14, డిసెంబర్ 2025, ఆదివారం

WILL DEED

  WILL DEED is one of the important document in one's life. Because this is the only document through which one can transfer all his/her estates. Many people does not recognize the importance of Will Deed, due to which after the demise of the head of family the children ( Successors) will face many problems. It is always better to execute a WILL DEED when a person attains the age of 65 or more. 


WHO SHOULD WRITE WILL DEED: any person  who is a major, having movable, immovable properties, cash, ornaments or any type of assets. Can  write a WILL DEED so as to transfer the same to his family members/Legal Representative.


HOW TO WRITE A WILL: WILL DEED is a simple deed it can be written on any paper, but it should be attested by two major witnesses.


IS IT COMPULSARY TO REGISTER A WILL DEED: 

NO it is not compulsory to register a will deed even a WILL DEED can be executed on a white paper. But I sincerely advise the parties to register a WILL DEED to avoid future complications.


WHY REGISTRATION: Because WILL DEED should be presented in many Government and Municipal offices to get mutate the names of Legal Representatives. In the Government offices to avoid un necessary litigation and to have perfection and to avoid risk, usually prefer a Registered WILL DEED. So it is always safe to register a WILL DEED.

if you have any doubts with regard to drafting, execution of WILL DEED you can contact here by way of comment. 

మహాభారతము

  ```

ప్రతిరోజూ…

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో...!

1412e7;➖75.

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀7️⃣5️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు```


     *సంపూర్ణ మహాభారతము*        

                    *75 వ రోజు*

                    ➖➖➖✍️


*వన పర్వము ప్రథమాశ్వాసము*


    *ఇంద్రలోకంలో అర్జునుడు*

              ➖➖➖✍️

```

దానిపై అర్జునుడు ఇంద్రలోకం వెళ్ళాడు. ఇంద్రలోకంలో సూర్య చంద్రులు లేకనే స్వయంప్రకాశంతో వెలిగి పోతున్న అమరావతి నగరాన్ని చూసాడు అర్జునుడు. పురద్వారం వద్ద ఐరావతం అర్జునుడికి స్వాగతం చెప్పింది. అర్జునుడు దేవేంద్రునికి నమస్కరించాడు. అర్జునుడికి ఆనందం కలిగించడానికి దేవేంద్రుడు ఊర్వశిని నియమించాడు. ఊర్వశి అర్జునుడి ముందు నాట్యం చేసింది. అర్జునుడు ఆమెకు నమస్కరించి 

“అమ్మా! నా మీద పుత్ర ప్రేమతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చావా?” అంటూ మాతృభావంతో ఊర్వశికి నమస్కరించాడు. “అర్జునా! నేను నీ పొందు కోసం వచ్చాను. ఇది దేవలోకం. నేను దేవ వేశ్యని. మాకు వావివరసలు ఉండవు. నీకు నేను ఏవిధంగా తల్లిని అయ్యాను?” అన్నది. 


“మా వంశకర్త పురూరవుని భార్యవు నీవు. నా తండ్రి అయిన ఇంద్రునికి పరిచర్యలు చేస్తుంటావు కనుక నీవు నాకు మాతృ సమానురాలివి. స్వేచ్ఛా శృంగారం దోషం, పాపం” అన్నాడు. 


ఊర్వశి కోపించి “కోరి వచ్చిన నా కోరిక తీర్చనందుకు భూలోకంలో నపుంసకుడివై ఆడవాళ్ళ మధ్య సంచరించు!” అని శపించి వెళ్ళి పోయింది. 


ఇది తెలిసిన ఇంద్రుడు అర్జునుడుతో “అర్జునా! నీ వంటి ధైర్యవంతుని నేను ఇదివరకు చూడలేదు. నీవు ధర్మబుద్ధివి, జితేంద్రుడివి. బాధపడకు ఊర్వశి శాపం అనుభవించక తప్పదు. కాని అది నీ అజ్ఞాతవాస సమయంలో ఉపయోగపడుతుంది. ఎవ్వరికీ తెలియకుండా నపుంసక రూపంలో ఉంవడచ్చు. నీ అజ్ఞాతవాసం ముగియగానే నీ శాపం తొలగి పోతుంది" అని ఊరడించాడు. 


తరువాత అర్జునుడికి ఇంద్రుడు ఎన్నో దివ్యాస్త్రాలను ఇచ్చాడు. అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్న సమయంలో భూలోకంలో ఐదు సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు రోమశుడు అనే మహర్షి దేవేంద్రుని వద్దకు వచ్చి ఇంద్రుని అర్ధ సింహాసానంపై కూర్చున్న అర్జునుని చూసి “ఎవరీతుడు?" అని ఇంద్రుని అడిగాడు. 


దానికి దేవేంద్రుడు “మహర్షీ! ఇతడు పూర్వజన్మలో నరుడు అనే మహర్షి. ఇప్పుడు నా అంశతో కుంతీ గర్భాన జన్మించాడు. పరమేశ్వరుడు ఇతనిని అనుగ్రహించి పాశుపతాన్ని ఇచ్చాడు. నేను కూడా ఇతనికి దివ్యాస్త్రాలెన్నో ఇచ్చాను. ఇతను నివాత కవచులను రాక్షసులను సంహరించగలడు. కాని తమరు భూలోకమునకు పోయి అర్జునుడు నా వద్ద ఉన్నాడు అని ధర్మరాజుకు చెప్పండి. ధర్మజుని తీర్ధయాత్రలు చేయమని నా తరఫున చెప్పండి. తీర్ధయాత్రల వలన అతడు పాప రహితుడు కాగలడు" అని రోమశునితో చెప్పాడు.✍️```(సశేషం)

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాంటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

పరిస్థితులను మారుస్తావా

 ఒకరోజు ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరకి వచ్చింది,

" నాన్నా..! నేను ఈ కష్టాలు పడలేను. నాకు జీవితం అంటేనే విసుగేస్తోంది.

నాకే ఇన్ని కష్టాలు రావాలా..? " అంటూ తన బాధలను చెప్పుకుంటూ

వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.


తండ్రి మౌనంగా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు.

చిన్నగా నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచాడు.


గ్యాస్ పొయ్యి మీదున్న - మూడు బర్నర్ల మీద మూడు గిన్నెలు పెట్టాడు.

వాటిల్లో నీళ్ళు పోసి ఒకదానిలో బంగాళా దుంపలు ( ఆలుగడ్డలు),

మరొకదానిలో కోడిగుడ్లు, ఇంకో గిన్నెలో కాఫీగింజలు వేశాడు.


తండ్రి తనతో అలా నిర్లక్ష్యముగా ఉండి,

ఏమీ మాట్లాడకుండా చేస్తున్న పని మీద కోపం వస్తున్నా -

అలాగే చూడసాగింది ఆ అమ్మాయి.


అలా 20 నిముషాలు మరిగించాక - స్టవ్ ని కట్టేసి, ఆ గిన్నెలను దింపి,

వాటిని కూతురు ముందు పెట్టి ఏమి జరిగిందో పరిశీలింఛి చెప్పమన్నాడు.


నాన్న ' అలా ఎందుకు చేసాడా పని..' అని అయోమయముగా ఉన్న ఆ కూతురు వాటిని పరిశీలించాక అంది,


" ఏముందీ..! దుంపలు మెత్తబడ్డాయి. కోడిగుడ్డు గట్టిపడింది.

కాఫీ డికాషన్ వచ్చింది........

అయినా ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నావు నాన్నా?.. " అంది.


అప్పుడు ఆ తండ్రి చిన్నగా నవ్వి,


" ఆ మూడింటికీ ఒకే రకమైన ప్రతికూలత ఎదురయ్యింది. అంటే ఒకేలా ఒకే రకమైన గిన్నెల్లో, అదే గ్యాస్ వేడినీ, వేడి నీటినీ చవిచూశాయి.


కానీ, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయి అని గమనించావా?

