7, మే 2026, గురువారం

కల్తీCB

 మనం తినే మామిడి పండ్లు నూటికి 90 శాతం కార్బెట్ తో పండించినవే అందులో అనుమానమే లేదు


 మనం తినే ఆహారంలో నిత్యం అనేక రకాలైన రసాయనాల కల్తీలతో ఉన్నవే అందుకే మనకు చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు ఇతర సమస్యలు వస్తున్నాయి 


ముఖ్యంగా మనం వాడే వంట నూనెలు చాలా మటుకు కల్తీ నూనెలే 


మీరు ఒక్క విషయం ఆలోచించండి ఒక కిలో పల్లీలు రెండు వందల రూపాయలు ఉంటే ఒక లీటరు పల్లీ నూనె 150 ,170 రూపాయలకు ఎలా ఇవ్వగలుగుతారు.అంటే అవి నిజంగా స్వచ్ఛమైన నూనెలు కావని వాళ్ళు ఒప్పుకున్నట్లేనా కాదా


 ఒక కిలో పల్లీలను నూనెగా తీస్తే ఒక పావు కిలో నూనె మాత్రమే వస్తుంది అంటే స్వచ్ఛమైన పల్లీలతోటి కిలో నూనె తీయాలంటే నాలుగైదు కిలోల పల్లీల అవసరపడతాయి.


అట్లా చేస్తే మీకు కిలో నూనె ఎనిమిది వందల రూపాయలకి తక్కువకి దొరకదు.


అదే విధంగా ఇతర నునెలలో కూడా  చాలా కల్తీలు ఉన్నాయి అని అంటున్నారు.


ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే మనం వాడే పాలలో యూరియా వంటి కెమికల్స్ తోటి తయారు చేస్తున్నారట.అది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి.


ఇది ఇట్లా ఉంటే నేను మాకు దగ్గరలో ఉన్న పశువుల షెడ్డు నుంచి అప్పుడే తీసిన పాలను తెచ్చుకుంటున్నాను అందులో ఎటువంటి కల్తీ లేదని కూడా మనం అనటానికి వీల్లేదు.


ఎందుకంటే గేదెలకు పాలు రావటానికి ఇంజక్షన్లు చేస్తున్నారు అలానే డ్రైనేజీ నీళ్లలో పెంచిన గడ్డి తినిపిస్తున్నారు.


దానివల్ల ఆ గేదల నుంచి వచ్చే పాలు పూర్తిగా కలిసికతమై ఉంటున్నాయి.


ఇంకా బియ్యానికి వస్తే మనం తినే బియ్యం స్టీమ్డ్ రైస్, హెచ్ఎంటి  బియ్యం లను పాత బియ్యంగా విక్రయిస్తున్నారు.


ఆ బియ్యమును పాలిష్ చేసి దాని మీద పూర్తిగా తౌడును తొలగించి తెల్లగా నిగలాడేరట్టు చేయటం వలన బియ్యంలోని పోషక విలువలు పూర్తిగా పోయి కేవలం పిప్పి మాత్రమే మిగులుతున్నది.


మనలో చాలామందికి బి కాంప్లెక్స్ లోపము ఏర్పడటానికి కారణం ఇదే.


మనం తినే ఆహారంలో సరైన విటమిన్లు, ప్రోటీన్లు విలువైన ఆహారపు విలువలు లేని కేవలం పిప్పిని మాత్రమే భుజిస్తున్నాము.


ఇక వాతావరణం విషయానికొస్తే మనం రోజు అనేక రకాల రేడియేషన్స్ కి గురి అవుతున్నాము.


కొన్ని మన ఇంట్లో మనమే సృష్టించుకుంటున్నాము.


ముందుగా బయట రేడియేషన్స్ తేల్చుకుందాం.


మన చుట్టూ అనేక మైక్రోవేవ్ రేడియేషన్లు సెల్ఫోన్ టవర్ల నుండి వెలువడుతున్నాయి.



ఇక రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఉండనే ఉన్నది.


మన ఇంట్లో మనం వైఫై ఏర్పాటు చేసుకొని ఆ రేడియేషన్కు కూడా గురి అవుతున్నాము.


