9, ఆగస్టు 2024, శుక్రవారం

Panchaag


 

నవ విధ భక్తి మార్గాల్లో

 ఒక ఊరిలో ఎవరో రామాయణ ప్రవచనం చెప్తున్నారు. బండోడు శ్రద్ధగా విని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. 

"రామాయణం నీకేం అర్ధమైంది" అని అడిగింది భార్య

"నాకేం అర్ధం కాలేదు" అన్నాడు బండోడు

 ప్రవచనం జరిగిన పది రోజులూ ఇదే తంతు. ప్రవచనం నుండి రాగానే నీకేమర్ధమయింది అని భార్య అడగడం, నాకేం అర్ధం కాలేదని బండోడు చెప్పడం. భార్యకి కోపం నషాళానికి అంటింది. 

"ఇదిగో ఆ గుండ్రాయి తీసుకు పోయి దాన్తో నీళ్ళు పట్రా" అంది. 

బండోడు వెళ్ళి గుండ్రాయిని నీళ్ళల్లో ముంచాడు. గుండ్రాయి లో నీళ్ళు నిలబడవు కదా. అలాగే తీసుకొచ్చాడు.భార్య మళ్ళీ తెమ్మంది. మళ్ళీ వెళ్ళాడు. అలా పది సార్లు తిప్పింది. 

"చూసావా.. ఆ గుండ్రాయితో నీళ్ళు తేలేకపోయావు.అలాగే పది రోజులు రామాయణం విన్నా నీకు ఏమీ అర్ధం కాలేదు. 

నువ్వా గుండ్రాయితో సమానం" అని ఈసడించింది. 

అప్పుడు బండోడు అన్నాడు, ".గుండ్రాయి నీళ్ళు తేలేక పోయిన మాట నిజమే కానీ పదిసార్లు నీళ్ళల్లో మునగడం వల్ల మాలిన్యం అంతా పోయి అది శుభ్రపడింది కదా.. అలాగే రామాయణం నాకేమీ అర్ధం కాకపోయినా పదిరోజుల్నుండీ వినడం వల్ల మనసు తేలిక పడ్డట్టు హాయిగా వుంది. మనసు ప్రశాంతంగా వుంది" అన్నాడు. 

భర్తకి అర్ధం కావల్సిన దానికన్నా ఎక్కువే అర్ధం అయిందని భార్యకి అర్ధం అయింది ! 


*నవ విధ భక్తి మార్గాల్లో శ్రవణం ఒకటి.విన్నా చాలు!

మహిళల పండుగ నెల

 https://youtu.be/OeLhIhKJVss?si=SpM9h3ufYr6G1C9r

శ్రీభారత్ వీక్షకులకు శ్రావణమాస శుభాకాంక్షలు 🌹 శ్రావణ మాసం అంటేనే మహిళల పండుగ నెల. నోములు, వ్రతాలు, పూజలు, తాంబూలాలు, వాయినాలు.. సందడే సందడి. కార్తీక మాసంలో ఆలయాల్లో సందడి ఎక్కువైతే, శ్రావణంలో ఇళ్లలో కూడా సందడి కనిపిస్తుంది. ఇప్పుడు అపార్ట్మెంట్ లలో ఈ సందడి కనిపించడం మంచి పరిణామం అంటున్నారు ప్రముఖ రచయిత్రి డా. తిరుమల నీరజ గారు. మన సంస్కృతి మన తర్వాత తరాలకు అందాలంటే మనం మన ఆచార వ్యవహారాలు మరువకూడదంటున్నారు నీరజ గారు. నిజమే కదా! అందరం పాటిద్దాం. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

మూగబోయింది

 *👉🏾ఒకసారి "పాలు" ఈశ్వరుని గురించి తపస్సు చేసింది. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యేక్షమై ఏమి నీ సమస్య ?!అని అడిగాడు.* 

 *అప్పుడు  పాలు..........* 


 *ఈశ్వరా !!* 

 *నేను ఆవు నుంచి, బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగా, పరిశుద్ధముగా ఉంటాను.. అయితే ఈ పాపిష్టి మానవుడు వాడి స్వప్రయోజనము కోసం నాలో పులుపు వేసి నా మనసును విరిచేస్తున్నాడు. నన్ను రక్షించు అని చెప్పి భాదపడిందట.* 


 *అప్పుడు ఈశ్వరుడు ఓ చిరు నవ్వు నవ్వి...* 


 *ఓ క్షీరమా... ఇది విను, నీవు పాలు లా జీవించాలి అని ఆశ పడే ముందు నా మాట విను.. నీవు పాలు లాగా అయితే ఒకరోజు మాత్రమే బ్రతుకుతావు.* 

 *పాలకు పెరుగు తోడు వేస్తే రెండు రోజులు బ్రతుకుతావు.,* 

పెరుగుని చిలికి చల్ల ని చేస్తే* *పుల్లపుల్లగా ఇంకో రెండు రోజులు బ్రతుకుతావు.* 

 *అదే చల్ల లోంచి వచ్చిన వెన్న అయితే వారం రోజులు బ్రతుకుతావు, అ వెన్నను బాగా కాచి దాంట్లో రెండు తమలపాకులు వేసి నెయ్యి చేస్తే మంచి ఘుమ ఘుమలతో  నెలలు తరబడి బ్రతుకుతావు.* 

 *ఆ నెయ్యితోనే దీపం పెడితే నాకు అర్పణవు అవుతావు..*


 *ఇప్పుడు చెప్పు... ఒక రోజు పాలు లాగా ఉండి పాలలాగానే చస్తావా ?! లేక క్షణక్షణం అనుక్షణం, రోజు రోజూ పెరిగి రూపాంతరం చెంది నాకు అర్పణవు అవుతావా... అని ఈశ్వరుడు ప్రశ్నించారు..* 


 *దేవుని మాటకి "పాలు" మూగబోయింది, ఈశ్వరునికి దాసోహం  అయ్యింది. తన మనసులో ఉన్న అంధకారానికి సిగ్గుపడి బయటకు వచ్చింది. ఈశ్వరుడు ముందు ప్రజ్వలించి దీపంలా నిలిచిపోయింది... అలా ప్రతి ఒక్కరూ తమ వృత్తిలో ప్రగతి పథంలో పయనించాలి..అప్పుడే మన జన్మ సార్థకం అవుతుంది...


 * ☘️☘️

భోజనమునకు ఉపయోగించదగిన

 భోజనమునకు ఉపయోగించదగిన పాత్రలు మరియు ఆకు విస్తళ్ళు - 


 * బంగారు పాత్ర యందు భోజనము మంగళప్రదమైనది . జఠరాగ్ని వృద్ది చెందును .వీర్యవృద్ధి కలుగచేయును . మంచి చూపును ఇచ్చును . పైత్యవికారాలను అణుచును . శరీరానికి గొప్ప మేలు చేయును . 


 * వెండిపాత్ర యందు భుజించిన పిత్తం ఎక్కువగును . శ్లేష్మాన్ని హరించును . వాతాన్ని చేయును . అరుచి ( ఏమి తిన్నా రుచి లేకుండా ఉండు సమస్య ) పోగొట్టును . శరీరానికి కాంతిని ఇచ్చును . వెండి ప్లేట్ మధ్యలో బంగారముతో తాపడం చేయించి అందులో భుజించుట కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును . 


 * కంచు పాత్రలో భుజించిన రక్తపైత్యము హరించును . హృదయానికి బలాన్ని ఇచ్చును . బుద్ధిని పెంచును . శరీరము నందు జఠరాగ్ని పెంచును . శరీరానికి కాంతిని కలుగచేయును . ఎముకల వృద్ది అగుటకు తోడ్పడును . ఎముకల బలానికి సహాయపడును . 


 * స్టెయిన్ లెస్ స్టీల్ , ఇనుము పాత్ర యందు భుజించిన శోధన ( Asitis ) , పాండురోగము ( Anemia ) సమస్యలను పోగొట్టును . కామిల వ్యాధి ( కామెర్లు ) నివారణ అగును . వీర్యవృద్ధి , జఠరాగ్ని పెంచును . ఈ పాత్రలను శుభ్రపరుచుట సులభము . 


 * అల్యూమినియం పాత్ర యందు వండుట మరియు భోజనం చేయుట అత్యంత ప్రమాదకరం . ఈ పాత్రల యందు వండు సమయము నందు దీని యందలి విషము కొంచం కొంచం వండిన ఆహారాల యందు కలిసి రక్తదోషాలు ఏర్పడి చర్మరోగాలు వచ్చుటయే కాక , జఠరాగ్ని మందగించి శరీరము విషతుల్యమై అనేక రోగాలు సంప్రాప్తించును . 


 ఆకు విస్తర్ల యందు భోజనం చేయుట వలన ఉపయోగాలు - 


 * అరటి ఆకు యందు భోజనము మిక్కిలి పరిశుభ్రముగా ఉండును . వాతాన్ని హరించును . బలము , ఆరోగ్యము వృద్ధిచెందును . శరీరకాంతి , సంభోగశక్తి పెంపొందించును . ఆకలిని మరియు దంతకాంతిని కలిగించును . పైత్యమును శాంతిప చేయును . శ్లేష్మవికారాలు , వొళ్ళు నొప్పులు తగ్గును . శరీరము నందలి క్రిములు నాశనం అగును . ఉదరము నందలి పుండ్లు ( peptic ulcers ) తగ్గించును . 


 * మోదుగ ఆకు విస్తరి యందు భుజించుట వలన గుల్మరోగము ,మహోదరము , క్రిమిరోగము , రక్తసంబంధ రోగములు , పిత్తరోగములు నివారణ అగును . బుద్దిని పెంచును . మోదుగ చంద్ర సంబంధ వృక్షము . చంద్రుడు మనః కారకుడు అందుచే ఈ విస్తరి యందు భుజించటం చేత సాత్విక గుణములు కలుగును . 


 * మర్రి ఆకుల విస్తరి యందు భుజించటం వలన క్రిమిరోగ నివారణ అగును. వ్రణములు , పైత్యం పొగొట్టును . కుష్ఠు రోగమును హరించును . నేత్రదోష నివారణ చేయును . వీర్యవృద్ధి కలిగించును . 


 * రావి ఆకు విస్తరి యందు భుజించిన పిత్తము , శ్లేష్మము నివారణ అగును . అగ్నివృద్ధి కలిగించును . జననేంద్రియ దోషములు నివారణ అగును . విద్యార్జనకు కావలసిన ఆసక్తిని కలుగచేయును . 


 * పనస ఆకుల యందు భుజించిన అగ్నివృద్ది , పిత్తహర గుణములు ఉండును . 


 * తామర ఆకు విస్తరి యందు భుజించిన విషహరముగా ఉండును . సరస్సులో ఉన్న ఆకు భుజించుటకు పనికిరాదని " అహ్నిక ప్రకాశం" అను గ్రంథములో ఉన్నది . 