మామూలుగా గట్టిగా ఉండే దుంపలు ఇప్పుడు మెత్తబడ్డాయి.

చితికిపోయే గుడ్డు గట్టిపడింది.

గట్టిగా ఉండే కాఫీ గింజలు మెత్తపడి, వాటిలోని రసాన్ని ఊరించి,

నీటిరంగునే మార్చింది.. అవునా..!!


ఇప్పుడు చెప్పు..


వీటిల్లో - నీవు ఎలా ఉండాలి అనుకుంటున్నావు?


మెత్తబడిపోతావా..? ( ఇప్పుడు నీవున్న స్థితి అదే.. )


గట్టిపడిపోతావా..?


పరిస్థితులను మారుస్తావా...?


ఇక్కడ నీదే ఎంపిక,

దానిమీదే ఇందాక నీవడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది.." అన్నాడు.


ఆ అమ్మాయి మొఖంలో ఏదో తెలీని వెలుగు. కన్నీళ్లు ఆగిపోయాయి. బాధలేదు.


దాని బదులుగా ఆ కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపింది..


" నాన్నా! యూ ఆర్ మై రియల్ హీరో.. మెంటార్.. ఎవర్ అండ్ ఫరెవర్.." కృతజ్ఞతాభావంతో అంది.

*సంపూర్ణ మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*🍁శనివారం 13 డిసెంబర్ 2025🍁*


            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                           7️⃣3️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


       *సంపూర్ణ మహాభారతము*           

                    *73 వ రోజు*

                   

*వన పర్వము ప్రథమాశ్వాసము*


*అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించుట*```


ధర్మరాజు వ్యాసుని సాదరంగా ఆహ్వానించి అర్చించాడు." ధర్మరాజా! నీ మనస్సులో ఉన్న చింతను గుర్తించి ఇక్కడకు వచ్చాను. నేను నీకు ప్రతిస్మృతి అనే విద్యను నేర్పిస్తాను. దానిని నీవు అర్జునునకు ఉపదేశించు. దాని ప్రభావంతో అర్జునుడు అధికంగా తపస్సు చేసి దేవతలను మెప్పించి దివ్యాస్త్రాలను సంపాదిస్తాడు. మీరు ఈ అడవిని విడిచి వేరే అడవికి వెళ్ళండి " అని చెప్పాడు . వ్యాసుని ఆజ్ఞ ప్రకారం పాండవులు కామ్యక వనానికి వెళ్ళారు. ధర్మరాజు ఒకరోజు అర్జునినితో " అర్జునా ! భీష్ముడు, ద్రోణుడు దివ్యాస్త్ర సంపన్నులు. వారిని గెలవాలంటే మనకూ దివ్యాస్త్ర సంపద కావాలి. వ్యాసుడు అందుకు మార్గం చెప్పి మంత్రోపదేశం చేసాడు. నేను నీకు ఆ మంత్రం ఉపదేశిస్తాను. నీవు తపస్సు చేసి దివ్యాస్త్రాలు సంపాదించు. వృత్తాసురుడికి భయపడి దేవతలంతా తమతమ అస్త్రాలను ఇంద్రునికి ఇచ్చారు. అవి నీకు లభిస్తాయి. పరమ శివుని ఆరాధించి పాశుపతాస్త్రం సంపాదించమని వ్యాసుడు ఆదేశించాడు " అని చెప్పి అర్జునునకు వ్యాసుడు ఉపదేశించిన ప్రతిస్మృతి అవే విద్యను ఉపదేశం చేసాడు. అన్న అనుమతి తీసుకుని అర్జునుడు తపస్సు చేయడానికి గంధ మాదన పర్వతం చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలి బ్రాహ్మణుడు అర్జునిని చూసి " వీరుడా నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఇక్కడ శాంతస్వభావులైన బ్రాహ్మణులు తపమాచరించే ప్రదేశం. ఆయుధదారివైన నీకు ఇక్కడ ఏమి పని ? నీ ఆయుధములు విడిచి పెట్టు " అన్నాడు. ఆ మాటలకు చలించకుండా స్థిరంగా ఉన్న అర్జునిని సాహసానికి మెచ్చి బ్రాహ్మణుని రూపంలో ఉన్న ఇంద్రుడు అర్జునుడికి ప్రత్యక్షమైయ్యాడు. " అర్జునా నీ ధైర్యానికి మెచ్చాను. నీకేమి కావాలో కోరుకో " అని అన్నాడు. అర్జునుడు " నాకు దివ్యాస్త్రాలు కావాలి " అన్నాడు. ఇంద్రుడు " ఎలాగూ అవి లభిస్తాయి. అమరత్వం కావాలా? " అని అడిగాడు. అర్జునుడు " ముందు నాకు దివ్యాస్త్ర సంపద కావాలి. అవి నాకు ప్రసాదించండి " అన్నాడు. ఇంద్రుడు " అలా అయితే ముందు నీవు పరమేశ్వరుని గురించి తపస్సు చెయ్యి " అన్నాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

ఆదివారం*🌞 *🌹14డిసెంబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🌞 *ఆదివారం*🌞

 *🌹14డిసెంబర్2025🌹*     

    *దృగ్గణిత పంచాంగం*                   

   

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - బహుళపక్షం*


*తిథి  : దశమి* ‌సా 06.49 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం    : ఆదివారం* ( భానువాసరే )

*నక్షత్రం  : హస్త* ఉ 08.18 వరకు ఉపరి *చిత్త*

*యోగం : సౌభాగ్య* ప 11.45 వరకు ఉపరి *శోభన(

*కరణం  : భద్ర* సా 06.49 ఉపరి *బవ* రాత్రంతా పూర్తిగా


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 08.00 - 10.00 మ 02.00 - 04.00*

అమృత కాలం  : *రా 03.59 - 05.46 తె వరకు*

అభిజిత్ కాలం  : *ప 11.40 - 12.24*

*వర్జ్యం    : సా 05.15 - 07.02*

*దుర్ముహూర్తం  : సా 04.08 - 04.52*

*రాహు కాలం   : సా 04.13 - 05.37*

గుళికకాళం      : *మ 02.50 - 04.13*

యమగండం    : *మ 12.02 - 01.26*

సూర్యరాశి : *వృశ్చికం*                                     

చంద్రరాశి : *కన్య/తుల*

సూర్యోదయం :*ఉ 06.38*

సూర్యాస్తమయం :*సా 05.34*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.27 - 08.41*

సంగవ కాలం         :     *08.41 - 10.55*

మధ్యాహ్న కాలం    :    *10.55 - 01.09*

అపరాహ్న కాలం    : *మ 01.09 - 03.23*


*ఆబ్ధికం తిధి         : మార్గశిర బహుళ దశమి*

సాయంకాలం        :  *సా 03.23 - 05.37*

ప్రదోష కాలం         :  *సా 05.37 - 08.11*

రాత్రి కాలం           :*రా 08.11 - 11.37*

నిశీధి కాలం          :*రా 11.37 - 12.28*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.45 - 05.37*

<><><><><><><><><><><><><><>

        🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞శ్రీ సూర్య పంజర స్తోత్రం🌞*


*అసితాంగభైరవాయ నమః* 

*రురుభైరవాయ నమః*

*చండభైరవాయ నమః* 

*క్రోధభైరవాయ నమః*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

స్వామి వివేకానంద స్ఫూర్తి.

 స్వామి వివేకానంద స్ఫూర్తి....
రోజుకో సూక్తి....


ప్రతికార్యం - అవహేళన, ప్రతిఘటన, తరువాత అంగీకారం. ఈ మూడు దశలను దాటవలసి ఉంటుంది. తానున్న కాలానికంటే ముందుగా ఆలోచించే ప్రతి వ్యక్తిని లోకం అపార్థం చేసుకోవడం సహజం. కాబట్టి ప్రతిఘటన, హింస అనివార్యాలు. మీరు స్ధైర్యంగా, పవిత్రంగా ఉంటూ 

భగవంతుడిపై అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు ఇవన్నీ అదృశ్యమవుతాయి.


