28, జూన్ 2021, సోమవారం

సహస్ర గాయత్రి జపం

 దశభిః జన్మ జనితం 

శతేనబి పురాకృతం 

త్రిజన్మం  సహస్రేణ 

గాయత్రి హంతి పాతకం 


సహస్ర గాయత్రి జపం చెసిన వారికి ఈ జన్మ పాపములు మాత్రమె కాక గత మూడు జన్మలలొ చెసిన పాపములు తొలగించ బడుతాయి అని శాస్త్ర వచనం . కనుక వీలైనంత వరకు సహస్ర గాయత్రి జపం చెయడానికి ప్రయత్నం చెయండి . కలికాలములొ , చెయనీయకుండా మానడానికి మనకు "వంద "

కారణాలు కనపడుతాయి , చెయడానికి "ఓక్క " కారణం వెతుక్కొండి . యెదీ దొరకనప్పుడు పై శ్లొకం గుర్తు తెచ్చుకొండి ! 

గాయత్ర్యెనమః

శ్రీమద్భాగవతము--పద్యం:

 *28.06.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2183 (౨౧౮౩)*


*10.1-1272-*


*క. "నీ పాదకమల సేవయు*

*నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం*

*తాపార భూతదయయునుఁ*

*దాపసమందార! నాకు దయచేయఁ గదే!"*  🌺



*_భావము: తపస్వులకు కల్పవృక్షమైనట్టి వాడా! నాకు నీ పాదకమలముల యందు అచంచలమైన భక్తి, నీ పాదములను అర్చించే వారి తో స్నేహము (సత్సాంగత్య భాగ్యము), సకల జీవుల యందు  అంతులేని అపరిమితమైన దయను అనుగ్రహించుము._*  🙏



*_Meaning: The flower vendor in his humble prayer appealed to Sri Krishna: ”You are like the KalpaVruksha for the sages, who perform penance. Kindly grant me the opportunity of serving Your Lotus Feet, the companionship of Your ardent devotees and infinite compassion towards the fellow beings.”_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

మంగళసూత్రాల వెనుక ఉన్న రహస్యం

 🎻🌹🙏*రెండు మంగళసూత్రాల వెనుక ఉన్న అద్బుత రహస్యం ఏమిటో తెలుసుకుందాం..!*

  

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


హిందూ వివాహ తంతులో మాంగల్యధారణే అతి ప్రధానమైంది. మాంగల్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతో బాటు వివిధ రూపాలు కూడా ఉన్నాయి. మానవులకు మనువాడటం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం. మంగళసూత్రం లేదా మాంగళ్యం హిందూ సాంప్రదాయంలో పెళ్ళి జరిగిన స్త్రీలు మెడలో ధరించే గొలుసు లాంటి వస్తువు. దీనిలో తాళి లేదా తాళిబొట్టు, కొన్ని నల్ల పూసలు మొదలైనవి గుచ్చుకుంటారు.


వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో ‘మంగళ’ అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలున్నాయి. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు ఉన్నాయి. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రాన్ని పఠిస్తారు.


“ మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!! ”


మంగళ సూత్రం భార్యా భర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడు నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రం ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు. అందుకే హిందూ స్తీ మంగళ సూత్రం ధరిస్తుంది. వివాహిత మెడలో మంగళ సూత్రం లేదంటే భర్త చనిపోయినట్లుగా భావించే వారు అప్పటి కాలంలో… భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రంలో ముత్యం మించిన విలువైంది లేనేలేదు.


దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధం ఉంది. అదేమిటంటే ముత్యం పగడం ధరించిన పాతతరరం స్త్రీలలో ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం. కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్ లేనిదే జరగటం సర్వసాధారణమైపోయింది. ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలోనుండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రాలను ఉత్తేజపరచి శారీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనడంలో ఎటువంటి సందేహం వలదు.


కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం, పగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభ ఫలితాలు సమకూర్చగలదు. మరొక విషయమేమిటంటే శుక్రుడు వివాహకారకుడు మాత్రమే, కాని సంసారిక జీవితాన్ని నడిపేవాడు కుజుడేనన్న మాట మరువకూడదు. అందుకే తొలుతగా కుజ దోషం ఉన్నదా లేదా అని చూస్తారు .ప్రతి స్త్రీ జీవితంలో పైన చెప్పబడిన మూడు గ్రహాలు వాటి స్థితిగతులు బాగుంటే యిక జీవితం ఆనందమయమే అని భావన...సేకరణ...🙏🌹🙏


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

కొయ్యబారిన విష్ణువు

 🔻కొయ్యబారిన విష్ణువు - చమత్కార శ్లోకం*🔻

🚩ఒకాయన ఉత్కళ దేశంలో ఉన్న జగన్నాథుని దర్శించాడట. అక్కడి విగ్రహం చెక్కతో చేయబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడట.

సామాన్యంగా అన్ని దేవాలయాలలో విగ్రహాలు రాతితో గాని, లోహాలతో గాని చేయబడతాయి.

ఆ దారుమూర్తిని చూసిన ఆ కవి మదిలో ఒక చమత్కార శ్లోకం మెరిసింది.

💥శ్లో||

ఏకా భార్యా ప్రకృతిరచలా, చంచలా చ ద్వితీయా

పుత్రోనంగో, త్రిభువన జయీ,మన్మథో దుర్నివారః

శేషశ్శయ్యాప్యు దధి శయనం, వాహనం పన్నగారిః

స్మారం స్మారం స్వగృహచరితం దారు భూతొ మురారి!💥

🚩అదేమంటే, శ్రీ మహా విష్ణువు తన కుటుంబంలోని వారి ప్రవర్తనలను చూసి తట్టుకోలేక కొయ్యబారి పోయాడట.