ఇది చాలదు అన్నట్లు మనము బ్లూటూత్ పరికరాలను ఉపయోగించి బ్లూటూత్ రేడియేషన్ కూడా కొని తెచ్చుకుంటున్నాము.


ఈ రకమైన రేడియేషన్లు మన శరీరంలో ఉన్న నరాల మీద ప్రభావితం చూపెడతాయి ఇంకా మన రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ మీద కూడా చూపెడతాయి.


సెల్ఫోన్ టవర్లకి దగ్గరగా ఉన్న మానవులకి మైక్రోవేవ్ రేడియేషన్ వల్ల మెదడు లోపల అనేక చెడు లక్షణాలు కనబడుతున్నాయి.


మొదలుగా తలనొప్పి వస్తుంది తర్వాత నరాలకు సంబంధించిన అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది.


ఇక మనంతట మనమే కొని చేర్చుకున్న అలవాట్ల వల్ల కలిగే దుష్ప్రభావాలను ఒకసారి చూద్దాం.


మనం రోజు ఎక్కువ సమయం సెల్ ఫోను లాప్టాప్ టీవీ చూడటం లో గడుపుతున్నాము.


దానివల్ల అల్ట్రా వైలెట్ రేడియేషన్ కి ఇంకా ఎక్కువ ప్రకాశమైనా వెలుతురుని చూడటం వల్ల అది మన కంటిలోని రెటీనా మీద ప్రభావం చూపెట్టి కను గుడ్లు ఆరోగ్యాన్ని కోల్పోతున్నాయి.


చిన్న వయసులోనే పిల్లలకి కళ్ళజోళ్ళు రావడం మనం గమనిస్తున్నాము.


ఇంకా సెల్ ఫోనులో మన యొక్క పూర్తి ఏకాగ్రత ఉంచి వీడియోలు చూడటం వలన అవి మెదడు మీద ప్రభావం చూపుతున్నాయి.


ఇటువంటివి అనారోగ్య సమస్యలు ప్రతి వాళ్ళకి వస్తున్నాయి.


ఇట్లా ఉంటే వాహనాల  పొగ వలన వాతావరణంలో ఆక్సిజన్ శాతం రోజురోజుకీ తగ్గుతున్నది.


ఆక్సిజన్ని ఉత్పత్తి చేసే వృక్షాలను మానవులు కొట్టివేసి ఆ స్థలాలలో అనేక మల్టీస్టోరీడ్ బిల్డింగులు కట్టడం వలన ఆక్సిజన్ తక్కువ అవుతున్నది.


అందువలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతున్నది.


ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు మనుషులు పూర్తిగా అనారోగ్య పరిస్థితులలో ఉన్నారు అన్నది సత్యం.


ఇక శారీరిక దృఢత్వానికి వస్తే పూర్వకాలంలో ఆడవారు కానీ మగవారు కానీ బావిలో చేత వేసి నీళ్లు చేదుకునేవాళ్లు దానివల్ల వాళ్లకి చక్కటి వ్యాయామం అయ్యేది.


అప్పుడే పెతికిన పాలు తాగేవాళ్లు దంచిన బియ్యం తినేవాళ్లు దానివల్ల పూర్తిగా ఆరోగ్యకరమైనటువంటి ఆహారము ఆరోగ్యకరమైనటువంటి అంటే వ్యాయామ కరమైనటువంటి అలవాట్లు ఉండేవి.


ఇప్పుడు ప్రతిదీ యాంత్రికం కావడం వలన శారీరిక శ్రమ పూర్తిగా తగ్గింది వంట ఇంట్లో ఆడవారు పిండి రుబటం లేదు.


మిక్సీలో పడుతున్నారు కట్టెలపై  పొయ్యి వెలిగించటం లేదు గ్యాస్ స్టవ్ మీద వండుతున్నారు.


కూర్చొని వండటం వల్ల చక్కగా ఆ వంట కుదురుగా ఉండి రుచికరంగా ఉండేది.


ఇప్పుడు వండటం నిల్చమని తినటం కుర్చీలో కూర్చొని.