శుభ రవి వారం 🌞Happy Sunday. 


Swami Vivekananda’s Wisdom for

Daily Inspiration. 


Each work has to pass through these stages — ridicule , opposition , and then acceptance . Each man who thinks ahead of his time is sure to be misunderstood. So opposition and persecution are welcome , only i have to e steady and pure and must have immense faith in god , and all these will vanish . . . .

ఆన్లైన్లో సంగీతం క్లాసులు

  ఆన్లైన్లో సంగీతం క్లాసులు


 ఆన్లైన్లో కర్ణాటక సంగీత క్లాసులు కండక్ట్ చేయబడుతున్నాయి మీ పిల్లలకి సంగీతం నేర్పించదల్చుకుంటే వెంటనే ఈ పోస్ట్ కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయగలరు. మీ వాట్సాప్ నంబర్ తెలియజేస్తే వాట్సాప్ ద్వారా మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలము. మీరు పెట్టిన కామెంట్లు ఈ బ్లాగులో ఎవరికి కనబడవు. 


మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా పర్వాలేదు ఆన్లైన్లో క్లాసులు అటెండ్ కావచ్చు 


ప్రస్తుతం అమెరికాలో వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఉన్నారు.

అంతా_అన్నంలోనే_ఉంది

  *#అంతా_అన్నంలోనే_ఉంది*


అంపశయ్యపై ఉన్న భీష్ముడు తన చుట్టూ చేరిన పాండవులకు ధర్మ సూక్ష్మాలు వివరిస్తున్నాడు. అక్కడే ఉండి ఆ మాటలు వింటున్న ద్రౌపది ఫక్కున నవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ నవ్వు భీష్ముడి మాటల ప్రవాహానికి భంగం కలిగించడంతో ‘అమ్మా! ఇప్పుడు నువ్వెందుకు నవ్వావో నాతో పాటు వీళ్లకీ తెలియాలి.. కాస్త చెప్పమ్మా’ అన్నాడు.


ద్రౌపది బదులిస్తూ ‘భీష్మాచార్యా! ఇంకొద్ది రోజుల్లో మరణించబోయే మీరు ఇంత చక్కగా ధర్మం గురించి చెబుతున్నారు, బాగుంది. కానీ నాడు నా వస్త్రాపహరణ సమయంలో ఈ ధర్మపరిజ్ఞానం అంతా ఏమైపోయిందో అనిపించగానే నవ్వు ఆగలేదు’ అంది.


ఆయన తల పంకించి ‘నువ్విలా నవ్వడం మంచిదయ్యిందమ్మా! నువ్వు గనుక నవ్వకపోయుంటే నాకూ నీకూ ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఇదొక శేష ప్రశ్నగా మిగిలిపోయేది. నీ సందేహానికి నా సమాధానం విను!


అప్పుడు నేను సుయోధనుడు పెట్టిన మలినమైన అన్నం తింటున్నాను. అది నా రక్తంలో కలిసి.. ఆ ప్రభావం నా విజ్ఞతను, వివేకాన్ని తెరలా కప్పేయడం వల్ల కర్తవ్యం గుర్తు రాలేదు. నేడు అర్జునుడి బాణాలతో నా రక్తంలో చేరిన ఆ కాలుష్యమంతా అంతరించింది కనుక ధర్మం మాట్లాడుతున్నాను అన్నాడు.


మిత్రులారా! అన్నం మహిమ అంతటిది. మనం తినే ఆహారం కష్టార్జితంతో కూడుకొన్నదై ఉండాలి. పీడన సొమ్ముతో లభించింది తింటే.. అది చెడు ఆలోచనలు కలిగిస్తుంది. అందుకని ఆహారం స్వార్జితం, దైవార్పితం, మితం అయ్యుంటే అది మనసును పరిశుద్ధంగా ఉంచుతుంది. ధర్మమార్గంలో నడిపిస్తుంది. సాత్విక ఆహారంతో ఆత్మ, దేహం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. దైవసాధనలో మనసు నిగ్రహం కోల్పోదు .

దత్తపది

 

🌹🦜🙏🏽🦜🌹

    12.12.2025

     శుక్రవారము 

     

దత్తపది  అంశం :  భారతార్ధంలో

ఛందము ..  ఏదేని వృత్తము

***************************


  " *హరి  - గిరి - సరి - ఝరి "* 


**************************** 


 *ఉత్పలమాల..* 


శ్రీహరి నడ్డగింపనట సిగ్గును

వీడుచు నల్లకొల్వులో 


ద్రోహులు కౌరవాధములు దూరుచు

మ్రగ్గిరి సంగరమ్మునన్ ! 


దా హతుడాయె రాజు 'సరి తమ్ముని'

ధాటికి నొక్కపెట్టునన్ ! 


గోహళి వ్రయ్యలాయె, కురు క్రౌర్యపు

నిర్ఝరి క్రుంకెఁ జూడుమా !!

......................................................

సరి తమ్ముడు  ... భీముడు ( సరియగు, సరిజోడు )

గోహళి  .. కిరీటము ( రాజ్యము, రాచఠీవి )

నిర్ఝరి ... సెలయేటి ప్రవాహము 

      (రాచరికము అనే భావములో వాడాను ) 

🦄🐓🦜🦢🐘

పి.ఎల్.నాగేశ్వరరావు 

హైదరాబాదు

“ *అవధానంబులఁ బెక్కు సేసినను*

  🌹🦜🙏🏽🦜🌹

   12.12.2025

     శుక్రవారం 


“ *అవధానంబులఁ బెక్కు సేసినను* 

 *దా నల్పుండె విద్వత్సభన్”* 

   ................................................ 


 *మత్తేభమ్...* 


శ్రవణానందపు మేటి గాత్రమది,

విస్పష్టంబులౌ పల్కులున్, 


గవితా ధారయు, ధారణా పటిమ,

వాక్చాతుర్యుడౌ శాస్త్రి  తాఁ 


గవనం బందున మేలుబంతి యయి,

సద్గ్రాహ్యంబు లోపంబునై 


యవధానంబులఁ బెక్కు సేసినను 

దా నల్పుండె విద్వత్సభన్”

...................................................... 

🦄🐓🦜🦢🐘

పి.ఎల్.నాగేశ్వరరావు 

హైదరాబాదు

శ్రీనివాస తిరుమలేశ

  🌸శ్రీనివాస స్తుతి🙏

తేటగీతి పద్యం


శ్రీనివాస తిరుమలేశ శ్రీహరి నిను

 నిరతము గొలుతు భక్తితో నీరజాక్ష 

సకల సంపదలొసగుము సన్నుతాంగ

 సప్తగిరులపై వెలసిన సాధుపురుష

జయము జయమయ్య గోవింద శరణు శరణు


సాహితీ శ్రీ జయలక్ష్మి

విష్ణు స్తు తి

  🌸విష్ణు స్తు తి


శంఖచక్రములును సకిరీట మునుగల

వైకుంఠవాసుడావందనాలు

మా మొరలు వినవా మాధవ శ్రీహరి

కరుణతో మమ్ముల కావుమయ్య 

దుష్టుల శిక్షించి దురితములను బాపు

 దామోదరా నీకు దండ మయ్య 

నీల మేఘశ్యామ నిరుపమ గుణధామ

నిన్ను నమ్మియుంటినినిచ్చలందు

తే, ధర్మ పాలన జేసెడి ధర్మవీర

సకల దేవతా పూజిత శరణు శరణు

 విన్నపాలువినుము దేవ విష్ణుమూర్తి

 మానవుల పైన దయ చూపు మమత తోడ 


సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్ల

తేనియల్ చిందు నా భాష తెలుగుభాష

  .... జాతీయ తెలుగు సాహితీ పీఠము .....  

 తేనియల్ చిందు నా భాష తెలుగుభాష  

.... డా. నలవోలు నరసింహా రెడ్డి .... 