విష్ణుమూర్తికి ఇద్దరు భార్యలు. ఒకావిడ కదలకుండా ఉండే ప్రకృతి (భూదేవి),

ఇంకొకావిడేమో (లక్ష్మి) ఒకచోట నిలకడగా ఉండకుండా, మనుష్యులను మారుస్తూ తిరుగుతూ ఉంటుందిట.

🚩కొడుకు(మన్మధుడు)ని చూద్దామా అంటే, ఎంతో దుర్మార్గుడని అందరితో తిట్లు తింటూ ఉంటాడు. అందరినీ బాధిస్తూ ఉంటాడు. వాడు బలంగా ఉన్నాడా అంటే, అసలు శరీరమే లేదు.

🚩ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుందామనుకుంటే, తాను నడుము వాల్చేది ఒక పెద్ద పాము మీద, ఆదేమో మెత్తగా ఉంటుంది. ఎంత సేపూ బుసలు కొడుతూనే ఉంటుంది. ఒక తలా ఏమన్నానా, వెయ్యి తలలాయె. ఒక దాని తర్వాత ఇంకొక తల బుసలు కొడుతూనే ఉంటాయి.

🚩ఆ పాముు ఉండేది పాలసముద్రం మధ్యలో. అన్నీ అలలే, హోరున శబ్దం. ఒక అల అటు వైపు నుండి కొడితే, ఇంకొకటి యిటు వైపు నుండి కొడుతుంది.

🚩పోనీ వాహనమెక్కి బయటికి పోదామా అంటే, అది ఒక పెద్ద గ్రద్ద, పైన ఎగురుతూ పోతూ ఉంటే, క్రింద పాము కనబడితే చాలు, తన యజమాని పని మర్చిపోయి, గబుక్కున క్రిందికి దిగి, ఆ పామును కాళ్లతో పట్టుకొని తినే వరకు కదలదు.

🚩ఇవన్నీ తలుచుకొని తలుచుకొని శ్రీ మహా విష్ణువు కొయ్యబారి పోయాడట!💥

✍🏿కవుల మనసులో ఏది మెరిస్తే దానిని చెప్పేస్తారు, చమత్కారంగా.😀

కర్మ ఫలం

 *కర్మ ఫలం తప్పదు*


🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺


🙏అందర్నీ హెచ్చరించే మంచి వ్యాసం. అందరూ చదవాలని మనవి 🙏


*కర్మఫలం ఎవరికైనా అనుభవించక తప్పదు*.

మన పాపకర్మే  గ్రహరూపంలో వచ్చి బాధిస్తుంది. ఎందుకంటే? కర్మ బలీయమైనది.


పరీక్షిత్తు మహారాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు. 

కశ్యపుడనే బ్రాహ్మణోత్తముడు గొప్ప మంత్రవేత్త. రాజును సంరక్షింప, రాజప్రాసాదానికి బయలుదేరాడు. దారిలో ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు.


తక్షకుడు కూడా బ్రహ్మణ వేషధారియై, కశ్యపుని చూసి మహాత్మా! తమరెవరు? ఎచ్చటికీ పయనం? అని అడిగాడు.

 ఏదో బీద బ్రాహ్మణుడిని. రాజుగారు ఏనుగెత్తు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే, నా మంత్రమహిమ వినియోగించే అవకాశం వచ్చింది కదా అని సంబరపడుతున్నాను అంటూ దాపరికం లేకుండా అసలు విషయం చెప్పేశాడు.


అమాయక బ్రాహ్మణుడా! పరీక్షిన్మహరాజుని కాటూవేయబోయేది ఏదో నీటిపామో, బురద పామో అనుకుంటున్నావా? సర్పరాజు వాసుకితో సమానుడైన ఇంకొక సర్పాధిపుడు తక్షకుడే స్వయంగా అయితేనో? అన్నాడు.


తక్షకుడైనా కానిమ్ము! అతడ్ని మించిన ఆదిశేషుడైనా కానిమ్ము! నా దగ్గర ఉన్నది గారడీవాడి పాముమంత్రమో, విషకీటక మంత్రమో అనుకుంటున్నావా? అని ప్రశ్నించాడు కశ్యపుడు.


అంత గొప్పవాడివా! నేనే ఆ తక్షకుడ్ని అని నిజరూపం చూపించాడు తక్షకుడు. 


అంతటా కశ్యపుడు, సర్పరాజా! నీకిదే నా ప్రణతి! దీనితోపాటే నా వినతి కూడా విను! మంత్రాధిష్ఠాన దైవానుగ్రహం వల్ల నువ్వు రాజును కాటువేసినా గాని, దాన్ని విరిచెయ్యగల మంత్రాన్ని అనుష్ఠించిన వాడను! తక్షణం విషహరమంత్రం ప్రయోగించి, ప్రభువును రక్షించి బహుమానం పొందగలను. ఇది నా దృఢవిశ్వాసం అని  అన్నాడా కశ్యపుడు.


అపుడా తక్షకుడు, తమ ఆత్మవిశ్వాసం కడు శ్లాఘనీయమే! భూసురోత్తమా! ఈ మర్రి చెట్టునుచూడు! దీని ఊడలు ఏవో, మొదలు ఏదో తెలియరానంత దట్టంగా ఉంది కదా! లెక్కపెట్టడానికి సాధ్యం కానన్ని పక్షులకిది ఆలవాలమై కూడా ఉంది. దీన్ని ఉన్నదున్నట్లుగా బూడిద చెయ్యగల నా విషశక్తి చూడు! అని ఆ చెట్టును కసితీరా కాటువేశాడు తక్షకుడు. 


కశ్యపుడు అదంతా చిరునవ్వుతో చూస్తున్నాడు. తక్షకుడు చెప్పినదాంట్లో ఆవగింజంతయినా అబద్ధంలేదు.  ఆ మహా విషకీలలకు, చెట్టు నిలువునా మాడి బూడిదైపోవడం కళ్లారా గాంచి, అయింది కదా తక్షకా! ఇప్పుడు చూడు! అని పిడికెడు బూడిదను ఆ భస్మరాశి నుంచి తీసుకుని, అత్యంత శ్రద్ధా భక్తులతో అధిష్ఠాన మంత్రజపం చేసి అభిమంత్రించి 

ఆ బూడిదను కుప్పపై పోసి జలం సంప్రోక్షించి విడిచినాడు. 


