10, మే 2026, ఆదివారం

హోమియోపతి వైద్యం

 ఆన్లైన్లో హోమియోపతి వైద్యం

 కొరకు సంప్రదించండి


 దీర్ఘకాల రోగములకు చక్కటి చికిత్స కలదు 


తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషలలో ఏ భాషలోనైనా డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు.


మీ సమస్యని తెలుపుకొని చికిత్స తీసుకోగలరు.


మందులు మీ ఇంటికి ఆన్లైన్లో కొరియర్ ద్వారా పంపించబడును.


వివరాలకు 9035231905 నెంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు . 


మీ పేరు,

వయస్సు, 

లింగము 

మీ చిరునామా

 మీ సమస్యను క్లుప్తంగా వివరించండి 


మీరు ఏ భాషలో డాక్టర్ గారి ని సంప్రదించదల్చారు పేర్కొనండి 


తరువాత డాక్టర్ గారే మీకు ఫోను చేసి మీతో మాట్లాడగలరు.

డాక్టర్ గారి ఫీజు మందుల ఖర్చులు అడిగి తెలుసుకోండి


డాక్టర్ సాయి అఖిల


 స్త్రీల రోగముల నిపుణురాలు

వాగర్థావివ సంపృక్తౌ

  


*వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే౹*

*జగతఃపితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ॥*


అని కాళిదాసమహాకవి ఆదిదంపతులను ప్రార్థనచేశాడు. 


ఆ ఆదిదంపతులు ఎట్లా ఉంటారటంటే.....   వాక్కు అంటే పదము ఒక పదాన్ని అంటిపెట్టుకొని దాని అర్థం ఉంటుందో...  ఆ అర్థాన్ని పదం నుండి ఎలా విడదీయటం కుదరదో...  అర్థం నుండి పదాన్ని 

అదేవిధంగా ఎలా విడదీయటం కుదరదో... ఒకరికొకరు అవిభాజ్యంగా ఉంటారుట. అదే అర్థనారీశ్వరతత్త్వం. 


ఇది ఆదిదంపతుల విషయంలో చెప్పబడినా.... ప్రతి ఒక్క మానవదంపతులకు కూడా వర్తిస్తుంది. 


మీరన్నట్లు శరీరం భౌతికం అంటూ భౌతికతత్త్వంతో చూడకూడదు. మానవునిలో "చిత్" అనే పేరుకలిగిన శక్తి ఒకటి ఉంటుంది. అది అమ్మవారి/భగవంతుడి శక్తి. ఈ "చిచ్ఛక్తి" పురుషులలో హృదయంలో కుడివైపున ఉంటే స్త్రీలలో హృదయంలో ఎడమవైపున ఉంటుంది. 


ఈ రెండింటి కలయికతోనే సృష్టి పరిపూర్ణమౌతుంది. 



_అమ్మ ప్రేమ , నాన్న ఆధారం

 _మాతా గురుతరా భూమేః పితా స్వర్గస్య దుర్లభః ।_

_తయోః పూజా పరం తీర్థం త్రిషు లోకేషు విశ్రుతమ్ ॥_


తల్లి భూమికంటే గొప్పది. తండ్రి స్వర్గానికంటే దుర్లభుడు, మహోన్నతుడు. అట్టి తల్లిదండ్రులను సేవించడం, పూజించడం మూడు లోకాలలో ప్రసిద్ధమైన పరమ పవిత్ర తీర్థయాత్రతో సమానం. తల్లి ప్రేమకు హద్దులుండవు. తండ్రి త్యాగానికి కొలమానం ఉండదు. వీరిద్దరూ కలిసే జీవితం నిర్మాణకర్తలు. వారిని విడిగా చూసే కన్నా, ఒకటిగా పూజించడం భారతీయ సంస్కృతి నేర్పిన మహత్తర ధర్మం.


చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న విషయం ఒకటి గుర్తుకొచ్చింది 


_అమ్మ ప్రేమ అయితే, నాన్న ఆధారం._

_అమ్మ కరుణ అయితే, నాన్న కర్తవ్యం._


*మాతా పితరో నిత్యం పూజనీయౌ ప్రయత్నతః ।*

*తయోః ప్రసాదసిద్ధ్యర్థం సర్వం శ్రేయః ప్రవర్తతే ॥*


🙏🙏🙏🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - వైశాఖ మాసం - కృష్ణ పక్షం - అష్టమి - ధనిష్ట -‌‌ భాను వాసరే* (10.05.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

నమో నారాయణాయ నమః

  నమో నారాయణాయ నమః


గోవిందుడు గొప్ప తనంమనం వర్ణించగలమా?


ఆ లీలా వినోది అయి పార్ద సారధి తత్వం

మామూలు వాడికి అర్దమౌతుందా?

భగవంతుడితో ఎన్నో జన్మల అనుబంధం

ఉంటేనే స్వామి యందు కించిత్ భక్తి

మొలకెత్తుతుంది.ఏది ఎందుకుఎలా

చేస్తాడో పరమాత్మ ని అర్దంచేసుకోలేము.


గోపెమ్మలకోకలు మాయం

ద్రౌపది కి కోకలు సాయం

కృష్ణా!

నువ్వు అర్దంకావు


అన్నిటికీ మనసేమూలం మనసు స్వచ్చంగా ఉంటే భౌతిక మైన పూజాదికార్యక్రమాలు. లేకుండానే 

స్వామి సాక్షాత్కారం లభిస్తుంది. 


మనసు 

పాలకడలి అయి తే 

ప్రతి భావం

కృష్ణ లీలా తరంగమే!


                     ...........

జె.ఎల్. నరసింహం,హాస్యావధాని, హైదరాబాద్.

సూర్య స్తుతి

  🌸సూర్య స్తుతి🙏


సీ. కర్మసాక్షి కపిల కమలాప్త ఆదిత్య 

కాశ్యపేయ ఖలుడా! కావు మమ్ము 

గగనమణి ఖమణి గ్రహ పతి ఖచరుడా

దినమణి !దినపతి దీనబంధు 

దినకరా తిమిరారి దిననాధ భానుడా!

ధరణుడా కావుము ధాత్రినంత

నీరజ బంధుడ నెలజోడ మిత్రుడా!

భాస్కర రావయ్యబాధ

 తీర్ప

తేగీ ..వసుధలోజనులుచలికివణుకుచు నిక

 దిక్కుతోచక యుండిరి దీనబంధు

నీదు దర్శన భాగ్యము నేడు లేదు 

కశ్యపాత్మజ కదలిరా! కమల బంధు!


సాహితీ శ్రీ జయలక్ష్మి

Mantra - 35

  Mantra - 35 ARUNAM 4 anuvaakam


‘సూర్యుడు మంచును చీల్చి ప్రకాశించినట్లు, నీ జ్ఞాననేత్రం అజ్ఞాన పొరలను చీల్చి పరమ సత్యాన్ని దర్శించాలి’ అని నిన్నటి మంత్రం ఉపదేశిస్తే, ఈ రోజు ఈ క్రిందటి మంత్రం ప్రకృతిలో సంభవించే ఋతు మార్పులను, ముఖ్యంగా శిశిర ఋతువు (శీతాకాలం చివర) నాటి వాతావరణాన్ని మరియు ఆ సమయంలో సంభవించే ఉరుములు, మెరుపుల విశిష్టతను వివరిస్తుంది.


"దుర్భిక్షం దేవలోకేషు |

మనూనాముదకం గృహే | 

ఏతా వాచః ప్రవదన్తీః। 

వైద్యుతో యాన్తి శైశిరీః||”


“దుర్భిక్షం దేవలోకేషు" - దేవలోకములలో (ఆకాశంలో) ఆహారానికి కొరత (దుర్భిక్షం) ఏర్పడినట్లుగా ఉంది.

శీతాకాలంలో మేఘాలు లేక ఆకాశం ఖాళీగా, నిర్మలంగా ఉండటాన్ని ఇది సూచిస్తుంది.


“మనూనాముదకం గృహే” - మనుష్యుల ఇళ్ళలో మాత్రం నీరు సమృద్ధిగా ఉంటుంది. అంటే వర్షాలు పడకపోయినా, భూమిలో ఇంకిన నీరు లేదా మంచు రూపంలో లభించే తేమ మనుష్యులకు అందుబాటులో ఉంటుందని అర్థం.