ఇటువంటి అలవాట్ల వల్ల మనం తినే ఆహారం శరీరానికి సరిగా పట్టటం లేదు.


దానివలన అనేకమైన అనారోగ్యాలు వస్తున్నాయి ఇకపోతే శారీరకంగా ఏమాత్రం అలసట చెందకుండా తినంగానే వెంటనే పడుకోవటం వలన కడుపు ఉబ్బి లావుగా తయారవుతున్నారు.


ఆహారం సరిగా అరగటం లేదు  దానివల్ల అనేకమైన రుగ్మతలు వస్తున్నాయి.


ఇట్లా చెప్పుకుంటూ పోతే పుస్తకాలు పుస్తకాలు రాయవచ్చు.


ఒక్క మాటలో చెప్పాలంటే మనము పూర్తిగా అనారోగ్యకరమైన వాతావరణంలో ఉంటున్నాం తింటున్నాం  పడుకుంటున్నాము.


ఇది సత్యము సత్యము సత్యము ముమ్మాటికీ

07-05-2026 గురువారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

07-05-2026 గురువారం రాశి ఫలితాలు


మేషం


అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ధనవ్యయ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు మరింత పెరుగుతాయి.

---------------------------------------


వృషభం


దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి. నూతన వస్తులాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

---------------------------------------


మిధునం


ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థుల అంచనాలు అందుకుంటారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. నూతన వాహన యోగం ఉన్నది. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

---------------------------------------


కర్కాటకం


వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. గృహమున కొందరి ప్రవర్తన శిరో బాధ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. 

---------------------------------------


సింహం


మానసిక సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఎంత శ్రమపడిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది.

---------------------------------------


కన్య


ఆపదల నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగమున మీ విలువ మరింత పెరుగుతుంది.

---------------------------------------


తుల


మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ధన పరమైన చికాకులు పెరుగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.  

---------------------------------------


వృశ్చికం


నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. 

---------------------------------------


ధనస్సు


చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి.

---------------------------------------


మకరం


దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవచింతన పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.

---------------------------------------


కుంభం


విలువైన వస్త్ర ఆభరణలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన అనుకూలత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

---------------------------------------


మీనం

 

ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు అధికమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ తప్పదు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.

---------------------------------------

పంచాంగము 🌓 07.05.2026

 🕉️


పంచాంగము 🌓 07.05.2026


🪔 శ్రీ రమాత్రివిక్రమాయనమః‌ 🪔


అష్టావింశతి మహాయుగే 


కలియుగం: 5128


విక్రమ సంవత్సరం: 2083 సిధ్ధార్ధ


శక సంవత్సరం: 1948 పరాభవ


ఆయనం: ఉత్తరాయణం 


ఋతువు: వసంత


మాసం: వైశాఖ 


పక్షం: కృష్ణ - బహుళ 


తిథి: పంచమి ఉ‌.07:05 వరకు

తదుపరి షష్ఠి 

 

వారం: గురువారం - బృహస్పతివాసరే

 

నక్షత్రం: పూర్వాషాఢ ప‌.03:43 వరకు 

తదుపరి ఉత్తరాషాఢ


యోగం: సాద్య రా.01:12 వరకు

తదుపరి శుభ

 

కరణం: తైతుల ఉ‌.07:05 వరకు

తదుపరి గరజ‌ రా. 07:52 వరకు

తదుపరి వణిజ


వర్జ్యం: రా.12:29 - 02:14 వరకు


దుర్ముహూర్తం: ఉ‌.10:04 - 10:55

మరియు ప‌.03:12 - 004:03


రాహు కాలం: ప‌.01:49 - 03:25


గుళిక కాలం: ఉ‌.08:59 - 10:36


యమ గండం ఉ‌.05:47 - 07:23

 