చిత్రాతిచిత్రంగా మొత్తం సకల పక్షిగణ సహితంగా ఆ మహావృక్షం ఎప్పటిలాగానే అక్కడ నిలబడింది. అతడు సామాన్యుడు కాడని సర్పరాజుకి అర్థమైంది. 


వెంటనే తక్షకుడు ఆయన చేతులు పట్టుకుని మహామంత్రద్రష్టా! తమను తక్కువగా అంచనా వేసినాను, నా అజ్ఞానాన్ని మన్నించండి! తమకు తెలుసో... లేదో, నిజానికి పరీక్షిత్తు శాపరూపాన మృత్యుదేవుని సదనానికి వెళ్లవలసిన విధి ఉంది. లేకుంటే, అంతటి ధర్మమూర్తికి సహజ మరణం సమీపించడం ఇప్పట్లో దుర్లభం. త్వరలో కలిప్రవేశం జరగబోతోంది. అప్పటికి జనమేజయుడు రాజుగా ఉండాలంటే, తక్షణం పరీక్షీతుని అంకం పరిసమాప్తం కావాలి! ఇది విధాత కృతమే గాని, పరీక్షిత్తుకు సహజంగా జనించిన వికృతం కానేకాదు. 


ఇంతకూ తమకు కావలసింది.... అని తక్షకుడు మాట పూర్తి చేసేలోగా ధనమయ్యా! ధనం! అన్నాడు. అంతేకదా! ఈ విలువైన నాగమణులు తీసుకోండి! ఇంకా వజ్ర వైఢూర్యాలు మీపరం చేస్తాను అని అప్పటికప్పుడే పాతాళ నిధుల్లోని విలువైనవి కశ్యపునికి బహుకరించి పంపివేసినాడు.


*ఇంతవరకూ కథ బాగుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినది చాలా వున్నది.*


*మన తలరాత బాగా లేకపోతే సహాయం చేసే వాళ్లు దరిదాపులలో కూడా కనిపించరు.*

ఓక వేళ కశ్యపుడు లాంటివాడు బయలుదేరినా వారిని ప్రక్కకు తప్పిస్తుంది కాలం. 

అదే మనం చేసుకొన్న పాపం,కర్మఫలం.

*పాపకర్మ బలీయంగా వుంటే ఎవ్వరూ సహాయం చేయలేరు, ఆఖరికి భగవంతుడు కూడా*.


ఎందుకంటే వాడి కర్మ కలిసిరావాలి. 

కౌశికుడు రాజును రక్షించుదామని బయలుదేరినా,  పరీక్షిన్మహారాజు యొక్క పాపకర్మ అడ్డు పడినది.

ఏమిటి ఆ పాప కర్మ?  

ఓక ముని మీద చచ్చిన పామును వేయడం. 

*మంచివారితో మహాత్ములతో చెలగాడటం*.

కోరి కోరి తన మృత్యువును అహంకారంతో కొని తెచ్చుకొన్నాడు.


రాజు, మునిశాపం వలనో, తక్షకుడి కాటు వలనో చనిపోలేదు, *కేవలం తన కర్మ చేతనే చనిపోయినాడు.*

 

పరీక్షిత్తు మహారాజుకు, గ్రహముల వలన కీడు జరగలేదు. ఇక్కడ తక్షకుడు ఎంత నిమిత్తమాత్రుడో, అదే విధముగా గ్రహములు కూడా! *మానవునికి, కర్మ ఫలము నొసగడంలో గ్రహముల యొక్క ప్రమేయం వుంటుంది*. 


మన పాపములు గ్రహముల రూపములో మనల్ని కర్మఫలం అనుభవింప జేస్తాయి.

నిజానికి ఏ గ్రహమూ మనల్ని ఏమీ చేయదు.

*మన పాపకర్మే గ్రహరూపంలో వచ్చి బాధిస్తుంది*.

కర్మ బలీయమైనది.

దశమస్కంధము



*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము -  డెబ్బది నాలుగవ అధ్యాయము*


*శ్రీకృష్ణభగవానుని అగ్రపూజ శిశుపాలుని ఉద్ధారము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*


*74.1 (ప్రథమ శ్లోకము)*


*ఏవం యుధిష్ఠిరో రాజా జరాసంధవధం విభోః|*


*కృష్ణస్య చానుభావం తం శ్రుత్వా ప్రీతస్తమబ్రవీత్॥11356॥*


*శ్రీశుకుడు నుడివెను* పరీక్షిన్మహారాజా! మహారాజైన యుధిష్ఠిరుడు జరాసంధునివధను, అనంతశక్తిమంతుడైన కృష్ణప్రభువుయొక్క అద్భుత మహత్త్వమును గుఱించియు మిగుల సంతసించి నుడివెను-


*యుధిష్ఠిర ఉవాచ*


*74.2 (రెండవ శ్లోకము)*


*యే స్యుస్త్రైలోక్యగురవః సర్వే లోకమహేశ్వరాః|*


*వహంతి దుర్లభం లబ్ధ్వా   శిరసైవానుశాసనమ్॥11357॥*


*యుధిష్ఠిరుడు ఇట్లనెను* "పురుషోత్తమా! ముల్లోకములకును అధిపతులైన బ్రహ్మ, శంకరాదులు, ఇంద్రాదిలోకపాలురు దుర్లభమైన నీ ఆదేశము కొఱకు నిరీక్షించుచుందురు. నీ ఆజ్ఞను పొందిన పిమ్మట వారు దానిని శిరసా వహింతురు.