 

. ...... పొడుపు పద్యము ...... 

ఆ. నరుని చెంత నుండు తరువులు లేనట్టి 

చిక్కనైన యడవి చిత్రముగను 

చక్కనయిన దారి చిక్కని యడవిలో 

దీని భావమేమి ధీ వరేణ్య..? 251

జవాబు .. ?

నిన్నటి జవాబు ... (గురిగింజ)

పెండ్లికల పరతత్త్వనిర్ణయము

 పెండ్లికల

పరతత్త్వనిర్ణయము


ఉ॥ 

వేదములున్ తదంతములు విశ్రుతధర్మపరేతిహాసశా 

స్త్రాదులు గూఢతత్వవిషయ

మ్ములనున్ కలలోన దెల్పిసం 

వాదము నందు పండి‌తసభన్ 

పరతత్త్వము తానటంచునా 

మోదము జేయ నంపె హరి ముచ్చటదీరగ,విష్ణుచిత్తునిన్  

69


తే.గీ|| 

అంత ప్రణమిల్లి భాగవతార్యుడపుడు 

పండితసభకు జనె పరివారజనము 

వెంటరా, నెదురేగి యా విభుడు నమ్ర 

శీర్షుడై తద్విజోత్తము జేర్చె పీఠి 70


తే.గీ॥

అచట సభ నొక్క ప్రజ్ఞాని యాదిశక్తి 

యే పరమతత్త్వమనుచు వాదించి మెరిసె 

మరొక డనలాంబకపరత్వ

మహిమ దెలెపె 

వేరొకండట నలువయే వేల్పుడనియె 71


సీ|| 

విష్ణుచిత్తుడపుడు విష్ణుపరత్త్వమున్    

         భాష్యాలు ఘటియించి వ్యక్త పరచె 

ఉపనిషత్తుల లోని యుపపత్తులను జూపి    

         బోధాయనోక్తుల పోహణించె

ఇతిహాసకథలతో ప్రతివాదమును సల్పె  

         సారమ్ము ననువున జక్క జూపి 

మోహులై కనువారు ముగ్ధులై రనినచో 

         నదియె వైష్ణవమాయ యనగ నొనరె


తే.గీ॥

వివిధగాధామయ పురాణవేత్తయగుచు గూఢపరమార్థముల నెల్ల కూర్చి నుడువె 

వాదమున కెవ్వడును ప్రతివాది లేక 

ఒక్కొక విషయమ్ము నిటుల నుగ్గడించి 72


కంజర్ల రామాచార్య

ఉత్పలమాల

  🌹🦜🙏🏽🦜🌹

    13.12.2025

       శనివారం 


*అంశం .. చిత్రముపై కవి హృదయం* 

.................................................. 


 *ఉత్పలమాల..* 


దూకుచునుండె గంగ, శివ! త్రుళ్లుచుఁ

జంపును మమ్మునీ భువిన్! 


నీకిది భావ్యమా? జపము నేటికిఁ

జాలును, మేలుకొమ్మయా! 


చీకులు తీరు రైతులకుఁ జెర్వుల

నింపిననట్టి నీటితోఁ ! 


జేకొని మెట్టభూమియును శ్రీల

నొసంగును మానవాళికిన్ !!

................................................ 

🦄🐓🦜🦢🐘

పి.ఎల్.నాగేశ్వరరావు 

హైదరాబాదు

దాశరథి కాడు రాముడు దనుజ సుతుడు

  సమస్య:- దాశరథి కాడు రాముడు దనుజ సుతుడు.

(క్రమాలంకార పూరణ)

ఆ.వె

తండ్రి యాజ్ఞ తొ వనముల దరలె నెవరు

లంక గాల్చిన వీరుడు రాముడేన?

నారసింహుని గొలిచిన ధీరుడెవడు?

దాశరథి, కాడు రాముడు, దనుజ సుతుడు.

       పల్లావఝల వెంకట శైలజ, విజయవాడ.

*అంశం ..వర్క్ ఫ్రమ్ హోమ్

  🌹🦜🙏🏽🦜🌹

   


 *అంశం  ..వర్క్ ఫ్రమ్ హోమ్* 

  ............................................ 


 *తేటగీతి..( పంచపాది )* 

సమయ పాలన లేనట్టి సాఫ్టువేరు

నింటనుండుచుఁ బనిచేయ నేమి ఫలము?

నోట్ల యంత్రమై తనయింటఁ బాట్లుపడుచు

ప్రేగు బంధమ్ముతోనైన సాగలేక

బ్రతుకు నీడేర్చు చుండిరి వెతలు పడుచు!!

......................................................

పి.ఎల్.నాగేశ్వరరావు

అగపడదొక్క వేణువు స్వరామృత* *పానముఁ జేసిరెల్లరున్ "*

 


" *అగపడదొక్క వేణువు స్వరామృత* 

  *పానముఁ జేసిరెల్లరున్ "* 

  ..............................................


 *చంపకమాల..* 


మిగుల విశిష్ట శ్రీకరుని మిక్కిలి

భక్తిని జూడనేగి  నే 


సుగమగు స్వామి దర్శనపు శోభను

గాంచ ప్రభాతవేళలో 


నగణిత వాద్యకారులట హ్లాదము

గూర్చుచుఁ బాడఁ గొండపై


యగపడదొక్క వేణువు స్వరామృత

పానముఁ జేసిరెల్లరున్!!

...................................................

శ్రీకరుడు  .. వెంకన్న అనే భావం.

కొండ .. తిరుమల కొండ 

🦄🐓🦜🦢🐘

పి.ఎల్.నాగేశ్వరరావు 

హైదరాబాదు

ఇంగువ

 .

*మన ఆరోగ్యం…!


                 *ఇంగువ.....* 

                 ➖➖➖✍️

```

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, 

గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది, రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది, శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది మరియు యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. 


అయితే, అతిగా వాడితే వికారం, కడుపులో ఇబ్బంది వంటి దుష్ప్రభావాలు ఉండవచ్చు.


గర్భిణీ స్త్రీలు దీనిని వాడకపోవడం మంచిది. ```



*ఇంగువ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.....*```


*జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది, గ్యాస్ మరియు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. 


*రక్తపోటును నియంత్రిస్తుంది:

ఇంగువ రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. 


*శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం:

శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.


*యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీవైరల్

ఇంగువలో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి, ఇవి జీర్ణక్రియ సంబంధిత వ్యాధుల చికిత్సలో ఉపయోగపడతాయి.


*క్యాన్సర్ కణాల నివారణ:

ఇంగువ క్యాన్సర్ కణాల నివారణకు కూడా సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. 


*వికారం మరియు కడుపు నొప్పిని తగ్గిస్తుంది:

దీనిలోని సమ్మేళనాలు కడుపులో అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. 


*గమనించాల్సిన విషయాలు;

మరియు దుష్ప్రభావాలు;

అలెర్జీ ప్రతిచర్యలు:


కొంతమంది వ్యక్తులలో ఇంగువ వల్ల చర్మంపై దద్దుర్లు, దురద లేదా వాపు వంటి అలెర్జీ ప్రతిచర్యలు రావచ్చు. 


*అధిక వినియోగం:

ఎక్కువ మోతాదులో ఇంగువ సేవించడం వల్ల వికారం, విరేచనాలు, లేదా కడుపులో ఇబ్బంది వంటి సమస్యలు రావచ్చు. 


*గర్భిణీ స్త్రీలు:

గర్భిణీ స్త్రీలు ఇంగువ సేవించడాన్ని నివారించాలి, ఎందుకంటే ఇది గర్భాశయ సంకోచానికి దారితీయవచ్చు.


ప్రసవమైన తరువాత బాలింతలకు 

బాగా వుపయోగపడుతుందంటారు✍️ -సేకరణ.```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

పద్దెనిమిది మెట్లు విశిష్ఠత*

  

      *పద్దెనిమిది మెట్లు విశిష్ఠత*

                ➖➖➖✍️

```

మన హిందూ ధర్మసంప్రదాయ ప్రకారము ప్రతీ దేవాలయములలో ముఖ్యమైనది మూలవిరాట్ మాత్రమే, కాని కేరళ రాష్ట్రంలో పరశురామునిచే ప్రతిష్టించబడిన శబరిమలైలో.. 

శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో అతిముఖ్యమైనది, అతి పవిత్రమైనది మన స్వామివారి ఆలయమునకు ముందున్న పదునెనిమిది మెట్లు. 


అంత పవిత్రమైన, సత్యమైన సాలగ్రామశిలతో నిర్మితమైన ఆ పద్దెనిమిది మెట్లను ఎక్కాలంటే స్వామివారి దీక్షమాల ధరియించి, మండల కాలము అనగా 41 దినముల పైన నియమనిష్టలతో వ్రతనియమములు ఆచరించి, పవిత్రమైన ఇరుముడిని గురుస్వామి ద్వారా శిరస్సున ధరించిగాని ఎక్కుటకు వీలులేదు.


మన హిందు ధర్మసంప్రదాయము ప్రకారము ప్రతీ దేవాలయములలో ముందర ఉన్న ధ్వజస్తంభమును తాకి నమస్కరించిన పిదప దేవతలను దర్శించుకుంటాము. 

కాని శబరిమలై శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో మాత్రము ముందర ఉన్న స్వామివారి 18 మెట్లను తాకి నమస్కరించిన పిమ్మట ధ్వజస్తంభమును తాకి స్వామివారిని దర్శించుకుంటాము, అంటే మన శబరిగిరి వాసుడు అయ్యప్ప 

ఆ పద్దెనిమిది మెట్లకు ఎంత ప్రాముఖ్యత కల్పించాడో ఆ పద్దెనిమిది సంఖ్యకు ఎంత విలువనిచ్చారో, దీనిని బట్టి అర్ధమౌతుంది.


ఇక సంఖ్యా శాస్త్రము ప్రకారము ‘18’ సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది, వ్యాస భగవానుడు ఈ సంఖ్య యొక్క ప్రాధాన్యతను గూర్చి చాలా చక్కగా చెప్పిరి. 1+8=9 అనునది పరిపూర్ణమైన సంఖ్య, అంతే కాక ఆ సంఖ్య నవగ్రహములకు సూచిస్తుంది, కావున భక్తులు అశేషముగా ఆ స్వామి వారిని దర్శించుటకు నియమాల మాల మెడలో ధరించి నిష్టతో దీక్షబూని గురుస్వామి వారికి పూజలు జరిపి, ఇరుముడిని శిరస్సున ధరించి ఆ పద్దెనిమిది మెట్లను అధిరోహించి స్వామి వారిని దర్శించి తరిస్తూ యున్నారు. 


అందుకే మనము మన స్వామి పూజలలో కూడ పడిపూజ అంటామే కాని, అయ్యప్ప పూజ, స్వామివారి పూజ అని ఎక్కడా అనకుండా అయ్యప్పస్వామి వారి పడిపూజ అంటున్నాము. 


మరి ఆ 18 సంఖ్య గూర్చి కొన్ని వివరాలు తెలుసుకుందాం...


అమ్మవారి శక్తిపీఠములు - 18. 

1. శాంకరీ దేవి, 2. కామాక్షీ దేవి, 3. శృంఖలాదేవి, 4. చాముండేశ్వరీ, 5. జోగులాంబ, 6. భ్రమరాంబ, 

7. మహాలక్ష్మీ, 8. ఏకవీరిక, 

9. గిరిజాదేవి, 10. మాణిక్యాంబ, 11. కామరూపిణి, 12. మాధవేశ్వరి, 13. మహాకాళి, 14. పురుహుతిక, 15. వైష్ణవీదేవి, 16. మాంగళ్యగౌరీ, 17. విశాలాక్షీ, 18. సరస్వతి.


వ్యాసమహాముని వ్రాసిన పురాణాలు:18


1. మత్స్యపురాణము, 

2. మార్కండేయ పురాణము, 

3. దేవీభాగవత పురాణము, 

4. భవిష్యత్పురాణము, 5.బ్రహ్మాండపురాణము, 

6. బ్రహ్మవైవక్త పురాణము, 

7. వరాహపురాణము, 

8. వామనపురాణము, 

9. విష్ణు పురాణము, 

10. వాయు పురాణము, 

11. అగ్నిపురాణము, 

12. నారదపురాణము, 

13. పద్మపురాణము, 

14. లింగపురాణము, 

15. గరుడపురాణము, 

16. కూర్మపురాణము, 

17. స్కాంద పురాణము, 

18. బ్రహ్మపురాణము.


మహాభారతములోని పర్వములు-18.


1. ఆదిపర్వము, 2. సభాపర్వము, 3. అరణ్యపర్వము,4.విరాటపర్వము, 5. ఉద్యోగపర్వము(వీటిని ఆది పంచాకాలని), 6. భీష్మపర్వము, 

7. ద్రోణపర్వము, 8. కర్ణపర్వము, 9. శల్యపర్వము, 10. సౌప్తిక పర్వము, 11. శ్రీ పర్వము (వీటిని యుద్ధషష్ఠకములని, 12. శాంతి పర్వము, 13. అనుశాసన పర్వము, 14. ఆశ్రమవాస పర్వము, 

15. అశ్వమేధపర్వము, 

16. మౌసులపర్వము, 

17. మహాప్రస్థాన పర్వము, 

18. స్వర్గారోహణము (వీటిని శాంతి సప్తకములని).


భగవద్గీతలోని అధ్యాయములు-18.


1. అర్జున విషాదయోగము, 2. సంఖ్యాయోగము, 3. కర్మయోగము, 4. జ్ఞాన కర్మసన్యాస యోగము, 

5. కర్మసన్యాస యోగము, 

6. ఆత్మ సంయమయోగము, 

7. జ్ఞానవిజ్ఞాన యోగము, 

8. అక్షర పరబ్రహ్మయోగము, 

9. రాజవిద్యరాజ గుహ్యయోగము, 10. విభూతి యోగము, 

11. విశ్వరూప సందర్శన యోగము, 12. భక్తి యోగము, 13. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము, 14. గుణత్రయ విభాగ యోగము, 15. పురుషోత్తమ ప్రాప్తియోగము, 16. దైవాసుర సంపద్విభాగ యోగము, 

17. శ్రద్దాత్రయ యోగము, 

18. మోక్ష సన్యాస యోగము.


ఉప పురాణముల సంఖ్య - 18.


1. సనత్కుమారము, 2. నృసింహ పురాణము, 3. స్కందపురాణము, 4. శివధర్మ పురాణము, 

5. నందికేశ్వరపురాణము, 

6. దుర్వాసపురాణము, 

7. నారదీయ పురాణము, 

8. కపిల పురాణము, 

9. మానవ ఔజానన పురాణము, 10. మహేశ్వర పురాణము, 

11. వారుణ పురాణము, 

12. కాళీ పురాణము, 

13. సాంబ పురాణము, 

14. సౌర పురాణము, 

15. పరశర పురాణము, 

16. మారీచ పురాణము, 

17. భార్గవ పురాణము, 

18. బ్రహ్మాండ పురాణము.


స్మృతులు - 18.


1.మనుస్మృతి, 2. బ్రహ్మస్మృతి, 

3. దక్షస్మృతి, 4. గౌతమస్మృతి, 

5. యమస్మృతి, 6. అంగీరసస్మృతి, 7. యోగీశ్వరస్మృతి, 8. ప్రచేసస్మృతి, 9. శాతతాప స్మృతి, 

10. పరాశరస్మృతి, 

11. సంవర్తనస్మృతి, 

12. ఉశనస్మృతి, 13. శంఖస్మృతి, 14. లిఖితస్మృతి,15. ఆత్రేయస్మృతి, 16. విష్ణుస్మృతి, 

17. అపస్తంబస్మృతి,

18. హరీతస్మృతి.