 * వక్కపెట్ట భోజనమునకు వాడుట కొన్ని ప్రదేశాలలో ఉన్నది. తిన్నతరువాత పళ్ళెము వలే కడిగి మరలా భుజించటం కూడా ఉన్నది . ఇది అగ్నివృద్ది చేయును . దీని నుంచి వాతపిత్తరోగములు హరించును . 


   మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


    గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

వేపచెట్టులోని గొప్ప ఔషధ గుణాలు -

 వేపచెట్టులోని గొప్ప ఔషధ గుణాలు -


   మనకి వేపచెట్టు ఔషధ గుణాలు ఉన్న చెట్టుగా మాత్రమే తెలుసు. కాని ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. అందుకోసమే నేను చాలా పురాతన గ్రంథాలు పరిశోధించి మరియు నాయొక్క సొంత అనుభవాలు కలిపి మీకు ఇక్కడ తెలియచేస్తున్నాను. ఇప్పుడు నేను తెలియచేయబోయే విషయాలను జాగ్రత్తగా దాచుకోగలరు.


 * ఎంతోకాలంగా ఉండి మానని మొండి కురుపులకు వేపాకు నూరి కట్టిన అవి చాలా తొందరగా నయం అగును.


 * వేపాకు చిగురు ప్రతిరోజు ప్రాతఃకాలం నందు సేవించుచున్న రక్తం శుద్ధి అయ్యి శరీరం పైన ఉండు నల్లటి మచ్చలు ముఖ్యంగా ముఖంపైన ఉండు మచ్చలు తొలగిపోవును .


 * వేపచిగురు ప్రతినిత్యం పరగడుపున భుజించువారికి కొంతకాలానికి చేదుగా కాక తియ్యగా అనిపించును. వారికి పాము కరిచినను విషం ఎక్కదు.


 * వేపచెక్క గంధంని శరీరంపై పూసుకొనిన చర్మంపై వచ్చు చర్మవ్యాధులు హరించును. శరీరం పేలినట్లు ఉండటం, దురద, శోభి , మంగు, తామర వంటి చర్మవ్యాధులు హరించును .


 * ముదురు వేపచెట్టు యొక్క వేరు చూర్ణం కొద్దిమోతాదుగా లోపలికి పుచ్చుకొనిన రక్తంని శుభ్రపరచును. శరీరానికి పుష్టి కలిగించును. జ్వరమును పారద్రోలును , క్రిములను నాశనం చేయును .


 * వేపచెక్క చూర్ణం పసిపిల్లలకు ఇచ్చినచో కడుపులో ఉండు ఏలికపాములు , నులిపురుగులను సమర్ధవంతంగా నాశనం చేయును .


 * వేపచెక్క చూర్ణం పెద్దవారు సేవించిన అజీర్ణం వలన కలుగు జ్వరం తగ్గును.


 * వేపచెట్టు వేరు , బెరడు, ఆకు , ఈనే, పువ్వు, పిందె , కాయ, పండు, కల్లు , జిగురు ఇవి అన్నియు పలువిధములైన రుగ్మతలను నశింపచేయగలవు .


 * వేపాకు , పువ్వు శరీరం యొక్క తత్వమును మంచిస్థితికి మార్చి జీర్ణశక్తిని వృద్ధిపరచును.


 * వేపాకు రసం సేవించటం వలన జ్వరము, అజీర్తి, బలహీనం, పాండువు, క్రిమిరోగం, గండమాల , వ్రణములు, కుష్టు మొదలైనవి నశించును.


 * వేపాకు వడబెట్టి తలకు కట్టిన నరముల సంబంధం వలన వచ్చు "న్యూరాల్జియా"అను తలనొప్పి తగ్గును.


 * వేపాకు వడబెట్టి తలకు కట్టిన తలలోని పేలు , ఈపి , చుండ్రు నశించును.


 * చీముకారు పుండ్లకు వేపాకు నూరి ముద్దచేసి కట్టిన వాటిని మిగిల్చి మానునట్లు చేయును .


 * వేప బెరడు , వేప ఈనెల కషాయం , రోజుమార్చి రోజు వచ్చు జ్వరం నశించును.


 * వేపాకు ఆముదంతో వెచ్చచేసి కీళ్లవాపులకు కట్టిన తగ్గును.


 * లేతవేప చెట్టు నుంచి తీయబడిన కల్లు తియ్యగా ఉండును.దీన్ని పులియబెట్టి సేవించిన ఆమాశయ సంబంధమైన అజీర్తిని , క్రిములను పోగొట్టి మంచి ఆకలిని కలిగించును.


 * వేప కల్లు క్షయ, కుష్టు మొదలయిన అసాధ్యరోగాలను కూడా తగ్గించును .


 * వేప విత్తనాల నూనె చేదుగా ఉండును. ఈ నూనె లొపలికి సేవించిన వాతము హరించి ఉద్రేకమును పుట్టించును. అనగా వేడిని పెంచును.


 * ఈ వేపనూనె చర్మవ్యాధులను, క్రిమిజాడ్యములకు, మూలవ్యాధిని , మూత్రవ్యాధిని తగ్గించును .


 * వేపనూనె , ఆవనూనె, కొబ్బరినూనె సమభాగములాగా తీసుకుని కాచి చర్మవ్యాధులకు, కీళ్ళనొప్పులకు , వాపులకు , తలనొప్పికి ఉపయోగించవచ్చు.


 * పురిటి ఇంటి యందు వేపచమురుతో దీపం పెట్టిన శిశువులకు బాలగ్రహాది పీడలు కలగవు అని హిందువులకు గాఢమైన నమ్మకం.


 * వేప బంక పై పూతగా ఉపయోగించుట వలన సడలిపోయిన నరములు బిగువుగా అగును.


 * వేపాకు కషాయాంతో పుండ్లు కడిగిన త్వరగా మానును.


 * వేపచెట్టు గాలి ప్రతినిత్యం తగులుచున్న మశూచి,కలరా వంటి వ్యాధులు దరిచేరవు.


 * నూరు సంవత్సరములు కలిగిన వేపచెట్టు కాండంలో మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు పట్టేంతగా తొర్రని తొలచి అందులో సుమారు ఒక కిలో బియ్యమును అన్నంగా వండి వేడి తగ్గక ముందే ఆ తొర్రలో వేసి ఆ వేపచెట్టు పచ్చికఱ్ఱతోనే ఆ తొర్ర మూసేవిధంగా బిరడాలా చేసి బిగించి లొపలికి గాలిపోకుండా పైన ఆవుపేడను పూసి మూసివేయవలను . ఒక సంవత్సరం పాటు అలా ఉంచి ఆఖరు దినమున ఆ అన్నమును తీసిన ఎర్రగా మారిపోయి ఉండును.దానిని బాగా ఎండించి పూటకు రెండు నుంచి 3 గ్రాముల చొప్పున రెండుపూటలా 40 దినములు పుచ్చుకొనిన కుష్టురోగం నశించును.


 * వేపాకు మోతాదు మించి ఎక్కువుగా తినినచో మత్తు, మైకం, వాంతులు , విరేచనాలు అగును . కావున 4 నుంచి 5 ఆకుల వరకు తినవచ్చు.


  

         ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

సూరి మరణం లేక బండిరా పల్లకీ

 సూరి మరణం లేక బండిరా పల్లకీ 

ఈ పేరే చిత్రంగా ఉంది కదూ ? తెలుగు వ్యాకరణం చదువుకోని యువకులకు సూరి పేరు పరిచితమైనది కాకపోవచ్చు.కాని స్కూల్లోనో కాలేజీలోనో తెలుగు పాఠ్యాంశంగా చదువుకున్న వారికి చిన్నయ సూరి పేరు తెలిసే ఉంటుంది.చిన్నయ సూరి గారి ఇంటి పేరు పరవస్తు వారు.ఈయన చాలాకాలం క్రిందట (పందొమ్మిదవ శతాబ్దం ద్వితీయార్థంలో) మద్రాసులో కాలేజీలో తెలుగు అథ్యాపకులుగా పని చేసేవారు. ఈయన రచించినదే తెలుగు బాల వ్యాకరణం. తెలుగులో ఆది కవి నన్నయగారు ఆంద్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రచించారు. అదే మన మొదటి వ్యాకరణ గ్రంథం. అందుకే ఆయన వాగను శాసనుడయ్యాడు. ఆ తరువాత తెలుగు లో మరికొన్ని వ్యాకరణ గ్రంథాలు రాక పోలేదు గాని వాటన్నిటిలోకీ నవ్యాతి నవ్యమైనది పేరు పడ్డదీ మన చిన్నయసూరి గారి బాల వ్యాకరణమే.దాదాపు ఒక వంద సంవత్సరాలుగా మన తెలుగు పండితులందరి మన్ననలు పొంది నేటికీ మన తెలుగు గ్రాంథిక భాషను శాసిస్తున్నది ఈయన గారి వ్యాకరణమే.శ్రీ గిడుగు మున్నగు భాషా సంస్కర్తల పుణ్యాన మన తెలుగు వచనం ఈ గ్రాంథికాన్ని తోసిరాజని శిష్ట వ్యావహారికాన్ని తలకెత్తుకుని మన నెత్తిన పాలు పోసింది. లేక పోతే ఈ నాటికీ కృతక భాషలో రచనలు చదవ లేక యాతన పడేవారము. సరే ఇప్పటికి సూరి అంటే ఎవరో ఆయన వ్రాసిన వ్యాకరణమేదో తెలిసింది కదా? తాను శాసించిన తెలుగు గ్రాంథికము ఎలా ఉండాలో తెలుపడానికన్నట్లు ఆయన నీతి చంద్రిక పంచతంత్రము అనబడే రెండు గ్రంథాలను వెలువరించాడు. వాటిలో ఉన్నవి బహు చక్కని నీతి కథలే అయినా ఆ భాష మనం మాట్లాడుకునే తెలుగు భాషలా ఉండక ఏదోలా ఉంటుంది.సామాన్యులెవరికీ అర్థం కాదు. అవే కాదు గ్రాంథిక భాష లోని ఏ రచనైనా ఏ కొద్ది మంది పండితులకో అర్థ మౌతుంది కాని సామాన్య ప్రజానీకానికి కొరుకుడు పడదు. ఇటువంటి పరిస్థితుల్లో గిడుగు వారు సారథ్యం వహించగా తెలుగు దేశాన వ్యావహారిక భాషా ఉద్యమం రూపు దిద్దుకుంది.కొందరు ఛాందస పండితులు అడుగడుగునా అడ్డు తగిలినా జన బాహుళ్యం ఆమోదాన్ని పొంది తెలుగు వచనం గ్రాంథికాన్ని వీడి చక్కని వ్యావహారిక బాషను అక్కున చేర్చుకుంది.అయితే అది అంత సులువుగా జరగ లేదు.ఎంతో మంది కృషి ఫలితమిది. వీరిలో ఆంద్ర విశారద శ్రీ తాపీ ధర్మారావుగారు కూడా ఒకరు. వీరు పండితులు.భాషావేత్త.తెలుగులో చేమకూర వెంకట కవి కావ్యం విజయవిలాసానికి హృదయోల్లాస వ్యాఖ్య వ్రాసిన వారు. వీరు మొదట్లో గ్రాంథిక వాదులైనా గిడుగు పండితుని వాదనలోని స్వారస్యాన్ని గ్రహించి వ్యావహారిక భాషా వాదియై ఉద్యమం తోడ్పాటుకై ఎన్నో వ్యాసాలను వ్రాసి ప్రచురించారు. వాటిలో కొన్ని 1936 ప్రాంతంలో ప్రజామత పత్రికలో ధారా వాహికగా ప్రచురించబడ్డాయి. వాటిలోని కొన్నిటి సంకలనమే కొత్త పాళీ అనే పేరుతో 1955 ప్రాతంలో ముద్రింపబడి ఐదారు ముద్రణలకు నోచుకుంది.ఇదిగో ఈ పుస్తకంలోనే ఆయన వ్రాసిన సూరి మరణం లేక బండిరా పల్లకీ అనే ప్రహసనం చోటు చేసుకుంది.కేవలం నాలుగు రంగాలుగా విభజించి వ్రాయబడ్డ ఈ ప్రహసనం సూరి గారు అనారోగ్యంతో మంచాన పడి ఉండి గడియో క్షణమో అని ఉండగా ప్రారంభమౌతుంది.అక్కడ ఆయన విధవరాలైన కూతురూ మరో ఇద్దరు శిష్యులూ మాత్రం ఉంటారు.వైద్యుడు వచ్చి చూసి ఏమీ చెప్పకుండానే వెళ్లి పోతాడు.మరి కొద్ది సేపటికే సూరి గారు కన్ను మూస్తారు. నక్షత్రం మంచిది కాదని సూరి పార్థివ దేహాన్ని ఇంటి బయట అరుగు మీదకి చేరుస్తారు.అక్కడ చేరిన వారెవరూ పెద్దగా విలపించినట్లు తోచదు. వారిలో వారు మాట్లాడుకుంటూ ఉండగా మూర్తి అనే ఆయన సూరి గట్టివాడే కాని పాఠాలు చెప్పేటప్పుడు అరసున్నల గురించి బండిరాల గురించి తమను కాల్చుకు తినే వాడని ఒక ఉదాహరణ చెబుతాడు. చెరువులో ఏ “ర” ఉందని ఆయన అడిగి ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం చేప్ప లేక పోగా ఓ కుర్రాడు బండరాయుంటుందని అన్నాడుట. సూరిగారు శాబాసని వాడిని మెచ్చుకున్నారుట. ఆ అబ్బాయి అన్నది బండి’ఱా’యని కాదని బండరాయని పిల్లలందరూ గోల చేసారట. సూరి మరణించాక అందరూ “కతిపయ దివసములు గతించిన యనంతరంబ” అని కృతకంగా కాకుండా “కొన్నాళ్లు గడిచేక” అని అందరికీ అర్థమయేలాగ వ్రాసుకుంటారన్నమాట అనుకుంటారు. అక్కడ చేరిన వారు ఇటువంటి సరదా మాటలాడుకుంటూ సూరి మరణించిన రోజు నిజంగా తెలుగు జాతికి శుభ దినమని అందుచేత తామేదైనా చిరకాలం గుర్తుండి పోయే కార్యక్రమమేదైనా చేయాలని నిశ్చయించుకుంటారు .నాలుగో రంగంలో వారి ఆలోచన కార్య రూపం దాలుస్తుంది. వారిలో ఒకరైన రావుగారి ఇంటివద్ద బండి రా ఆకారంలో ఒక పల్లకీని ఏర్పాటు చేసి దానిలో సూరి ఆకారం గల బొమ్మనోకదానిని తయారు చేసి తీసుకు వచ్చి దానిలో పడుక్కోబెడతారు.అది అసలు సూరిగారు కాదు కదా? అన్నవారితో అది సూరిగారి రూపాంతరమనీ రూపాంతరాలు సూరిగారి వ్యాకరణ సమ్మతమేననీ సమర్థించుకుంటారు. ఆ పల్లకీ బండిఱా ఆకారంలో (బొమ్మ చూడండి)తయారు చేయబడి ఉంటుంది.దానికి వారు శకట రేఫ పల్యంకిక అనీ అర్థాను స్వారాల అనంత శయనం అనీ ముద్దు పేర్లు పెట్టుకుంటారు. పల్లకీ బండిరా రూపంలో ఉండడమే కాదు దానికి మీదని చంద్ర వంకల వంటివి తగిలించి ఉంచారు. అవి అర్థాను స్వారాలట.కర్ర మీదనున్న కట్లు నుగాగమాలూ టుగాగమాలూ అనీ ముందున్నవి ఆదేశాలనీ వెనకున్నవి ఆగమాలనీ అంతా వ్యాకరణ పరిభాషలో వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు.

“సూరి మరణము చూడగా రండి జనులార మీరు

దారి పొడుగున వేడ్క చూడండి||

సూరి మరణముతోనె బంధాల్ పారిపోయె, వ్రాత కోతలు

 తేరుకుని దేశానికున్నతి తెచ్చు నిశ్చయమింక మీదట ||సూరి|| 

అని పాడుకుంటూ భజన చేసుకుంటూ పల్లకీని ఊరేగిస్తూ ముందుకు సాగుతారు.

ఇదీ బండిరా పల్లకీ కథ.ఈ బండి రా లేక శకటరేఫ తెలుగు రచనల్లో ఎప్పుడో కనిపించకుండా పోయింది.మన తెలుగు పెద్ద బాల శిక్ష గ్రంథంలో అక్షర మాలలో ఈ శకటరేఫ (బండిరా) ఉండదు చూడండి. కొంత మంది ఇంకా ఛాందసంగా దాన్నివారి రచనల్ల ప్రయోగిస్తూ ఉండవచ్చు. తప్పేమీ లేదు.అది వారి ఇష్టం. కాని మనం గుర్తించ వలసిన విషయం ఏమిటంటే ‘ర’ ‘ఱ’ ల ఉచ్చారణలో భేదం తగ్గిపోయింది .ఆ రోజుల్లోనే శకటరేఫా నిర్ణయ కుఠారము వంటి గ్రంథాలు వెలుడ్డాయంటే వాటి సరైన నిర్ణయం తెలియక ఎన్ని తర్జన భర్జనలు జరిగాయో తెలుస్తుంది. కొందరిప్పటికీ అనవచ్చు కొన్ని పదాల్లో రేఫ ఉంటే ఒక అర్థం శకట రేఫ ఉంటే ఇంకొక అర్థం వస్తాయని అందువల్ల అది కొన సాగ వలసిందేనని.ఈ బండిరా అరసున్నల నిష్ప్రయోజకత్వం గురించి విపులంగా మరో పోస్టులో వ్రాస్తాను. సెలవు.

సైన్స్ పుట్టింది

 హిందుత్వం నుంచి సైన్స్ పుట్టింది అనటానికి ఎన్నో ఉదాహరణలు...!!!

1. కేవలం నీటి నుంచి సంతాన ఉత్పత్తి : భీష్ముడు జననం. 

2. నేతి కుండలలో పిండాల అభివృద్ధి = ఇప్పటి టెస్ట్ ట్యూబ్ బేబీ ల జననాలు = 100 మంది కౌరవులు ఏక కాల సంవత్సరంలో జననం.

3. పంచ భూతాలు నుంచి, అంటే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నుంచి జననం :*

పంచ భూతాలు+కుంతి= పాండవుల జననం..

4. ఆచార్య ద్రోణుడు, భరద్వాజ మహర్షి : టెస్ట్ ట్యూబ్ బేబీలు, కృపాచార్యుడు, కృపి అనే అన్నా చెల్లెళ్ళు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే.. కానీ ఈ ఇద్దరి టెస్ట్ ట్యూబ్ పిల్లలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక,ద్వారా పిల్లలను కనవచ్చా లేదా అన్నది ప్రాక్టికల్ గా ప్రయోగం చేశారు..తద్వారా అశ్వత్థామ జననం..

5. 🌞🌝ఒక మనిషి , సూర్యునిలో ఉన్న తేజస్సుని గ్రహించి *సూపర్ నాచురల్ ప్రొటెక్షన్* తో బిడ్డకు జన్మించటం : సూర్యుడు + కుంతి = కర్ణుని జననం..

 6. 🌞🌞. అగ్ని నుంచి వచ్చే *తేజస్సు* తో పిల్లలను కనటం : ద్రౌపది, దుష్టద్యుమ్నుల జననం..

7. సాధారణ మానవునికి, ఒక అసాధారణ వనితకి వివాహం : భీముడు + హిడింబి = ఘటోత్కచుడు..

8. ఆడదాన్ని మగ వాడిగా మార్చటం = శిఖండి 

👉🏻gender transformation.

 9. మగ వాడిని ఆడదానిగా మార్చటం = చిత్ర రధుడు..

10. చేప కడుపున ఆడపిల్ల పుట్టటం : సత్యవతి..

👉🏻ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి..కేవలం ఒక్క మహా భారత గ్రంథంలోనే ఇన్ని ఉంటే, మన రామాయణ, భాగవతాలు, అష్టా దశ పురాణాలు, వేదాలు ఉపనిషత్తులలో ఇంకెన్ని రహస్యాలను, ఇంకెంత విజ్ఞానం దాగి ఉందో?

👉🏻ఇవేమి,నేటి సైన్స్ కి అర్థం కాని ప్రశ్నలు..కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యం కాకపోయినా *లక్షల సంవత్సరాల క్రితమే* మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు ఎలా చేయ గలిగి విజయం సాధించ గలిగారు?

👉🏻ఇప్పటి మిడి మిడి జ్ఞానం ఉన్న మనలో కొంత మంది ఫేక్ అని కొట్టి పడేస్తారు,.కానీ లక్షల సంవత్సరాల క్రితం ఆ ఊహ గొప్పదే కదా?

       

ఈ సనాతన హైందవ ధర్మం ఒక అంతులేని సైన్స్.. అందులో పరిశోధన చేసే కొద్దీ అద్భుతాలు ఎన్నో బైటికి వస్తాయిఅని,స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు..

      

కాబట్టి మనం పూజించే ప్రతి దైవం సైన్స్ కి ప్రతి రూపము*. సైన్స్ ఉంది అంటే, ఖచ్చితంగా దాని *existency ఉండి తీరుతుంది..