“ఏతా వాచః ప్రవదన్తీః” - ఈ మాటలు పలుకుతున్నట్లుగా…. అంటే ప్రకృతిలో జరుగుతున్న మార్పులు ఒక సందేశాన్ని ఇస్తున్నట్లుగా ఉన్నాయి.


“వైద్యుతో యాన్తి శైశిరీః" - శిశిర ఋతువుకు సంబంధించిన మెరుపులు (వైద్యుతః) సంచరిస్తున్నాయి.

సాధారణంగా వర్షాకాలంలో వచ్చే మెరుపుల కంటే, శిశిర రుతువులో అరుదుగా వచ్చే మెరుపులు ఒక ప్రత్యేకమైన ధ్వనిని, కాంతిని కలిగి ఉంటాయి.


అరుణప్రశ్నలోని ఈ అనువాకం సూర్యుడు ఏ విధంగా వివిధ ఋతువులలో తన ప్రభావాన్ని చూపుతాడో వివరిస్తుంది. శిశిరంలో ఆకాశం 'దుర్భిక్షం' (మేఘరహితం) గా ఉన్నప్పటికీ, భూమిపై ప్రాణకోటి మనుగడకు అవసరమైన నీరు (మంచు లేదా భూగర్భ జలం) లభిస్తుంది. ఇది ఋతు వర్ణన.


‘వైద్యుతః’ (Lightning): మెరుపులను "వాక్కులు" (వాచః) గా వర్ణించడం ఇక్కడ విశేషం. మేఘాల ఘర్షణ వల్ల కలిగే ధ్వని, వెలుగు లోకానికి ఒక దివ్యమైన సందేశాన్ని ఇస్తున్నట్లుగా ఋషి దర్శించాడు.


శిశిర రుతువుకు సంబంధించిన శక్తులను 'శైశిరీః' అని అంటారు. ఇవి రాబోయే వసంత ఋతువుకు సూచికలు. శైశిరీః అనేది వైదిక పదం.


ఈ మంత్రంలో "దేవలోకంలో దుర్భిక్షం" అని చెప్పడం వెనుక ఒక నిగూఢార్థం ఉంది. దేవతలు హవిస్సును (యజ్ఞ భాగాలను) ఆహారంగా స్వీకరిస్తారు. మేఘాలు లేని ఆకాశం దేవతలకు తృప్తినిచ్చే వర్షాన్ని ఇవ్వలేకపోవడాన్ని అలా వర్ణించి ఉండవచ్చు.


అరుణప్రశ్నలోని ఈ మంత్రాలు ప్రకృతిని ఒక జీవకళా రూపంగా మనకు చూపిస్తాయి. 


తత్త్వ విచారణ: 

అద్వైత సిద్ధాంతం ప్రకారం, ఈ వర్ణనను సాధకుని అంతర స్థితికి అన్వయించవచ్చు.

‘దేవలోక దుర్భిక్షం’ అంటే అధ్యాత్మలో ఇంద్రియ నిగ్రహం. అద్వైతంలో 'దేవతలు' అంటే తరచుగా మన ఇంద్రియాలకు సంకేతం. "దేవలోకంలో దుర్భిక్షం" అంటే ఇంద్రియాలకు అందవలసిన విషయ సుఖాలు నిలిచిపోవడం. సాధకుడు 'ప్రత్యాహారం' అనే స్థితిలో ఉన్నప్పుడు, ఇంద్రియాలు బాహ్య ప్రపంచం వైపు వెళ్లవు. లోక విషయాల పట్ల ఈ 'దుర్భిక్షం' (వైరాగ్యం) కలగడం జ్ఞానోదయానికి మొదటి మెట్టు.


‘మనూనాముదకం గృహే’ - అంతర్ముక్తి (Inner Bliss)

'మనుష్యుల గృహం' అంటే మన హృదయం. బయట విషయాలు లేకపోయినా (దుర్భిక్షం), లోపల మాత్రం 'ఉదకం' (శాంతి/ఆనందం) నిండి ఉంటుంది. ఆత్మజ్ఞాని బాహ్య సుఖాల కోసం వెతకడు. తన హృదయమనే గృహంలోనే ఆత్మ చైతన్యమనే అమృతధారను దర్శిస్తాడు.