సిద్ధులు - 18.


1.అణిమ, 2.లహిమ, 3.మహిమ, 4.ఈశాక్త్వా, 5.వసిత్వ, 6.ప్రాకామ్యా, 7. బుద్ధి, 8. ఇచ్చా, 9. ప్రాప్తి, 10. సర్వకామ, 11.సర్వాసంపత్ప్రద, 12. సర్వప్రియంకర,

13. సర్వమంగళాకారణ, 

14. సర్వదుఃఖవిమోచన, 

15, సర్వమృత్యుప్రవాచ, 

16. సర్వవిఘ్ననివారణ, 

17. సర్వాంగసుందర, 

18. సర్వాసౌభాగ్యదాయక. 



విద్యలు - 18.


1. ఋగ్వేదము, 2. యజుర్వేదము, 3. సామవేదము, 

4. అధర్వణవేదము, 5. శిక్షా, 

6. వ్యాకరణము, 7. చందస్సు, 

8. నిరుక్త, 9. జ్యోతిష్యము, 

10. కల్పము, 11. మీమాంస, 

12. న్యాయశాస్త్రము, 13.పురాణాలు, 14. ధర్మశాస్త్రాలు, 15.ఆయుర్వేదము, 

16. ధనుర్వేదము, 

17. నీతిశాస్త్రము, 

18. అర్ధశాస్త్రము.


మానవ శరీరములో ఉన్న ముఖ్యమైన స్థానము - 18.

1. మూలాధారం, 2. స్వాధిష్ఠానము, 3. మణిపూర్వకము,4.అనాహతము, 5.లంబిక, 6.విశుద్ధి, 7.అంగత, 8.బిందు,9.అర్ధచక్రము, 10.రోధిని, 11. నాధం, 12. సాంధారము, 13. శక్తి, 14.వ్యాపిక, 15.సమన, 16. ఉన్మన, 17. మహాబిందు, 18. సహస్రావరము.


శబరిమలై_ప్రాంతములో_స్వామివారి_

పవిత్రగిరులు_(కొండలు) - 18.


1.శబరిమలై, 2.కాంతమలై(పొన్నంబలమేడు, 

3. నాగమలై, 

4. సుందరమలై(సౌందర్యమలై), 

5. చిత్రంబలమేడు, 6. కల్కిమలై, 7. మదంగమలై(మాతాంగమలై), 

8. శ్రీపాదమలై, 9. గ్రౌండర్మలై (అప్పాచిమేడు), 10. దేవమలై, 11. నైలడంకుండ్రు, 12. తహైప్పార్ మలై, 13. నిలక్కల్ మలై, 

14. పుడుచ్చేరిమలై, 15. కాళైకట్టి, 16. ఇంజిప్పారై, 17. కరిమలై, 

18. నీలిమలై.


అష్టరాగ_పంచేంద్రియ_తిగుణ_జ్ఞానాజ్ఞనములు - 18.


1. కామము, 2. క్రోధము, 

3. లోభము, 4. మోహము, 

5. మాత్సర్యము, 6. దర్పము, 

7. అహంకారము, 8. కన్ను, 

9. ముక్కు, 10. చెవి, 11. నోరు (నాలుక), 12.చర్మము, 13.సత్వ గుణము, 14. తమోగుణము, 

15. రజోగుణము, 16. అవిద్య, 17. విద్య, 18.ఆశ.


పద్దెనిమిది_సార్లు_మాల_ధరించి_వెళ్లి_వచ్చిన_స్వామి_వార్ల_పేర్లు - 18.

1. కన్నెస్వామి, 2. కత్తిస్వామి, 

3. గంటస్వామి, 4. గధాస్వామి, 

5. పెరియస్వామి, 6. జ్యోతిస్వామి (గురుస్వామి), 7. సూర్యస్వామి, 

8. చంద్రస్వామి, 9. త్రిశూలస్వామి, 10. విష్ణుచక్రస్వామి, 11. శంఖదార స్వామి, 12. నాగభరణస్వామి, 

13. శ్రీహరి స్వామి, 14.పద్మస్వామి, 15. శ్రీస్వామి, 16. శ్రీశబరిగీశ్వరస్వామి (రాతిస్వామి), 17. ఓంకారస్వామి, 18. నారికేళస్వామి.


పద్దెనిమిదిసార్లు_శబరిమలై_వెళ్ళిన_స్వాములు_ప్రతీ_ఏట_శరంగుత్తిలో_వదిలి పెట్టే వస్తువులు - 18.

1. శరము (బాణం), 2. కత్తి, 

3. గంట, 4. గధ, 5. విల్లు (ధనస్సు), 6. జ్యోతి (దీపము), 7. సూర్యుడు, 8. చంద్రుడు, 

9. త్రిశూలము, 10. విష్ణు చక్రము, 11. శంఖం, 12. నాగాభరణం, 13. వేలాయుధం, 14. పద్మము (కమలము), 15. శ్రీ, 16. రాయి, 17. ఓం, 18. కొబ్బరిచెట్టు.


కాళికాదేవి_యొక్క_కరములు - 18.

అమ్మవారి యొక్క కాళికారూపములో ఆమె చేతులు మొత్తము పద్దెనిమిది.


భారతయుద్ధము_జరిగిన_దినములు - 18.

కురుక్షేత్ర సంగ్రామములో పాండవులు, కౌరవులు కలిసి యుద్ధము చేసినది పద్దెనిమిది రోజులు.


కురుపితామహుడు_అంపశయ్యమీద వున్న_దిననములు - 18.


పాండవులకు, కౌరవులకు తాతగారైన భీష్ముడు రణరంగములలో నేలకు ఒరగకుండా అర్జునుడు నిర్మించిన అంపశయ్యపైన ఉన్నది 18 దినములు.


భారత_యుద్ధములో_పాల్గొన్న_అక్షౌహిణులు-18, సుప్రసిద్ధమైన భాషలు కూడా పద్దెనిమిది.


అందువలన ఇంతటి విశిష్టత కలిగిన ఈ పద్దెనిమిది సంఖ్యగల పదునెట్టాంబడిని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారు శబరిమలై దేవాలయములోను, ప్రతీ అయ్యప్ప దేవాలయాలలోను మరియు స్వామివారి పడిపూజలలోను ఇంత విలువ కలిగియున్నది.✍️```

పద్దెనిమిది మెట్ల సోపానాధిపతయే శరణం అయ్యప్ప🙏

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*షష్టాశ్వాసం ద్వితీయ భాగం*

*590 వ రోజు*


*మధు కైటబులు*


ప్రణవధ్వని వచ్చిన దిక్కుకు పరుగెత్తిన మధుకైటభులకు అక్కడ ఎవరూ కనపడక వేదములు పెట్టిన చోటుకు వెళ్ళి చూసి అక్కడ వేదములు కనిపించక పోవడంతో వారికి భయంకరమైన కోపము వచ్చింది. నానారభస చేస్తూ అటూఇటూ తిరుగుతూ ఉండగా యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి వారికి కనిపించాడు. వారు విష్ణువును యుద్ధముకు ఆహ్వానించగా విష్ణువు యుద్ధోన్మాదులైన మధుకైటబులను సంహరించాడు. అలాసృష్టి జరగడానికి సాయం చేసాడు. బ్రహ్మదేవుడు సృష్టిచేయడం ప్రారంభించాడు. అప్పటి నుండి హయగ్రీవుడు అన్ని అవతారముల కంటే మహిమాన్వితుడయ్యాడు. వేదములను రక్షించిన హయగ్రీవుడిని వేదములు సదా ఆశ్రయించి ఉంటాయి. జనమేజయమహారాజా ! హరి త్రిగుణములలో హెచ్చుతగ్గులను కలిగిస్తుంటాడు కనుక మానవులలో కూడా త్రిగుణములు హెచ్చుతగ్గులుగా ఉంటుంది. అందుకే మానవులలో ఒకరు గుణవంతులు మరొకరు గుణరహితులు ఔతారు. మానవులలో త్రిగుణాలకు కారణం అయిన శ్రీహరి త్రిగుణాలను నాశనంచేసే శక్తి ఆయనకే ఉంది. వేదములు, యజ్ఞములు, పుణ్యకార్యములు, పంచభూతములు శ్రీహరి రూపాలే " అని వైశంపాయనుడు చెప్పాడు.