*74.3 (మూడవ శ్లోకము)*


*స భవానరవిందాక్షో దీనానామీశమానినామ్|*


*ధత్తేఽనుశాసనం భూమంస్తదత్యంతవిడంబనమ్॥11358॥*


లోకపూజ్యుడవైన ఓ కమలాక్షా! వాస్తవముగా మేము దీనులము అయ్యును, మహారాజులనుగా తలంచుకొనుచున్నాము. నీవు సర్వశక్తిమంతుడవేయైనను సామాన్యమానవునివలె మా ఆజ్ఞలను మన్నించుచు వాటిని పాలించుచుందువు.


*74.4 (నాలుగవ శ్లోకము)*


*న హ్యేకస్యాద్వితీయస్య బ్రహ్మణః పరమాత్మనః|*


*కర్మభిర్వర్ధతే తేజో హ్రసతే చ యథా రవేః॥11359॥*


పరమాత్మా! నీవు సజాతీయ విజాతీయ స్వగతభేదరహితుడవు. స్వయముగా పరబ్రహ్మవు. ఉదయాస్తమయములలో సూర్యుని తేజస్సు ఎట్టి మార్పును పొందక ఒకేరీతిగా నుండునట్లు ప్రాకృతములైన శత్రుజయాదికర్మలచేత నీ ప్రభావము పెరుగదు, తరుగదు.


*74.5 (ఐదవ శ్లోకము)*


*న వై తేఽజిత భక్తానాం మమాహమితి మాధవ|*


*త్వం తవేతి చ నానాధీః పశూనామివ వైకృతా॥11360॥*


మాధవా! 'నేను, నాది, నీవు, నీది' అను భేద భావములు అనగా అహంకారమమకార వికారములు పశుతుల్యులైన అజ్ఞానులలో ఉండునుగాని, నీ అనన్య (పరమ) భక్తులలో ఉండవు. ఇంక జగద్విజేతవైన నీలో ఎట్లుండును? కనుక నీవు చేయునవి అన్నియును నీ దివ్యలీలలే"


*శ్రీశుక ఉవాచ*


*74.6 (ఆరవ శ్లోకము)*


*ఇత్యుక్త్వా యజ్ఞియే కాలే వవ్రే యుక్తాన్ స ఋత్విజః|*


*కృష్ణానుమోదితః పార్థో బ్రాహ్మణాన్ బ్రహ్మవాదినః॥11361॥*


*శ్రీశుకుడు వచించెను* రాజా! ఇట్లు పలికిన పిమ్మట ధర్మరాజు శ్రీకృష్ణునియొక్క ఆమోదముతో రాజసూయ యాగమును ప్రారంభించుటకు అనువగు వసంతఋతువునందు యజ్ఞకర్మలయందు నిపుణులైన వేదవేత్తలగు బ్రాహ్మణులను, ఋత్విజులను ఆచార్యులనుగా ఎన్నుకొనెను(ఆహ్వానించెను).


*74.7 (ఏడవ శ్లోకము)*


*ద్వైపాయనో భరద్వాజః సుమంతుర్గౌతమోఽసితః|*


*వసిష్ఠశ్చ్యవనః కణ్వో మైత్రేయః కవషస్త్రితః॥11362॥*


*74.8 (ఎనిమిదవ శ్లోకము)*


*విశ్వామిత్రో వామదేవః సుమతిర్జైమినిః క్రతుః |*


*పైలః పరాశరో గర్గో వైశంపాయన ఏవ చ॥11363॥*


*74.9 (తొమ్మిదవ శ్లోకము)*


*అథర్వా కశ్యపో ధౌమ్యో రామో భార్గవ ఆసురిః|*


*వీతిహోత్రో మధుచ్ఛందా వీరసేనోఽకృతవ్రణః॥11364॥*


పిమ్మట యుధిష్ఠిరుని ఆహ్వానమపై యజ్ఞనిర్వహణమునకై వ్యాసమహర్షి, భరద్వాజుడు, సుమంతుడు, గౌతముడు, అసితుడు, వసిష్ఠుడు, చ్యవనుడు, కణ్వుడు, మైత్రేయుడు, కవషుడు, త్రితుడు, విశ్వామిత్రుడు, వామదేవుడు, సుమతి, జైమిని, క్రతువు, పైలుడు, పరాశరుడు, గర్గుడు, వైశంపాయనుడు, అథర్వుడు, కశ్యపుడు, దౌమ్యుడు, పరశురాముడు, శుక్రాచార్యుడు, అసురి, వీతిహోత్రుడు, మధుచ్ఛందుడు, వీరసేనుడు, అకృతవ్రణుడు మొదలగువారు విచ్చేసిరి.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి డెబ్బది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

never cry for employment*

 *Muslims never cry for employment*


At the same time, they do not commit *suicide* due to unemployment


Whereas the children of *Hindus* cry for *employment*


What is the reason?

 read below 👇


*A Hindu boy met me and said- Brother, I am unemployed, I am not getting a job anywhere, I am very upset. You tell me, Modi ji had said that he will give employment to millions of youth every year, it is going to be seven years, we got nothing.*


I asked him a few questions and all the questions were answered as follows...


Can you be a tailor?

No!


Work at beauty parlour?

No!


So become a barber?

No!


Do the work of halwai?

No!


Do carpenter work?

No!


Will you do the work of blacksmith?

No!


Work on a lathe machine?

No!


Can you do welding?

No!


Do graphic design work? No!


Do the work of scrap? No!


Do vegetable or fruit business? Nope!


Bike repairing? come on!

No!


Do the accounts work?

No!


Can you do plumbing work? Nope.


Will you work for farming, gardening? No!


Will you make a puncture? No!


Work in a hotel or restaurant? No!


Canyou repair fan, AC, geyser, cooler, washing machine? No!


Can work at a clothing store? No!


Can work at a grocery store? No!


Know of sewing or tailoring work? No!