‘వైద్యుతః’ - చైతన్య స్ఫురణ (Flash of Awareness)

శిశిర కాలపు మెరుపులు అత్యంత ప్రకాశవంతంగా ఉంటాయి. ఇవి మన బుద్ధిలో అకస్మాత్తుగా కలిగే 'జ్ఞానోదయం' (Flash of Realization) కు సంకేతం.

చీకటిగా ఉన్న ఆకాశంలో మెరుపు ఒక్క క్షణం మెరిసి మొత్తం ప్రపంచాన్ని ఎలా చూపిస్తుందో, అజ్ఞానాంధకారంలో ఉన్న సాధకుడికి గురువు ఉపదేశం వల్ల కలిగే 'మహావాక్య' బోధ అలా కళ్ళు విప్పేలా చేస్తుంది. బ్రహ్మ "విద్యుల్లేఖేవ భాస్వర" - మెరుపు తీగలా ప్రకాశించేది.


శిశిరము అంటే ఆకులు రాలిపోయే కాలం. పాతవి పోయి కొత్తవి రావడానికి సిద్ధమయ్యే స్థితి. సాధకుడిలో పాత సంస్కారాలు, వాసనలు రాలిపోయి (శిశిరము), జ్ఞానమనే వసంతానికి సిద్ధమవ్వడాన్ని ఇది సూచిస్తుంది. ఈ సమయంలో కలిగే మెరుపులు (జ్ఞాన స్ఫురణలు) సాధకుడిని సంపూర్ణ సత్యం వైపు నడిపిస్తాయి.


Conclusion:

బయటి ప్రపంచంలోని విషయ వాసనల పట్ల వైరాగ్యాన్ని (దుర్భిక్షాన్ని) పెంచుకో. అప్పుడు నీ హృదయ గృహంలో ఆత్మశాంతి అనే అమృతం నిండుతుంది. ఆ స్థితిలో నీ బుద్ధిలో మెరిసే జ్ఞానమనే మెరుపు (విద్యుత్), నిన్ను ఆ కాలాతీతమైన పరమాత్మతో అనుసంధానం చేస్తుంది.

అరుణప్రశ్నలోని ఈ మంత్రాలు కేవలం వాతావరణ మార్పుల గురించి కాక, అవి మన ప్రాణ, మనో, విజ్ఞాన కోశాల్లోMantra - 35 ARUNAM 4 anuvaakam


‘సూర్యుడు మంచును చీల్చి ప్రకాశించినట్లు, నీ జ్ఞాననేత్రం అజ్ఞాన పొరలను చీల్చి పరమ సత్యాన్ని దర్శించాలి’ అని నిన్నటి మంత్రం ఉపదేశిస్తే, ఈ రోజు ఈ క్రిందటి మంత్రం ప్రకృతిలో సంభవించే ఋతు మార్పులను, ముఖ్యంగా శిశిర ఋతువు (శీతాకాలం చివర) నాటి వాతావరణాన్ని మరియు ఆ సమయంలో సంభవించే ఉరుములు, మెరుపుల విశిష్టతను వివరిస్తుంది.


"దుర్భిక్షం దేవలోకేషు |

మనూనాముదకం గృహే | 

ఏతా వాచః ప్రవదన్తీః। 

వైద్యుతో యాన్తి శైశిరీః||”


“దుర్భిక్షం దేవలోకేషు" - దేవలోకములలో (ఆకాశంలో) ఆహారానికి కొరత (దుర్భిక్షం) ఏర్పడినట్లుగా ఉంది.

శీతాకాలంలో మేఘాలు లేక ఆకాశం ఖాళీగా, నిర్మలంగా ఉండటాన్ని ఇది సూచిస్తుంది.


“మనూనాముదకం గృహే” - మనుష్యుల ఇళ్ళలో మాత్రం నీరు సమృద్ధిగా ఉంటుంది. అంటే వర్షాలు పడకపోయినా, భూమిలో ఇంకిన నీరు లేదా మంచు రూపంలో లభించే తేమ మనుష్యులకు అందుబాటులో ఉంటుందని అర్థం.