*ఏకాగ్రత*


జనమేజయుడు " మహాత్మా ! ఏకాగ్రచిత్తులు గొప్ప వారు అన్నావు కదా ! అసలు ఏకాగ్రత అంటే ఏమిటి ? " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయా ! పూర్వము శ్రీకృష్ణుడు మీ తాతగారైన అర్జునుడికి భారతయుద్ధ ఆరంభంలో సాంఖ్యము, యోగముల సారము బోధించారు. దానినే భగవద్గీత అంటారు. అది నేను ఎప్పుడో విన్నాను ఇప్పుడు నీకు చెప్తాను శ్రద్ధగా విను. ఏకాగ్రత ధర్మమును పూర్వము నారాయణుడికి ఉపదేశించాడు. దానిని బ్రహ్మ దక్షుడికి ఉపదేశించాడు. దక్షప్రజాపతి తన మనుమడైన సూర్యుడికి ఉపదేశించాడు. సూర్యుడు దానిని మనువుకు ఉపదేశించాడు. మనువు ఇక్ష్వాకుడికి ఉపదేశించాడు. ఇక్ష్వాకుడి నుండి ఆ ఏకాంతిక ధర్మము యోగ్యులైన వారికి పరంపరగా అందజేయబడింది. ఈ ఏకాంతిక ధర్మమును మహావిష్ణువు నుండి ఉపదేశం పొందిన నారదుడు తన శిష్యులకు ఉపదేశించాడు. వారి నుండి వారి శిస్యులకు అలా పరంపరగా సకల జనులకు చేరింది. ఏగాగ్రత ధర్మము దుర్మార్గులకు మాత్రము అవగతము కాదు. ఈ ఏకాగ్రత ధర్మము అహింసకు మూలము. ఈ అహింసా వ్రతముతో శ్రీహరి ప్రీతి చెందుతాడు. హరి అన్నా క్షేత్ర్తజ్ఞుడు అన్నా ఒకటే. శ్రీహరి తన భక్తులకు వాసుదేవాది నాలగు రూపములలో దర్శనం ఇస్తాడు. ఈ నలుగురిలో వాసుదేవుడు ప్రధముడు, రెండవ వాడు సంకర్షుణుడు, మూడవ రూపము ప్రద్యుమ్నుడు, నాల్గవ రూపము అనిరుద్ధుడు. ఎన్ని రూపములలో దర్శనం ఇచ్చినప్పటికీ అంతర్లీనంగా ఉండే రూపము ఒక్కటే. ఆ దైవస్వరూపము మన ఇంద్రియములకు గోచరం కాదు. అనన్య భక్తి, తపస్సు, మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కలవారికి మాత్రమే ఆ దైవస్వరూపము గోచరమౌతుంది. ఏకాంతధర్మము శాంత మనస్కుడికి కరతలామలకం. ఈ ఏకాగ్ర ధర్మము మనలోని అన్ని చింతలను తుడిచి వేయు ఆయుధము " అని వైశంపాయనుడు చెప్పాడు.


*నోములు వ్రతాలు*


జనమేజయుడు" మహాత్మా ! ప్రజలు అత్యున్నతమైన ఏకాగ్రతావ్రతం ఆచరించక ఏవోవో పూజలు నోములు వ్రతాలు ఏ ప్రయోజనాన్ని ఆచరిస్తున్నారు ? వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు " మహారాజా ! మనస్సు త్రిగుణముల వలన ప్రభావితమౌతుంది. అందులో ఉత్తమమైన సాత్వికగుణము కలవారి యోగక్షేమములు శ్రీ మహావిష్ణువే చూసుకుంటాడు. వారే ఏకాగ్రచిత్తం కలిగిన ఏకాంతికులు. వారికి దైవచింత తప్ప వేరే వ్యాపకం లేదు. రాజసము తామసము అవలంబించిన వారు ప్రాపంచిక విషయాలలో మునిగి భోగలాలసలో నిమజ్ఞులై ఉంటారు. అలాంటి వారు శ్రీహరికృపకు పాత్రులు కాలేరు. ఏకాంతికులు ఏకాంతచిత్తంతో సేవించే వారు విష్ణుమూర్తి మనసులో చోటుచేసుకుంటారు. ఈ విషయాన్ని వేదాలు కూడా ఉద్ఘాటిస్తున్నాయి. మా గురువుగారు దయతో నాకు ఉపదేశించిన ఈ ఉపదేశము విని నేను పవిత్రుడనైనాను. జనమేజయా ! నీవు కూడా ఆచరించగలిగిన ఏకాగ్రవ్రతము ఆచరించి ఏకాగ్రతతో శ్రీహరిని ధ్యానించి తరించి శాశ్వతత్వాన్ని పొందు " అని వైశంపాయనుడు. జనమేజయుడు" ఓ మహర్షీ ! లోకములో యోగము, సాంఖ్యము, వేదములు, పాశుపతము, పంచరాత్రము, ఇంకా అనేక సాధనాలు ఉన్నాయి కదా! అన్నిటికీ నిష్టలు ఒకే విధంగా ఉంటాయా ! లేక వేరువేరుగా ఉంటాయా ! అసలు వీటిని ఎవరు ఉపదేశించారు ? " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయమహారాజా ! వేదములకు, సాంఖ్యముకు, యోగముకు, ఇతర శాస్త్రాలకు మూలకర్త శ్రీహరే ! అన్నీ ఆయనను చేరడానికి ఉన్న మార్గాలే ! వేదములను నారాయణ పుత్రుడు అయిన వ్యాసుడి చేత ఉపదేశించబడింది. సాంఖ్యమును కపిలుడు ఉపదేశించాడు, యోగమును హిరణ్యగర్భుడు ఉపదేశించాడు, పాశుపతమును శివుడు ఉపదేశించాడు, వైష్ణవము అను పంచరాత్రమును సాక్షాత్తు విష్ణుమూర్తి చేత ఉపదేశింపబడింది " అని వైశంపాయనుడు చెప్పాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ ఉతర రంగనాథర్ ఆలయం

  🕉 మన గుడి : నెం 1325


⚜  తమిళనాడు : పల్లికొండ - వెల్లూరు


⚜  శ్రీ ఉతర రంగనాథర్ ఆలయం




💠 ఉతర రంగనాథర్ ఆలయం తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని పల్లికొండ గ్రామంలో ఉన్న విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం. 


💠 ఈ ఆలయం పాలార్ నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ స్వామివారిని   రంగనాధ స్వామి అని, అమ్మవారిని రంగనాయకి తాయర్ అని పిలుస్తారు. 


💠 బ్రహ్మదేవుని యజ్ఞానికి భంగం కలిగించడానికి ఉద్దేశించిన వరదను అడ్డుకోవడానికి నారాయణుడు తనను తాను శయన కోలంలో ప్రదర్శించిన మూడు ఆలయాలలో ఇది మొదటిది.


💠 ప్రభువు పాల సముద్రంలో (క్షీర సాగర లేదా పాల కడల్) వలె శయన రూపంలో ఉన్నందున, ఈ నదికి పాలార్ అని పేరు పెట్టారు, అంటే 

పాలార్ అనగ క్షీర నది. 

పల్లికొండ అనగా శయనించిన స్వామి అని అర్ధం. 


💠 బ్రహ్మాండ పురాణము ప్రకారము ఈ క్షేత్రములో ఒక దినము గడిపి స్వామిని పూజించిన మోక్షము లభించునని భక్తుల నమ్మకము. మూడు దినములు కాంచిపురములో గడిపి వరదరాజ స్వామిని పూజించిన మోక్షము కలుగునని నమ్మకము. 