     

ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుణ్య ఫలితంగా ఈ మానవ జన్మ, అందులోనూ, భారత దేశంలో అందులోనూ హిందువుగా పుట్టటం, *అందులోనూ, దైవం అంటే నమ్మకం ఉన్న వాడిగా పుట్టటం*, అందులోనూ త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించటం ఒక వరం..మనకి మాత్రమే దక్కిన అరుదైన వరం..

👉🏻భారతీయులారా మిత్రులారా మీకు ఇవి తెలుసా?

      

👉🏻భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట)


👉🏻భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)


👉🏻ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది మనమే (సుశ్రుతుడు)


👉🏻విద్యుత్* మొట్టమొదట కనిపెట్టింది మనమే (అగస్త్యుడు)


👉🏻విమాన శాస్త్రాన్ని అందించింది మనమే (భరద్వాజమహర్షి)


👉🏻భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన వరాహమిహిరుడు మనవాడే


👉🏻గణితం, భౌతికం, ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసిన


వాల్మీకి మహర్షి మనవాడే


👉🏻రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు


👉🏻కాస్మోలజీ చెప్పిన కపిలుడు


👉🏻అణువులు గురించి వివరించిన కణాదుడు


👉🏻DNA గురించి చెప్పిన బోధిధర్మ

👉🏻మేఘ శాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి


👉🏻మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన ఉత్సమధుడు


👉🏻సంగీతాన్ని (స.రి.గ. మ. ప) ప్రపంచానికి అందించిన స్వాతి ముని


ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు...!!!


*సేకరణ*

హిందూ ధర్మాన్ని

 *జై శ్రీ రామ్

_🚩హిందూ ధర్మాన్ని ఎందుకు రక్షించాలి...?_*


*_చాలామంది తెలియని వారికి అవగాహన కోసం ఈ వ్యాసం..!_*


*_చాలా మంది అవగాహన లేని వారు,చదువుకున్న వాళ్ళు అయినా సరే అవగాహన లేక పోవడం వల్ల మతం అంటే అది ఏదో వేరే వింత విషయంలా చూస్తారు.._*


*_ఇప్పటి చాలా మంది యువతకి అసలు మతం ఒక దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది,మతం యొక్క ప్రభావం మన జీవితం మీద ఎలా ఉంటుందో కూడా తెలిదు.._*


*_మనలో ఉన్న ఒక సమస్య ఏంటి అంటే...._*


*_సమాజంలో ఒక సమస్య ఉన్నా కూడా మన దృష్టికి అది రానంతవరకు ఏ సమస్యా లేదనే అనుకుంటాం.._*


*_మన దృష్టికి వస్తే అప్పుడు రియలైజ్ అయ్యి సమస్య ఉంది అని తెలుసుకుంటాం.._*


*_ఇదే పరిస్థితి ఇప్పుడు మన హిందువులది, అవగాహనా లోపం,మనకి తెలియకుండా మన చుట్టూ హిందువులుకు పొంచి ఉన్న ప్రమాదం సాటి హిందువులకు తెలియజేయాలి.._*


*_సాధారణంగా చదువుకున్న వాళ్లకి అన్ని మతాలు సమానం,దేవుళ్ళు అందరు ఒకటే.._*


*_ఏ మతం ఆచరిస్తే ఏంటి..?_*


*_భిన్నత్వం లో ఏకత్వం,ఏకత్వంలో భిన్నత్వం అనే మాయలో ఉంటారు._*


*_ఇది ఎంత తప్పో నేను వివరిస్తా.._*


*_నువ్వు హిందూ అయితే సర్టిఫికెట్స్ లో హిందూ అని క్రైస్తవుడు అయితే క్రైస్తవడు అని ముస్లిం అయితే ముస్లిం అని వేయించుకుంటావుగా అలాగే..._*


*_నీ జీవితంలో హిందువు అయితే హిందువు లాగే బతుకు.._*


*_అంతే గాని బొట్టు పెట్టుకోవడానికిసిగ్గు పడుతూ,నాకు దేవుళ్ళ మీద నమ్మకం లేదని లోపల ఆలోచిస్తూ,అన్ని దేవుళ్ళు ఒకటే,అన్ని మతాల సారం ఒకటే అని భ్రమ పడుతూ..ఉండకు.._*


 *_దేవుడి మీద నమ్మకం లేకపోతే నాస్తికుడిగా మారు,మారాక బ్రతుకు తెరువు కోసం మళ్లీ హిందువు అని సర్టిఫికెట్స్లో మాత్రం ఉంచుకోకు.._*


*_మతం అంటే అర్ధం ఏమిటి?మతం అంటే మనిషి మతిలో నుండి పుట్టింది అని,ఆ మనిషి రాకముందు ఆ మతం ఉండలేదు..ఆ మతం అనేది ఒక ప్రాంతానికి పరిమితం,దాని ఆలోచనలు ఒక స్థాయి వరకే ఉంటాయి.._*


*_మతం అనేది, మనుషుల కోసం, మనుషుల చేత, మనుషులే ఏర్పరచుకున్న ఒక నియమావళి.._*


*_ఉదాహరణకి, యేసు వచ్చాక క్రైస్తవ మతం ( సుమారు 2020 సంవత్సరాల క్రితం ) మొహమ్మద్ ప్రవక్త వచ్చాక (1400 సం. క్రితం) ఇస్లాం, బుద్ధుడు వచ్చాక బౌద్ధం ఇలా స్థాపించబడ్డాయి..కానీ హిందూ మతం (నిజానికి మనది మతం కాదు, ధర్మం) ఒక వ్యక్తి వచ్చి స్థాపించలేదు,ఇది ఎప్పటినుండో ఉంది.._*


*_యేసు రాక మందు క్రైస్తవం లేదు, యేసు క్రైస్తవుడు కాదు,మహమ్మద్ ప్రవక్త రాకముందు ఇస్లాం లేదు, అతడు ముస్లిం కాడు వీరు పోయాక ఆయా మతాలు స్థాపించబడ్డాయి. కానీ మనం పూజించే రాముడు,కృష్ణుడు వీళ్ళు హిందువులే,వాళ్ళకంటే ముందు నుండే హిందూ మతం(సనాతన ధర్మం) ఉంది._*


*_ఒక దేశము, ప్రాంతంపై మత ప్రభావం ఏంటి??చాలా మందికి మతం అనేది మన జీవితంపై ఎలా ప్రభావం చూపుతుందో తెలిదు..నిజానికి ప్రతి దేశము కూడా ఒక ప్రధాన మతం కలిగి ఉంటాయి.కొన్ని దేశాలు ఏకంగా ఒకమతాన్నే తమ దేశ మతంగా ప్రకటిస్తాయి (ఇస్లాం దేశాలు)ఆయా దేశాల్లో చట్టాలు ఆయా మతస్తులకు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. తక్కువ శాతం ఉండే వేరే మతస్తులకు అక్కడ అంత స్వేచ్ఛ ఉండదు..ఏ దేశములో అయినా ఒక మతం వారు మెజారిటీ అవ్వనంత వరకే, మెజారిటీ అయ్యాక వాళ్ళు అనుకున్నదే చేస్తారు.. అలా ఎలా అంటారా??చిన్న ఉదహారణ,ఒక గదిలో 10 మంది ఉన్నారు, 10 మందిలో 9 మంది గదిలో ఫ్యాన్ తిరగాలి అని కోరుకుంటున్నారు.. ఒకడు మాత్రమే ఫ్యాన్ వద్దు అని అనుకుంటున్నాడు..అప్పుడు ఏం జరుగుతుంది? 9 మంది కోరుకున్నదే ఖచ్చితంగా జరిగి తీరుతుంది.._*


*_అలాగే ఒక ప్రాంతంలో ఎవరు మెజారిటీ గా ఉంటే వాళ్లు ఏది కోరుకుంటే అదే జరుతుంది..కాశ్మీర్, పాత బస్తీ,పశ్చిమ బెంగాల్,కేరళ ఇవన్నీ కూడా మెల్లగా వేరే మతస్తుల వాళ్ళ చేత అక్రమించ బడి వాళ్ళ సంఖ్య పెంచుకోబడ్డవే..ఒకసారి ముస్లిం జనాభా పెరిగాక కాశ్మీర్ ఏమి అయ్యిందో వేరే చెప్పాలా??నిజం చెప్పాలంటే వాళ్ళ దేవుణ్ణి కాకుండా వేరే వాళ్ళని పూజిస్తే అవతలి వాళ్ళ ప్రాణాలు కూడా తీసేస్తారు..అవునా? అని సందేహ పడొద్దు.. బైబిల్, ఖురాన్ లో వాళ్ళ దేవుడు నన్ను కాకుండా వేరే వాళ్ళని పూజిస్తే చంపమని స్పష్టంగా చెప్పాడు.._*


*_ఇది నిజం..మనకి వేరే మత గ్రంధాలూ మీద అవగాహన లేక ఇవన్నీ తెలీవు..పైన అందుకే అన్ని మతాలు సమానం కావు,అన్ని మత గ్రంధాల సారం ఒకటే కాదు అని నేను అన్నది.అందుకే చరిత్ర లో క్రూసేడ్లు పేరుతొ మత యుద్ధాలు జరిగాయి.. క్రైస్తవులు ముస్లింలు కొట్టుకు చచ్చారు..ఖాళీ సమయంలో గూగుల్ లో క్రూసేడ్స్ అని కొట్టండి..భారత్ లో హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకే శాంతి భద్రత, హిందువులు మైనారిటీ లోకి వెళ్తే ఎలా ఉంటుందో కాశ్మీర్ ఒక ఉదాహరణ.._*


*_మతం మారితే ఏమి అవుతుంది..??మతం మారడం వల్ల ఆ దేశం మీద ప్రేమ తగ్గుతుంది, ఇది నేను చెప్పిన విషయం కాదు..భారత రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ అన్న మాట..మతం మారితే అలా దేశభక్తి ఎలా తగ్గుతుంది అంటే..ఒక వ్యక్తి ఏ మతంలోకి మారితే ఆ మతం ఎక్కడ పుట్టిందో,ఏ దేశంలో పుట్టిందో ఆ దేశం మీద ప్రేమతో పాటు ఆ మతం వల్ల ఆ దేశం మీద భక్తి పుడుతుంది.._*


*_ఉదా:-క్రైస్తవులకు ఇజ్రాయిల్ అలాగే క్రైస్తవ దేశాలు అంటే ఇష్టం, ముస్లిమ్స్ కి మక్కా అంటే ఇష్టం.. కొంత మంది భారతీయ ముస్లిమ్స్ భారత్ తో క్రికెట్ మ్యాచ్ జరిగినపుడు పాకిస్తాన్ ని సపోర్ట్ చేయడం మనం చూస్తూంటాం.. ఇవే ఆ లక్షణాలు మరి కొన్నిసార్లు ఆ మతంలోని దేవుడు పెట్టిన రూల్స్ వల్ల సమాజనికి, బంధువులకు,మిత్రులకూ దూరం అవుతారు.. ఎలా అంటే చాలా మంది క్రైస్తవులు హిందువుల ప్రసాదాలు తినరు,గుడికి రారు..గుడి లో విగ్రహాలును రాళ్లు,రప్పలు,సైతానులు అంటారు కూడా.వాళ్ళ మత గ్రంధం అదే చెప్పింది వాళ్లకి మరి.._*