“ఏతా వాచః ప్రవదన్తీః” - ఈ మాటలు పలుకుతున్నట్లుగా…. అంటే ప్రకృతిలో జరుగుతున్న మార్పులు ఒక సందేశాన్ని ఇస్తున్నట్లుగా ఉన్నాయి.


“వైద్యుతో యాన్తి శైశిరీః" - శిశిర ఋతువుకు సంబంధించిన మెరుపులు (వైద్యుతః) సంచరిస్తున్నాయి.

సాధారణంగా వర్షాకాలంలో వచ్చే మెరుపుల కంటే, శిశిర రుతువులో అరుదుగా వచ్చే మెరుపులు ఒక ప్రత్యేకమైన ధ్వనిని, కాంతిని కలిగి ఉంటాయి.


అరుణప్రశ్నలోని ఈ అనువాకం సూర్యుడు ఏ విధంగా వివిధ ఋతువులలో తన ప్రభావాన్ని చూపుతాడో వివరిస్తుంది. శిశిరంలో ఆకాశం 'దుర్భిక్షం' (మేఘరహితం) గా ఉన్నప్పటికీ, భూమిపై ప్రాణకోటి మనుగడకు అవసరమైన నీరు (మంచు లేదా భూగర్భ జలం) లభిస్తుంది. ఇది ఋతు వర్ణన.


‘వైద్యుతః’ (Lightning): మెరుపులను "వాక్కులు" (వాచః) గా వర్ణించడం ఇక్కడ విశేషం. మేఘాల ఘర్షణ వల్ల కలిగే ధ్వని, వెలుగు లోకానికి ఒక దివ్యమైన సందేశాన్ని ఇస్తున్నట్లుగా ఋషి దర్శించాడు.


శిశిర రుతువుకు సంబంధించిన శక్తులను 'శైశిరీః' అని అంటారు. ఇవి రాబోయే వసంత ఋతువుకు సూచికలు. శైశిరీః అనేది వైదిక పదం.


ఈ మంత్రంలో "దేవలోకంలో దుర్భిక్షం" అని చెప్పడం వెనుక ఒక నిగూఢార్థం ఉంది. దేవతలు హవిస్సును (యజ్ఞ భాగాలను) ఆహారంగా స్వీకరిస్తారు. మేఘాలు లేని ఆకాశం దేవతలకు తృప్తినిచ్చే వర్షాన్ని ఇవ్వలేకపోవడాన్ని అలా వర్ణించి ఉండవచ్చు.


అరుణప్రశ్నలోని ఈ మంత్రాలు ప్రకృతిని ఒక జీవకళా రూపంగా మనకు చూపిస్తాయి. 


తత్త్వ విచారణ: 

అద్వైత సిద్ధాంతం ప్రకారం, ఈ వర్ణనను సాధకుని అంతర స్థితికి అన్వయించవచ్చు.

‘దేవలోక దుర్భిక్షం’ అంటే అధ్యాత్మలో ఇంద్రియ నిగ్రహం. అద్వైతంలో 'దేవతలు' అంటే తరచుగా మన ఇంద్రియాలకు సంకేతం. "దేవలోకంలో దుర్భిక్షం" అంటే ఇంద్రియాలకు అందవలసిన విషయ సుఖాలు నిలిచిపోవడం. సాధకుడు 'ప్రత్యాహారం' అనే స్థితిలో ఉన్నప్పుడు, ఇంద్రియాలు బాహ్య ప్రపంచం వైపు వెళ్లవు. లోక విషయాల పట్ల ఈ 'దుర్భిక్షం' (వైరాగ్యం) కలగడం జ్ఞానోదయానికి మొదటి మెట్టు.


‘మనూనాముదకం గృహే’ - అంతర్ముక్తి (Inner Bliss)

'మనుష్యుల గృహం' అంటే మన హృదయం. బయట విషయాలు లేకపోయినా (దుర్భిక్షం), లోపల మాత్రం 'ఉదకం' (శాంతి/ఆనందం) నిండి ఉంటుంది. ఆత్మజ్ఞాని బాహ్య సుఖాల కోసం వెతకడు. తన హృదయమనే గృహంలోనే ఆత్మ చైతన్యమనే అమృతధారను దర్శిస్తాడు.


