చేస్తే (బయటికి కానీ లోపల కానీ) ప్రత్యక్షంగా శంకరులే శబ్దరూపంలో ఎదురునిలుస్తారు అని అంటారు. అలాగే సౌందర్యలహరి పారాయణ చేస్తే జగదంబ శబ్దరూపంలో ప్రకటితమౌతుందనీ అంటారు. అందుకే తగిన శౌచం, కనీసం అంతశ్శౌచంలేకుండా ఈ పారాయణ చేయరు. పెద్దలైనవారు బాగా చదవడం వచ్చినవారి దగ్గరే చదవడం నేర్చుకోమని చెప్పడానికి కారణం అదే. దీనిలో ఆదిశంకరులు మంత్ర శాస్త్ర రహస్యాలను కథారూపంలో దాచేయడం వల్ల వీటికీ యంత్రాలు అధిదైవతం ఉపాసన ఉపదేశాలున్నాయి.*


           *అలాగే "మూక పంచశతి" విషయంలో, మూకమహాశయుడు అంతకు పూర్వం పండితుడూ, విద్వత్తున్నవాడూ అని చెప్పడం క్లిష్టం. ఒకవేళ అలా అయ్యుంటే మూక మహాశయులు దీనికన్నా ముందే స్తోత్రాలో గ్రంథాలో రచించి ఉండేవారు,అవి లభ్యంలోనూ ఉండేవి. చరిత్రలోనూ అలా లేదు.*


*మూకమహాకవి అమ్మవారి వైభవాన్ని కొలుస్తు 'ఆర్యా శతకం', పాదాలను దర్శించి 'పాదారవింద శతకం', అమ్మప్రేమను పొందిన ఆనందంలో అమ్మవారి హృదయంలోని కరుణను తలుస్తూ 'స్తుతి శతకం', అమ్మవారి క్రీగంటి చూపు మహిమను తెలిపే 'కటాక్ష శతకం', అమ్మవారి సన్నని తెల్లని నవ్వును చూసి చెప్పిన 'మందస్మిత శతకం' అనే ఐదు స్తుతి ఝరులు ప్రవహించాయి.*


*ఈ ఐదు శతకాలూ అమ్మ వలననే, అమ్మ నోటి తాంబూలపు పిడచ మహిమ వలననే ప్రకటించబడ్డాయి కాబట్టి, ఈ స్తోత్రాలు ఎక్కడ చదివినా, విన్నా, ఆ గ్రంథం ఏ ఇంట ఉన్నా శాబ్దిక స్వరూపంలో కామాక్షి ప్రత్యక్షమైనట్టే అని పెద్దల ప్రతిపాదన.*

🙏🙏🙏


సేకరణ

విష్ణు సహస్రనామం* *..ఎలా వచ్చింది!!!*

  🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺


*విష్ణు సహస్రనామం* 

         *..ఎలా వచ్చింది!!!*


🍀🍀🍀🍀🍀🍀🍀🍀


భీష్మపితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు. 

కృష్ణుడు, ధర్మరాజుతో సహా, కాని ఎవరూ రాసుకోలేదు. 


మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?


అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తిని అక్కడున్న వారినందిరినీ ఉద్దేశించి, 

*"ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది?"* 

అని అడిగారు.


ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. 

మళ్ళీ స్వామివారు, 

*"విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?"* 

అని అడిగారు


ఒకరన్నారు, 

"భీష్ముడందించారన్నారు"


స్వామివారు, *"భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"*


మళ్ళీ నిశబ్దం.


స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు. 

భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు.


అప్పుడు యుధిష్టురుడన్నాడు, 

*"ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా"* అని.


"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.


శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.


"అదెలా" అని అందరూ అడిగారు.


శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే *సూత స్పటికం* వేసుకున్నాడు. 


ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. 

దీని ప్రత్యేకతేంటంటే... 

వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. 


సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు.


శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యాస మహర్షి వ్రాసిపెట్టాడు.


ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

 శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।

విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూధానం ||

హరిం నరహరరిం రామం గోవిందం దధివామనం ||


🙏🙏🙏🙏🙏🙏🙏🙏

వడదెబ్బతో చనిపోతే

 *వడదెబ్బతో చనిపోతే రూ. 4 లక్షల పరిహారం - ప్రభుత్వ నిబంధనలు*


తెలంగాణ ప్రభుత్వం వడదెబ్బను "ప్రకృతి విపత్తు" గా గుర్తించింది. అందుకే వడదెబ్బతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి *రూ. 4,00,000 పరిహారం* ఇస్తుంది. గతంలో ఇది కేవలం ₹50,000 మాత్రమే. a4bd


*పరిహారం రావాలంటే ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్*


*1. వెంటనే సమాచారం ఇవ్వాలి - 24 గంటల్లో*

- *పోలీస్ స్టేషన్*: మీ ఏరియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వడదెబ్బతోనే చనిపోయారని FIR లో రాయించాలి.

- *రెవెన్యూ శాఖ*: MRO/VRO కి సమాచారం ఇవ్వండి.

- *వైద్య శాఖ*: స్థానిక ANM, ఆశా వర్కర్ లేదా PHC డాక్టర్‌కు చెప్పాలి. a0e3


*2. పోస్టుమార్టం తప్పనిసరి*

వడదెబ్బ వల్లే మరణం సంభవించిందని నిర్ధారించడానికి *ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం* చేయించాలి. ప్రైవేట్ ఆసుపత్రి రిపోర్ట్ చెల్లదు. పోస్టుమార్టం రిపోర్టులో "Cause of death: Heat Stroke/Sunstroke" అని స్పష్టంగా ఉండాలి. a0e3


*3. కావాల్సిన డాక్యుమెంట్లు*

1. మరణ ధృవీకరణ పత్రం - గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీ నుంచి

2. పోస్టుమార్టం రిపోర్ట్ - ప్రభుత్వ ఆసుపత్రి నుంచి

3. పోలీస్ FIR కాపీ

4. మృతుని ఆధార్ కార్డ్, ఓటర్ ID జిరాక్స్

5. కుటుంబ సభ్యుల ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ - వారసత్వ ధృవీకరణ కోసం

6. MRO ఇచ్చే "వడదెబ్బ మరణ ధృవీకరణ" నివేదిక

7. వైద్యాధికారి ఇచ్చే రిపోర్ట్


*4. దరఖాస్తు ఎక్కడ ఇవ్వాలి?*

అన్ని డాక్యుమెంట్లతో *MRO/తహసీల్దార్ ఆఫీస్‌లో* దరఖాస్తు పెట్టాలి. MRO విచారణ చేసి, కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ ఆమోదంతో *SDRF నిధుల నుంచి* 4 లక్షలు వారసుల బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారు. a4bd


*ముఖ్యమైన నిబంధనలు - జాగ్రత్తలు*

నిబంధన వివరణ

**వయసు** వయసుతో సంబంధం లేదు. పిల్లలు, పెద్దలు అందరికీ వర్తిస్తుంది.

**టైమ్ లిమిట్** మరణించిన 30 రోజుల్లో దరఖాస్తు పెట్టడం మంచిది. ఆలస్యమైతే కారణం చెప్పాలి.

**ఎక్కడ చనిపోయారు** ఇంట్లో, పొలంలో, రోడ్డు మీద ఎక్కడైనా సరే. కానీ వడదెబ్బ వల్లే అని ప్రూవ్ కావాలి.

**మందు/మత్తు** మద్యం తాగి, వడదెబ్బ తగిలి చనిపోతే పరిహారం రాదు. పోస్టుమార్టంలో తేలుతుంది.

**ఇతర అనారోగ్యం** గుండె జబ్బు, షుగర్ ఉండి వడదెబ్బతో చనిపోతే, డాక్టర్ "Primary cause Heat Stroke" అని రాస్తేనే వస్తుంది.

*పరిహారం రాకపోవడానికి కారణాలు*

1. పోస్టుమార్టం చేయించకపోవడం

2. FIR లో "వడదెబ్బ" అని రాయించకపోవడం

3. ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయి, వడదెబ్బ అని ప్రూవ్ చేయలేకపోవడం

4. మద్యం సేవించి ఉన్నట్టు రిపోర్ట్‌లో రావడం


*మీరు వెంటనే చేయాల్సింది*: మీ దగ్గర ఎవరైనా వడదెబ్బతో చనిపోతే, ముందు 100 కి డయల్ చేసి పోలీసులకు, 108 కి కాల్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించండి. పోస్టుమార్టం చేయించండి. తర్వాత MRO ని కలవండి.

     మీ బుర్ర నర్సయ్య గౌడ్

వివేకచూడామణి

 *వివేకచూడామణి*


*శ్రీఆదిశంకరాచార్య విరచితము*


*66. తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే*

*స్వేనేవ యత్నః కర్తవ్యో రోగాదేరివ పండితైః*


*పదవిభజన :*

*తస్మాత్ + సర్వప్రయత్నేన - భవబంధవిముక్తయే - స్వేన + ఏవ - యత్నః - కర్తవ్యః +* *రోగాదేః + ఇవ -*

*పండితైః*


*భావము :*

*రోగి స్వయంగా ఔషధాన్ని సేవించి రోగవిముక్తి పొందినట్లు, సంసారబంధ నివృత్తి కోరే వివేకి అయిన సాధకుడు, శ్రవణమననాది సకలోపాయాల సహాయంతో, సర్వవిధాలా స్వప్రయత్నం చేసి, ఆధ్యాత్మిక తాపత్రయాన్ని పోగొట్టుకోవాలి.*


*వివరణ* :

 *స్వేన + ఏవ= స్వేనైవ =* *స్వయముగానే*;


*తన బంధము ఇతరులచే* *తొలగింప శక్యము* 

*కానిదవటం వలన,* *సాధనచతుష్టయ*

*సంపన్నుడైన తాను కూడా గురువును చేరి, అతని ముఖము నుండి వేదాంతములను విని వాటి అర్థాలను మననం చేసి, నిదిధ్యాసనం చేసి, నిర్వికల్పక నిష్టచే బ్రహ్మతత్త్వాన్ని స్పష్టంగా తెలుసుకొని మోక్షాన్ని పొందవలెనే గాని, వేరే విధంగా పొందలేడు.*

🙏🙏🙏

గర్భస్రావం

 తరచుగా గర్భస్రావం అవుతున్న స్త్రీల కొరకు -


కొంత మంది స్త్రీలకు తరచుగా గర్భస్రావం అవుతూ ఉంటుంది . అటువంటి స్త్రీలకు రావిచెట్టు బెరడు చూర్ణం రెండున్నర గ్రాముల మోతాదుగా వెన్న, పంచదార కలిపి రోజుకు నాలుగయిదు సార్లు ఇస్తుంటే గర్భస్రావం కాకుండా ఆగిపోతుంది...


కొద్ది కొద్దిగా విరేచనాలు అవుతున్నప్పుడు -


అల్లం, బెల్లం సమబాగాలుగా కలిపి దంచి పూటకు పిల్లలకు రెండున్నర గ్రాములు , పెద్దలకు అయిదు గ్రాముల మొతాదుగా తినిపిస్తుంటే మాటిమాటికి అయ్యే విరేచనాల భాద తగ్గిపోతుంది అదేవిదంగా అరిచేతులు , అరికాళ్లు లొ పొరలు ఊడటం కూడా హరించి పోతుంది.


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .



మోక్షవేత్తలు

  విదురుడు చెప్తున్నాడు. “రాజా! మోక్షవేత్తలు ఉదాహరించిన పోలిక ఇది. దీనిని గ్రహించటం వలన, మానవుడు పరలోకంలో సుకృత ఫలాన్ని పొందగలడు. ఆ అడవి అన్నది మహాసంసారమే. దుర్గమవన మన్నది సంసారం యొక్క నిగూఢ (క్లిష్ట) స్వరూపం. పాము లని చెప్పినవన్నీ రోగాలు. పెద్దశరీరంతో అక్కడ నిలిచిఉన్న స్త్రీ అంటే వార్ధక్యమే. అది రూపాన్నీ, రంగునూ నాశనం చేస్తుంది. రాజా! అక్కడ బావి అని చెప్పినది జీవి శరీరమే. అక్కడ బావిలో క్రింద ఉన్న ఆ మహాసర్పం కాలమే. అది సర్వప్రాణులనూ అంతం చేసేది. దేహధారుల సర్వస్వాన్నీ అపహరించేది. బావి మధ్యలో పెరిగిన తీగ దేహధారులకు గల జీవితాశ. దానిలో చిక్కుకొనే గదా ఆ మానవుడు వ్రేలాడుతున్నది. రాజా! ఆ బావిపై గట్టు దగ్గర ఆ చెట్టును సమీపిస్తున్న ఆరు ముఖాల ఏనుగు సంవత్సరం. దానిముఖాలు ఆరు ఋతువులు. పాదాలు పన్నెండు నెలలు. ఎప్పుడూ ఉద్యమిస్తూ, ఆ వృక్షాన్ని కొరుకుతున్న ఎలుకలు రాత్రింబవళ్ళు. ప్రాణివిచారణ చేసే పండితులు అలా చెప్పారు. అక్కడున్న తేనెటీగలు కోరికలుగా చెప్పబడుతున్నాయి. విరివిగా తేనె ధారలను స్రవిస్తున్న ఆ ధారలు, కామరసాలు అని గ్రహించాలి. మానవులు వాటిలోనే మునిగిపోతారు. పండితులు సంసార చక్ర గమనాన్ని ఈ విధంగా గ్రహిస్తారు. అందుకే ఆ బుధులు (వైరాగ్యంతో) సంసారచక్ర బంధాలను ఛేదిస్తారు.”

సుబ్రహ్మణ్యస్వామి దగ్గర

 సుబ్రహ్మణ్యస్వామి దగ్గర కోడిపుంజు ఎందుకు....!!


🌿సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వాహనం ఏది అంటే నెమలి అని ఠక్కున చెప్పేస్తారు. కానీ ఆయన చిత్రాల్లో ఓ మూలన కోడిపుంజు కూడా కనిపిస్తుంది. 

మన దగ్గర తక్కువే కానీ... తమిళనాడులో అయితే కార్తికేయుని ఆలయాలలో కోడిపుంజులని పెంచుతుంటారు. 


🌸ఇంతకీ కార్తికేయునికీ, కోడిపుంజుకీ మధ్య అనుబంధం ఏమిటి? ఈ విషయం తెలియాలంటే ఆయన జన్మవృత్తాంతాన్ని ఓసారి గుర్తుచేసుకోవాల్సిందే!


🌿దక్షయజ్ఞంలో తన భార్య సతీదేవి మరణించడంతో శివుడు తీవ్ర వైరాగ్యంలో మునిగిపోయాడు. ఒక పక్క శివునికి భార్య లేదు, మరో వివాహం చేసుకునే స్థితిలోనూ లేడు.


🌸 ఇలాంటి సమయంలో ఆయనకి సంతానం కలిగే అవకాశం లేదని ముల్లోకాలూ భావించాయి. తారకాసురుడు, శూరపద్ముడు అనే రాక్షసులు ఇదే అదనుగా భావించారు.


🌿 తమకి శివుని కుమారుని చేతిలో తప్ప అన్యుల చేతిలో మరణం రాకూడదన్న వరాన్ని పొందారు. వరాన్ని పొందిన ఆ రాక్షసులు ఆగడాలకు అంతులేకుండా పోయింది. 


🌸ఏకంగా స్వర్గం మీదకే దండెత్తి ఇంద్రుని జయించారు. ఇలాంటి పరిస్థితిలో దిక్కు తోచని దేవతలు శివుని వైరాగ్యాన్ని భగ్నం చేయమంటూ ఆ మన్మథుని వేడుకున్నారు. 