అభిజిత్: 11:47 - 12:37


సూర్యోదయం: 05:47


సూర్యాస్తమయం: 06:38


చంద్రోదయం: రా.11:30


చంద్రాస్తమయం: ఉ‌.09:53


సూర్య సంచార రాశి: మేషం


చంద్ర సంచార రాశి: ధనుస్సు


దిశ శూల: దక్షిణం


🚩 శ్రీ కశ్యప ఋషి జయన్తి 🚩


🏳️ సంత్‌ చౌఖమేలా పుణ్యతిథి‌🏳️


🎊 శ్రీ భువనేశ్వరి పాటోత్సవ్ 🎊

(గొండాల్ - గుజరాత్)


🛕చెన్నై శ్రీ కేశవ పెరుమాళ్

రథోత్సవం 🛕


🪄 శ్రీనివాసమంగాపురం శ్రీ 

 కల్యాణ వేంకటేశ్వరస్వామి 

 వసంతోత్సవారంభం‌  🪄


🛕తిరువల్లికేణి శ్రీ పార్థసారథి

 పెరుమాళ్ రథోత్సవం 🛕


🇮🇳 అల్లూరి సీతారామరాజు

స్మృతి దినం 🇮🇳


⚛️


వైశాఖే కృష్ణపక్షే తు 

పంచమ్యాం ఋషిసత్తమః |

కశ్యపః ప్రాదురభవత్ 

లోకానాం హితకామ్యయా ||


మరీచిః కశ్యపం తస్మాత్ 

సర్వలోక పితామహమ్ |

సృష్టవాన్ సర్వభూతాని

సదేవాసుర మానుషాన్ ||

మరీచి కుమారుడైన కశ్యపుడు,

దేవతలు, అసురులు మరియు

మనుష్యులతో సహా సమస్త

భూతజాలాన్ని సృష్టించిన లోక

పితామహుడు.


వైశాఖే మాసి సంభూతం

మరీచికుల నందనమ్ |

కశ్యపం సర్వలోకానాం 

పితరం ప్రణమామ్యహమ్ ||


మరీచేః కశ్యపో జజ్ఞే 

కశ్యపాత్తు సురాసురాః |

శశాంకవంశ్యాః సూర్యాశ్చ 

తథాన్యే చ చరాచరాః ||

మరీచి నుండి కశ్యపుడు

జన్మించాడు. కశ్యపుడి నుండే

దేవతలు, అసురులు,

చంద్రవంశీయులు,

సూర్యవంశీయులు మరియు

ఇతర చరాచర ప్రాణులు

ఉద్భవించాయి.


కశ్యపస్య ప్రభావన లోకాః

సృష్టాశ్చరాచరాః |

తస్మాత్ సర్వమయం లోకం

కశ్యపం పరిచక్షతే ||

కశ్యపుని ప్రభావం వల్లనే ఈ

చరాచర జగత్తు సృష్టించబడింది.

అందుకే ఈ లోకమంతా

కశ్యపమయము.


అదితిర్దితిస్తథా దనుః కాష్ఠా 

అరిష్టా సురసా ఇలా |

మునిః క్రోధవశా చైవ తాసాం 

భర్త్రే నమో నమః ||"

కశ్యపుని భార్యలైన అదితి, దితి

మొదలైన వారిని పేర్కొంటూ,

సమస్త జీవరాశికి తండ్రి అయిన

కశ్యపునికి నమస్కారం.


కశ్యపాయ నమస్తుభ్యం

సర్వభూత హితైషిణే |

మరీచిపుత్ర ధర్మజ్ఞ 

గృహాణార్ఘ్యం మయా దత్తమ్ ||

సర్వ భూతాల మేలు కోరేవాడా,

మరీచి పుత్రుడా, ధర్మం తెలిసిన ఓ

కశ్యప మహర్షీ! నేను సమర్పిస్తున్న

ఈ అర్ఘ్యాన్ని స్వీకరించు.


🔯


Mantra - 32

 Mantra - 32 ARUNAM 4 anuvaakam


నిన్నటి మంత్రంలో ‘నీవు వేరు కాదు, ఆ జీవనప్రదాత అయిన పరమాత్మ వేరు కాదు’ అని తెలుసుకున్నాము కదా ఇప్పుడు శరదృతువు వర్ణనలో ఉన్న తత్త్వాన్ని చూద్దాం తదుపరి క్రింది మంత్రంలో.