Will you sell Pan Masala Gutkha? No!


Can you do wages? Nope!


Then I asked what work do you know?


*He said, I am educated, I am BA pass. All these works are not for me, I just want a job of a government clerk. Otherwise I will not even get married. Despite being educated, I am not getting any work.*


He said that Modi ji has made many youths like us unemployed.


I've been upset since then.


These are the people whom even Modi can't help. Today's youth consider abusing the government a better option, than working hard. 


*I said you don't know how to do any work, there is lack of people who work, not of work, work is scattered all around, and Muslim boys are snatching them. You people are just waiting for a government or a job worth 10-15 thousand. You are crying for employment and cursing Modi. Muslim boys are taking advantage of Modi's "Skill India" and Hindu boys are waiting for government or non-government jobs.*


Educate your children and make them skilled.


Never think of *what people will say?* or *what people will think?* are the most dangerous sentences, that ruins us!


*Teach children that no work is small. Dhirubhai Ambani had previously worked at petrol pumps, and in the beginning he had done the business of buying and selling old clothes.*


If he was waiting for a government job, he would have become a clerk / manager in a government department, and Reliance company would not have been formed.


When Atal Bihari Vajpayee ji took the bus to Pakistan, film actor Devanand also went with him, and Devanand who could not get his degree certificate, at the time of fleeing from Pakistan,  was given to him, he said that, 


"Today, I am what I am, due to this missed degree certificate."


"My brother was getting me a clerk job in Navy, and I did not get that because of this missed certificate. In the beginning, I was disappointed, still, I struggled and today I am at this stage. If I had this degree at that time, I would have died as a navy clerk, and today no one would recognized me!!"


*Teach children skills*


We should also give attention to the children of our society to learn some *skills* apart from education.


When every person in the society has some *skill* only then problem of *unemployment* will be solved.




*Share this message to Hindu relatives*

*Someone sent it, felt right*

*Worth thinking about*

*Hail India* 

😳👍🇮🇳

రిక్తహస్తేన నోపేయాత్


అగ్నిహోత్రం గృహం క్షేత్రం 

గర్భిణీ వృద్ధబాలకాన్౹

రిక్తహస్తేన నోపేయాత్ 

రాజానం దైవతం గురుమ్౹౹


భావం:- యజ్ఞయాగాదులు జరిగే స్థలాలకు వెళ్ళినపుడు, పర్యటన ముగించుకుని తన ఇంటికి వెళ్ళినపుడు, యాత్రాస్థలాలైన క్షేత్రాలకు వెళ్ళేటపుడు, గర్భిణీస్త్రీలను, వృద్ధులను, పిల్లలను చూడ్డానికి వెళ్ళినపుడు, అలాగే రాజదర్శనం, దైవదర్శనం, గురుదర్శనం కోసం వెళ్ళేటపుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు.

అరుణ ప్రశ్న

 అరుణ ప్రశ్న ఋగ్వేదంలో శక్తిని దాని వ్యాప్త మును సూత్ర పరంగా తెలుపు చున్నది. అదే రుద్ర రూపమని రుద్ర శక్తి వ్యాప్తంగా తెలియుట. అగ్ని మన దేహములో చైతన్య పరచుటకు ఏ సూత్రం ఆధారమగునో ఆ ఆధార సూత్రము యఙ్ఞమే. దీనికి అరుణ మనే ఋగ్వేద ప్రశ్న సవివరంగా తెలుపు చున్నది. అణు భద్రాం దిశాం వరః, అణు వర్ణే భూమిః, ఋగ్వుషాం వసుః,(ఋక్కు లక్షణము ఉష రూపంలో కాంతి రూపంలో)వసుః భూమికి,తాం యఙ్ఞ్యస సర్వాం నవ యజామహే. యజామహే నవా సర్వాం తాం యఙ్ఞం.ఏదైతే నిత్య నూతనమైన ప్రకృతిని జీవం గలిగి యుండుటయే యఙ్ఞం. అనగా నిత్య నూతనంగా పూర్ణ శక్తి ఎప్పుడూ వకే రీతిలో వుండుట, మార్పుయనే లక్షణము లేకుండా. యత్ జా, యేదైతే జీవ వ్యాప్తంగా లక్షణము గల జీవము, దేహము, మహా యనే పూర్ణ శక్తి.అగ్ని  హవిస్సు రూపంగా కూడియున్న తత్వమును మహా యని అది తెలియుట పదార్ధ రూప ఙ్ఞానము యనగా దేహము. అది అంతకు ముందు లేదు ఇప్పుడు మార్పువలన వున్నదని తెలిసినది. అదియును పూర్తిగా తెలియలేదు. మహా, మహే గా మారు ప్రక్రియ. మూడవ ప్రక్రియ మహీ పదార్ధ రూపం. మూడవ రూపం వలననే పదార్ధ రూపమైన దేహము. శక్తికి మూడు సూత్రముల ద్వారా వ్యాప్తి. మహా మెుదటి సూత్రం మహే రెండవ సూత్రం. మహీ మూడవ సూత్రం. మూడవ సూత్రం క్షేత్రము. భూమి ద్వారా దాని వసుః లక్షణము వాసనల ద్వారా అనగా గుణముల వలన తెలియుట. అంతకు ముందు రెండు సూత్రములవలన తెలియలేదు. కాని వాటి తత్వమును మూడవ సూత్రం ద్వారా నిరూపణ. దీని తత్వము శివ శక్తి. అణువు భద్రమై ప్రకాశించు ధాతు లక్షణమై, నలు దిశలయందుండు వ్యాప్తి చెందిన కాంతి రూపము ,వర్ణ లక్షణంగా, పరిణామ రూపంలో సూక్మంగా మారిన వాసనల రూపం క్షేత్రం. అది భూమిగానీ, దేహం గాని. దీనిని తాం యఙ్ఞ్యస సర్వాం నవ యజామహే. మన దేహము కూడా తల్లి దండ్రుల యఙ్ఞ క్రియయే. వకే కుటుంబమునకు మాత్రమే పరిమితి యఙ్ఞం అనే దేహం.యఙ్ఞం సర్వవ్యాప్తమైన ప్రకృతి రక్షణకు, ప్రకృతి రక్షణ పరమార్ధం సర్వ జీవ వ్యాప్త లక్షణము.అనంతమైన ఙ్ఞానము.మనం చేసే కర్మలు స్వార్ధ మునకు కాకుండా సర్వ జీవ రక్షణకని తెలిసి చేయుట ఙ్ఞానం. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