*_మరి కొన్ని సార్లు అపురూపమైన దేశ సంస్కృతికి దూరం అవుతారు మతం మారితే... అవునా ఎలా?మన దేశంలో ఉన్న సంగీతం,నాట్యం,పురాతన కట్టడాలు ఇవన్నీ హిందూ మతంతో ముడి పడి ఉన్నాయి,వాటిని నేర్చుకోవడం,వాటిని రక్షించడం వేరే మతస్తులు చెయ్యలేరు..ఎందుకంటే వారి నమ్మకాల ప్రకారం విగ్రహలను,విగ్రహాలను పూజించే పురాతన అపురూప కట్టడాలను నాశనం చేయాలి అని వాళ్ళ దేవుడు చెప్పాడు.. (బైబిల్ లో ఉన్నవే నేను చెప్తున్న) మన దేశ చరిత్ర లో ఎన్నో వేల దేవాలయాలును నాశనం చేసిన సంఘటనలు ఎన్నో...మన అతి ప్రేమో,లేదా ప్రతి ఒక్కరినీ గౌరవించేతనమో,అందరు బాగుండాలి "సర్వేజన సుఖినో భవంతు" అని అనుకునే మన దేశానికి వచ్చిన బహుమతి 1000 సంవత్సరాల భానిసత్వం.._*


 *_ప్రపంచంలో అగ్రగామిగా ఉండే దేశం తక్కువ స్థాయికి చేరిపోయింది.. కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు మన దేశం నుండీ దోపిడీ చేయబడింది.. మన చరిత్ర పుస్తకాల్లో ఇవేవీ ఉండవు..మతం మారితే కనీసం నీ మాతృ భాష తెలుగు కూడా నేర్చుకోలేవు!!ఒక వేళ మీరు మీ పిల్లలను మిషనరీ స్కూల్ లో చేర్పిస్తే అక్కడ మొదట తీయించేవి బొట్టు,పువ్వులు,గాజులు.అవును.. తెలుగు నేర్చుకోవాలంటే తెలుగులో ఉన్న మన గ్రంధాలు,పోతన భాగవతం పద్యాలూ లాంటివి నేర్పించాలి.. కానీ మిషనరీ స్కూల్స్ లో,క్రైస్తవుల ఇంట్లొ పోతన భాగవతం పద్యాలు పాడటం, చదవటం కుదరదు..ఎందుకంటే వాళ్ళ దేవుడికి అసూయ వేరే వాళ్ళని స్తుతిస్తే..అలా వాళ్ళు చివరికితెలుగు చదవడం రాక,రాయటం రాక మాతృభాషకి కూడా దూరం అయిపోతారు.._*


*_హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం అంటే అదేదో దేశ భక్తి, దైవ భక్తి కాదు. మన భవిష్యత్ తరాలకు భారతదేశములో చోటు ఇవ్వడమే..ఈ దేశాన్ని తమ వశం చేసుకోవాలని క్రైస్తవం, ముస్లిం ప్రయత్నిస్తున్నాయి..ఆ మధ్య టైమ్స్ నౌ ఛానెల్ వాళ్ళు హిందూ అమ్మాయిలను మతం మారిస్తే లక్షల రూపాయాలు ఆయా యువకులకు ఇస్తున్న వీడియోలు కూడా విడుదల చేసారు..ఒక హిందువు వేరే మతం లోకి మారితే హిందువులకే ప్రమాదం!!అవునా ఎలా??..._*


*_బైబిల్, ఖురాన్ ల ప్రకారం.. వాళ్ళ దేవుణ్ణి కాకుండా వేరే దేవుణ్ణి పూజిస్తే రాళ్లతో కొట్టి చంపాలి.. ఒకడే దేవుణ్ణి కాకుండా ఎక్కువ మంది దేవుళ్ళని పూజించే వాళ్ళు కనపడితే చంపండి..(ఖురాన్ 9:5,బైబిల్ ద్వితీయఉపదేశ కాండం 13:6,7,8,9)అలా నోళ్లు వెళ్ళ బెట్టకండి, పైన ఉన్న వాక్యాలు వాళ్ళ దేవుళ్ళు చెప్పినవే.._*


*_ఊరుకోండి భయ్యా..మీరు మరీనూ..వాళ్ళు అలా ఎవరినైనా చంపితే పోలీసులు ఉరుకుంటారా?? చట్టం లేదూ అంటారా.. మీరు అతిగా ఆవేశ పడుతున్నారు..పోలీసులు,గీలుసులు నహీ చెల్తా...ఆ మధ్య కాశ్మీర్ లో DSP ని సైతం రాళ్లతో కొట్టి చంపి,నగ్నంగా ఊరేగించారు.. మతోన్మాదులు అలా ఉంటారు. వాళ్ళు మతం ఎలా మారుస్తారు ??ఆరోగ్యం బాలేదా ?? మా మతంలోకి వచ్చేయ్.. మా దేవుణ్ణి నమ్ముకో నీకు నయం అయిపోద్ది..!!ఒక వేళా నిజంగా ఆ మతం లోని దేవుడు వల్ల జబ్బు నయం అయితే.. రెండో సారి వాళ్ళకి జబ్బు వస్తే హాస్పిటల్ కి వెళ్లకుండా ఉండమని చెప్పాలి..అప్పుడు రెండో సారి మాత్రం జబ్బు వస్తే హాస్పిటల్ కి పరిగెడతారు..ఏమి అప్పుడు దేవుడు ఏమి అయ్యాడు ?? అలా అయితే హాస్పిటల్స్ ఎందుకు అన్ని మూసేయమని చెప్పాలి కదా.జబ్బు కోసమో డబ్బు కోసమో మతం మారడం స్టార్ట్ చేస్తే ప్రపంచకంలో ఉన్న అన్ని మతాలలోకి మారినా కూడా ఎదో ఒక కొత్త జబ్బులు వస్తూనే వుంటాయి..._*


*_నీకు ఉద్యోగం లేదా??అయితే మతం మారిపో.. మా దేవుణ్ణి నమ్ముకో మీకు ఉద్యోగం వచ్చేస్తది..!!పెళ్లి కాలేదా ??అయితే మతం మారిపో..మా దేవుణ్ణి నమ్ముకో.!!పిల్లలు లేరా??అయితే మతం మారిపో.. మా దేవుణ్ణి నమ్ముకో..!!కుటుంబ సమస్యలా??ఆర్థిక సమస్యలా ???మతం మారిపో..మా దేవుణ్ణి నమ్ముకో..!!మతం మారిన ప్రతి ఒక్కరు దాదాపు ఇలానే మార్చబడ్డారు..ఇలా అమాయక ప్రజల్ని మతం మారుస్తూ వాళ్ళ దగ్గర దశమ భాగాలు పేరుతో 10 % సంపాదన ని దోచుకుంటారు..మన రాష్ట్రం లో 65 % మాత్రమే అక్షరాస్యత.. అంటే 100 లో 35 మందికి చదవటం,రాయటం రాదు.. వాళ్లకి ఈ విషయాల మీద అవహగాహన తక్కువ.. మిగతా 65 మందిలో 30 మందికి చదవటం,రాయటం మాత్రమే వచ్చు.. వాళ్ళకి ఇలాంటి విషయాలు మీద అవగాహాన తక్కువ.. ఇక మిగిలిన 35 మందిలో చాలా వరకు అన్ని మతాలూ సమానం, అన్ని మతాల సారం ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే అనే మాయలో బతికేస్తున్నారు.. కాబట్టి చదువులేని నిరక్షరాస్యులకు, చదువు ఉండి కూడా ఏమి తెలియని అమాయకులకు ఈ వ్యాసం ఒక మేలుకొలుపు..._

 జై శ్రీరామ్ కంచెర్ల వెంకట రమణ జై కృష్ణధర్మరక్షణ 🙏🙏👍👍👍

నాగపంచమి లేక గరుడ పంచమి!#

 #నేడు నాగపంచమి లేక గరుడ పంచమి!#


శ్రావణ శుద్ధ పంచమి రోజున కశ్యప ప్రజాపతి భార్యలైన వినత, కద్రువులకు గరుత్మంతుడు, నాగులు జన్మించారు. ఆ రోజునే గరుడ పంచమి, నాగ పంచమిగా హిందువులు పూజలు చేస్తున్నారు.


శ్రావణ శుక్ల పంచమినే నాగ పంచమి, గరుడ పంచమి పేర్లతో పిలుస్తారు. సనాతన భారతీయ సంస్కృతిలో నాగ పూజకి ఓ విశిష్టత ఉంది. శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. నాగపంచమి ప్రాముఖ్యతని సాక్షాత్తు పరమేశ్వరుడే స్కంద పురాణంలో వివరించాడు. శ్రావణ శుద్ధ పంచమి అత్యంత విశిష్టత సంతరించుకుంది. ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమని అడిగితే.. తాము ఉద్బవించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి సర్ప పూజలు చేయాలని కోరుకున్నాడు. ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీమహావిష్ణువు శ్రావణ శుక్ల పంచమి రోజున జనులు సర్ప పూజలు చేస్తారని వరమిచ్చాడు.


"నాగ పంచమి" రోజు నాగులని పూజించి, గోధుమతో చేసిన పాయశాన్ని నైవేద్యంగా పెడతారు. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేస్తారు. నాగ పంచమి రోజున


‘విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః, న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్’ 


ఈ మంత్రాన్ని చదువుతూ పుట్టలో పాలు పొయ్యాలి. నాగ పంచమి రోజున పూజచేసిన వారికి విష బాధలుండవు. సర్ప స్తోత్రాన్ని ప్రతిరోజూ, నాగ పంచమి రోజున చదివినవారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు, రోగాలు రావు. వంశాభివృద్ధి, సంతానోత్పత్తి, కార్యసిద్ధి కలిగి కాలసర్ప దోషాలు, నాగ దోషాలు తొలగిపోతాయి.


కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు. వినతకి గరుత్మంతుడు, కద్రువకు నాగులు జన్మించారు. దీంతో సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమిని‘నాగ పంచమి’గా పిలుస్తున్నారు. ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కాబట్టి, శ్రావణ శుద్ధ పంచమిని ‘గరుడ పంచమి’గా పేర్కొంటారు. శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది. కాబట్టి సర్పభయం పోవడానికి నాగపూజ చేస్తారు. అలాగే ఈ రోజున గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు. అయితే సోదరులు ఉన్న మహిళలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం వుంది.

నేర్చుకోవడం

 🍀నేర్చుకోవడం.....