"ఏతా వాచః ప్రయుజ్యంతే|

శరద్యత్రోప దృశ్యతే|

అభిధూన్వన్తోభిఘ్నన్త ఇవ। 

వాతవన్తో మరుద్గణాః||”


ఈ మంత్రం ప్రకృతిలో కలిగే మార్పులను, ముఖ్యంగా శరదృతువులో వాయువు యొక్క చలనాన్ని మరియు మరుద్గణాల (వాయు దేవతల) ప్రభావాన్ని వర్ణిస్తుంది.


"ఏతా వాచః ప్రయుజ్యంతే" - ఈ వాక్కులు / మంత్రాలు ఉచ్ఛరించబడుతున్నాయి/ ప్రయోగించబడుతున్నాయి.


"శరద్యత్రోపదృశ్యతే" - శరదృతువు ఎక్కడైతే కనిపిస్తుందో, ప్రవేశిస్తుందో. వర్షాకాలం ముగిసి, ఆకాశం నిర్మలంగా మారే శరత్ కాలం నాటి వాతావరణాన్ని ఇది సూచిస్తుంది.


“అభిధూన్వన్తోభిఘ్నన్త ఇవ" - కంపపింపజేస్తూ, కొడుతున్నట్లుగా (వేగంగా వీస్తూ) - గాలి వేగంగా వీస్తూ చెట్లను, ప్రకృతిని కదిలించే తీరును ఇక్కడ వర్ణించారు.


“వాతవన్తో మరుద్గణాః" - వాయువుతో కూడిన మరుద్గణములు - వేదాలలో 'మరుత్తులు' అంటే వాయుదేవతలు. వారు గుంపులుగా (గణములు) ఉండి, ప్రకృతిలో శక్తివంతమైన చలనాన్ని కలిగిస్తారు.


వర్షాలు తగ్గుముఖం పట్టి, పంటలు చేతికి వచ్చే సమయంలో వీచే గాలులు శరదృతువుకు చిహ్నం. ఈ సమయంలో వాయువు ప్రసరణ ప్రకృతిని శుద్ధి చేస్తుందని భావిస్తారు.


మరుత్తులు రుద్రుని పుత్రులుగా, ఇంద్రుని సహాయకులుగా వేదాల్లో వర్ణించబడ్డారు. వారు తుఫానులకు, గాలులకు అధిదేవతలు. వారు "అభిధూన్వంతః" (కదిలించడం) ద్వారా ప్రకృతిలోని జడత్వాన్ని తొలగిస్తారని అర్థం.


అరుణప్రశ్నలోని ఈ మంత్రాలు సూర్యుడు, కాలం, మరియు వాయువు మధ్య ఉన్న సమన్వయాన్ని వివరిస్తాయి. సూర్యరశ్మి వల్ల కలిగే వేడి, దానివల్ల వచ్చే వర్షం, ఆపై వీచే గాలులు - ఈ క్రమమంతా ఈశ్వర సృష్టిలోని ఒక అద్భుతమైన చక్రం.


అద్వైత సిద్ధాంతం ప్రకారం, శరత్ ఋతువు వర్ణన వెనుక ఉన్న గూఢార్థాలు ఏమిటంటే..

"అభిధూన్వన్తః" (కదిలించడం) మరియు "అభిఘ్నన్తః" (దెబ్బతీయడం) అనే పదాలు మాయ యొక్క ‘విక్షేప శక్తి' ని సూచిస్తాయి. నిశ్చలంగా ఉన్న సముద్రం మీద గాలి వీచినప్పుడు తరంగాలు ఎలా వస్తాయో, నిర్గుణ బ్రహ్మపై మాయా వాయువు వీచినప్పుడు ఈ జగత్తు అనే చలనం పుడుతుంది.  


శరత్ కాలంలో వీచే గాలులు చెట్లను, ఆకులను ఎలా కదిలిస్తాయో, మన లోపల ఉన్న వాసనలు (Desires) మనస్సును అలా కదిలిస్తూ ద్వైత భ్రమను కలిగిస్తాయి. ఇదే మాయా విక్షేపం - The Disturbance of Maya.