‘వైద్యుతః’ - చైతన్య స్ఫురణ (Flash of Awareness)

శిశిర కాలపు మెరుపులు అత్యంత ప్రకాశవంతంగా ఉంటాయి. ఇవి మన బుద్ధిలో అకస్మాత్తుగా కలిగే 'జ్ఞానోదయం' (Flash of Realization) కు సంకేతం.

చీకటిగా ఉన్న ఆకాశంలో మెరుపు ఒక్క క్షణం మెరిసి మొత్తం ప్రపంచాన్ని ఎలా చూపిస్తుందో, అజ్ఞానాంధకారంలో ఉన్న సాధకుడికి గురువు ఉపదేశం వల్ల కలిగే 'మహావాక్య' బోధ అలా కళ్ళు విప్పేలా చేస్తుంది. బ్రహ్మ "విద్యుల్లేఖేవ భాస్వర" - మెరుపు తీగలా ప్రకాశించేది.


శిశిరము అంటే ఆకులు రాలిపోయే కాలం. పాతవి పోయి కొత్తవి రావడానికి సిద్ధమయ్యే స్థితి. సాధకుడిలో పాత సంస్కారాలు, వాసనలు రాలిపోయి (శిశిరము), జ్ఞానమనే వసంతానికి సిద్ధమవ్వడాన్ని ఇది సూచిస్తుంది. ఈ సమయంలో కలిగే మెరుపులు (జ్ఞాన స్ఫురణలు) సాధకుడిని సంపూర్ణ సత్యం వైపు నడిపిస్తాయి.


Conclusion:

బయటి ప్రపంచంలోని విషయ వాసనల పట్ల వైరాగ్యాన్ని (దుర్భిక్షాన్ని) పెంచుకో. అప్పుడు నీ హృదయ గృహంలో ఆత్మశాంతి అనే అమృతం నిండుతుంది. ఆ స్థితిలో నీ బుద్ధిలో మెరిసే జ్ఞానమనే మెరుపు (విద్యుత్), నిన్ను ఆ కాలాతీతమైన పరమాత్మతో అనుసంధానం చేస్తుంది.

అరుణప్రశ్నలోని ఈ మంత్రాలు కేవలం వాతావరణ మార్పుల గురించి కాక, అవి మన ప్రాణ, మనో, విజ్ఞాన కోశాల్లో కలిగే పరిణామాలను ఎంత అద్భుతంగా వివరిస్తాయి. కలిగే పరిణామాలను ఎంత అద్భుతంగా వివరిస్తాయి.

వేదములలో జున్ను ప్రస్తావన

 వేదములలో జున్ను ప్రస్తావన: శాస్త్రీయ మరియు ధార్మిక విశ్లేషణ


ఈశ్వర ప్రోక్తమయిన వేదములలో సర్వ జీవరాశుల క్షేమమును కాంక్షించే అనేక విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి. కృష్ణ యజుర్వేదం, బ్రాహ్మణ భాగము (2-1-1) లోని ‘అంగీరస ప్రశ్న’లో గోసంరక్షణ మరియు దూడ హక్కుల గురించి ఒక అద్భుతమైన ప్రస్తావన ఉంది. ఒక రోజు గోవు బ్రహ్మ వద్దకు వెళ్లి ఒక వరం కోరింది. 


"సోబ్రవీత్ వరం వృణౖ | దశమా రాత్రీర్జాతన్నదోహన్ |

ఆసంగవం మాత్రా సహచరాణీీతి | తస్మాత్ వత్సం జాతం దశ రాత్రీ ర్నదుహంతి| ఆసంగవం మాత్రా సహ చరతి| వారే వృతగ్గుహ్యస్య | తస్మాత్ వత్సగ్o సంగ్o సృష్ట ధయగ్o రుద్రో ఘాతుకః||"

( కృ.య.బ్రహ్మణము 2-1-1)


పై మంత్రమునకు ముఖ్య భావమేమనగా...