🌿కానీ ఆ ప్రయత్నం చేయబోయిన మన్మథుడు, శివుని కోపానికి గురై భస్మమైపోయాడు. ఆ సమయంలో శివుని నుంచి వెలువడిన కాంతిపుంజమే కార్తికేయునిగా అవతరించింది.


🌸శివుని కాంతిపుంజాన్ని అగ్నిదేవుడు సైతం భరించలేకపోయాడు. ఆయన దానిని గంగానదిలో విడిచిపెట్టాడు. అలా గంగానదిలోని రెల్లు పొదల మధ్య జన్మించిన కార్తికేయుని, ఆరుగురు అక్కచెల్లెళ్లు (కృత్తికలు) పెంచారు.


🌿 కొన్నాళ్లకి కార్తికేయుడు తన తల్లిదండ్రులను చేరుకున్నాడు. తను అవతరించిన కారణాన్ని తెలుసుకున్న కార్తికేయుడు, తారకాసురుని మీద యుద్ధానికి బయల్దేరాడు.


🌸ఏకాదశ రుద్రులు తోడురాగా, తల్లి పార్వతీదేవి ఇచ్చిన వేలాయుధాన్ని చేపట్టి కార్తికేయుడు యుద్ధానికి బయల్దేరాడు. తమిళనాడులోని తిరుచెందూరు ప్రాంతం వద్ద కార్తికేయునికీ, రాక్షసులకీ మధ్య ఘోర యుద్ధం జరిగిందని చెబుతారు. 


🌿అక్కడి సముద్రతీరాన శూరపద్ముడూ, తారకాసురుడూ కలిసి కార్తికేయుని ఎదిరించే సాహసం చేశారు. కార్తికేయుడు మరెవ్వరో కాదు సాక్షాత్తూ ఆ శివుని కుమారుడే అన్న విషయం శూరపద్మునికి తెలిసిపోయింది. 


🌸కానీ వెనకడుగు వేయలేని పరిస్థితి. పైగా దేవుని సైతం ఎదిరించాలనిపించే రాక్షసప్రవృత్తి. దాంతో రొమ్ము విరుచుకుని కార్తికేయుని మీదకు యుద్ధానికి బయల్దేరాడు. 


🌿కానీ యుద్ధంలో తన సైనికులు, సహచరులంతా ఒకొక్కరే మరణించడం చూసి శూరపద్మునికి భయం పట్టుకుంది.

శూపద్ముడు ఒక మామిడిచెట్టు రూపాన్ని ధరించి కార్తికేయునికి నుంచి దాక్కొనే ప్రయత్నం చేశాడు. 


🌸కానీ ఆ షణ్ముఖుని కంటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా! కార్తికేయుడు తన వేలాయుధంతో ఆ మామిడిచెట్టుని రెండుగా చీల్చాడట. దాంతో చెట్టులోని సగభాగం నెమలిగానూ, రెండో సగం కోడిపుంజుగానూ మారిపోయాయి.


🌿 నెమలిని తన వాహనంగానూ, కొడిపుంజుని తన ధ్వజంగానూ మార్చుకున్నాడు కార్తికేయుడు.

30, మే 2026, శనివారం

ఆదివారం*🌞 *🌹31, మే, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌞 *ఆదివారం*🌞

  *🌹31, మే, 2026🌹*

  *దృగ్గణిత పంచాంగం* 

               

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*అధిక జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం* 


*తిథి : పౌర్ణమి* మ 02.14 వరకు ఉపరి *కృష్ణ పాడ్యమి*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : అనూరాధ* సా 04.12 వరకు ఉపరి *జ్యేష్ఠ*

*యోగం : సిద్ధ* పూర్తిగా రోజంతా *రాత్రితో సహా*

*కరణం  : బవ* మ 02.14 *బాలువ* రా 03.25 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 07.00 - 09.00 మ 02.00 - 04.30*     

అమృత కాలం  : *శేషం ఉ 06.21 వరకు*

 అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.31*

*వర్జ్యం    : రా 10.29 - 12.17*

*దుర్ముహూర్తం  :సా 04.52- 05.44*

*రాహు కాలం  :సా 04.59- 06.36*

గుళికకాళం     : *మ 03.21 - 04.59*

యమగండం   : *మ 12.05 - 01.43*

సూర్యరాశి : *వృషభం*           

చంద్రరాశి : *వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 05.41* 

సూర్యాస్తమయం :*సా 06.47*

*ప్రయాణశూల  : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం        :*ఉ 05.34- 08.10*

సంగవ కాలం        :*08.10 - 10.47*

మధ్యాహ్న కాలం    :*10.47 - 01.23*

అపరాహ్న కాలం  :*మ 01.23- 04.00*

*ఆబ్ధికం తిధి        : శూన్య తిథి*

సాయంకాలం    :*సా 04.00- 06.36*

ప్రదోష కాలం      :*సా 06.36- 08.48*

రాత్రి కాలం         :*రా 08.48 - 11.43*

నిశీధి కాలం        :*రా 11.43 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.06 - 04.50*

■■■■■■■■■■■■■■■■■■■■

               *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


   *సవిత్రే నమః వామచక్షుషి* 

            *మాం రక్షతు*


*🙏 ఓం నమో సూర్యదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

ఆన్లైన్లో హోమియోపతి వైద్యం

  ఆన్లైన్లో హోమియోపతి వైద్యం

 కొరకు సంప్రదించండి


 దీర్ఘకాల రోగములకు చక్కటి చికిత్స కలదు 


తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషలలో ఏ భాషలోనైనా డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు.


మీ సమస్యని తెలుపుకొని చికిత్స తీసుకోగలరు.


మందులు మీ ఇంటికి ఆన్లైన్లో కొరియర్ ద్వారా పంపించబడును.


వివరాలకు 9035231905 నెంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు . 


మీ పేరు,

వయస్సు, 

లింగము 

మీ చిరునామా

 మీ సమస్యను క్లుప్తంగా వివరించండి 


మీరు ఏ భాషలో డాక్టర్ గారి ని సంప్రదించదల్చారు పేర్కొనండి 


తరువాత డాక్టర్ గారే మీకు ఫోను చేసి మీతో మాట్లాడగలరు.

డాక్టర్ గారి ఫీజు మందుల ఖర్చులు అడిగి తెలుసుకోండి


డాక్టర్ సాయి అఖిల


 స్త్రీల రోగముల నిపుణురాలు

_*శ్రీ రామ

 _*శ్రీ రామ జయరామ జయజయ రామరామ...!!*_

రామనామం మహా పవిత్రమైంది. రామనామ మహిమకు అటు ఆధ్యాత్మిక, ఇటు వైజ్ఞానిక కారణాలు ఎన్నో ఉన్నాయి. రామనామాన్ని అధికంగా ఉచ్చరించడం ద్వారా వ్యక్తిలో తేజస్సు పెరుగుతుంది. సమస్యలను పరిష్కరించుకునే శక్తి ఉత్పన్నమవుతుంది. తమకు అధికార సిద్ధి పరిపూర్ణంగా కలుగుతుంది. అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది.


భారతీయ మంత్రశాస్త్రం ప్రకారం అక్షరాలలో ‘రం’ అనేది అగ్ని బీజాక్షరం. దీనిని ఉచ్చరిస్తూ ఉంటే శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే, రామ తారక మంత్రంలోనూ అన్నీ రేఫలే (ర) ఉంటాయి. చాలామంది దేవతల పేర్లలోనూ ‘ర’ అనేది లేకుండా ఉండదు. ఉదాహరణకు శంకర, రమా, అపర్ణ, సరస్వతి, పార్వతి, సుబ్రహ్మణ్య, గాయత్రీ, ఈశ్వర మొదలైనవి చాలా ఉంటాయి. భాషాశాస్త్రం ప్రకారం ‘రం’ అక్షరాన్ని ‘ట్రిల్స్‌' అంటారు. ఈ అక్షరాన్ని ఉచ్చరిస్తుంటే మన నాలుక కొన్ని వేలసార్లు కంపనాలు పొందుతుంది. ఆ కంపనాలు నరాల వ్యవస్థ ద్వారా శరీరంలో అంటుకుపోయిన మలినాలను తొలగిస్తాయి. దానివల్ల శరీరంలోని వేర్వేరు ‘బ్లాక్స్‌' క్రమంగా కనుమరుగవుతాయి. 


శరీరంలోని అన్ని వ్యవస్థలలోని ‘బ్లాక్స్‌' తొలగిపోవడమే ‘పాపం’ దూరం కావడం. అందులోను దైవనామం బాహ్యోచ్చారణ చేసినా, అంతరోచ్చారణ చేసినా పాపనాశనమే అవుతుంది. బాహ్యోచ్చారణ ద్వారా ప్రత్యక్షంగా, అంతరోచ్చారణ ద్వారా పరోక్షంగా శరీర, మానసిక శుద్ధి కలుగుతుంది. నామాలకు ‘జయ జయ’ శబ్దాన్ని చేర్చడం ద్వారా అది ‘జయాంతమాల’ అవుతుంది. ఇటువంటివి మంత్రశాస్త్రంలో వేర్వేరుగా ఉంటాయి. శ్రీరామ శబ్దానికి ‘జయ’ శబ్దాన్ని చేర్చడం ద్వారా సర్వకార్య విజయానికి, అధికార సిద్ధికి, ఆనంద ప్రదమైన, ఆరోగ్య ప్రదమైన జీవనానికి హేతువు అవుతుంది. అందుకే, ప్రతిరోజూ ‘శ్రీరామ జయరామ జయజయ రామరామ’ అనే జపాన్ని కనీసం 3 గంటల సేపు చేద్దాం. అన్ని సమస్యలను పరిష్కరించుకునే శక్తిని పెంచుకుని, విజయాన్ని సాధించి ఆనందంగా జీవిద్దాం.

వృద్ధాప్యంలో

  వృద్ధాప్యంలో పిల్లలతో కలిసి ఉండటం"....కన్ఫ్యూషియస్ చెప్పిన ఒక గొప్ప పాఠం​...


"వృద్ధాప్యంలో మీ పిల్లలతో అతిగా కలిసి ఉండటం, విచిత్రంగా వారిని మీకు దూరం చేస్తుంది" అని కన్ఫ్యూషియస్ ఒకసారి హెచ్చరించారు. ఈ కథ 2,500 ఏళ్ల నాటిదైనా, నేటి కాలానికి, మనకు, మన తల్లిదండ్రులకు మరియు మన పిల్లలకు కూడా సరిగ్గా సరిపోతుంది.​


ఇది లీ వీ అనే వృద్ధుడి కథ. ఆయన తన మనసును వేధిస్తున్న ఒక ప్రశ్నతో గొప్ప తత్వవేత్త అయిన కన్ఫ్యూషియస్ దగ్గరకు వెళ్ళాడు...


“మహాశయా, మన జీవితమంతా పిల్లల కోసమే ధారపోసిన తర్వాత కూడా... వృద్ధాప్యంలో మనం ఎందుకు ఒంటరిగా మిగిలిపోతున్నాము?" అని అడిగాడు.​


లీ వీ చెడ్డ తండ్రి కాదు. నిజానికి, ఆయన తన పిల్లల కోసం సర్వస్వం ఇచ్చాడు. వారు దేనికీ లోటు లేకుండా ఉండాలని అహర్నిశలు కష్టపడ్డాడు. వారు సుఖంగా ఉండాలని తన సౌకర్యాలను త్యాగం చేశాడు. పిల్లలు పెరిగి, పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడినప్పుడు, ఇక తాను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని లీ వీ భావించాడు. తన ఇంటిని అమ్మివేసి కొడుకు దగ్గరకు వెళ్ళాడు. కుటుంబం,మనవళ్లు, మనవరాళ్లతో కలిసి ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుందని నమ్మాడు.​ కానీ ఆయన ఆశించిన సంతోషం దక్కలేదు. ఇల్లు కుటుంబంలోని అందరితో నిండిఉన్నా సరే , ఆయన హృదయం మాత్రం వెలితిగానే ఉండేది. పగలు అందరూ బిజీగా ఉండేవారు. సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చి, ప్రశాంతతను కోరుకునేవారు. వారు లీ వీ మాటలను అరకొరగా వినేవారు. ఆయన ఇచ్చే సలహాలు వారిని విసిగించేవి. ఆయన ఉనికిని వారు ఒక భారంగా భావించడం మొదలుపెట్టారు. ఆయన వారి దగ్గరికి చేరాలని ప్రయత్నించే కొద్దీ... వారు మరింత దూరమవుతూ వచ్చారు.​సమాధానం అన్వేషణ​ కోసం


లీ వీ కన్ఫ్యూషియస్ దగ్గరకు వెళ్లి తన బాధను ఇలా చెప్పుకొచ్చాడు...


“గురువుగారు, నా జీవితాన్ని పిల్లల కోసమే అంకితం చేశాను. వృద్ధాప్యంలో వారి దగ్గర ఉంటే నాకు శాంతి, ప్రేమ దొరుకుతాయని అనుకున్నాను. కానీ నేను అక్కడ ఎవరికీ అవసరంలేని వ్యక్తిలా మారిపోయాను... ఎందుకు?”​కన్ఫ్యూషియస్ ఆయనను వట్టి మాటలతో ఓదార్చలేదు. బదులుగా మూడు చిన్న పాఠాలు నేర్పాడు.​


అందులో మొదటి పాఠం...


ఆయన ఒక కూజాను తీసుకొని అంచు వరకు నీటితో నింపారు. “ఇందులో ఇంకా నీళ్లు పోస్తే ఏమవుతుంది?” అని అడిగారు.“అవి పొంగిపొర్లుతాయి,” అని లీ వీ జవాబిచ్చాడు.“సరిగ్గా అంతే,” అన్నారు కన్ఫ్యూషియస్. “సంబంధాలు కూడా ఇలాగే ఉంటాయి. ఇప్పటికే నిండిపోయిన ఒక ప్రదేశంలో మనం బలవంతంగా దూరాలని చూస్తే, అక్కడ అసమతుల్యత ఏర్పడుతుంది. నీ పిల్లలు ఎదగడానికి నువ్వు ఒక ఇల్లు కట్టావు. కానీ ఇప్పుడు నువ్వు మళ్లీ ఆ ఇంటికి కేంద్రం కావాలని చూస్తున్నావు. వారి జీవితాలకు ఇప్పటికే ఒక కేంద్రం ఉంది.అదే వారి స్వంత జీవితం, వారి పిల్లలు. ఖాళీ లేని పాత్రలో నువ్వు నిన్ను పోసుకోవాలని చూస్తున్నావు".


ఇక ​రెండవ పాఠం...


ఒకదానికొకటి అతి దగ్గరగా పెరుగుతున్న రెండు చెట్లను కన్ఫ్యూషియస్ చూపించారు. వాటి కొమ్మలు సూర్యరశ్మి కోసం ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి ఉన్నాయి.


“చెట్లు అతి దగ్గరగా పెరిగితే ఏమవుతుంది?” అని అడిగారు.“అవి ఒకదాని ఎదుగుదలను ఒకటి అడ్డుకుంటాయి,” అని లీ వీ అన్నాడు.“అవి బలంగా పెరుగుతాయా?...లేదు...అవి బలహీనంగా, ఆకారం లేకుండా మారిపోతాయి. జీవితంలో కూడా అంతే,” అన్నారు కన్ఫ్యూషియస్. “దగ్గరగా ఉండటమే ఐక్యత అని మనం అనుకుంటాం. కానీ అతి సామీప్యం ఒత్తిడిని కలిగిస్తుంది. పెరుగుదలకి కొంత ఖాళీ ప్రదేశం అవసరం".