భగవంతుని సూచన

 *ఇంద్రియ నియంత్రణ ... భగవంతుని సూచన..*

 

శరీరం ఇల్లు అని నవరంధ్రాలు నవ ద్వారాలని చెపుతూ భగవంతుడు మన శరీరాన్ని నిర్మించేటప్పుడు బేసి సంఖ్యలో ద్వారాలు పెట్టి వాస్తు పాడు చేసాడని  దానికి పరిష్కారము ఏమిటనేది ఇంతకు ముందు చర్చించాము. అందులో "భగవంతుడు నిర్లక్ష్యంగా చేశాడా కావాలనే అలా చేశాడో తెలీదు". అని రాసాను. అది హాస్యం కోసం వ్రాసినది.


ఈ నవరంధ్రాల ఈ విషయంలో వాస్తు అనేది పెద్ద విషయమే కాదు. ఈ శరీరాన్ని ఇల్లు అని మనమే అనుకోవడం. నవరంధ్రాల ను ద్వారాలు అని మనమే అనుకోవడం.   అలా అనుకున్న తర్వాత అందులో వాస్తు తప్పింది అనుకోవడం అన్నీ మన ఊహలే. భగవంతునికి సంబంధం లేదు.


ఈ నవరంధ్రాల విషయంలో సరైన విమర్శ వేరే ఉన్నది. తొమ్మిది రంధ్రాలు ఎనిమిది పనులు లెక్క తేలుతాయి. మలవిసర్జన కు ఒకటి. దాని విషయంలో పేచీ లేదు.


వాసన చూడడం బయటి శబ్దాలు వినడం బయటి దృశ్యాలు చూడడం ఈ మూడు పనులకు ఆరు రంధ్రాలు ఏర్పా టయ్యాయి. రెండు ముక్కులు రెండు చెవులు రెండు కళ్ళు.


నోటికి భోజనం చేయడం మాట్లాడడం రెండు పనులు. అలాగే సంతానమూ మూత్రం వదిలి పెట్టడమూ రెండు పనులూ ఒకే చోట ఉన్నాయి. 


ఒకే పనికి రెండు రంధ్రాలు రెండు పనులకు ఒకే రంధ్రము ఎందుకు. ఒక్కో పనికి ఒక్కో రంధ్రం పెడితే ఇంకా ఒకటి మిగులుతుంది కదా. ఇలా ఎగుడు దిగుడు గా పెట్టడం పొరపాటు  అనేది ఆ విమర్శ. 


ఒకే పనికి రెండు రంధ్రాలు :: ఒక చెవి  ఉంటే శబ్దం ఎటు నుంచి వస్తుందో తెలియదు. ఒక కన్ను ఉంటే దూరంగా ఉన్న వస్తువులు ఏది ముందు ఉన్నదో ఏది వెనక ఉన్నదో తెలీదు. ముక్కు కూడా అంతే. మనం దాన్ని అంత సరిగా ఉపయోగించు కోము.  వాసన పసిగట్టే జంతువులు రెండు ముక్కులను సరిగా వాడు  కుంటాయి. అవి రెండు రెండు ఉండడం మన సౌకర్యం కోసమే.


ఇక మిగిలింది ఒకే రంధ్రానికి రెండు పనులు పెట్టడం. ఇది పైకి తప్పు లాగా కనిపిస్తుంది. దీన్ని లోతుగా పరిశీలిస్తే దాని అంతరార్థం తెలుస్తుంది. ఈ విషయంలో భగవంతుడు మనుషులకు ఒక సూచన చాలా నర్మగర్భంగా చేస్తున్నాడు. ఆ సూచన ఏమిటో తెలియడానికి ఆ రెండు రెండు పనులలో ప్రాధాన్యతను నిర్ణయించాలి. 


మనిషి మాట్లాడకుండా ఎన్ని రోజులైనా ఉండవచ్చు భోజనం చేయకుండా అలా ఉండలేడు. మాటలు రాని జీవులు ఆహారం తింటూ హాయిగా బతుకుతున్నాయి. కాబట్టి నోటికి ఉన్న రెండు పనులలో ఒకటి ప్రధానం రెండవది అప్రధానం. ఇలాగే తరువాతి  విషయంలో కూడా.  సంతానము కామము ఇవి లేకున్నా చాలాకాలం  బతకొచ్చు. అందువల్ల ఆ పని అప్రధానమైనది. మూత్ర విసర్జన చాలా అవసరము. దానికి ఏదన్న అడ్డు తగిలితే గంటా రెండు గంటల్లో మరణిస్తాము. కాబట్టి ఏది ప్రాధాన్యము ఏది అప్రాధాన్యము ఇప్పుడు తెలుసు కున్నాము. 


ఇందులో భగవంతుడి సూచన ఏమిటంటే :: "జీవితానికి ప్రధానమైనవి  ముఖ్యమైనవి అయిన పనులు చేసుకోండి. జీవితానికి అప్రధానమైనవి అవసరం లేనివి మానుకోండి కనీసం తగ్గించుకోండి. " మనం మన మధ్యలో మామూలుగా మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే "ఎక్సట్రాలు చెయ్యవద్దు" అని భగవంతుడు చెబుతున్నా డన్న మాట.