సోక్రటీసుకు మరణశిక్ష విధించారు. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడని అభియోగం. ఆయన్ని జైల్లో పెట్టారు. 


ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవం. పేరుకు జైల్లో పెట్టారు కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి వెళుతున్నారు. శిష్య బృందమయితే అక్కడే ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానీ ఆ తాత్వికుడు ఇదేమీ పట్టనట్లు నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ కబుర్లూ చెబుతూ ఉన్నాడు. అందరూ ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరణమంటే లక్ష్యపెట్టని ఆ మహానుభావుణ్ణి చూసి విస్తుపోతున్నారు. మరణ శిక్ష అమలు కావడానికి రెండు గంటల సమయముంది. ఆ శిక్ష విషం తాగి మరణించడం. సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి.


 సోక్రటీస్‌ ఆ సంగతే పట్టనట్లు అది తనకు సంబంధించిన విషయమే కానట్లు ఉన్నాడు. అందరి ముఖాల్లో ఆందోళన దిగులు, ఆయన ముఖంలో ఆనందం వెలుగు. ఆయన కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూచుని లైర్‌ వాద్యం వాయిస్తున్నాడు. ఆ తీగల్ని మీటుతూ పాడుతున్న పాట సోక్రటీస్‌ మనసుని తాకింది.


 పరవశంగా కళ్ళు మూసుకున్నాడు. చల్లటి గాలి ఆ పాటను మోసుకొచ్చి పరిమళంలా సోక్రటిస్‌ హృదయాన్ని తాకింది. ఎప్పుడూ ఆనందంగా ఉండే అతను మరింత ఆనందపడ్డాడు.


సోక్రటీస్‌ మెల్లగా కళ్ళు తెరచి జైలర్‌ని పిలిచాడు. జైలర్‌ ఎంతో గౌరవభావంతో దగ్గరికి వచ్చి ఏమికావాలన్నాడు. సోక్రటీస్‌ కిటికీలోంచి చూపించి ”మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాణ్ణి తీసుకొస్తారా?” అని అడిగాడు.


 జైలర్‌ ”అయ్యో!దాందేముంది?” అని వెళ్ళి ఆ బిచ్చగాణ్ణి తీసుకొచ్చాడు. 


సోక్రటీస్‌ ఆ బిచ్చగాణ్ణి తనకాపాట నేర్పమన్నాడు. అతని దగ్గర నుంచి లైర్‌ వాద్యం తీసుకున్నాడు. ఆ బిచ్చగాడు పాటపాడాడు.


 సోక్రటీస్‌ ఆ పాట పాడుతూ లైర్‌ వాద్యం వాయించాడు. ఇట్లా అరగంట సాధన తరువాత బిచ్చగాడి సాయం లేకుండానే ఆ పాట పాడాడు. 


సోక్రటీస్‌ కృతజ్ఞతలు చెప్పి బిచ్చగాణ్ణి పంపేశాడు. ఆయన శిష్యులు, జైలర్‌ ఆశ్చర్యపోయారు. మరణశిక్షకు ఇంకా గంట మాత్రమే ఉంది కానీ సోక్రటీస్‌ ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది. 


శిష్యులు


 ”గురువుగారూ! ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది. అది తాగి మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతున్నారు. 


కానీ ఇప్పుడు మీరు లైర్‌ వాద్యంమీద ప్రాక్టీసు చేసి పాట నేర్చుకున్నారు? ఏమిటిది?” అని కన్నీళ్ళ పర్యంతమయ్యారు. సోక్రటీస్‌ నవ్వి ”జీవితమంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు.


 నేను నువ్వు ఇక్కడున్న అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. కానీ జీవించినన్నినాళ్ళు ప్రతిక్షణం విలువైందే. ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందముంది.


 గంటక్రితం నాకా పాట తెలీదు. ఇప్పుడు నేర్చుకున్నాను. 


ఇంకా నాజీవితంలో గంట సమయముంది. 

.

అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశముంది” అన్నాడు.


 శిష్యుల నోట్లో మాట రాలేదు.

Learning is life🍎🍑🍅🍓🍓🍇👏👏చంద్రశేఖర్ శాస్త్రి 🙏🙏🙏

ఆగష్టు, 09, 2024*🪷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

        🌹 *శుక్రవారం*🌹

 🪷 *ఆగష్టు, 09, 2024*🪷 

      *దృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*

*దక్షిణాయణం - వర్షఋతౌః*

*శ్రావణమాసం - శుక్లపక్షం*


*తిథి : పంచమి* రా 03.14 తె వరకు ఉపరి *షష్ఠి*

వారం :*శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం : హస్త* రా 02.44 వరకు ఉపరి *చిత్త*


*యోగం : సిద్ధ* మ 01.46 వరకు ఉపరి *సాధ్య*

*కరణం : బవ* మ 01.55 *బాలువ* రా 03.14 తె ఉపరి *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 06.00 - 08.00 సా 05.00 - 06.00*

అమృత కాలం :*రా 07.57 - 09.45*

అభిజిత్ కాలం :*ప 11.47 - 12.38*


*వర్జ్యం : ఉ 09.05 - 10.53*

*దుర్ముహుర్తం : ఉ 08.23 - 09.14 మ 12.38 - 01.29*

*రాహు కాలం : ఉ 10.37 - 12.13*

గుళిక కాలం :*ఉ 07.26 - 09.01*

యమ గండం :*మ 03.24 - 05.00*

సూర్యరాశి : *కర్కాటకం* 

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 05.50* 

సూర్యాస్తమయం :*సా 06.35*

*ప్రయాణశూల :‌ పడమర దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.50 - 08.23*

సంగవ కాలం :*08.23 - 10.56*

మధ్యాహ్న కాలం :*10.56 - 01.29*

అపరాహ్న కాలం :*మ 01.29 - 04.02*

*ఆబ్ధికం తిధి:శ్రావణ శుద్ధ పంచమి*

సాయంకాలం :*సా 04.02 - 06.35*

ప్రదోష కాలం :*సా 06.35 - 08.50*

నిశీధి కాలం :*రా 11.50 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.20 - 05.05*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


  🌷 *శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం*🌷


త్వమేవ జననీ లక్ష్మీ పితా లక్ష్మీ త్వమేవ చ /

భ్రాతా త్వం చ సభా లక్ష్మీ విద్యా లక్ష్మీ త్వమేవచ //


త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురేశ్వరి /

త్రాహి త్రాహి జగన్మాతః దారిద్ర్యా త్యాపి వేగతః //


నమస్తుభ్యం జగద్దాత్రి నమ స్తుభ్యం నమో నమః /

ధర్మాధారే నమ స్తుభ్యం నమ సాంపత్తి దాయినీ //

    

            🪷 *ఓం శ్రీ*🪷

🌹 *మహాలక్ష్మీయై నమః* 🌹

🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

       🌹🌷🌹🌹🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

       🌷🌹🌷🌷🌹🌷

 🌹🍃🌿🪷🪷🌿🍃🌹

ఆ తరం వెళ్ళి పోతున్నది



*ఆ తరం వెళ్ళి పోతున్నది....!* *ఆ ప్రేమ... కనుమరుగైపోతున్నది....!!* ********************** *తరం వెళ్ళిపోతుంది. ప్రేమగల పెద్దరికం కనుమరుగైపోతుంది. బహుదూరపు బాటసారై పయనం ముగిస్తున్నది. జ్ఞాపకాల మూట వదిలి బాటపట్టి పోతుంది. తెల్లని వస్త్రధారణతో... స్వచ్ఛమైన మనసుతో... మధురమైన ప్రేమతో... అందరి పట్ల అనురాగంతో విలువలతో కూడిన బ్రతుకును సాగించిన .... మన ముందు తరం తిన్నగా చేజారిపోతున్నది. వయోభారంతో మనల్ని వదిలిపోతుంది. హుందాతనపు మీసకట్టు... రాజహాసపు పంచ కట్టు.... పూటకో తీరు మార్చని మాట కట్టు.... శ్రమనే నమ్ముకుని ఎక్కిన బ్రతుకు మెట్టు.... తల తెగినా మాట తప్పని నీతి ఒట్టు.... ఇబ్బందులు ఎన్ని ఎదురైనా విప్పని గుట్టు.... ఇలా నిజాయితీకి మారుపేరుగా నిలిచిన.... ఒక నాటి మన పెద్దతరం క్రమంగా కనుమరుగవుతుంటే..... హృదయం బరువెక్కుతుంది . మనసు మూగబోతుంది. కంటనీరు కారిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.... కష్టాలు ఎన్ని చుట్టుముట్టినా..... సమస్యలు ఎన్ని ఎదురైనా..... అందరూ సామరస్యంగా.. కలిసిమెలిసి ...., ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకునేవారు. ఒకరికొకరు సహకరించుకునేవారు. సమస్యలను సమూహంగా జయించేవారు. మరి మన తరం,,,,,,

పురోహితుడు

 పురోహితుడు అంటే ఎవరు???

*********************************

శ్లో:జన్మనా బ్రాహ్మణోజ్ఞ్యేయః

సంస్కారద్వ్దిజ ఉచ్యతే౹

విద్యయా యాతి విప్రత్వం

త్రిభిః శ్రోత్రియ ఉచ్యతే౹౹

పుట్టుకతో శూద్రుడు, ఉపనయన కాలంలో ద్విజుడు,విద్యాభ్యాసంలో విప్రుడు, ఈ మూడింటితో అతడు శ్రోత్రియుడు అగును...


👉పురోహితుడు అనగా:ముందుగా హితము పలికెడివాడు

👉పురోహితుడు అనగా:ధర్మార్థ కామమోక్షములకు సోపానము

👉పురోహితుడు అనగా:పూజనీయుడు

👉పురోహితుడు అనగా:సహృదయతకు, మృదుభాషనకు, మధురానుభూతికి మారుపేరు

👉పురోహితుడు అనగా:నిత్య కర్మానుష్ఠానము ఒనర్చు ఒక తపస్వి

👉పురోహితుడు అనగా:ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు

👉పురోహితుడు అనగా:హైందవ సాంప్రదాయానికి రక్షణ కవచం

👉పురోహితుడు అనగా:సాదారణమైన పేరు వశిష్ఠుడు

👉పురోహితుడు అనగా:మానసిక వ్యాధిని ఛేదించె సైకాలజీ, ఒక హిప్నాటిస్ట్

👉పురోహితుడు అనగా:ఆత్మస్థైర్యమును, నమ్మకమును కలిగించె, బాధలను తొలగించె పిలాసపీ, ఒక మెజీషియన్

👉పురోహితుడు అనగా:సందేహ నివృత్తికి ఒక నిఘంటువు

👉పురోహితుడు అనగా:తాను ఉద్దరింపబడుచు, ఇతరులను ఉద్ధరింపజేయు జ్ఞాన దీపిక

👉పురోహితుడు అనగా:భగవంతునికి భక్తునికి మద్య ఒక వారధి

👉పురోహితుడు అనగా:భూత భవిషత్వర్తమాన కాలముల సూచిక 

👉పురోహితుడు అనగా:శుభాశుభ కార్యములను ఆరాధించు సమదర్శి

👉పురోహితుడు అనగా:నిత్య కాల గణన చేయు గణిత వేత్త

👉పురోహితుడు అనగా:గోసంపద, వృక్ష సంపదతో వాతావరణ కాలుష్యాన్ని నివారించు యజ్ఞమూర్తి

👉పురోహితుడు అనగా:పర్యావరణ పరిరక్షణలో వృక్ష ప్రతిష్టకు మొదటి ప్రతినిధి

(జన్మ నక్షత్ర వృక్షాలు, యజ్ఞసమిదల వృక్షాలు, ఫలపుష్పాది వృక్షాలు, ఓషధివృక్షాలు మొదలగువాటిని ప్రతిష్టించి, పెంచి, పోషించుమని ప్రోత్సహించువాడు)

👉పురోహితుడు అనగా:ధర్మ శాస్త్ర ప్రియుడు..