మూడవ పాఠంగా...


కన్ఫ్యూషియస్ కొంచెం ఇసుకను తీసుకుని పిడికిలిని గట్టిగా బిగించారు.“నేను ఇలా గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది?”


“అది మీ వేళ్ల సందుల నుండి జారిపోతుంది,” అని లీ వీ చెప్పాడు.“మనుషుల మధ్య సంబంధాలు కూడా అంతే,” అని కన్ఫ్యూషియస్ బదులిచ్చారు. “ప్రేమ, గౌరవం ఒత్తిడిలో పెరగవు. నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటే, ఎంతగా సామీప్యాన్ని కోరుకుంటే... అది అంత వేగంగా మాయమవుతుంది. స్వేచ్ఛను ఇవ్వు, నీకు చెందాల్సింది నీ దగ్గరే ఉంటుంది."


"నువ్వు ఒక చెట్టును నాటినప్పుడు, వృద్ధాప్యంలో అది నీకు నీడ ఇస్తుందని ఆశిస్తావా?” అని కన్ఫ్యూషియస్ అడిగారు.“లేదు గురువుగారు. అది పెరగాలని నేను నాటుతాను. అది నీడ ఇస్తే అది ఒక బహుమతి మాత్రమే, తప్పనిసరి కాదు.”


“మరి నీ పిల్లల విషయంలో ఎందుకు వేరుగా ఆలోచిస్తున్నావు? నువ్వు వారిని నీ కోసం పెంచలేదు.ఈ ప్రపంచం కోసం పెంచావు.”​


మొదటిసారి లీ వీకి అసలు విషయం అర్థమైంది.​


తరువాత కన్ఫ్యూషియస్


లీ వీ కు కొన్ని విత్తనాలతో ఉన్న సంచిని ఇచ్చాడు.“నువ్వు ఇంకా మొక్కలు నాటవచ్చు. ఇంకా నేర్పించవచ్చు. ఇంకా నేర్చుకోవచ్చు. వృద్ధాప్యం అంటే వేచి ఉండటం కాదు...అది కొత్త ఆరంభాల సమయం.


పిల్లల నుండి ప్రేమ కోసం ఎదురుచూడకు. నీకు నచ్చిన పనిని మొదలుపెట్టు.”​ అని బోధించాడు.


లీ వీ తిరిగి తన గ్రామానికి వెళ్ళాడు...కానీ కొడుకు ఇంటికి కాదు. ఒక పాఠశాల దగ్గర చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. తనకు తెలిసిన విద్యను, కథలను పంచుకున్నాడు. వారితో కలిసి చెట్లను నాటాడు. త్వరలోనే అందరూ ఆయనను ‘మాస్టర్ లీ’ అని పిలవడం మొదలుపెట్టారు.​ఆయన తన ఉనికిని ఇతరులపై రుద్దడం మానేసే కొద్దీ, ఆయనపై గౌరవం పెరిగింది. ఆయన శ్రద్ధను ఆశించడం మానేసే కొద్దీ, అందరూ ఆయనను ప్రేమగా చూడటం మొదలుపెట్టారు.​


ప్రేమ తిరిగి వచ్చిన వేళ​ ఒకరోజు కొడుకు నుండి ఉత్తరం వచ్చింది. “నాన్నా, నువ్వు వెళ్లి చాలా కాలమైంది. మేమంతా నిన్ను మిస్ అవుతున్నాము. పిల్లలు నీ గురించి అడుగుతూనే ఉన్నారు. మమ్మల్ని చూడటానికి రా.


మాతో ఉండటానికి కాదు, మాతో గడపడానికి రా.


”​లీ వీ వెళ్ళినప్పుడు, ఆయనకు సాదర స్వాగతం లభించింది.


ఏళ్ల తర్వాత మొదటిసారి ఆయన తనను తాను ఒక భారంగా కాకుండా, ఒక ఆత్మీయ అతిథిగా భావించాడు.​


అప్పుడే ఆయనకు అర్థమైంది...ఎప్పుడైతే ఆయన ప్రేమను ఆశించడం మానేశాడో... అప్పుడే అది వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చిందని .​


ఈ కథ ఇచ్చే సందేశం​“వృద్ధాప్యంలో పిల్లలతో కలిసి ఉండటం తప్పు” అని కాదు. నిజమైన సామీప్యం స్వేచ్ఛ నుండి పుడుతుంది...బాధ్యత లేదా బలవంతం నుండి కాదు.​


మనం ఎదుటివారి ఉనికిని శాసించాలని చూస్తే, వారిని ఊపిరి ఆడకుండా చేస్తాము. మనల్ని మనం వారిపై రుద్దితే, మనం వారికి అదృశ్యమైపోతాము.


ఎప్పుడైతే మనం పట్టు వదులుతామో, అప్పుడే మనం వారి మనసుల్లో స్థానం పొందుతాము.​


కన్ఫ్యూషియస్ చెప్పినట్లు...


ప్రేమ మరియు గౌరవాన్ని డిమాండ్ చేయలేము. వాటిని కేవలం పోషించగలం.


నిజం కదా మేము పెంచాము పెద్దవాళ్ళను చేసాము. మేము పెద్దవాళ్ళము అయ్యాము ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు చూడాలి. ఇది ఇచ్చి పుచ్చుకోవాటమ్ లాంటి ది.

ఆలా కాకుండా పెంచు, చదివించు, ప్రయోజకులను చెయ్యి, తరువాత ఆశించకు వాళ్ళనుంచి.

ఇప్పటి కాలం లవ్ అస్సలు జరగని పరిస్థితి. పెద్దాయన చెప్పినట్లు ఎదో ఒక పని చెయ్యి. ఎదో ఒక సహాయం చేస్తున్నావ్ ఉండు. బిడ్డలు వారంతట వారే మారతారు.


లాస్ట్ గా పిల్లలకు చెయ్యటం నే బాధ్యత.

గీతలో చెప్పినట్లు ఖర్మ ను చెయ్యి. ఫలితం ఎదురు చూడకు వాళ్ళు తిరిగి నీలాగా చెయ్యాలని ఆశించకు.


    🌿సుల్తానా. తిరుపతి 🌿

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

      *శనివారం 30 మే 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*                               

          *104 వ భాగం*

     

       *శ్రీకృష్ణావతారము-7*


      *కాళీయ మర్దనము*```


కృష్ణుడు, గోపబాలురు గోవులను కాచే ప్రదేశం సమీపంలో ఒక నీటి మడుగుఉంది. వర్షాకాలంలో యమునా నది పొంగి ప్రవహించే సమయంలో నీరు ఆ మడుగు లోకి వచ్చి చేరేది. అంతుతెలియని లోతు కలిగిన ఆ నీటి మడుగు దగ్గరకు అక్కడివారు ఎవ్వరు వెళ్లేవారు కాదు. ఆ నీరు సలసల కాగుతున్నట్టు ఉండి వేడి విషపు పొగలు చిమ్ముతూ ఉంటుంది.


పొరబాటున ఆ నీరు త్రాగే జంతువులు, ఆ మడుగు పై ఎగిరి విషపు గాలి పీల్చేపక్షులు నల్లబడి కింద నీటిలో చనిపోయేవి. నీరు త్రాగడానికి వచ్చే జంతువులను, ఆ మడుగులో ఉండే కాళీయుడు అనే ఐదు తలల మహాసర్పము తన తోకతో పట్టి లాగి తినేసేది.  తెలిసిన గోపాలురు తమ గోవులను మడుగు సమీపానికి వెళ్ల కుండా చూసేవారు.


కృష్ణుడి మధుర మురళీగానంలో మునిగిపోయి గోపాలురుండగా ఒక గోవత్సము(దూడ)  చెంగు చెంగున ఎగురుతూ కాళీయమడుగు తీరానికి వెళ్లింది. గోపబాలుడు ఒకడు చూసి దానిని మళ్ళించుకురావడానికి పరుగెత్తి వెళ్లాడు.  గోపబాలుడు పట్టుకునేలోపు మడుగు నుంచి ఐదు తలల కాళీయ సర్పము లేచి తన తోక చాచి తీరాన ఉన్న ఆవుదూడను చుట్టుకుని పట్టుకుని మడుగు లోకి లాగివేసింది. ఆవుదూడ భయంతో అంబా అంబా అని అరుస్తుంటే గోపబాలుడు భయ పడి పరిగెత్తుకుంటూ కృష్ణుడి వద్దకు వచ్చాడు.


“కన్నయ్యా! మన దూడను మడుగులో ఉండే సర్పం పట్టుకుని నీళ్ళ లోపలికి లాగేసింది” అని ఏడుస్తూ కృష్ణుడికి చెప్పాడు. కృష్ణుడు వెంటనే చెట్టు మీద నుంచి దిగి మడుగు దగ్గరికి పరిగెత్తుకు  వెళ్లాడు. బలరాముడు, గోపబాలురు వెంట పరిగెత్తారు.  మడుగు దగ్గరకు వెళ్లిన కృష్ణుడు అక్కడ ఉండే పెద్ద చెట్టు పైకెక్కి మడుగు మధ్యకు వ్యాపించిన చెట్టు కొమ్మను చేరి ఆవుదూడను సర్పము నీట ముంచుతున్న ప్రదేశంలోకి దూకాడు.


బలరాముడు నిబ్బరంగా ఉన్నా, చూస్తున్న గోపబాలురు భయ పడ్డారు. హాహాకారాలు చేశారు. కొందరు నంద యశోదలకు చెప్పడానికి గ్రామానికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. నీటిలో దూకిన కృష్ణుడు సర్పము తోకకు చుట్టుకుని అరుస్తున్న ఆవుదూడను విడదీసి ఒడ్డుకు నీటినుండే విసిరేశాడు. బలరాముడు పట్టుకుని ఆ దూడకు సపర్యలు చేశాడు.


కాళీయ సర్పానికి తన బంధనం నుంచి దూడను విడిపించిన కృష్ణుడిపై ఆగ్రహం వచ్చింది. కృష్ణుని తోకతోచుట్టి నాగపాశంతో బంధించి తన పడగల నుంచి విషపు గాలులు కృష్ణుని పైకి వదిలాడు. బాలకృష్ణుడు సృహ తప్పాడు.


తరువాత కథ చెప్పే ముందు కాళీయుడు ఎవరో చెబుతాను..   


రసాతలంలో కాళీయుడు అనే సర్పరాజు భార్యలు, పిల్లలు, సేవకులతో నివసించేవాడు. 

తన విషపు అగ్ని జ్వాలలతో రసాతల వాసులను భయ భ్రాంతులను చేసేవాడు. దొరికిన వారిని చంపి ఆహారంగా తీసుకునేవాడు. రసాతల వాసులు గరుత్మంతుడితో మొర పెట్టుకుని కాళీయుని నుంచి రక్షించమని కోరారు. గరుత్మంతుడు కాళీయుని చంపడానికి బయలుదేరి వెళ్లాడు.


గరుత్మంతుడు వస్తున్నాడని తెలుసుకున్న కాళీయుడు ప్రాణాలు రక్షించుకోవడానికి తనవారిని తీసుకుని సముద్రం ద్వారా యమునకు, యమున నుంచి నీటి మడుగుకు వచ్చి దాక్కున్నాడు. మడుగు సమీపానికి వచ్చే జంతువులను, మనుషులను చంపి ఆకలి తీర్చుకోసాగాడు. కాళీయుని విషానికి మడుగు నీరు విషపూరితమై త్రాగడానికి పనికిరాకుండా పోయింది.


ఇక కథలోకి వస్తే, సమాచారం తెలిసిన నందుడు యశోద గోపికలు గోపబాలురతో కలసి కాళింది మడుగు దగ్గరకు వచ్చారు. కృష్ణుడు కనపడలేదు. కాళింది మడుగు మధ్య నుండి ఉబుకుతున్న వేడి నీరు, పొగలుగా చిమ్ముతున్న విషపు జ్వాలలు చూసి యశోద “కన్నయ్యా” అంటూ దుఖంతో సృహతప్పింది. నందుడు, గోపికలు,గోపాలురు దుఖిస్తున్నారు. మడుగులోకి వెళ్లే సాహసం ఎవ్వరికీ లేదు.


బలరాముడికి తన అవతారాంశ జ్ఞప్తికి వచ్చి మడుగులోపల సృహ తప్పి కాళీయుడి బంధనంలో చిక్కిన కృష్ణుని కన్నులు మూసుకుని దివ్యదృష్టితో చూశాడు. మనస్సులోనే నమస్కరిస్తూ “శ్రీహరీ! మీ అవతారాన్ని లోకానికి చూపించే సమయం వచ్చింది. సృహకి వచ్చి కాళీయుడికి బుద్ది చెప్పి శిక్షించండి. లేదంటే నా ఆదిశేష రూపము ప్రకటించవలసి వస్తుంది” అని ప్రార్ధించాడు.


మడుగులో నాగపాశానికి బందీ అయ్యి సృహతప్పిన కృష్ణుని బలరాముని ప్రార్ధన మేలుకొలిపింది.  క్షణంలో  శరీరము సవరించుకొని ఒక్క ఉదుట్న నాగపాశం నుండి విడిపించుకున్నాడు. చేతిలో కాళీయుడి తోక చివరి భాగం పట్టుకుని చటుక్కున కాళీయుడి పడగల పైకి ఎగిరాడు. కాళీయుని పడగలను పాదాలతో మర్ధిస్తూ నాట్యం చేయసాగాడు.


కృష్ణుడి పాద ధాటికి కాళీయుడి ఐదు పడగల నుంచి విషం,రక్తం బయటకు వచ్చాయి. మడుగు మధ్య నుండి రక్తము ఉబికి రావడంతో నందుడు గోపాలురు హాహాకారాలు చేశారు. బలరాముడు వారికి “కృష్ణుడికి ఏమి కాలేదు” అని ధైర్యం చెబుతూ త్వరలో మడుగు నుంచి సురక్షితంగా కృష్ణుడు వస్తాడని హామి ఇచ్చాడు.


కాళీయుడి రక్తం అంతా పోయింది. ప్రాణాలు మరికొన్ని క్షణాలలో పోతాయి అనుకునే సమయంలో కాళీయుని పత్నులు కృష్ణుడి ముందుకు వచ్చి చేతులు జోడించి  పతికి ప్రాణభిక్ష పెట్టమని ప్రార్ధించారు. కాళీయుడు కూడా ‘పాహి మాం కృష్ణా’ అని శరణు వేడాడు. 


కృష్ణుడు శాంతించి “మీరు తక్షణమే ఈ మడుగు వదలి రసాతలం వెళ్లి పోవాలి. నా అడుగుల ముద్రలు పడగల పైన ఉండటంతో గరుత్మంతుడు కాళీయుని ఏమీ చేయడు. ఇక జీవ జంతువులను విషంతో చంపకుండా రసాతలంలో లభించేవి తిని ఆకలి తీర్చు కోవాలి. ఇలా ప్రమాణం చేస్తే వదిలేస్తాను. ఈ మడుగు ఇకనుంచి కాళింది మడుగు అనే పేరుతో ప్రసిద్దమవుతుంది” అన్నాడు.