వాయువు లేదా మరుత్తులు మన శరీరంలోని 'ప్రాణ శక్తి' కి సంకేతం. అద్వైతంలో ప్రాణము ఆత్మకు అత్యంత సన్నిహితమైన ఉపాధి. గాలి కంటికి కనిపించదు కానీ దాని స్పర్శ, క్రియ మనకు తెలుస్తుంది.

అలాగే, ఆత్మ మనకు నేరుగా కనిపించకపోయినా, ప్రాణ చలనం ద్వారా దాని ఉనికిని మనం గుర్తించవచ్చు. వాయువు సర్వవ్యాపి అయినట్లు, ఆత్మ చైతన్యం కూడా సర్వవ్యాపి.‘మరుద్గణాః’ అన్న వేద వాక్యము నకు ప్రాణ శక్తి అని భావం (అధ్యాత్మంలో). 


అధిభౌతికంలో (Physical/Material) లో వాయువే, అధ్యాత్మంలో (Microcosmic) లో ప్రాణ శక్తి యే, ఆదిదైవికంలో (Macrocosmic) బ్రహ్మ లేదా హిరణ్యగర్భుడు. దీనికి ప్రమాణం గా ‘నమస్తే వాయో! త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాऽసి’ - ఓ! వాయు దేవతా! నీవు సాక్షాత్ బ్రహ్మ వే - అని తైత్తిరీయ ఉపనిషత్ శిక్షా వల్లి వేద వాక్యాన్ని చెప్పవచ్చు.


వర్ష ఋతువులో బురదగా ఉన్న నీరు శరత్ కాలం రాగానే నిర్మలంగా మారుతుంది. అద్వైత సాధనలో ఇది ఒక ముఖ్యమైన స్థితి. మనస్సులోని అజ్ఞానమనే బురద తొలగిపోయి, ఆత్మ అనే ఆకాశం నిర్మలంగా కనిపించే సమయం ఇది. 


"వాతవన్తః" అంటే వాయువు గూడు కట్టుకున్న మేఘాలను చెదరగొట్టినట్లు, జ్ఞానమనే వాయువు అజ్ఞానపు మేఘాలను తొలగించి సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. శరత్ - మల నివృత్తి - Clarity of Consciousness. పై విధంగా తాప త్రయాలను అన్వయించుకోవచ్చు.


శరత్ కాలంలో లోక వ్యవహారాలు (వాక్కులు) చురుగ్గా సాగుతాయి. కానీ అద్వైతం ఏం చెబుతుందంటే—ఈ మాటలు, ఈ పనులు అన్నీ 'ఇవ' (లాగా) మాత్రమే. అంటే ఇవి ప్రాతిభాసిక సత్యాలే తప్ప పరమార్థ సత్యాలు కావు. గాలి వీచినప్పుడు కలిగే శబ్దం ఎలా వచ్చి పోతుందో, ఈ జగత్తులోని వ్యవహారాలు కూడా అలాగే వచ్చి పోతుంటాయి. వాచః ప్రయుజ్యంతే అంటే నామరూప జగత్తు.


ఈ మంత్రం సారాంశం రెండు మాటల్లో చెప్పాలంటే, గాలి వీచినప్పుడు వృక్షాలు కదులుతున్నట్లు, మాయా ప్రభావం వల్ల నీ మనస్సులో వికారాలు కలగవచ్చు. కానీ గాలికి ఆధారం ఆకాశం ఎలాగో, ఆ ప్రాణ చలనానికి ఆధారం నీలోని ఆత్మయే. శరత్ కాలపు ఆకాశంలా నీ మనస్సును నిర్మలం చేసుకున్నప్పుడు, కదిలే వాయువులోనూ, కదలిక లేని ఆత్మను దర్శించగలవు. ఈ మంత్రం ద్వారా ప్రకృతిలోని చలనాన్ని అంటే Kinetic energy, ఆత్మ యొక్క నిశ్చలత్వంతో రథచక్రం ఇరుసు (axle) వలె అనుసంధానం చేయడం జరిగింది.