ఇలా చెప్పడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. మనిషి ఉన్నతికి ఇంద్రియ నిగ్రహం చాలా అవసరము. 


*ఇంద్రియాల లోకెల్లా అత్యంతంగా కొంప ముంచేవి  రెండే రెండు. అవి వాక్కు ఉపస్తు. కింది శ్లోకంలో రెండో పాదం చూడండి.*


*ఇంద్రియాణాం హి సర్వేషాం*

*వాగుపస్తౌ మహాబలౌ*

*తయార్జయస్తు సిద్ధ శ్చేత్*

*కో న ము త్చ్యేత బంధనాత్.*


అవి రెండూ గెలిచిన మనిషి మిగతా ఇంద్రియాలను సులభంగా గెలవగలడు. అట్లాంటి వాడు సులభంగా అన్ని బంధనాల నుంచి విముక్తుడు అవుతాడు అని అర్థము.


వాక్కు మీద నియంత్రణ మౌనానికి దారి తీస్తుంది. ముని యొక్క ముఖ్య లక్షణం మౌనం. ( మౌనం అనే పదం అసలు ముని అనే పదం నుంచి వచ్చింది). కామవాంచ మీద నియంత్రణ బ్రహ్మచర్యానికి దారి తీస్తుంది. అది బ్రహ్మచారి  లక్షణం. బ్రహ్మచర్యం అంటే స్త్రీ పురుష సంబంధమైన కామము ఒకటే కాదు. మనసును బ్రహ్మ యందు లగ్నం చేసి మిగతా అన్ని విషయాలను వదిలిపెట్టి ఉండడం. కామవాంచ మీద నియంత్రణ అనేది దానికి మొదటి మెట్టు మాత్రమే. 


*ఇంకో మాటలో చెప్పాలంటే ఈ అప్రధానమైన రెండు విషయాల మీద సరైన నియంత్రణ ఉంటే మనిషి ముందు ముని తరవాత బ్రహ్మచారి (బ్రహ్మజ్ఞాని) అవుతాడు. మనలనందరినీ అలా అవమని భగవంతుడు చెబుతున్నాడు...* 


ఇంద్రియాలను కల్పించే టప్పుడే వాటి నియంత్రణ మార్గాలను కూడా భగవంతుడు మనకు సూచనగా అందులోనే ఉంచి పెట్టాడు. ఆ సూచన కనిపెట్టి దానికి తగినట్టుగా నడుచుకోవడము మన బాధ్యత.


*పవని నాగ ప్రదీప్.*

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*సాధన..సందేహ నివృత్తి..*


శ్రీ స్వామివారు సాధన చేసుకునే సమయంలో..ఆశ్రమం ప్రధాన గదిలో తన సాధన కోసం ప్రత్యేకంగా త్రవ్వించుకున్న నేలమాళిగ లోపల కూర్చుని, దానిమీద ఒక చెక్క పలకను మూతగా పెట్టుకొని..ధ్యానం చేసుకునేవారు..


నేను, అమ్మా నాన్న గార్లతో శ్రీ స్వామివారు దాదాపు వారం  రోజులపాటు తీవ్ర ధ్యానం లో ఉండిపోయారనీ..ఆహారం కూడా తీసుకోలేదనీ చెప్పిన తరువాత..అమ్మా నాన్న శ్రీ స్వామివారి గురించి ఆందోళన చెందారు..లోపల ఊపిరాడుతుందా?..స్వామివారికి ఏ ఆపదా కలుగదు కదా?..కనుక్కుందాము అని అమ్మా నాన్న గార్లకు తోచింది..ఒకసారి ఆశ్రమానికి వెళ్లి, ఆయనతో నేరుగా మాట్లాడి తెలుసుకుందామని అనుకుని..గూడు బండి సిద్ధం చేయించుకొని ఉదయం తొమ్మిది గంటలకల్లా ఆశ్రమానికి చేసురుకున్నారు..ప్రహరీ దాటి లోపలికి అడుగు బెట్టేసరికి.. శ్రీ స్వామివారు బావి వద్ద నిలబడి..సూర్యనికి నమస్కారం చేసుకుంటున్నారు..ఒక్క రెండు మూడు నిమిషాల లోనే వీళ్ళిద్దరిని చూసి..సంతోషంతో నవ్వుతూ..


"అమ్మా!..మీరిద్దరూ మనసులో తల్లడిల్లిపోతున్నారా?..నాకు ఆ జగన్మాత ఆశీస్సులు ఉన్నంతవరకూ ఏ ఆపదా రాదు..మాలాటి అవధూతలకు ఇటువంటి కఠోర సాధన అవసరం..దానిని మేము చేసి తీరాలి..మోక్షానికి దగ్గర మార్గాలు లేవు!..మనసును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి..సరే..మీరిద్దరూ సందేహంతో ఇక్కడిదాకా వచ్చారు..ఆ సందేహాన్ని నివృత్తి చేస్తాను..నాతో రండి.." అన్నారు..


అత్యంత ఆశ్చర్యం తో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ..తాము ఎందుకోసం వచ్చిందీ ముందుగానే చెప్పేసారు శ్రీ స్వామివారు..ఇక తమ ఇద్దరికీ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు..స్వామివారి వెనకాలే ప్రధాన గది వద్దకు వెళ్లారు..


"శ్రీధరరావు గారూ..నేను ఈ క్రింద ఉన్న గది లోపలికి వెళ్లి కూర్చుంటాను..మీరు పైన ఆ చెక్క పలకతో మూసివేసి..ఒక ప్రక్కగా కూర్చోండి..తరువాత మీకు అన్నీ అవగతం అవుతాయి..సరేనా?.." అని చెప్పి..శ్రీ స్వామివారు లోపలికి దిగి పద్మాసనం వేసుకొని కూర్చున్నారు..నాన్న గారు ప్రక్కనే ఉన్న చెక్క పలకను ఆ నేలమాళిగ పైన మూతగా పెట్టి..ఆ గదిలోనే ఒక మూలనున్న చాప పరచుకొని దానిమీద అమ్మ తో సహా కూర్చున్నారు..