కాళీయుడు అంగీకరించాడు. పడగలపై వేణుగానం పలికిస్తూ నాట్య భంగిమలో ఉన్న తనను నీటి పైకి తీసుకెళ్లమని కాళీయుని కృష్ణుడు ఆదేశించాడు. కాళీయుడు కృష్ణుని మడుగు నీటి నుండి పైకి తీసుకొచ్చాడు.  కాళీయుడి పడగల పై వేణుగానం చేస్తూ నృత్యభంగిమలో ఉన్న కృష్ణుని నందుడు, గోపాలురు, గోపికలు, గోపబాలురతో పాటు అప్పుడే సృహలోకి వచ్చిన యశోద చూసి ఆనందించింది. గోపాలురు హర్షధ్వానాలు చేసారు.


కాళీయుడు శ్రీకృష్ణుని తీరాన దించి తన భార్యలు, పిల్లలు, పరివారంతో మడుగు వదలి రసాతలానికి వెళ్లి పోయాడు. యశోద నందులకు తమ కుమా రుడు దివ్యబాలుడు, నారాయణుడి అవతారమని అర్ధమయ్యింది. కృష్ణుడికి అర్ధం అయ్యి యశోదను కుదుపుతూ “అమ్మా! చాలా ఆకలిగా ఉంది. వెన్న పెట్టవా అమ్మా!” అని మారాం చేస్తూ ముద్దు ముద్దుగా అడిగాడు. 


యశోద పై విష్ణుమాయ ప్రభావం పడి భగవంతుడు అనే మాట మరచిపోయింది. మాతృప్రేమ బయటకు వచ్చి “పదరా కన్నా! ముందు దిష్టి తీసి తరువాత కడుపు నిండేంత వెన్న తింటానికి  ఇస్తాను" అంటూ చేయి పట్టుకుని ఇంటికి తీసుకెళ్లింది. బలరాముడు నందుడు ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు.


*తరువాత కథ  రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

గొప్ప వారు ఎవరు

 *గొప్ప వారు ఎవరు - మంచి వారు ఎవరు???*


ఈరోజుల్లో చాలా మంది మా పిల్లవాడు చాలా గొప్ప వాడు కావాలి, చాలా చదువు చదవాలి, చాలా గొప్ప పేరు ప్రతిష్టలు తేవాలి అని ఆత్రుత పడుతుంటారు...!!

 మరి కొంత మంది తలితండ్రులు నా కుమారుడు చాలా మంచి వాడు కావాలని అని కోరుకుంటారు!!... 

ఈ రెండింటిలో చాలా వ్యత్యాసం ఉంది,

గొప్పవాడు కావాలని కోరేటువంటి తల్లి, సరియైనటువంటి కోరిక కాదు.  

నీవు గొప్పవాడు కావాలనుకుంటే, గొప్ప లావా ? లేక ఎత్తా? లేకపోతే గొప్ప పేరు ప్రతిష్టలా ? లేక శ్రీమంతుడా? లేక బలవంతుడా? లేక గుణవంతుడా? మంచి పేరు అనేటువంటిది గుణముతో వస్తుంది.


కనుకనే... *గొప్పవాడు రావణుడు, మంచి వాడు రాముడు*.  

చదివినటువంటి చదువులు అన్నియు కూడను ప్రాక్టికల్ లో పెడుతూ వచ్చాడు రాముడు, ఆచరించి చూపాడు రాముడు,...


కానీ ఎన్నియో చదువులు చదివాడు రావణుడు, కానీ ఆచరించలేదు, అజ్ఞానం ఆవరించిపోయింది.  

కనుకనే అతనికి గొప్ప పేరు వచ్చింది కానీ, మంచి పేరు రాలేదు.  


"రాముడు ఆచరించి, ఆనందించి పది మందికి పంచి పెట్టినటువంటి వాడు కనుకనే, అతనికి మంచి పేరే వచ్చింది కానీ, గొప్ప పేరు రాలేదు."

ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, మన పిల్లవాడు రాముడు కావాలా, రావణుడు కావాలా అని!!...


          *_శుభమస్తు_*

🙏 శ్రీ సద్గురు పీఠం నుండి....✍️

సమస్త లోకా సుఖినోభవంతు 🙏

న్యాయం సాధించడానికి

 న్యాయం సాధించడానికి అసాధారణ పద్ధతులను ఉపయోగించడం గురించిన మన అవగాహనపై మహాభారతం వంటి కథలు ఎలాంటి ప్రభావం చూపుతాయి?



ధర్మరాజు యక్షుడితో సంవాదం


యదిహాస్తి తదన్యత్ర

యన్నేహాస్తి నతత్ క్వచిత్ "

- ఆది పర్వం, మహాభారతం


ధర్మం, అర్ధం, కామం, మోక్షం అనే నాలుగు సద్గుణాల గురించి మహర్షి వ్యాసుడు ఇలా అన్నారు: మహాభారతంలో లభించే సమాచారమే బయట కూడా లభిస్తుంది. మహాభారతంలో లభించని ఏ సమాచారమైనా మరెక్కడా ఎప్పటికీ బయట లభించదు " అని.


మహర్షి విశ్వాసం అలాంటిది.


విదురనీతి ఓ అద్భుత సంకలనం. యక్షుని ప్రశ్నలకు ధర్మరాజు ఇచ్చిన సమాధానాలు ఉత్తమం. మేధావులు నేటికీ ఆ గ్రంథాల ద్వారానే మార్గనిర్దేశం పొందుతున్నారు.


శాంతి పర్వంలో భరద్వాజ, భృగు మహర్షుల మధ్య చెట్ల గురించి జరిగిన చర్చ అత్యుత్తమమైనది. దానిలో చెట్లకు ప్రాణం, స్పర్శ జ్ఞానం, ప్రతిస్పందించే సామర్థ్యం, ​​చూసే శక్తి, వినే సామర్థ్యం ఉన్నాయని ప్రస్తావించబడింది—ఇది ఎంతటి అద్భుతమైన జ్ఞానం.


వేల సంవత్సరాల తర్వాత, ఇంత కాలం గడిచాక, కేవలం ఇప్పుడే—విదేశీ శాస్త్రవేత్తలు క్రమంగా ఈ వాస్తవాలను కనుగొనడం ప్రారంభించారు.


అయినప్పటికీ, మన భారతీయ వృక్షశాస్త్రవేత్త అయిన జగదీష్ చంద్ర బోస్ ఈ భావనలను వివరించిన తర్వాతే, విదేశీ పరిశీలకులు మరియు శాస్త్రవేత్తలు చివరకు సత్యాన్ని గ్రహించారు.


చాలా మంది బోస్‌పై తన " రేడియో " ఆవిష్కరణకు పేటెంట్ పొందమని ఒత్తిడి చేశారు, కానీ ఆయన, “నాకు పరిశోధనపై మాత్రమే ఆసక్తి ఉంది, డబ్బు సంపాదించడంపై కాదు” అని అన్నారు. మార్కోనీ బోస్ ఈ ఆవిష్కరణను ఉపయోగించుకున్నారు. ఆ సమయంలో బోస్ జాతి వివక్షను ఎదుర్కొన్నారు, మరియు ఆయన చేసిన సేవలు విస్మరించబడ్డాయి . మార్కోనీ 1909లో రేడియో రంగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు.


ఈ విషయం " మన విజ్ఞానం ఎటువంటిదో, దేనికోసమో " కుహనా మేధావులకు తెలియచేయడం కోసమే.


అలాంటి పరిస్థితుల్లో, ఇతిహాసాలలోని సమాచారం అసాంప్రదాయ పద్ధతులకు ఎలా మద్దతునిస్తాయి.

ఇతిహాసాలు కేవలం ధర్మబద్ధమైన మరియు సాంప్రదాయ పద్ధతులను మాత్రమే అందిస్తాయి.


శుభమస్తు

*దైవం తో సంబంధం ఎలా??...*

 *దైవం తో సంబంధం ఎలా??...*

భగవంతునితో సఖ్యత పెంచుకోవాలి, జపం, పూజ, ధ్యానం, వ్రతాలు మాత్రమే భక్తి కాదు!!... 

అవికూడా చేయవలసినవే! ఇవి రోజూ చేయడంవలన మనకు దైవంతో అనుబంధం, ప్రేమ పెరగుతుంది, ఆయనను ప్రేమించడం మనవిధి.


రూపనామములతో మనిషిగా దైవాన్ని గుర్తించి, ప్రేమించి పూజించడం, అంటే అది పూర్వ జన్మ సంస్కారమే. 

అందరికీ భగవంతుని తో బంధం కలగదు, ఆయన అనుగ్రహం ఉన్నవారికే అది సాధ్యం అవుతుంది...


సఖ్యత భగవంతుని తో కుదరాలంటే, ఎప్పుడూ ఆయన మన దృష్టిలో, భావనలో ఉండాలి, ప్రేమ పూర్వకంగా అతనితో ముచ్చట సలపాలి.

దేవుని చూడగానే చెంపలను కొట్టుకోవడం, నమస్కారం చేయడం మాత్రమే కాదు, నమస్కారము అంటే -

ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియములు...

ఈ పది ఇంద్రియాలతోనే మనం ప్రవర్తిస్తున్నాము. 

"ఇవన్నీ భగవంతుడు ఇచ్చినవే, " ఇవి నీవే స్వామీ, వీటిని సక్రమంగా వినియోగించు కోగలగాలి," అని ప్రార్థించాలి.

దేహములు మాత్రమే దూరముకానీ, బింబ ప్రతి బిఁబములవలె, అవినాభావ సంబంధం దైవంతో ఏర్పడుతుంది.  

   

           *_శుభమస్తు_*

🙏శ్రీ సద్గురు పీఠం నుండి...✍️

సమస్త లోకా సుఖినోభవంతు 🙏

సామాజిక స్పృహ

 *సామాజిక స్పృహ - పూర్ణ నాగరికతా చైతన్యము 8*


సభ్యులకు నమస్కారములు 


*ఓం సంగచ్చత్వం, సంవదత్వం సంవో మనాంసి జానతామ్, దేవభాగం యధా పూర్వే, సంజనానా ఉపాసతే* (ఋగ్వేద మంత్రం) అర్థం:- మనమందరం కలిసి ఉమ్మడి లక్ష్యం వైపు అడుగులేద్దాం. మన ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకుంటూ సామరస్యంగా మాట్లాడుకుందాము. మన మనసులు, ఆలోచనలు ఏకతాటిపై ఉండాలి. పూర్వ కాలంలో దేవతలందరు తమ బాధ్యతలను కల్సి పంచుకుని సామరస్యంగా ఏలా జీవించారో మనం కూడా ఆలా జీవిద్దాం. 


పై మంత్రం మరియు ఆచరణ సంఘ బలానికి ఉన్న విశిష్టతను తెలియజేస్తున్నది. ఐకమత్యమే సంఘ శక్తికి నిదర్శనం. ఆర్థిక స్వావలంబనకు, ఆత్మవిశ్వాసానికి, మానసిక ధైర్యానికి, అన్యాయాల నిలువరింతకు, దుర్మార్గాల కట్టడికి మరియు సామూహిక శ్రేయస్సుకు సామాజిక శక్తి ప్రధానం.


*ముందు అనాగరిక చర్యలు ఎలాంటివో చూద్దాము* వల్లించడానికి ఎన్నెన్నో ఆదర్శాలు, ఆచరణ ఏది. సాధారణ జన జీవితంలో మనం ప్రత్యక్ష సాక్షులుగా ఉండే ఘటనలు కొన్ని పరిశీలిద్దాము. *కాలని పేరు ఆదర్శ కాలని, లోపభూయిష్టాలకు లోటులేదు*. ఈ కాలని భారత దేశంలో ఎక్కడో మారుమూల ఉన్న కాలని కాదు. భాగ్యనగరం నడి బొడ్డున కాలని.

1) గృహాలకు Cellar భాగము ఉండదు. వాహన నిలుపుదల సౌకర్యం అమర్చుకోరు. రహదారి *వీధులను Car Garages* గా మార్చేస్తారు. *రాకపోకలు సాగించే వారికి ఇబ్బంది*.

 2) గృహముల ముందు మెట్లు, Ramps ప్రక్కకు అరుగులు, వృక్ష సంపద పేరుపై ఇంటి ప్రక్కనే కంచెలు. ప్రభుత్వ రహదారులను కబళిస్తారు. *రాకపోకలు సాగించేవారికి ఇబ్బంది*. 3) నీరు వృధాచేయరాదన్న నిబంధన ఉన్నప్పటికీ ఇంటి ముందున్న ప్రభుత్వ Cement రహదారి స్థలాన్ని శుభ్రత పేరుతో కుళాయి పైపు తో అందునా పెద్ద ధారతో నీటిని వృధా చేస్తారు. *Mop తో శుభ్రం చేయవచ్చును గాని చేయరు గాక చేయరు*. వాహనాలు వెళ్లినప్పుడు పాదచారులపై మరియు పరిసరాలపై ఆ మురికి నీళ్లు చిమ్ముతాయి. *రాకపోకలు సాగించేవారికి ఇబ్బంది*.

4) ధరలు తక్కువగా ఉన్నప్పుడు కాలనీలలో Plots కొంటారు. ఏండ్లు గడిచినా వాటిని శుభ్రంగా ఉంచుదామన్న స్పృహ ఉండదు. వాటికి సరిహద్దు (Boundary walls) గోడలు కట్టరు. ఇందుకు అదనంగా కాలనీవాసులు అందులో చెత్తా చెదారం, విరిగిన వస్తువులు, సోఫాలు వేసి ఆ స్థలాన్ని చెత్త దిబ్బలుగా మారుస్తారు. ఆ స్థలాన్ని అపరిశుభ్రతా నిలయంగా రూపుదిద్దుతారు. ఇన్ని అవకతవకలను కాలని ASSOCIATION పట్టించుకోదు. *అక్కడ ఉండే తోటివారికి ఇబ్బంది*. 


ఈలాంటి వాతావరణం మీ ప్రాంతంలో లేదా. అవుతే *ఈ విభాగంలో* మీరు నాగరికులే. ధన్యవాదములు


*చిన్నవిగానే కనబడినా పై కార్యకలాపాలన్నీ నాగరికము కానే కావు*


ధన్య*సామాజిక స్పృహ - పూర్ణ నాగరికతా చైతన్యము 7*


సభ్యులకు నమస్కారములు.


*ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా* అనేది వేద వచనం. *అర్థం*:- ధర్మమే సమస్త విశ్వానికి మరియు జగత్తుకు మూలాధారం. 

అన్నిటికంటే.... సుఖ సంతోషాలను, శాంతి భద్రతలను అందించగల్గేది *ధర్మమే* అనునది భీష్మ పితామహుడి వచనం. ఇతర ప్రాణులకు నిర్దేశింపబడనిది, మానవులకు మాత్రమే నిర్దేశించబడినది *ధర్మం*. ఆచరించగల్గిన సమర్థత కల్గిన *ప్రాణి కూడా మనుష్యుడొక్కడే.* ధర్మాన్ని ప్రారంభించాలి, కొనసాగించాలి. ఇది మానవులు ఉపేక్షించరాని సత్యము మరియు బాధ్యత. *అభివృద్ధి అయినా, నాగరికత ఐనా ప్రతి ఒక్కరు తమ తమ ధర్మాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలి*. ధర్మాన్ని ఆచరిస్తూ మనుష్యులుగా జీవిద్దామా లేక ధర్మాన్ని తప్పి *చతుష్పాదులుగా దిగజారాలా*...ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సి విషయం. 


మానవ ధర్మం అనగా మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరు నైతిక విలువలు, విధులు పాటిస్తూ సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఇవి సకల మానవాళికి కల్గి ఉండే సార్వత్రిక ధర్మాలు. 