పురోహితము

పు ,అనగా పురజనులందరికి

రో ,అనగా రోజురోజుకి

హి ,అనగా హితముచెప్పుచు

త ,అనగా తరింపజేసి

ము ,అనగా ముదముగూర్చునది🔥🥥🍁🦢🚩


జై శ్రీమన్నారాయణ  ❤️

బలవంతంగా లాక్కోనిపోగలవు.

 యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ।

ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః ।। 60 ।।


యతతః — స్వీయ-నియంత్రణ అభ్యాసం చేసేటప్పుడు; హి — దానికి; అపి — కూడా; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; పురుషస్య — పురుషుని యొక్క; విపశ్చితః — బుద్ధి విచక్షణ కలవారు; ఇంద్రియాణి — ఇంద్రియములు; ప్రమాథీని — అల్లకల్లోలమైన; హరంతి — లాక్కోనిపోవును; ప్రసభం — బలవంతంగా; మనః — మనస్సుని.


Translation

BG 2.60: ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి, అల్లకల్లోలమైనవి అంటే, ఓ కుంతీ పుత్రుడా, వివేకము కలిగి, స్వీయ-నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కోనిపోగలవు.


Commentary

ఇంద్రియములు అనేవి అప్పుడే పగ్గాలు వేయబడిన అడవి గుర్రాల వంటివి. అవి దుడుకైనవి, తెంపరితనం మెండుగా ఉన్నవి, కాబట్టి వాటిని క్రమశిక్షణలో పెట్టడం అనేది సాధకులకు తమలో తామే పోరాడవలసిన చాలా ముఖ్యమైన కార్యం. కాబట్టి ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నించేవారు, కామ క్రోధాదులతో కూడిన, భోగములను కోరే తమ ఇంద్రియములను మచ్చికచేసుకోవటానికి జాగ్రత్తగా ప్రయత్నించాలి, అలా చెయ్యకపోతే అవి గొప్ప సాధకులైన యోగుల ఆధ్యాత్మిక పురోగతిని కూడా చెడగొట్టి, పట్టాలు తప్పేలా చేయగలవు.


ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పటానికి, శ్రీమద్భాగవతంలో, ఒక చక్కని కథ ఉంది: (9వ స్కంధము, 6వ అధ్యాయం)


పురాతన కాలంలో సౌభరి అనే ముని ఉండేవాడు. అతను ఋగ్వేదంలో పేర్కొనబడ్డాడు, దానిలో సౌభరి మంత్రం అనే ఒక మంత్రం ఉంది. 'సౌభరి సంహిత' అనే ఒక గ్రంధం కూడా ఉంది. కావున అతను సామాన్యమైన ముని కాడు. సౌభరి ముని తన శరీరంపై ఎంత నియంత్రణ సాధించాడంటే అతను యమునా నదిలో పూర్తిగా మునిగి నీటిలోపల ధ్యానం చేసేవాడు. ఒకరోజు అతను రెండు చేపల సంయోగం చూసాడు. ఆ దృశ్యం అతని మనో-ఇంద్రియములను చలింపచేసింది, మరియు అతని మదిలో లైంగిక సాంగత్యం కోసం కోరిక పెల్లుబికింది. తన ఆధ్యాత్మిక సాధనని పరిత్యజించి, ఆ కోరిక ఎలా తీర్చుకోవాలనే తపనతో నీటినుండి బయటకు వచ్చాడు.


ఆ సమయంలో, అయోధ్యకు రాజు మాంధాత, అతను ఎంతో తేజోవంతమైన ఉత్తమ పాలకుడు. అతనికి యాభై మంది, ఒకరిని మించి ఒకరైన అందమైన కుమార్తెలు ఉండేవారు. సౌభరి ముని ఆ రాజు వద్దకి వచ్చి ఆ యాభై యువరాణులలో ఒకరిని పాణిగ్రహణానికి అడిగాడు.


మాంధాత మహారాజు ఆ ముని స్వస్థచిత్తత గురించి ఆందోళన పడి ఇలా అనుకున్నాడు, ‘ఒక వృద్ధుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడే!’ అని. ఆ రాజుకి, సౌభరి ఒక శక్తివంతమైన ముని అని తెలుసు, కాబట్టి ఈయన కోరికని నిరాకరిస్తే, ముని తనను శపించవచ్చు. కానీ, తను ఒప్పుకుంటే, తన కుమార్తెలలో ఒకరి జీవితం నాశనమైపోతుంది. ఎటూతోచని పరిస్థితిలో, రాజు ఇలా అన్నాడు, ‘ఓ పుణ్యపురుషా! మీరు అడిగినదానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దయచేసి కూర్చోండి. నా యాభై మంది కుమార్తెలను మీ ముందుకు తీసుకొస్తాను, వారిలో ఎవరు మిమ్ములను ఎంచుకుంటే, ఆమె భార్యగా మీదవుతుంది’ అని. రాజు ధైర్యం ఏమిటంటే తన కుమార్తెలలో ఎవరూ కూడా ఈ వృద్ధ సన్యాసిని కోరుకోరు, కాబట్టి ఈ ప్రకారంగా, ముని శాపాన్ని తప్పించుకోవచ్చు, అని.


రాజుగారి ఉద్దేశ్యం అర్థంచేసుకున్న సౌభరి, తాను మరుసటి రోజు వస్తానని రాజుకి చెప్పాడు. ఆ సాయంత్రం, తన యోగ శక్తిని ఉపయోగించుకుని అందమైన యువకుడిగా మారిపోయాడు. పర్యవసానంగా, మరుసటి రోజు రాజ మందిరం వెళ్ళి కనపడినప్పుడు, ఆ యాభై మంది రాకుమార్తెలు అందరూ అతన్నే భర్తగా కోరుకున్నారు. ఇచ్చిన మాటకు బద్ధుఁడైయున్న ఆ రాజు తన కుమార్తెలందరినీ ఆ మునికి ఇచ్చి వివాహం చేయవలసి వచ్చింది.


ఇప్పుడు, యాభై మంది తోబుట్టువులు ఒకే భర్తని పంచుకోవటం చేత, తమలో తాము తగవు పడతారేమో అని ఆ రాజు చింతించాడు. కానీ, సౌభరి మరల తన యోగశక్తిని ఉపయోగించాడు. రాజు భయాన్ని తొలగిస్తూ, అతను యాభై రూపములు స్వీకరించి, తన పత్నుల కోసం యాభై భవనాలు సృష్టించి, వారందరితో వేర్వేరుగా నివసించాడు. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరములు గడచి పోయినవి. సౌభరికి ప్రతి భార్యతో చాలా మంది బిడ్డలు కలిగారని, వారికి మళ్ళీ ఇంకా సంతానం కలిగి, చివరకి ఒక చిన్న పట్టణం తయారయిందని పురాణములలో చెప్పబడింది.


ఒక రోజు, సౌభరి తన అసలు స్పృహలోకొచ్చి ఇలా మొరబెట్టుకున్నాడు: ‘అహో ఇమం పశ్యత మే వినాశం’ (భాగవతం 9.6.50) ‘ఓ మానవులారా! మీలో ఎవరైతే, భౌతిక విషయముల ఆర్జన ద్వారా ఆనంద ప్రాప్తి కోసం ప్రయత్నించే వాళ్లారా, జాగ్రత్త. నా భ్రష్టత్వం చూడండి - నేనెక్కడ ఉండేవాడిని, ఇప్పుడెక్కడ ఉన్నాను. నేను యాభై శరీరాలు సృష్టించుకున్నాను, మరియు యాభై స్త్రీలతో వేల సంవత్సరాలు గడిపాను. అయినా ఇంకా, ఈ ఇంద్రియములు సంతృప్తి చెందలేదు, సరికదా ఇంకా కావాలని కాంక్షిస్తున్నాయి. నా పతనం చూసి నేర్చుకొని, ఆ దిశలో వెళ్ళవద్దు అని హెచ్చరిస్తున్నాను.’

09.08.2024,శుక్రవారం

 జై శ్రీమన్నారాయణ 

09.08.2024,శుక్రవారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

శ్రావణ మాసం -  

గరుడ పంచమి


నేడు నాగ గరుడ పంచమి..


శ్రావణ శుక్ల పక్ష పంచమి ”నాగ పంచమి”తోపాటు ”గరుడ పంచమి” అని కూడా పిలుస్తారు. ఇది సర్ప పూజ ఉద్దిష్టమైన రోజు.  భారతావనిలో అనేక ప్రదేశాలలో నాగజాతి వారున్నట్లు చరిత్ర చెబుతున్నది.


దేవాలయాల్లో గరుడ వాహనాలను గమనిస్తే, ఒక మోకాలు వంచి, మరో మోకాలు మీద నిటారుగా కూ ర్చొని రెండు చేతులనూ చాచి మూలవిరాట్టును చూస్తూ ఉంటాడు. దాని అంతరార్ధం ”స్వామి నా కర్తవ్య నిర్వహణ కోసం నేను ఏ క్షణంలోనైనా సిద్ధమే” అని.

సర్వశక్తి సంపన్నుడు అయి ఉండీ, సవతి సోదరులను వీపున మోస్తూ, అవమానాలను ఓర్చి, తల్లికీ, తనకూ గల దాస్య బంధనా లను తెంపి, మహావిష్ణువుకు వాహనంగా వినుతికెక్కిన వినతా పుత్రుడైన వైనతేయుడు ప్రాత:స్మరణీయుడు...


అలా ఈరోజు నాగుల నుంచి రక్షణ పొంది, నాగదోషం తగులకుండా పిల్లల ను కాపాడుకొనేందుకు, నిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లలు పుట్టడం కోసం గరుడ పంచమి నాడు గరుడ పూజ చేయడం ఆచారంగా ఉంది.