🔆 స్థల పురాణం


💠 శ్రీ మహాలక్ష్మి మరియు సరస్వతిల మధ్య ఒకరిపై మరొకరి ఆధిపత్యం గురించి ఒకసారి చర్చ జరిగి వారివురు బ్రహ్మదేవుని వద్దకు తీర్పుకై వచ్చారు. బ్రహ్మ శ్రీ మహాలక్ష్మి సరస్వతిదేవి కంటే ఉన్నతమైనదని తెలిపెను. 

దాంతో సరస్వతీ దేవి కోపించి బ్రహ్మదేవుడిని విడిచిపెట్టి, నంది దుర్గ కొండలకు వచ్చి ఆధిపత్యం కోసం తపస్సు చేయడం ప్రారంభించింది. 

ఈ సమయంలో, బ్రహ్మ దేవుడు శ్రీమన్నారాయుణుడుకు అంకితం చేయుటకు యజ్ఞాన్ని నిర్వహించాడు. నియమం ప్రకారం, ఈ ఆచారాలను అతని భార్యతో నిర్వహించాలి. 

బ్రహ్మ సరస్వతీ దేవిని తనతో కలిసి యజ్ఞానికి ఆహ్వానించాడు, కానీ ఆమె నిరాకరించింది.


💠 బ్రహ్మ మహా సరస్వతి గుణాలతో సావిత్రిని సృష్టించి, ఆమెను వివాహం చేసుకొని, సరస్వతి దేవికి మరింత కోపం తెప్పించిన యజ్ఞాన్ని ప్రారంభించాడు. 

యజ్ఞాన్ని నాశనం చేయడానికి సరస్వతి దేవి, షీరా నది లేదా పాలార్ నదిగా అవతరించి ఉగ్రంగా ప్రవహించడం ప్రారంభించింది. 

వరదను ఆపమని యజ్ఞాన్ని రక్షించమని బ్రహ్మ శ్రీమన్నారాయణుని ప్రార్థించాడు.


💠 బ్రహ్మ కోరిక మేరకు శ్రీమన్నారాయణుడు జలప్రళయానికి ముందు మూడు పుణ్యక్షేత్రాలలోని ఆదిశేషునిపై దీర్ఘరూపం ధరించి వరదను ఆపి యజ్ఞం విజయవంతంగా ముగించుటకు సహాయపడ్డారు.


💠 మహావిష్ణువు శయన రూపాన్ని పొందిన మొదటి ప్రదేశం ఈ పల్లికొండ క్షేత్రం, దీనిని వడ ఆరంగం అని కూడా పిలుస్తారు, రెండవది కావేరిపక్కం సమీపంలోని తిరుపార్కడల్, మూడవది కాంచీపురంలోని తిరువెక్కా ఆలయం లేదా యథోక్తకారి పెరుమాళ్ (సొణ్ణ వణ్ణం సెయిద పెరుమాళ్).


💠 విదేశీ దండయాత్రల సమయంలో, అసలు ఉత్సవ రంగనాథస్వామి విగ్రహాన్ని దాచిపెట్టి, దాని స్థానంలో కస్తూరి రంగనాథర్ లేదా చొట్ట రంగనాథర్ అని పిలువబడే శ్రీ రంగనాథర్ యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఉంచారు. 

ధండయాత్రలు ముగిసినప్పటికి నేటికినీ ఈ చొట్ట రంగనాథ స్వామికి పూజలు జరుపుతారు. 


💠 సంపతి ఋషి కోరిక మేరకు ఈ క్షేత్రములో స్వామి శెంబగవల్లి తాయారును ఉత్తర పాల్ఘుణి దినమున వివాహము చేసుకొన్నందున ఈ ఆలయములో వివాహములు జరుపుదురు. 

ఇచట వివాహము జరిగిన దంపతుల దాంపత్య జీవితము సుఖ సంతోషాలతో సాగునని భక్తుల నమ్మకము. 


💠 స్థలపురాణము ప్రకారము బ్రహ్మ విష్ణూమూర్తికి అంకితము చేసిన యజ్ఞమును విజయవంతముగా పూర్తి చేసిన తరువాత యజ్ఞ కుండము నుండి కాంచిపురములోని శ్రీ వరదరాజ స్వామి ఉద్భవించారు. ఇప్పటికిని స్వామి తిరుముగముపై కాలిన మచ్చలు కనిపించును. 


💠 ఇచట రంగనాధ స్వామికి బ్రహ్మ పది దినముల ఉత్సవము జరిపెను. ఈ ఉత్సవమును మొదటి బ్రహ్మోత్సవముగా పరిగణించబడినది. ఈ కాలములో అనేక విష్ణు ఆలయములలో బ్రహ్మోత్సవములు జరుపుచున్నారు గాని ఇచట జరిగిన ఉత్సవము బ్రహ్మ జరిపిన మొదటి బ్రహ్మోత్సవమని పరిగణించబడినది. 


💠 ప్రధాన మూలవర్ ఉతర రంగనాధస్వామి భూదేవి, శ్రీదేవి సమేతముగా బ్రహ్మ నాభి స్థానములో శయన కోలములో కలరు. 

స్వామి వారి విగ్రహము శాలగ్రామ శిలతో చేయబడినది. 


💠 ఉత్సవ మూర్తి రంగనాధ స్వామి శ్రీదేవి భూదేవి సమేతముగా వేంచేసియున్నారు. 

వేరొక ఉత్సవ మూర్తి కస్తూరి రంగనాధ స్వామి కూడ ఇచట కలదు. 

ఈ ఉత్సవ మూర్తికి కూడ ప్రతి దినము ఆరాధన జరుగును. అమ్మవారు రంగనాయకి ప్రత్యేక సన్నిధి  భక్తులకు దర్శనము.


💠 ఈ ఆలయములో శ్రీ రాములవారు, నవనీత కృష్ణుడు, ఆండాళ్, ఆంజనేయుడు, రామానుజలవారు, మనవాల మామునిగళ్, కులశేఖర ఆళ్వార్, నమ్మాళ్వార్, గరుడాళ్వార్ సన్నిధులు ఆలయ ప్రాంగణములో కలవు. ఆలయ తీర్ధము వ్యాస తీర్ధము. 


💠 ఏప్రిల్-మే నెలల్లో బ్రహ్మోత్సవం మరియు వైకుంఠ ఏకాదశి ఈ ఆలయంలో చాలా కోలాహలంగా జరుపుకుంటారు. 


💠 ఈ ఆలయం వెల్లూరు నుండి 24 కిలోమీటర్లు, చెన్నై నుండి 159 కిలోమీటర్లు దూరంలో ఉంది. 

ఈ ఆలయం వెల్లూరు నుండి కృష్ణగిరి మార్గంలో ఉంది.


రచన

©️ Santosh Kumar

ఆదివారం,డిసెంబరు.14,2025.

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


ఆదివారం,డిసెంబరు.14,2025.

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

మార్గశిర మాసం - బహుళ పక్షం

తిథి:దశమి రా8.34 వరకు

వారం:ఆదివారం(భానువాసరే)

నక్షత్రం:హస్త ఉ10.59 వరకు

యోగం:సౌభాగ్యం మ2.50 వరకు

కరణం:వణిజ ఉ8.01 వరకు తదుపరి భద్ర రా8.34 వరకు

వర్జ్యం:రా7.37 - 9.21

దుర్ముహూర్తము:సా3.56 - 4.40

అమృతకాలం:తె5.59 నుండి

రాహుకాలం:సా4.30 - 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 -1.30

సూర్యరాశి:వృశ్చికం

చంద్రరాశి:కన్య

సూర్యోదయం: 6.25 సూర్యాస్తమయం:5.24  

*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*,

*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము  - హేమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం - దశమి  - హస్త / చిత్ర -‌‌ భాను వాసరే* (14.12.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పంచాంగం