మనిషి మనిషిలా బ్రతకాలంటే ధర్మాన్ని అనుసరించడం, అనుష్టించడంతో బాటు ధర్మ ప్రచారం గూడా అవసరమే. *ఎవరి ధర్మం వారు పాటించాలి*. ధర్మము, ధర్మాత్ములు రక్షింపబడాలి ఇది ప్రభువుల ప్రధాన ధర్మం. ఈ కాలంలో ప్రభువులు అంటే ప్రభుత్వము, ప్రభుత్వ అధినేతలు. 


ప్రభుత్వము, ప్రభుత్వాలు, చట్టము మరియు నిబంధనలు అటుంచి మానవ ధర్మాలను అవలోకిద్దాము. 1) జననీ జనకులు తమ సంతానాన్ని తీర్చిదిద్దాలి 2) పురజనుడిగా ఎదిగిన పిమ్మట వ్యక్తిగత బాధ్యతలతో బాటు సామాజిక బాధ్యతలు పంచుకోవాలి. 3) పీఠాధిపతులు, ధర్మప్రభోధకులు, ప్రవచనకారులు దేశ కాల పరిస్థితులను గమనిస్తూ ప్రజలను జాగృత పర్చాలి. 

4) ధర్మానికి, సంస్కృతికి రక్షణగా ఉండాలి అంటే... *ధర్మ హింసా తదైవచ* అని కూడా ప్రజల దృష్టికి తేవాలి చట్టాల అనుసరణ యుక్తంగా చట్టాల రక్షణకు పాటుపడాలి. 5) చట్ట వ్యతిరేక చర్యలకు ఉద్వాసన పలకాలి. 6) చట్ట ఉల్లంఘనదారులను ఉపేక్షించ రాదు. అవినీతి పరులను, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని, హింసావాదులను, దౌర్జన్యకారులను బాధ్యతగా చట్టానికి అప్పగించాలి. 7) సమాజ ద్రోహ విషయాలలో *నాకెందుకు* అను ఉదాసీనత వీడాలి. 8) నేను మరియు నా కుటుంబం బావుంటే చాలు. సమాజం ఏమైతే నాకెందుకు అను *హీన దృక్పథం* వీడాలి.


ధన్యవాదములు

*(సశేషం)*వాదములు

గురువులు

 *గురువులు ఎన్ని రకాలు ఉంటారు ?* 


*శ్రీ గురుభ్యో నమః.*🙏


*1) సూచక గురువు : బాల్యం నుండి మనకు నాలుగు అక్షరాలూ నేర్పించి కే.జి నుండి పి.జి వరకు బ్రతుకుతెరువు కోసం బోధన చేసే గురువులు ఎందరో . మన జీవితంలో మనం ఉన్నత స్దితిలో ఉండటం కోసం ఎన్నో సలహాలు ఇస్తారు . వీరిని సూచక గురువులంటారు . వీరి ద్వారా భుక్తిమార్గం తెలుసుకుంటాం.*


*2 ). వాచక గురువు : వీరు ధర్మాధర్మ విచక్షణ , మంచి చెడు విశ్లేషణ , చతురాశ్రమాలు, వాటి ధర్మాల గురించి చెపుతారు. ( బ్రహ్మ చర్యము , గృహస్థాశ్రమం , వానప్రస్దం , సన్యాసం ) . వీరి ద్వారా ఎలా జీవించాలి అని అవగాహన వస్తుంది .*


*3 ). బోధక గురువు* : *వీరు మహా మంత్రాలను ఉపదేశిస్తారు . లౌకికంగా కోర్కెలు తీర్చేవాటిని , అలౌకిమైన మోక్షానికి మార్గం చూపే వాటిని ఉపదేశిస్తారు. వీరిని బోధక గురువులంటారు . మనం లౌకికం నుండి అలౌకికం వరకు మెల్లగా అడుగులు వేయగలుగుతాము.*


*4 ) నిషిద్ద గురువులు* : *మారణ ప్రయోగాలు , వశీకరణాలు , వినాశనాలు - ఇలాంటివి నేర్పే గురువులను నిషిద్ద గురువులంటారు. ఇలాంటి వారి దగ్గరకు వెళ్ళకపోవడం చాలా మంచిది . చిత్తాన్ని శుద్ధి చేయరు. విత్తాన్ని హరిస్తారు . ( పతనం కావాలి అనుకుంటే ఇలాంటి గురువులను ఎన్నుకోవాలి )*


*5 ) విహిత గురువు* : *మన హితము కోరి సూచనలు సలహాలిస్తారు , నశించిపోయే విషయభోగాలపై ఆసక్తి తగ్గించి , సత్యమైన శాశ్వతమైన విషయాలపై అంతర్ముఖం చేయడం నేర్పుతారు. ( ఏది సత్యం, ఏదసత్యం అనే విచక్షణ తో జివించగలుగుతాము )*


*6) *కారణ గురువు* : *వీరు మోక్షం గురుంచి మాత్రమే చెపుతారు . ఎన్ని సుఖాలు అనుభవించినా, అంతిమ లక్ష్యం ముక్తి, ఐహిక బంధాల నుండి విముక్తి అని చెప్పి శిష్యులను ఎప్పుడు ఎరుకలో ఉంచుతూ ఉంటారు ,( నిత్య ఎరుకతో కర్మ యోగిలా కదిలి పోవడం నేర్చుకుంటాము)*


*7.) పరమ గురువు :* *వీరు సాక్షాత్ భగవత్ స్వరూపం. పరిపక్వం చెందిన శిష్యుని వెతుకుతూ వస్తారు .*

*శిష్యునికి సన్మార్గం బోధించి ‘’ ఈ చరాచరజగత్తు మొత్తం వ్యాపించి ఉన్నది నేనే’’ అని అనుభవ పూర్వకంగా తానూ తెలుసుకుని ‘’ అహం బ్రహ్మాస్మి" అనేది కేవలం పదం కాకుండా ఆ పదాన్ని మనకు ఆవాహన చేసి మనం అనుభూతి చెందగలిగే స్దితికి తీసుకు వెళ్ళేవారు ఈ పరమ గురువులు . వీరు ఎక్కడో కోటిలో ఒక్కరు మాత్రమే ఉంటారు . మన నిజజీవితంలో ఇలాంటి గురువు తారసపడితే సాక్షాత్ భగవంతుడు మనతో జత నడిచినట్లే . వీరు లభిస్తే మన జన్మ ధన్యమైనట్లే.*


సేకరణ....🙏🙏🙏

పరమాచార్యుల వైరాగ్యం

  💐💐💐💐💐💐

*పరమాచార్యుల వైరాగ్యం — ప్రశంస కూడా బంధనంగా మారకూడదు*

💐💐💐💐💐💐


కాంచీ పరమాచార్యుల జీవితంలో భక్తుల మధ్య చెప్పబడే ఒక చిన్న సంఘటనలో చాలా గొప్ప ఉపదేశం దాగి ఉంది. ఈ సంఘటనకు సంబంధించిన ఖచ్చితమైన ముద్రిత గ్రంథ-స్థానం నాకు ఇప్పుడు లభించలేదు. కాబట్టి దీనిని “పరమాచార్యుల గురించి ప్రచారంలో ఉన్న స్మృతి/సంఘటన”గా మాత్రమే తీసుకోవాలి. అయితే ఈ సంఘటనలోని తాత్పర్యం — రుచిపై ఆసక్తి లేకపోవడం, సన్యాసి తన చిన్న అభిరుచితో కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని జాగ్రత్తపడడం, శ్రేష్ఠుల ప్రవర్తనను జనులు అనుసరిస్తారు అనే విషయం — శాస్త్రోక్తంగా బలంగా నిలుస్తుంది. కాంచీ మఠం వెబ్‌సైటులోని *Acharya’s Call* లో కూడా సన్యాసి భిక్షపై ఆధారపడి జీవించాలి, ఆహారం చిత్తశుద్ధికి సహాయపడాలి అనే బోధన కనిపిస్తుంది.


ఒకసారి మఠంలో పరమాచార్యులకు భిక్షలో ఒక కూర వడ్డించారు. ఆ రోజు ఆ కూర చాలా సాదాసీదాగా, శుచిగా, రుచిగా వండబడింది. పరమాచార్యులు దానిని చూసి, *“ఇది బాగా ఉంది”* అని ఒక మాట అన్నారు. అది భోగాభిలాషతో చెప్పిన మాట కాదు; వంట చేసినవారికి ఒక చిన్న ప్రోత్సాహం, ఆహారం శుచిగా తయారైనందుకు ఒక సంతృప్తి మాత్రమే.


కాని మహానుభావుల మాటను భక్తులు ఎంత గౌరవంగా తీసుకుంటారో తెలిసిందే. *“పరమాచార్యులకు ఈ కూర ఇష్టం”* అని వార్త వ్యాపించింది. ఆ మాట విన్న భక్తులు ఎవరెవరో తమ తమ శక్తి కొద్దీ ఆ కూరకు కావలసిన కూరగాయలను మఠానికి తెచ్చి సమర్పించడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరు కొంచెం తెచ్చినా, భక్తుల సంఖ్య ఎక్కువ. కొద్ది రోజుల్లోనే ఆ కూరగాయలు మఠంలో గుట్టలుగా పేరుకుపోయాయి.


ఆ తరువాత మఠ వంటశాలలో రోజూ అదే కూర వండబడసాగింది. పరమాచార్యులు గమనించారు. ఒక రోజు మృదువుగా వంటవారిని అడిగారు — *“ఎందుకు ప్రతిరోజూ ఇదే కూర చేస్తున్నారు? మఠంలో ఇతరులకు కూడా ఇది ఇబ్బంది కాదా?”* అప్పుడు వంటవారు వినయంగా చెప్పారు — *“స్వామీ! ఒక రోజు మీరు ఆ కూర బాగుందని అన్నారట. అప్పటి నుండి భక్తులు అదే కూరగాయను చాలా ఎక్కువగా తెచ్చి సమర్పిస్తున్నారు. అవి వృథా కాకూడదని మేము రోజూ ఇదే వండుతున్నాము.”*


ఆ మాట విన్న పరమాచార్యులు వెంటనే విషయం గ్రహించారు. *“నా ఒక చిన్న మాట భక్తులకు సంకేతమైపోయింది. నా రుచి కోసం వారు ఇంత సమర్పణ చేయడం మొదలుపెట్టారు. ఇది సన్యాసికి తగినది కాదు; నా అభిరుచి వల్ల మఠనిర్వహణకు భారమూ, భక్తులకు అనవసర వ్యయమూ కలగకూడదు”* అని భావించారు. ఆ రోజు నుండి ఆ కూరను తాను తీసుకోవడం మానేశారని చెబుతారు.


ఇది కేవలం ఒక ఆహార నియమం కాదు; ఇది సన్యాసధర్మంలోని *అసంగత్వం*. మహానుభావులు తమ ఇష్టాలను కూడా చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. ఎందుకంటే వారి చిన్న మాట కూడా అనేకమందికి ఆజ్ఞలా మారుతుంది. అందుకే భగవద్గీతలో భగవాన్ ఇలా చెప్పారు — శ్రేష్ఠుడు ఏమి చేస్తాడో, ప్రజలు దానినే అనుసరిస్తారు.


*यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः ।*

*स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥*


*యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః ।*

*స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ॥*

— భగవద్గీత 3.21


అందువల్ల పరమాచార్యుల జాగ్రత్త ఏమిటంటే — *“నా అభిరుచి ఒక నియమంగా మారకూడదు; నా ప్రశంస భక్తులపై భారంగా మారకూడదు.”* ఇదే నిజమైన గురు-హృదయం. గురువు తన కోసం భక్తుల నుండి పొందడంలో ఆనందించడు; భక్తులకు భారము తగ్గించడంలో ఆనందిస్తాడు.


ఈశావాస్యోపనిషత్తు మొదటి మంత్రం ఇదే ధర్మాన్ని మరింత లోతుగా చెబుతుంది. జగత్తంతా ఈశ్వరసంబంధమైనది; కావున త్యాగబుద్ధితో అనుభవించాలి, ఇతరుల ధనంపై ఆశ పెట్టకూడదు.


*ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् ।*

*तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम् ॥*


*ఈశావాస్యమిదం సర్వం యత్కిఞ్చ జగత్యాం జగత్ ।*

*తేన త్యక్తేన భుఞ్జీథా మా గృధః కస్యస్విద్ధనమ్ ॥*

— ఈశావాస్యోపనిషత్ 1


*“తేన త్యక్తేన భుఞ్జీథాః”* — త్యాగంతోనే అనుభవించాలి. పరమాచార్యుల ఆచరణలో ఇదే కనిపిస్తుంది. భోజనం కూడా అనుభవించేవస్తువు కాదు; శరీరధారణకు కావలసినంత మాత్రమే. భాగవతం కూడా ఇదే సూత్రాన్ని స్పష్టంగా చెబుతుంది — కామం ఇంద్రియసుఖం కోసం కాదు; జీవనధారణకు మాత్రమే.


*कामस्य नेन्द्रियप्रीतिर्लाभो जीवेत यावता ।*

*जीवस्य तत्त्वजिज्ञासा नार्थो यश्चेह कर्मभिः ॥*


*కామస్య నేంద్రియప్రీతిర్లాభో జీవేత యావతా ।*

*జీవస్య తత్త్వజిజ్ఞాసా నార్థో యశ్చేహ కర్మభిః ॥*

— శ్రీమద్భాగవతం 1.2.10


ఆహార విషయములో తైత్తిరీయోపనిషత్తు ఒక వైపు *“అన్నాన్ని నిందించకూడదు”* అని చెబుతుంది; ఇంకొక వైపు అన్నాన్ని ధర్మబుద్ధితో చూడమని నేర్పుతుంది. అంటే ఆహారం పవిత్రమైనది; కానీ రుచి-ఆసక్తి బంధనంగా మారకూడదు.


*अन्नं न निन्द्यात् । तद्व्रतम् ।*

*प्राणो वा अन्नम् । शरीरमन्नादम् ।*

*प्राणे शरीरं प्रतिष्ठितम् । शरीरे प्राणः प्रतिष्ठितः ।*


*అన్నం న నింద్యాత్ । తద్వ్రతమ్ ।*

*ప్రాణో వా అన్నమ్ । శరీరమన్నాదమ్ ।*

*ప్రాణే శరీరం ప్రతిష్ఠితమ్ । శరీరే ప్రాణః ప్రతిష్ఠితః ।*

— తైత్తిరీయోపనిషత్, భృగువల్లి 3.7


అదే ఉపనిషత్తు మరోచోట అన్నదాన ప్రాముఖ్యాన్ని చెబుతుంది.


*अन्नं बहु कुर्वीत । तद्व्रतम् ।


*అన్నం బహు కుర్వీత । తద్వ్రతమ్ ।*

— తైత్తిరీయోపనిషత్, భృగువల్లి 3.9


ఇక్కడ ఒక ముఖ్యమైన సమన్వయం ఉంది. అన్నాన్ని ఎక్కువగా సమకూర్చి, ఇతరులకు పంచడం ధర్మం. కానీ ఒక మహాత్ముని రుచి పేరుతో ఒకే వస్తువును గుట్టలుగా తెచ్చి, మఠవ్యవస్థకు భారంగా చేయడం ధర్మసూక్ష్మానికి విరుద్ధం. దానం కూడా వివేకంతో ఉండాలి; గురుభక్తి కూడా గురువుకి ఇబ్బంది కలిగించని విధంగా ఉండాలి.