ఈరోజు  శ్రావణమాసంలో వచ్చే మొదటి శుక్రవారం..


సాధారణంగా శుక్రవారాన్ని ఎంతగానో ఇష్టపడే లక్ష్మీదేవి, శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజుని మరింత ఇష్టపడుతుంది. వేంకటేశ్వరస్వామిది 'శ్రవణా నక్షత్రం' ... అందువలన ఈ మాసం అంటే అమ్మవారు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపుతుంది. ఈ శ్రావణ మాసపు శుక్రవారం రోజున మహాలక్ష్మిని ఆరాధించడం వలన సకల సంపదలు లభిస్తాయి. అదే విధంగా గోలక్ష్మి (ఆవు)ని పూజించిన వారికి సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ... 'కనకధారా స్తోత్రం' చదువుకున్నట్టయితే, సిరిసంపదలు కలుగుతాయి....

దేవాలయాలు - పూజలు 5*.

 *దేవాలయాలు - పూజలు 5*.


గత వ్యాసంలో పూజల ఉద్దేశ్యము మరియు అతరార్థం తెలుసుకున్నాము. భక్తులు దేవాలయం వెళ్లేలోపు అర్చక స్వాములు దేవాలయ పూజాచరణలో ఉంటారు. దేవాలయాలలో భగవంతుడికి తొలి మేలుకొలుపు ఆహ్వానం, సుప్రభాతం మరియు తదితర కార్యక్రమాల ప్రారంభం, కొనసాగింపు, ఆ దేవాలయంలో నియమింప బడిన అర్చక స్వాముల విద్యుక్తధర్మము. 


అర్చక స్వాముల గురించి కొంత అవగాహన కల్గి ఉందాము. దేవాలయాలలో ఆగమ శాస్త్రానుసారము మంత్రాలు, వేద మంత్రాలు పఠించడానికి మంత్రానుష్ఠానం చేయడానికి నిర్దిష్టమైన అర్హతలుండాలన్నది శాస్త్ర నియమము. అర్చక స్వాములు నియమ, నిష్ఠలతో తమ గురువుల ఉపదేశము ప్రకారమే పూజాదికాల నిర్వహణ అభ్యసించి ఉంటారు. *సాధకులకు మాత్రమే ఇది సాధ్యము*. 


బ్రాహ్మణ అర్చక స్వాముల ప్రాశస్త్యమును దిగువ చూపిన శ్రీ కృష్ణ వచనంలో చెప్పబడినది, గమనిద్దాము. 


*శ్లో! దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రహ్మణో మమ దేవతా*.

అర్థం:- ఈ జగత్తు మొత్తం దైవం ఆధీనంలో ఉంటుంది. ఆ దేవతలు మంత్రముల ద్వారా సంతృప్తి చెంది మంత్రముల ఆధీనంలో ఉంటారు. ఆ మంత్రములు శుద్ధ సాత్విక లక్షణములు గల బ్రాహ్మణుల అధీనంలో ఉంటాయి. అటువంటి బ్రాహ్మణులు దేవతా స్వరూపాలని గ్రహించాలి, *అర్చకోహరిఃసాక్షాత్* అని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. వారిని గౌరవించాలి. వేద మంత్రముల నెరిగిన బ్రాహ్మణులు భక్తులకు దైవ సమానులు. హైందవ ధర్మాలను అనుసరించే ప్రతి మానవుడు, తన జీవిత కాలంలో తప్పనిసరిగా బ్రాహ్మణుల సహకారంతో ఆచరించే కార్యక్రమాలు... *పూజాదికాలు, వివాహాది శుభకార్యాలు, షోడషకర్మలు*. ఈ కార్యక్రమాలన్ని మంత్ర యుక్తంగా, శాస్త్ర విహితంగా ఆచరింప జేయడానికి వేద మంత్ర దృష్టలైన బ్రాహ్మణుల ఆవశ్యకత అనివార్యము. *అందరు బ్రాహ్మణులు వందనీయులే*.


*మాన్యులకు విజ్ఞప్తి* 

*దేవాలయములు - పూజలు* అను విషయంపై ధారావాహిక రచనా వ్యాసంగము బహు సున్నితమే గాక బహు విస్తృతము, క్రమానుసారమైన, ప్రామాణిక, సుస్థాపిత విశేష్య అంశము గనుక, ఈ గ్రూప్ లోని మాన్యులు.... ఈ రచనలలో అన్యమైన, అసంగత, అసంబద్ధ, అప్రస్తుత, అనంగీకార ప్రస్తావనలు ఉంటే తెలుపగలరు, సరిదిద్దగలరు. ప్రమాణాలు కూడా జరపర్చిన చదువరులకు మరింత జ్ఞాన దాయకంగా ఉంటుంది.


ధన్యవాదములు.

*(సశేషము)*

తద్దినం

 సైన్స్ : తద్దినం ఎందుకు ? మహాభారతంలో ఒక కధ ఉంది... కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి రేవతి అనే అందమైన కూతు రు ఉండేది. అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు.


ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. అదేంటి అని అడిగాడు రాజు. నీకు తెలియదా భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమి పై 27 చతుర్యుగాలు గడిచి పోయాయి. ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు.


దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు బ్రహ్మ.. ఇప్పుడు భూమిపై 28 వ చతుర్యుగము నడుస్తుంది. అక్కడ మహా విష్ణు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి. కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ...


ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం... ఆ చిత్రం పేరు "Interstellar" ఈ చిత్రం 2014 లో వచ్చింది. ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిత్రం లో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు, కొడుకు ఉంటారు.

కూతురంటే అతనికి ప్రాణం. 


ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది. అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు.

తన కూతురు గదిలో దూళి చారలు ఏర్పడ్డాయని, తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ దూళి చారలు ఆకర్షించాయని, వాటిని పరిశీలించి చూసి దానిని డీకోడ్ చేశానని, ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో. అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా అవి శని గ్రహానికి(Saturn) దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని (Galaxy) ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్.


అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి ‘వార్మ్ హోల్’ (Warm hole) ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా. వార్మ్ హోల్ అంటే ఒక గాలక్సీ నుండి ఇంకో గాలక్సీకి వెళ్ళడానికి దగ్గరి దారి. అయితే వారి లక్ష్యం ఏంటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని.. వగైరా వగైరా(etc etc..).. అప్పటికి ఆ హీరో కూతురు వయ్యస్సు 10 సంవత్సరాలు (ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోవాలి). ఆ తరువాత కధ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బిలంలోనికి (Black hole) ప్రవేశిస్తాడు. అయితే అది 4D లోకం. మనం ఉన్నది 3D ప్రపంచం. నాలుగవ డైమెన్షన్ కాలం.


అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట.

అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించ గలడన్న మాట. అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు. అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు.


ఇప్పుడు అర్ధం అయ్యిందా... అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే.

ఇక ఆ తరువాత కొంత కధ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు. అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది. కాని హీరో వయసు మాత్రం మారదు. ఎందుకంటే హీరో వెళ్లిన గ్రహంలో ఒక గంట భూమిపై ఏడు సంవత్సరాలతో సమానం.


పైన మహా భారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కధగానే తీసుకుంటాం. కాని ఆ కధలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే "సమయ విస్ఫారణం"(Time dilation), "కృష్ణ బిలం (Black hole), "వెచ్చని రంధ్రం” (Warm hole) వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో మన హిందూ సనాతన ధర్మము యందు చెప్పడం జరిగింది.


అందుకే స్వామీ వివేకానంద అన్నారు.. "సైన్స్ అభివృద్ధి అయ్యేకొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుంది" అని.


ఇతర లోకాలకు, మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే "సమయ విస్ఫారణం” (Time dilation) అని నేటి సైన్స్ చెబుతుంది. మనం మహాభారతంలో చదువుకున్నాం. పాండవులు చివరి రోజులలో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాలు మీదుగా ప్రయాణం చేయడం. కాని, స్వర్గం ఉండేది భూమిపై కాదు. మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్లడం ఏంటి అని అనుమానం వస్తుంది. నాక్కుడా వచ్చింది.


పైన చెప్పిన వార్మ్ హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి. హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వార్మ్ హోల్స్ ఉన్నాయన్న మాట. అలాగే ఆది శంకరాచార్యుల వారు బద్రీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని ఆయన చరిత్ర చెబుతుంది. అంటే అక్కడ వార్మ్ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని అర్ధం అవుతుంది.


మన హిందూ సనాతన ధర్మము ప్రకారం, మరియు గరుడ పురాణం బట్టి చూసినా చనిపోయిన వారికి 11 -15 రోజుల వరకూ ప్రతీరోజూ పిండ ప్రధానం చేస్తారు. ఆ తరువాత సంవత్సరం వరకూ నెలకొక్కసారి చేస్తుంటారు. ఆ తరువాత సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు.


ఎందుకో తెలుసా, చనిపోయిన 11 – 15 రోజుల వరకూ జీవుడు భూమిపైనే ఉంటాడు. అందుకే ప్రతీరోజు పిండ ప్రధానం చేస్తాం. ఆ తరువాత జీవుడు స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరు కోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది గరుడ పురాణం ప్రకారం. ఆ సమయంలో భూమిపై నెలరోజుల కాలం ఆ లోకంలోని వారికి ఒకరోజుతో సమానం. అందుకే నెలకొకసారి చేస్తే వారికి రోజు కొకసారి పెట్టినట్టు. ఇక సంవత్సరం తరువాత స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరుకుంటారు. అప్పుడు సంవత్సరానికి ఒకసారే పెడతాం.


ఎందుకంటే అక్కడ ఒక రోజు, భూమిపై ఒక సంవత్సరంతో సమానం. ఇలానే ఎన్నో లోకాలు, ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి. ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే "సమయ విస్ఫారణం"(Time Dilation) అంటాం.


ఇట్లానే.. బ్రహ్మ దేవుఁడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినపుడు కూడా ఒక క్షణం పాటు అది ఒక సంవత్సరం అయ్యింది. అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా, జంతువులుగా మారి బ్రహ్మకు గుణపాఠం చెప్తాడు.


ఇలా మన పురాణాలలో ఎన్ని విషయాలు ఉన్నాయో కూడా తెలియని ఈ ప్రస్తుత సమాజం, మన సంస్కృతిని కాదని ఏ తల తోక లేని పర మాయలో పడుతున్నారు. మన తరువాత ఎప్పుడో వచ్చిన మాయలు ఇలాంటి విజ్ఞానంలో మన హిందూ సనాతన ధర్మమునకు దరిదాపుల్లో కూడా రాలేవు.


కుదిరితే ఈ వ్యాసం అందరికి పంపండి. కనీసం చదువుకున్న వాళ్లకు అర్థం అవుతుంది.


|| ఓం నమః శివాయ ||,

(సేకరణ)