ఆవు దేవుని ఒక వరం అడిగింది. దూడ పుట్టిన 10 రాత్రులు వరకు పాలు పిండ రాదని, దూడ ఆవుతో కలిసి ఉండాలని.  అప్పుడు దేవ దేవుడు మొదటి 10 రాత్రులు పాలు పితకరని, ఆవు నుంచి బిడ్డను విడదీయరని వరం ప్రసాదించాడు.  ఈ కారణం చేత పశువుకి / ఆవుకి దూడ పుట్టిన 10 రోజుల వరకు పాలు పితుకరాదు (న దోహన్).  మొదటి 10 రోజుల పాలు దూడకి మాత్రమే చెందాలి. కాని పక్షంలో వారికి రుద్ర ఘాతుక దోషం వర్తిస్తుంది. దూడకు అందాల్సిన పాలను మనం తీసుకోవడం వల్ల 'రుద్రుని కోపానికి' గురికావాల్సి వస్తుందని వేదం హెచ్చరిస్తోంది. అంటే ప్రకృతి నియమాలను ఉల్లంఘించడం వల్ల కలిగే దుష్పరిణామాలు అని అర్థం.


రుద్ర ఘాతుక దోషం

ప్రకృతి నియమాలను ఉల్లంఘించి, దూడకు చెందాల్సిన పాలను మనిషి తన స్వార్థం కోసం తీసుకుంటే, అతనికి 'రుద్ర ఘాతుక దోషం' వర్తిస్తుందని వేదం హెచ్చరిస్తోంది. అంటే, ప్రకృతి సమతుల్యతను దెబ్బతీయడం వల్ల కలిగే దుష్పరిణామాలు ఆ వ్యక్తికి చుట్టుకుంటాయి.


ఇది ఆవుకనేకాక అన్ని పశువులకు, క్షీరదాలకు వర్తిస్తుంది.  ఆధునిక వైజ్ఞానికుల సూచన ప్రకారం మొదటి 10 రోజుల పాలు బిడ్డ ఆరోగ్యానికి బలమైన పునాది వేస్తాయి.  రోగ నిరోధక శక్తిి వృద్ధి చెందుతుంది.




ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం, దూడ పుట్టిన మొదటి 10 రోజులు ఇచ్చే పాలను కోలోస్ట్రమ్ (Colostrum) అంటారు.

రోగనిరోధక శక్తి: ఈ పాలలో ఇమ్యునోగ్లోబ్యులిన్ (Immunoglobulins) వంటి యాంటీబాడీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి దూడకు జీవితాంతం వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తాయి.


జున్ను ఎందుకు తినకూడదు?: ఆధ్యాత్మికంగా అది దూడ వాటా కాబట్టి తినకూడదు. ఆరోగ్యపరంగా చూస్తే, జున్ను పాలు చాలా భారీగా ఉంటాయి. జున్ను పాలు చాలా చిక్కగా, ప్రోటీన్లతో నిండి ఉంటాయి (Heavy to digest). పసి దూడకు అవసరమైన ఆ పోషకాలు మనిషికి అరగడం కష్టం కావచ్చు, అందుకే పెద్దలు దీనిని నిషేధించారు.


రోగ నిరోధక శక్తి: ఈ పాలు దూడ యొక్క ఆరోగ్యానికి బలమైన పునాది వేస్తాయి. భవిష్యత్తులో అది వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని అందిస్తాయి.


ఈ కారణం చేతనే వేద పండితులు, శాస్త్ర పండితులు లేగడి పాలతో చేసిన జున్ను ని తినరు. 


మనం ఎందుకు జున్ను తినకూడదు?

వేద పండితులు మరియు శాస్త్ర కోవిదులు లేగడి పాలతో చేసిన జున్నును తినకపోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి:

ధార్మిక కారణం: అది దూడ యొక్క ప్రాథమిక హక్కు. జీవకారుణ్య దృష్టితో చూస్తే, పసి దూడ నోరు కొట్టి మనం ఆహారం తీసుకోవడం అధర్మం.

ఆరోగ్య కారణం: అతిగా ఉండే పోషకాలు మనిషికి అరగడం కష్టమై, అనారోగ్యానికి దారితీయవచ్చు. పరాయి జీవి యొక్క హక్కును గౌరవించడం, ప్రకృతితో మమేకమై జీవించడం.


వీలయినంతలో తెలుసుకున్న విషయాన్ని పాటించడం ద్వారా ప్రకృతి నియమాలను పాటిద్దాం!


లోకాసామస్తాస్సుఖినో భవంతు||