భగవద్గీతలో సాత్త్విక ఆహారం గురించి భగవాన్ చెప్పిన మాటలు కూడా ఇక్కడ స్మరణీయం. ఆయుష్షును, సత్వాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని పెంచేది, హృదయానికి అనుకూలమైనది సాత్త్విక ఆహారం.


*आयुःसत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धनाः ।*

*रस्याः स्निग्धाः स्थिरा हृद्या आहाराः सात्त्विकप्रियाः ॥*


*ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః ।*

*రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః ॥*

— భగవద్గీత 17.8


కాని అదే ఆహారం *“నాకు ఇది కావాలి, ఇదే కావాలి”* అనే రాగానికి కారణమైతే, అది సాధకునికి అడ్డంకి అవుతుంది. అందుకే గీతలో స్థితప్రజ్ఞుని లక్షణాన్ని ఇలా చెప్పారు.


*विहाय कामान्यः सर्वान्पुमांश्चरति निःस्पृहः ।*

*निर्ममो निरहङ्कारः स शान्तिमधिगच्छति ॥*


*విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః ।*

*నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి ॥*


— భగవద్గీత 2.71


పరమాచార్యుల ఆచరణలో *“నిర్మమత్వం”* స్పష్టంగా కనిపిస్తుంది. “నాకు ఇష్టమైన కూర” అనే భావమే రాకుండా, వచ్చినా అది భక్తులపై ప్రభావం చూపుతుందని తెలిసిన వెంటనే దానిని విడిచిపెట్టడం — ఇదే నిజమైన వైరాగ్యం.


ఈ కథ నుండి మనకు మూడు పాఠాలు తెలుస్తాయి. మొదటిది — మహానుభావుల మాటను భక్తి పేరుతో అతిశయింపకూడదు. రెండవది — దానం అవసరాన్ని బట్టి ఉండాలి, భావోద్వేగాన్ని బట్టి మాత్రమే కాదు. మూడవది — సన్యాసి తన రుచినీ, తన సౌకర్యాన్నీ, తన ఇష్టాన్నీ కూడా లోకహితార్థం విడిచిపెట్టగలవాడు.


కాంచీ మహాస్వామి గురించి కాంచీ మఠం వెబ్‌సైటులోని *Souvenir* విభాగం భక్తుల అనుభవాల సమాహారంగా పేర్కొనబడింది; ఆయన బోధనలు వేల పేజీలుగా ప్రచురించబడ్డాయని కూడా కాంచీ మఠం పేర్కొంటుంది. ఈ సంఘటనలో కనిపించే ఆత్మ మాత్రం ఆయన జీవితం మొత్తం తెలిపిన అదే సందేశం — *సాధుత్వం అంటే త్యాగం; గురుత్వం అంటే ఇతరులపై భారము కాకుండా ఉండే జాగ్రత్త; భోజనం కూడా భోగం కాదు, భగవదర్పణమైన శరీరధారణ మాత్రమే.*

💐💐💐💐💐💐

*Kumara Sharma*

*న్యాయవాది & ఆధ్యాత్మికవేత్త*

*జగద్గురు జ్ఞానపీఠం*

*9063939567*

💐💐💐💐💐💐

కేరళం చిన్న ముక్కే

 *సేకరణ: శ్రీ మంగళంపల్లి శ్రీహరి గారి వాల్ నుండి*

---------------------------


కేరళం చిన్న ముక్కే కదా అని వదిలేస్తే...


పీఠం సరిగ్గా ఉండాలి...లేకుంటే దేశ భద్రతకే ప్రమాదం...


అయ్యో...గాంధీ గారు మాకు ముస్లిములు వచ్చి హిందువులను చంపినా..ఎదురు తిరక్కుండా చచ్చిపొమ్మనే చెప్పారు...


ఆ మాటే పాటిస్తున్నాం...మనసిలాయో అంటున్నారు కొత్త సతీషన్...


నెహ్రూ కూడా ఖాన్ గ్రేస్ ఎప్పటికీ ముస్లిములను ఇరిటేట్ చేసే ఏ పని చెయ్యదు అని ...వందేమాతరం లో దుర్గా అనడం వాళ్ళని బాధ పెడుతుందని...దాన్ని తట్టుకోవడం ఆ సమాజానికి సాధ్యం కాక ఏదైనా చేస్తే..గాంధీ గారు చెప్పినట్టు చెయ్యాల్సి వస్తుందని...కొత్త సతీషన్ వాకృచ్చారు... 


ఇంక పాత విజయన్ అయితే...అసలు వందేమాతరం ఆరెస్సెస్ అజెండా...మేమెందుకు పాడుతాం...అంటున్నాడు...


అలా కొత్త పాత తేడాలేకుండా ఖాన్ గ్రేస్ కమ్యూనిస్లుంలు ఒకే మాట మీదకి వచ్చి...అసెంబ్లీలో పూర్తి వందేమాతరాన్ని పాడలేదు...గవర్నర్ ఆదేశాలను కూడా పట్టించుకోలేదు...


అయ్యా..ఇది వందేమాతరం 150 సంవత్సరాల శుభ సందర్భంలో ఆ గీతాన్ని పూర్తిగా పాడాలి...దేశ సమైక్యతా గీతం ఇది అని కేంద్ర హోం శాఖ 1971 లో చేసిన జాతీయ చిహ్నాల గౌరవ చట్టం ఆధారంగా సర్క్యులర్ పంపింది...


దాన్ని బేఖాతరు చేశాయి అధికార ప్రతిపక్షాలు...


అదే కేరళంలో గతంలో ఒక పాఠశాల జనగణమన పాడము అంటూ ఏకంగా కోర్టు ఉత్తర్వులు తెచ్చుకుంది...


వందేమాతరం పాడరు...జనగణమన పాడరు...


ఇంక కేంద్ర సంస్థల ఆదేశాలు అసలు లెక్కే చెయ్యరు...


కేంద్ర ప్రభుత్వ విచారణ అధికారుల మీద మాజీ సిఎం విజయన్ అనుచరుల దాడి...


అంటే కోర్టులు చట్టాలు కూడా మమ్మల్ని ఏమీ చెయ్యలేవు అన్న సవాల్...


ఈ ఉదంతాలు ఏం తెలియజేస్తున్నాయి...


హిందువులు మైనారిటీ అయిన చోట అంటే అరవై శాతం ఉన్నాగానీ..అక్కడ రాజ్యాంగం అమలు కాదు...


అస్సలు ఆ భూభాగాలు భారత్ లోనే ఉన్నాయా అనేంతగా మారిపోతాయి...


ఆ మధ్యన కమ్యూనిస్టు జమానాలో ఆరెస్సెస్ వాళ్ళ అంతు చూద్దాం అని పీఎఫ్ఐ..ఎస్ డీ పీ ఐ బహిరంగంగా కత్తులు పట్టుకుని ఊరేగింపులు చేసారు...


అంటే నిజానికి పశ్చిమ బెంగాల్ కంటే కేరళం మరింత ప్రమాదకర పరిస్థితిలో ఉందని అర్థం...


కేరళం సముద్ర రక్షణ పరంగా అత్యంత కీలకమైన ప్రాంతం...


మత్స్యకారుల సంఘాలు ...షిప్పింగ్ సంస్థలు...పూర్తిగా క్రైసన్స్...రెడ్ ఇండియన్స్...ఖాన్ గ్రేస్ చేతుల్లో ఉన్నాయి...


రేపు రేపు యుద్ధ సందర్భాల్లో నావెల్ బేస్ లకు తరలించే అత్యవసర వస్తువులను సహాయాలను ఈ గ్యాంగులు అడ్డుకోవని నమ్మకం ఏంటి...


కేవలం బంగారమే ఈ కమ్యూనిస్టులు స్మగ్లింగ్ చేస్తున్నారా...ఆయుధాలు కూడా చేస్తున్నారా అన్నది ఎలా తెలుస్తుంది...


కేంద్ర సంస్థలను అడ్డుకోవడం వెనుక ఉన్న ఉద్దేశ్యాలు ఏమిటి...


వందేమాతరం పాడకపోవడానికి...వీటికి కచ్చితంగా లింక్ ఉంది...


అసెంబ్లీ వేదికగా దేశ వ్యతిరేకత..కేంద్రాన్ని ధిక్కరిస్తాం అనే సందేశాన్ని ఇచ్చిన వాళ్ళు ..రోడ్లమీదకు అల్లరి మూకలను రప్పించిన వాళ్ళు దేనికైనా తెగిస్తారు...


ఏదో ఆషామాషీగా ఈ ధిక్కారాన్ని తీసుకోవడం సరికాదు...


బెంగాల్ ను కలిపిన వందేమాతరం...కేరళం ను కాపాడడానికి కూడా ఉపయోగించాలి...


అనుమానం ఉన్నచోట ప్రతి సారీ దేశభక్తిని పరీక్షించాల్సిందే...


కేరళం లో మిగిలిఉన్న పది శాతం మంది దేశభక్తులను కాపాడుకోలేకపోతే పీఠం కదిలిపోతుంది...


కేరళం చిన్న ముక్కే కదా అని వదిలేస్తే...

అది దేశ అస్థిత్వానికే ముప్పు తీసుకుని వస్తుంది...


జైహింద్!

సరదాలు

 (సరదాగా నవ్వుకోగలిగిన వారుమాత్రమే చదవండి మరి)


పెళ్ళిళ్ళ........సరదాలు.......సంబరాలు


అల్లరి చేసే పిల్లాణ్ని అదుపు చేయడానికి ఒక తల్లి 

‘ఒరే! నీ పెళ్లి చేస్తానుండు’ అని బెదిరిస్తుంది. 

అంతే! 

వాడి అల్లరి అటకెక్కిపోతుంది. 

చేతులు కట్టుకుని మరీ నిలబడతాడు. 

అదీ "పెళ్లి "

అనే మాటకున్న "శక్తి!"


 పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. 

‘కాదు... కాదు 

నూరేళ్ల వంట’ అని కస్సుమంటారు 

ఆడవాళ్లు. 

అయినా పంట లేనిదే వంట ఎక్కడుంది? ఇదోరకం అద్వైతం. 


‘తాళి కడితే ఖాళీ’ అంటారు కొందరు. 

నిజమే దంపతులు ఒకరికొకరు 

మానసికంగా 

తమ సర్వస్వం ధారపోసుకోవడంతో ఖాళీ అయిపోతారు.

‘ఇతరులకు ఇందులో ప్రవేశం ఉండదు!’ గిలిగింతలకయినా, కౌగిలింతలకయినా ఒకరికొకరే.


‘అప్పగింతలవేళ అమ్మాయికది 

ఆఖరి ఏడుపు. 

అబ్బాయికది ఆఖరు నవ్వు’ అంటారు విజ్ఞులు. 

తత్వం బోధపడితే ఏడుపైనా, నవ్వయినా ఒక్కటేగా. 

ఏడ్చినా నవ్వినా 

కన్నీళ్లే అయినప్పుడు 

దాని గురించి ఆలోచన ఎందుకు? 

ఏదో ఒకటి లేదనేదే ఏడుపునకు మూలం. 

అది ఎంతోమందికి పెళ్లప్పటి నుంచే మొదలవుతుంది. 

అసలు సమస్య అదే! 


‘మా ఆయనకు నోట్లో నాలుక లేదు’ 

అని ఒకావిడ బాధపడిపోతుంటుంది. అది అనవసరం. 

సాక్షాత్తూ బ్రహ్మకే నోట్లో నాలుక లేదు. ఆ నాలుక సరస్వతీదేవిది. ‘


మా ఆయనకు హృదయం లేదు’ 

అని మరొకావిడపతిదేవుణ్ని

తూలనాడుతుంటుంది. అది అన్యాయం! 

విష్ణుమూర్తికే 

సొంతానికి హృదయం లేదు. దానిని లక్ష్మీదేవి 

ఎప్పుడో ఆక్రమించేసింది. 


‘మా ఆయన 

ఒక్క అడుగు కూడా సొంతంగా వేయలేడు’ 

అని ఒక ఇల్లాలు బాధపడిపోతుంటుంది. ఏం చేస్తాం? 

శివుడికే ఆ పరిస్థితి లేదు. అర్ధనారీశ్వరుడాయే! 

ఒక కాలు పార్వతిదే. అదే ఆయన అవస్థ. 

ఇన్ని నిజాలు తెలిసీ 

భర్తల గురించి ఆడిపోసుకోవడం ఎందుకట అంటారు కొందరు పతులు. 

సరికొత్త మానవపరిణామ సిద్ధాంతానికీ బాటలు వేసేది పెళ్లే. 

‘బ్రహ్మచారీ శతమర్కటః’ అన్నారు. 

పెళ్లి కాగానే ఆ వంద కోతులూ మాయమైపోతాయి. 

చెప్పింది వింటూ, పెట్టింది తింటూ బుద్ధిమంతుడిగా మారిపోతాడు వివాహితుడు. 


హెల్మెట్టూ భార్యా ఒకే రకం. 

నెత్తిన పెట్టుకుంటే తలకాయకు 

బోలెడంత భద్రత అని ఒకాయన

స్వానుభవంతో ఉపదేశించాడు.


పెళ్లి చేసుకొనుటయా? మానుటయా? 

అని ఈ రోజుల్లో బ్రహ్మచారులు తర్జనభర్జనలు పడుతున్నారు. 


అయినా పెళ్లి చేసుకొనుటే ఉత్తమంబు, 

వెనకటికి మహాతాత్వికుడయిన సోక్రటీసును 

శిష్యుడొకరు 

‘గురూజీ పెళ్లి చేసుకొమ్మని మావాళ్లు 

ఒత్తిడి చేస్తున్నారు. తమరి సలహా ఏమిటి?’ అని అడిగాడు. 

ఆయనేమో ‘చేసుకో నాయనా’ అన్నాడు తాపీగా. 

శిష్యుడు జుట్టు పీక్కుని ‘ఏంటి గురూజీ అలా అన్నారు? 

మీ ఇంట్లో అమ్మగారు గయ్యాళి అని అందరికీ తెలుసు. 

అయినా పెళ్లి చేసుకొమ్మని నాకు సలహా ఇస్తున్నారు?’ అని ప్రశ్నించాడు. దాంతో సోక్రటీసు

 ‘నాయనా! పెళ్లి చేసుకుంటేనే మేలు. 

భార్య అనుకూలవతి అయితే గొప్ప భోగివి అవుతావు. 

కాకపోతే గొప్ప తాత్వికుడివవుతావు. ఏదయినా మంచిదే కదా!’ అన్నాడు.


దేవుడు ప్రతిచోటా తాను ఉండలేక తల్లుల్ని సృష్టించాడంటారు. 

మరి అదే దేవుడు భార్యల్ని ఎందుకు సృష్టించాడు? 

ప్రతి ఇంట్లో పోలీసుల్ని పెట్టలేక భార్యల్ని సృష్టించాడు. 

భార్యే లేకపోతే ఎన్ని అరాజకాలు? 

ఎన్నెన్ని ఘోరాలు? ఎన్నెన్ని నేరాలు?

 శాంతిభద్రతల పరిరక్షకురాలు ఇల్లాలే. 

ప్రతి ఇంటికి పెళ్లి ఇచ్చిన వరప్రసాదమే ఇల్లాలు.

సంతోషం దాంపత్యానికి సగం బలం- 

కాదు కాదు సంపూర్ణ బలం. 

ఎవరు గెలిచినా ఇద్దరూ గెలిచినట్టే. 


పండంటి కాపురానికి పది సూత్రాలు అంటారుగానీ 


ఈ ఒక్క ‘మంగళ’కరమైన సూత్రాన్నీ 

జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు.


భార్యా భర్తల మధ్య ఎకసెక్కాలుండాలి మరి

‘కన్యాదాన సమయంలో మీ నాన్న నా కాళ్లు పట్టుకుని, కడిగినప్పుడు 

నీకు ఏమి అనిపించింది?’ అని కొత్తగా పెళ్లయిన యువకుడు 

తన భార్యను అడిగాడు. ఆమె తడుముకోకుండా ‘ఆయన వసుదేవుడిలా కనిపించాడండీ’ అంది నవ్వుతూ. 

దాంతో మొగుడు కంగుతిన్నాడు


మూడు ముళ్లయినా, 

ఏడు అడుగులయినా ముసిముసి నవ్వులకు మూలకందాలే. 

పూలు తలలో పెట్టినా, చెవిలో పెట్టినా పెళ్లి పెళ్లే! దానికి సాటీ లేదు! పోటీ లేదు! ఏమంటారు మరి...!!😄😄

కొప్పరపు వేంకట సుబ్బయ్య గారు*

  *కొప్పరపు వేంకట సుబ్బయ్య గారు* మరియు *కొప్పరపు వేంకట రామణయ్య గారు* - ఇద్దరూ తెలుగు సాహిత్యంలో, ముఖ్యంగా *అవధాన విద్యలో దిగ్గజాలు.


*1. కొప్పరపు సోదర కవులు అంటే ఎవరు?*


ఈ ఇద్దరూ *అన్నదమ్ములు*. *"కొప్పరపు కవులు"* అని, *"కొప్పరపు సోదర కవులు"* అని పిలుస్తారు. 20వ శతాబ్దంలో అవధాన విద్యని బతికించిన వాళ్లలో వీళ్ళు ముఖ్యులు.

పేరు వివరాలు

**కొప్పరపు వేంకట సుబ్బయ్య గారు** 1885–1941 అన్నయ్య. **శతావధాని**. సంస్కృతాంధ్ర పండితుడు. 1911లో బెజవాడలో మొదటి శతావధానం చేశారు.

**కొప్పరపు వేంకట రామణయ్య గారు** 1887–1942 తమ్ముడు. **అష్టావధాని**. అన్నయ్యకు తోడుగా అవధానాలు చేసేవారు. ఇద్దరూ కలిసి చేస్తే దాన్ని "సహావధానం" అనేవారు.

*2. వీళ్ళ గొప్పతనం ఏంటి?*


1. *తిరుపతి వేంకట కవుల తర్వాత* అవధాన పరంపరను నిలబెట్టింది వీళ్ళే.

2. *సుబ్బయ్య గారు* దాదాపు *40కి పైగా శతావధానాలు* చేశారు. ఆ రోజుల్లో అది రికార్డు.

3. *ఆశువుగా పద్యం చెప్పడం*లో వీళ్ళకి వీళ్ళే సాటి. పృచ్ఛకులు ఏ సమస్య ఇచ్చినా, నిషిద్ధాక్షరి పెట్టినా, వెంటనే చంపకమాల, ఉత్పలమాల పద్యాలు చెప్పేసేవారు.

4. *గరికపాటి నరసింహారావు గారు, మేడసాని మోహన్ గారు* లాంటి ఇప్పటి అవధానులకు వీళ్ళే స్ఫూర్తి.


*3. ఫేమస్ సంఘటన*


ఒకసారి బెజవాడలో శతావధానం చేస్తుంటే, ఒక పృచ్ఛకుడు *"కాకి పిల్ల కాకికి ముద్దు"* అనే సమస్య ఇచ్చాడు. దాన్ని సుబ్బయ్య గారు ఇలా పూరించారు:


> శ్రీకరమైన కావ్య రసశేవధి గ్రోలుచు నున్న కూర్మి నా

> లోకము నందు గల్గు కవి లోకము మెచ్చగ నేర్తునే గదా

> *కాకి పిల్ల కాకికి ముద్దు* గాదె జగంబున నెప్పుడున్ మహా

> లోకము మెచ్చుకొన్న కవి లోకుల కెల్లను గాదె ముద్దగున్**


అంటే - కాకికి తన పిల్ల ముద్దు అయినట్టే, లోకం మెచ్చిన కవి అందరికీ ముద్దే అని అర్థం. ఒక్క నిమిషంలో చెప్పారు.


*4. స్వస్థలం*


వీళ్ళది *గుంటూరు జిల్లా, తెనాలి దగ్గర కొప్పరపు* అనే గ్రామం. అందుకే "కొప్పరపు కవులు" అయ్యారు.


*

సామాజిక స్పృహ

  *సామాజిక స్పృహ - పూర్ణ నాగరికతా చైతన్యము 9*




*భద్రం మనః కృణుష్వ* అని అంటుంది సామవేదం. అంటే మా మనస్సులను కళ్యాణమయం చేయుము అని.


వీధులు శుభ్రంగా ఉంచుకోవడం, కాలనీలు బాగు చేసుకోవడం మాత్రమే నాగరికత కాదు.


మన దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు, స్వపరిపాలన వచ్చి 77 సంవత్సరాలు అయినది. విద్య, వైద్య, ఆర్థిక, సాంకేతిక మరియు రక్షణ రంగాలలో అభివృద్ధి పరంగా ఎంతో ఎదిగాము. *కాని, నైతికంగా ఎదగవలసినంతగా మనము ఎదగలేదు, అంటే నాగరికత పెరగలేదు*. ప్రలోభాల ప్రభావాలను అధిగమించే తత్వాన్ని అలవరచుకొలేక పోతున్నాము....ఇంకా చెప్పుకుంటాము ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత దేశమని. అవుతే *స్వార్థ పరంగా, దోషులను సమర్థించడంలో మరియు నేరస్తులను ఉపేక్షించడంలో నియమిత ఎల్లలు, హద్దులు దాటి ఎదిగాము*. ఇది కూడా నాగరికత కాదు. *ఇంకా చెప్పాలంటే శృతి మించిన అనాగరిత*. 


రాజకీయ నాయకులు, ఇతర రంగాలలో ఉన్న ప్రముఖులు, పార్టీలు గాని అవకతవకలకు పాల్పడినప్పుడు వారి ప్రథమ మరియు ప్రథాన ఆయుధము *మతము, కులము, లింగ బేధం, ఉత్తరాది, దక్షిణాది వాదనలు*. ఈ వాదనలు, కుంటి సాకులు *ఇంకెన్నేళ్లు*. గత త్రింశతి (30) సంవత్సరాలుగా దేశ చరిత్రను పరిశీలించిన వారికి, దోష భూయిష్టులైన ఏ ఏ నాయకులు, ఇతర రంగాలలోని ప్రముఖులు దేశ స్వతంత్రతను, ప్రజాస్వామ్యాన్ని కవచంగా వాడుకున్నారో మనందరికీ అన్ని కరతలామలకములే....

అభిజ్జానములే


సావకాశంగా సంఘటనలు పరిశీలిస్తే ఒక నాయకుడంటాడు నేను మైనారిటీ మతం వాడిని నన్ను బలి పశువును చేస్తున్నారు అని. ఇంకొక ప్రముఖుడంటాడు నేను వెనుకబడిన తరగతుల వాడిని కాబట్టి నాపై కక్ష్య కట్టారు అని. ఇంకొక ప్రముఖురాలంటుంది నేను మహిళను కాబట్టి నేరం ఆపాదిస్తున్నారు అని. రాజకీయ నాయకుల దుర్మార్గాలు, దుష్చేష్టలు, దురలవాట్లు బైటపడ్డప్పుడు, ఆ పార్టీ వాళ్ళు వందలకొద్దీ ధర్నాలు, సమ్మెలు. రక్షకభట శాఖ *నిందితులను* న్యాయస్థానాల వైపు తరలిస్తున్నప్పుడు, ఏ మాత్రం *న్యూనత, లజ్జ* లేకుండా త్వరలో జనంలోకి వస్తామని చేతులూపుతూ *సన్మాన గ్రహీతలు లాగా* చిరు నవ్వులతో నిర్బంధశాలలకు వెళ్తుంటారు. ప్రతి రాజకీయ పార్టీకి అండ దండగా వారి సమాచార (పత్రిక, Tv) మాధ్యమాలు ఉంటాయి. అందులో పని గట్టుకుని ప్రభుత్వాన్ని విమర్శించడం మరియు ప్రత్యర్థులను నిందించడం మామూలైపోయింది. పార్టీల బేధం ఉన్నప్పుడు దక్షిణాది వారు ఉత్తరాది వారిని, ఉత్తరాది వారు దక్షిణాది వారిని విమర్శించడం సర్వ సాధారణమైనది. తమ తప్పులను సమర్థించుకోవడానికి మతాన్ని, కులాన్ని, వర్గాన్ని లింగాన్ని సమర్థవంతంగా వాడుకుంటూ రాజకీయ వ్యక్తిగత లాభాలను పొందడానికి నిస్సిగ్గుగా వాడుకుంటున్నారు. *ఇదీ నాగరికత కాదు.*


 *మనమందరము భారతీయులము అను జాతీయ భావం నాస్తి*. జాతీయత లోపించింది. ఈ పరిస్థితులలో పూర్ణ నాగరికతా చైతన్యము సిద్ధించాలంటే ఎంత శ్రమ అవసరమో భగవంతుడికే తెలియాలి అని చతికిల పడరాదు. *కృషితో నాస్తి దుర్భిక్షం* అని చదువుకున్నాము. 

*ఆత్మ విమర్శ* చేసుకోవాలి ఇకనైనా. ఇంకా ఎన్ని దశాబ్దాలు కావాలి *నీతివంతమైన జీవితం గడపడానికి*,

భగవదనుగ్రహం పొందడానికి, 

 *మన మనస్సులు కళ్యాణ మయం కావడానికి.*


ధన్యవాదములు.

సంగచ్చధ్వం సంవదధ్వం

 ఈ వ్యాసంలో ఋగ్వేదంలోని  *సంగచ్చధ్వం సంవదధ్వం...* 


మంత్రాన్ని ఆధారంగా తీసుకొని, సమాజంలో 

ఐకమత్యం, 

పరస్పర 

బాధ్యత, 

సామూహిక  సామాజిక శ్రేయస్సు వంటి విలువలను చక్కగా ప్రతిపాదించారు. 


వేదమంత్రం చెప్పే సంఘబలం కేవలం ఆధ్యాత్మిక భావన మాత్రమే కాక, 

నిత్యజీవితంలో ఆచరణకు దారితీసే మార్గదర్శకమని వివరించారు.


వ్యాసంలోని ప్రధాన విశేషం ఏమిటంటే, పెద్ద పెద్ద సిద్ధాంతాల కంటే సాధారణ ప్రజలు రోజువారీ జీవితంలో చేసే చిన్నచిన్న నిర్లక్ష్యాలనే నాగరికతకు పరీక్షగా చూపించడం. 

రహదారుల ఆక్రమణ, 

వాహనాల అస్తవ్యస్త పార్కింగ్, నీటి వృథా,

 ఖాళీ స్థలాల అపరిశుభ్రత వంటి అంశాలు వ్యక్తిగత చర్యలుగా కనిపించినా, అవి సామాజిక బాధ్యతా రాహిత్యానికి సూచికలని  స్పష్టంగా తెలియజేశారు...


వేదం చెప్పిన 

సమాన సంకల్పం – 

సమాన బాధ్యత” అనే సూత్రాన్ని ఆధునిక కాలనీల జీవన విధానంతో అనుసంధానించడం ఈ రచనకు ప్రత్యేకతను తెచ్చింది. నాగరికత అనేది భవనాల ఎత్తులో, సంపదలో లేదా సాంకేతిక అభివృద్ధిలో లేదని; ఇతరులకు ఇబ్బంది కలగకుండా జీవించడంలోనే ఉందనే సందేశం స్పష్టంగా తెలుస్తుందజా


ప్రత్యేకంగా, 

నాకు ఇబ్బంది లేకపోతే సరిపోతుంది” 


అనే స్వార్థ దృష్టికోణాన్ని విడిచి, నా చర్య వల్ల సమాజానికి ఇబ్బంది కలుగుతోందా?” అనే ప్రశ్నను ప్రతి వ్యక్తి తనను తాను వేసుకోవాలని ఈ వ్యాసం ప్రేరేపిస్తుంది.


సామాజిక స్పృహ, 

పౌర బాధ్యత, వేదస్ఫూర్తి మరియు ఆధునిక నాగరికత మధ్య ఉన్న సంబంధాన్ని సరళంగా, స్పష్టంగా వివరించిన చైతన్యవంతమైన వ్యాసం. చిన్న తప్పిదాలే పెద్ద సామాజిక సమస్యలకు కారణమవుతాయని గుర్తుచేస్తూ, నిజమైన నాగరికత అనేది పరస్పర గౌరవం మరియు బాధ్యతతో కూడిన జీవన విధానమని తెలియజేస్తుంది.


సంఘే శక్తిః కలౌ యుగే”అనే సూక్తికి ఆచరణాత్మక రూపమే ఈ వ్యాసం అని చెప్పవచ్చు....


శ్రీధ ర్శర్మ తోటపల్లి

శ్రీ సద్గురు పీఠం.....✍️

వృద్ధాప్యంలో

 వృద్ధాప్యంలో పిల్లలతో కలిసి ఉండటం"....కన్ఫ్యూషియస్ చెప్పిన ఒక గొప్ప పాఠం​...


"వృద్ధాప్యంలో మీ పిల్లలతో అతిగా కలిసి ఉండటం, విచిత్రంగా వారిని మీకు దూరం చేస్తుంది" అని కన్ఫ్యూషియస్ ఒకసారి హెచ్చరించారు. ఈ కథ 2,500 ఏళ్ల నాటిదైనా, నేటి కాలానికి, మనకు, మన తల్లిదండ్రులకు మరియు మన పిల్లలకు కూడా సరిగ్గా సరిపోతుంది.​


ఇది లీ వీ అనే వృద్ధుడి కథ. ఆయన తన మనసును వేధిస్తున్న ఒక ప్రశ్నతో గొప్ప తత్వవేత్త అయిన కన్ఫ్యూషియస్ దగ్గరకు వెళ్ళాడు...


“మహాశయా, మన జీవితమంతా పిల్లల కోసమే ధారపోసిన తర్వాత కూడా... వృద్ధాప్యంలో మనం ఎందుకు ఒంటరిగా మిగిలిపోతున్నాము?" అని అడిగాడు.​


లీ వీ చెడ్డ తండ్రి కాదు. నిజానికి, ఆయన తన పిల్లల కోసం సర్వస్వం ఇచ్చాడు. వారు దేనికీ లోటు లేకుండా ఉండాలని అహర్నిశలు కష్టపడ్డాడు. వారు సుఖంగా ఉండాలని తన సౌకర్యాలను త్యాగం చేశాడు. పిల్లలు పెరిగి, పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడినప్పుడు, ఇక తాను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని లీ వీ భావించాడు. తన ఇంటిని అమ్మివేసి కొడుకు దగ్గరకు వెళ్ళాడు. కుటుంబం,మనవళ్లు, మనవరాళ్లతో కలిసి ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుందని నమ్మాడు.​ కానీ ఆయన ఆశించిన సంతోషం దక్కలేదు. ఇల్లు కుటుంబంలోని అందరితో నిండిఉన్నా సరే , ఆయన హృదయం మాత్రం వెలితిగానే ఉండేది. పగలు అందరూ బిజీగా ఉండేవారు. సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చి, ప్రశాంతతను కోరుకునేవారు. వారు లీ వీ మాటలను అరకొరగా వినేవారు. ఆయన ఇచ్చే సలహాలు వారిని విసిగించేవి. ఆయన ఉనికిని వారు ఒక భారంగా భావించడం మొదలుపెట్టారు. ఆయన వారి దగ్గరికి చేరాలని ప్రయత్నించే కొద్దీ... వారు మరింత దూరమవుతూ వచ్చారు.​సమాధానం అన్వేషణ​ కోసం


లీ వీ కన్ఫ్యూషియస్ దగ్గరకు వెళ్లి తన బాధను ఇలా చెప్పుకొచ్చాడు...


“గురువుగారు, నా జీవితాన్ని పిల్లల కోసమే అంకితం చేశాను. వృద్ధాప్యంలో వారి దగ్గర ఉంటే నాకు శాంతి, ప్రేమ దొరుకుతాయని అనుకున్నాను. కానీ నేను అక్కడ ఎవరికీ అవసరంలేని వ్యక్తిలా మారిపోయాను... ఎందుకు?”​కన్ఫ్యూషియస్ ఆయనను వట్టి మాటలతో ఓదార్చలేదు. బదులుగా మూడు చిన్న పాఠాలు నేర్పాడు.​


అందులో మొదటి పాఠం...


ఆయన ఒక కూజాను తీసుకొని అంచు వరకు నీటితో నింపారు. “ఇందులో ఇంకా నీళ్లు పోస్తే ఏమవుతుంది?” అని అడిగారు.“అవి పొంగిపొర్లుతాయి,” అని లీ వీ జవాబిచ్చాడు.“సరిగ్గా అంతే,” అన్నారు కన్ఫ్యూషియస్. “సంబంధాలు కూడా ఇలాగే ఉంటాయి. ఇప్పటికే నిండిపోయిన ఒక ప్రదేశంలో మనం బలవంతంగా దూరాలని చూస్తే, అక్కడ అసమతుల్యత ఏర్పడుతుంది. నీ పిల్లలు ఎదగడానికి నువ్వు ఒక ఇల్లు కట్టావు. కానీ ఇప్పుడు నువ్వు మళ్లీ ఆ ఇంటికి కేంద్రం కావాలని చూస్తున్నావు. వారి జీవితాలకు ఇప్పటికే ఒక కేంద్రం ఉంది.అదే వారి స్వంత జీవితం, వారి పిల్లలు. ఖాళీ లేని పాత్రలో నువ్వు నిన్ను పోసుకోవాలని చూస్తున్నావు".


ఇక ​రెండవ పాఠం...


ఒకదానికొకటి అతి దగ్గరగా పెరుగుతున్న రెండు చెట్లను కన్ఫ్యూషియస్ చూపించారు. వాటి కొమ్మలు సూర్యరశ్మి కోసం ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి ఉన్నాయి.


“చెట్లు అతి దగ్గరగా పెరిగితే ఏమవుతుంది?” అని అడిగారు.“అవి ఒకదాని ఎదుగుదలను ఒకటి అడ్డుకుంటాయి,” అని లీ వీ అన్నాడు.“అవి బలంగా పెరుగుతాయా?...లేదు...అవి బలహీనంగా, ఆకారం లేకుండా మారిపోతాయి. జీవితంలో కూడా అంతే,” అన్నారు కన్ఫ్యూషియస్. “దగ్గరగా ఉండటమే ఐక్యత అని మనం అనుకుంటాం. కానీ అతి సామీప్యం ఒత్తిడిని కలిగిస్తుంది. పెరుగుదలకి కొంత ఖాళీ ప్రదేశం అవసరం".


మూడవ పాఠంగా...


కన్ఫ్యూషియస్ కొంచెం ఇసుకను తీసుకుని పిడికిలిని గట్టిగా బిగించారు.“నేను ఇలా గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది?”


“అది మీ వేళ్ల సందుల నుండి జారిపోతుంది,” అని లీ వీ చెప్పాడు.“మనుషుల మధ్య సంబంధాలు కూడా అంతే,” అని కన్ఫ్యూషియస్ బదులిచ్చారు. “ప్రేమ, గౌరవం ఒత్తిడిలో పెరగవు. నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటే, ఎంతగా సామీప్యాన్ని కోరుకుంటే... అది అంత వేగంగా మాయమవుతుంది. స్వేచ్ఛను ఇవ్వు, నీకు చెందాల్సింది నీ దగ్గరే ఉంటుంది."


"నువ్వు ఒక చెట్టును నాటినప్పుడు, వృద్ధాప్యంలో అది నీకు నీడ ఇస్తుందని ఆశిస్తావా?” అని కన్ఫ్యూషియస్ అడిగారు.“లేదు గురువుగారు. అది పెరగాలని నేను నాటుతాను. అది నీడ ఇస్తే అది ఒక బహుమతి మాత్రమే, తప్పనిసరి కాదు.”


“మరి నీ పిల్లల విషయంలో ఎందుకు వేరుగా ఆలోచిస్తున్నావు? నువ్వు వారిని నీ కోసం పెంచలేదు.ఈ ప్రపంచం కోసం పెంచావు.”​


మొదటిసారి లీ వీకి అసలు విషయం అర్థమైంది.​


తరువాత కన్ఫ్యూషియస్


లీ వీ కు కొన్ని విత్తనాలతో ఉన్న సంచిని ఇచ్చాడు.“నువ్వు ఇంకా మొక్కలు నాటవచ్చు. ఇంకా నేర్పించవచ్చు. ఇంకా నేర్చుకోవచ్చు. వృద్ధాప్యం అంటే వేచి ఉండటం కాదు...అది కొత్త ఆరంభాల సమయం.


పిల్లల నుండి ప్రేమ కోసం ఎదురుచూడకు. నీకు నచ్చిన పనిని మొదలుపెట్టు.”​ అని బోధించాడు.


లీ వీ తిరిగి తన గ్రామానికి వెళ్ళాడు...కానీ కొడుకు ఇంటికి కాదు. ఒక పాఠశాల దగ్గర చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. తనకు తెలిసిన విద్యను, కథలను పంచుకున్నాడు. వారితో కలిసి చెట్లను నాటాడు. త్వరలోనే అందరూ ఆయనను ‘మాస్టర్ లీ’ అని పిలవడం మొదలుపెట్టారు.​ఆయన తన ఉనికిని ఇతరులపై రుద్దడం మానేసే కొద్దీ, ఆయనపై గౌరవం పెరిగింది. ఆయన శ్రద్ధను ఆశించడం మానేసే కొద్దీ, అందరూ ఆయనను ప్రేమగా చూడటం మొదలుపెట్టారు.​


ప్రేమ తిరిగి వచ్చిన వేళ​ ఒకరోజు కొడుకు నుండి ఉత్తరం వచ్చింది. “నాన్నా, నువ్వు వెళ్లి చాలా కాలమైంది. మేమంతా నిన్ను మిస్ అవుతున్నాము. పిల్లలు నీ గురించి అడుగుతూనే ఉన్నారు. మమ్మల్ని చూడటానికి రా.


మాతో ఉండటానికి కాదు, మాతో గడపడానికి రా.


”​లీ వీ వెళ్ళినప్పుడు, ఆయనకు సాదర స్వాగతం లభించింది.


ఏళ్ల తర్వాత మొదటిసారి ఆయన తనను తాను ఒక భారంగా కాకుండా, ఒక ఆత్మీయ అతిథిగా భావించాడు.​


అప్పుడే ఆయనకు అర్థమైంది...ఎప్పుడైతే ఆయన ప్రేమను ఆశించడం మానేశాడో... అప్పుడే అది వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చిందని .​


ఈ కథ ఇచ్చే సందేశం​“వృద్ధాప్యంలో పిల్లలతో కలిసి ఉండటం తప్పు” అని కాదు. నిజమైన సామీప్యం స్వేచ్ఛ నుండి పుడుతుంది...బాధ్యత లేదా బలవంతం నుండి కాదు.​


మనం ఎదుటివారి ఉనికిని శాసించాలని చూస్తే, వారిని ఊపిరి ఆడకుండా చేస్తాము. మనల్ని మనం వారిపై రుద్దితే, మనం వారికి అదృశ్యమైపోతాము.


ఎప్పుడైతే మనం పట్టు వదులుతామో, అప్పుడే మనం వారి మనసుల్లో స్థానం పొందుతాము.​


కన్ఫ్యూషియస్ చెప్పినట్లు...


ప్రేమ మరియు గౌరవాన్ని డిమాండ్ చేయలేము. వాటిని కేవలం పోషించగలం.


నిజం కదా మేము పెంచాము పెద్దవాళ్ళను చేసాము. మేము పెద్దవాళ్ళము అయ్యాము ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు చూడాలి. ఇది ఇచ్చి పుచ్చుకోవాటమ్ లాంటి ది.

ఆలా కాకుండా పెంచు, చదివించు, ప్రయోజకులను చెయ్యి, తరువాత ఆశించకు వాళ్ళనుంచి.

ఇప్పటి కాలం లవ్ అస్సలు జరగని పరిస్థితి. పెద్దాయన చెప్పినట్లు ఎదో ఒక పని చెయ్యి. ఎదో ఒక సహాయం చేస్తున్నావ్ ఉండు. బిడ్డలు వారంతట వారే మారతారు.


లాస్ట్ గా పిల్లలకు చెయ్యటం నే బాధ్యత.

గీతలో చెప్పినట్లు ఖర్మ ను చెయ్యి. ఫలితం ఎదురు చూడకు వాళ్ళు తిరిగి నీలాగా చెయ్యాలని ఆశించకు.


    🌿సుల్తానా. తిరుపతి 🌿

లిపిడ్ ప్రొఫైల్

  ⸻


లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏమిటి?


ఒక ప్రముఖ వైద్యుడు లిపిడ్ ప్రొఫైల్‌ను ఎంతో అందంగా వివరించారు. దాన్ని అర్థమయ్యేలా చెప్పేందుకు ఒక చక్కని కథను పంచుకున్నారు.


మన శరీరాన్ని ఒక చిన్న పట్టణంగా ఊహించుకోండి.


ఈ పట్టణంలో అతి పెద్ద అల్లరి చేసే వ్యక్తి — కొలెస్ట్రాల్.


అతనికి కొన్ని సహచరులు కూడా ఉన్నారు. అతని ప్రధాన సహచరుడు — ట్రైగ్లిసరైడ్.


వీళ్ల పని ఏమిటంటే… వీధుల్లో తిరుగుతూ గందరగోళం సృష్టించడం, రోడ్లను బ్లాక్ చేయడం.


ఈ పట్టణానికి కేంద్ర భాగం — గుండె (Heart).

అన్ని రోడ్లు గుండె వైపే వెళ్తాయి.


ఈ అల్లరి మూకలు పెరిగితే ఏమవుతుందో ఊహించవచ్చు.

వీరు గుండె పనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు.


కానీ మన శరీర పట్టణంలో ఒక పోలీస్ బలగం ఉంది — HDL (మంచి కొలెస్ట్రాల్).


ఈ మంచి పోలీస్ అల్లరి చేసే వారిని పట్టుకుని జైలులో ( కాలేయం – Liver ) వేస్తాడు.


ఆ తర్వాత కాలేయం వారిని శరీరం నుంచి బయటకు పంపుతుంది — మన డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా.


కానీ ఒక చెడు పోలీస్ కూడా ఉన్నాడు — LDL (చెడుకొలెస్ట్రాల్).


ఈ LDL ఏమి చేస్తాడంటే…

జైలులో ఉన్న నేరస్తులను బయటకు తీసి మళ్లీ వీధుల్లో వదిలేస్తాడు.


మంచి పోలీస్ అయిన HDL తగ్గిపోతే,

మొత్తం పట్టణం గందరగోళంగా మారుతుంది.


అలాంటి పట్టణంలో ఎవరు జీవించాలని కోరుకుంటారు?


👉 ఈ నేరస్తుల సంఖ్య తగ్గించి, మంచి పోలీసుల సంఖ్య పెంచాలనుకుంటున్నారా?


👉 నడక ప్రారంభించండి (Walking)!


మీరు వేసే ప్రతి అడుగుతో —

 • HDL పెరుగుతుంది

 • కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్లు, LDL తగ్గుతాయి


మీ శరీరం (పట్టణం) మళ్లీ ఆరోగ్యంగా మారుతుంది.


మీ గుండె — పట్టణ కేంద్రం —

ఈ నేరస్తుల వల్ల వచ్చే హార్ట్ బ్లాక్ నుంచి రక్షణ పొందుతుంది.


గుండె ఆరోగ్యంగా ఉంటే,

మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.


కాబట్టి అవకాశం దొరికినప్పుడల్లా — నడక మొదలుపెట్టండి!


🌿 ఆరోగ్యంగా ఉండండి…

🌿 మంచి ఆరోగ్యం మీకు కలగాలని ఆకాంక్షిస్తున్నాం



ఈ వ్యాసం HDL (మంచి కొలెస్ట్రాల్) పెంచి, LDL (చెడుకొలెస్ట్రాల్) తగ్గించే ఉత్తమ మార్గం — నడక అని చెబుతుంది.


👉 ప్రతి అడుగు HDL‌ను పెంచుతుంది.

👉 కాబట్టి ముందుకు సాగండి… కదులుతూనే ఉండండి.


హ్యాపీ సీనియర్ సిటిజన్స్ వీక్ 🎉



🔻 ఇవి తగ్గించండి:

 1. ఉప్పు

 2. చక్కెర

 3. మైదా (వైట్ రిఫైన్డ్ ఫ్లోర్)

 4. పాలు మరియు పాల ఉత్పత్తులు

 5. ప్రాసెస్డ్ ఆహారాలు



🔺 ఇవి ప్రతిరోజూ తినండి:

 1. కూరగాయలు

 2. పప్పులు

 3. బీన్స్

 4. గింజలు (నట్స్)

 5. చల్లగా పిండిన నూనెలు (Cold Pressed Oils)

 6. పండ్లు



🧠 మర్చిపోవడానికి ప్రయత్నించాల్సిన మూడు విషయాలు:

 1. మీ వయస్సు

 2. మీ గతం

 3. మీ లోపాలు



❤️ స్వీకరించాల్సిన నాలుగు ముఖ్యమైన విషయాలు:

 1. కుటుంబం

 2. స్నేహితులు

 3. సానుకూల ఆలోచనలు

 4. శుభ్రంగా, ఆహ్వానించేలా ఉండే ఇల్లు



🙂 అలవాటు చేసుకోవాల్సిన మూడు ప్రాథమిక విషయాలు:

 1. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి

 2. మీ సామర్థ్యానికి తగినంత శారీరక వ్యాయామం చేయండి

 3. బరువును పరిశీలించి నియంత్రించండి



🌱 స్వీకరించాల్సిన ఆరు ముఖ్యమైన జీవన అలవాట్లు:

 1. దాహం వేసే వరకు నీరు తాగకుండా ఉండకండి

 2. అలసిపోయే వరకు విశ్రాంతి తీసుకోకుండా ఉండకండి

 3. అనారోగ్యం వచ్చే వరకు వైద్య పరీక్షలను వాయిదా వేయకండి

 4. అద్భుతాల కోసం ఎదురు చూడకండి — దేవునిపై నమ్మకం ఉంచండి

 5. మీ మీద మీకు నమ్మకం ఎప్పుడూ కోల్పోవద్దు

 6. సానుకూలంగా ఉండండి — మంచి రేపటి మీద ఆశ ఉంచండి



👆 మీకు 45–80 సంవత్సరాల వయస్సులో ఉన్న స్నేహితులు ఉంటే, తప్పకుండా ఈ సందేశాన్ని వారికి పంపండి.

ఇది వారి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది 🙏