సుమారు ఓ పదిహేను ఇరవై నిమిషాల తరువాత..అమ్మా నాన్న గార్లకు ఏదో మైకం లాగా వచ్చేసింది..తమకు తెలీకుండానే నిద్రలోకి జారిపోయారు..ఆ గదిలోనే చాప మీద వాలిపోయారు.. గంట..రెండు గంటలు..ఇలా కాలం గడిచిపోతోంది.. ఉదయం తొమ్మిది, తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో గదిలోకి వెళ్లిన మా తల్లిదండ్రులకు మెలకువ వచ్చేసిరికి..సమయం చూసుకుంటే..సాయంత్రం నాలుగు దాటుతోంది..ఒక్కసారిగా ఇద్దరికీ గుండె గుభేల్ మంది..


దాదాపు ఏడు గంటల పాటు తాము దిక్కుతెలీనంత గా నిద్రపోయారు.. తమ ఒళ్ళు తమకు తెలీదు..క్రింద నేలమాళిగ లో కూర్చున్న ఆ స్వామివారు ఎలా ఉన్నారో?..ఏమిటో?..అనుకుంటూ..గబ గబా లేచి చాప చుట్టి పక్కన పెట్టి..నేలమాళిగ పైన మూతగా పెట్టిన చెక్క పలకను తొలగించి.."స్వామీ..స్వామీ!.." అంటూ మా నాన్నగారూ.." నాయనా!..నాయనా!." అంటూ అమ్మా పిలిచారు ఆతృతగా..


అరవవద్దు అన్నట్లు చేతితో సైగ చేస్తూ..శ్రీ స్వామివారు లేచి నిలబడ్డారు.. తన రెండుచేతులు ఆసరాగా పెట్టుకుని..ఆ గోతిలాంటి గది నుంచి ఒక్క ఉదుటున బైటకు వచ్చారు..శ్రీ స్వామివారిని చూసిన తరువాత గానీ వీళ్ళిద్దరికీ ఆత్రుత తగ్గలేదు..


కానీ..చిత్రం..కనీసం గాలికూడా చొరబడని ఆ చిన్న గోతి లాంటి గదిలో దాదాపు ఏడు గంటల పైగా ధ్యానం లో ఉన్న శ్రీ స్వామివారి శరీరం పై ఒక్క చెమట బిందువు లేదు..ఉదయం ఎంత స్వచ్ఛంగా ఉన్నారో..ఇప్పుడూ అంతే స్వచ్ఛతతో..చిరునవ్వుతో..వున్నారు..ఆ ముఖం లో దేదీప్యమైన కాంతి కనబడుతోంది..అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరించారు..


శ్రీ స్వామివారు చప్పున..నమస్కరించవద్దన్నట్లు వీరిని వారించి.."అమ్మా..మీ ఇద్దరి సందేహమూ తీరిపోయిందా?..ఇది సాధనలో ఒక భాగం అమ్మా..అవధూత సంప్రదాయం లో ఇటువంటి తీవ్ర సాధన కూడా ఒక భాగం..ఆ సాధన సక్రమంగా చేస్తే..అణిమాధ్యష్ట సిద్ధులూ వశం అవుతాయి..కానీ వాటిని సక్రమంగా సమాజహితానికి వాడుకోవాలి..అప్పుడే ఆ సాధనకు ఫలితం..స్వార్ధానికి ఉపయోగిస్తే..తాత్కాలిక భోగాలు లభించి..చివరకు పతనం అవుతారు.."


"శిరిడీ లోని సాయిబాబా..అరుణాచలం లోని శ్రీ రమణులు ఉత్తమ సాధకులకు అత్యుత్తమ ఉదాహరణలు..వారు తమను తాము తరింపచేసుకొని..తమతో పాటు ఈ సమాజానికి మార్గదర్శనం చేసారు.. ప్రస్తుతం శ్రీ పరమాచార్య వారూ వారి పంథాలో వారు జాతిని ఉద్ధరిస్తున్నారు..


(శ్రీ స్వామివారు ఈ మాటలు చెప్పేనాటికి అంటే..1974 సంవత్సర ప్రాంతంలో..మన ఆంధ్రప్రాంతంలో కొంతమందికి మాత్రమే శిరిడీ లో ప్రకటమైన శ్రీ సాయిబాబా గురించి అవగాహన ఉన్నది..నేటి లాగా విపరీత ప్రాచుర్యం లేదు..అలాగే శ్రీ రమణమహర్షి గురించి కూడా..కానీ..శ్రీ స్వామివారు ఆ ఇద్దరినీ ఉదహరించారు..అవధూత లు "ద్రష్ట" లు అనడానికి..వారికి కుల, మత, జాతి విబేధాలు లేవు అనడానికి..ఇదొక నిదర్శనం..)


"శ్రీధరరావు గారూ తపస్సులో అనేక మార్గాలున్నాయి..ఒక్కొక్కరిదీ ఒక్కొక్క పంథా..మీరు నా గురించి ఏ విషయం లోనూ చింత పడవద్దు..అన్నీ సక్రమంగా జరిగిపోతాయి..అమ్మా!..ఏ నిమిషంలో మీకు సందేహం వచ్చినా..నిరభ్యంతరంగా నా వద్దకు రండి..ఇప్పటికే కాలాతీతమైనది..వెళ్ళిరండి!.." అన్నారు..


అమ్మా నాన్న ఇద్దరూ శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకొని బైట ఉన్న తమ బండి వద్దకు వచ్చారు..చిత్రం..అప్పటికి కూడా బండి తోలే మనిషి..నిద్ర లోనే వున్నాడు..ఎద్దులు కూడా జోగుతున్నాయి..వీళ్ళు లేపేదాకా ఆ పనివాడు లెయ్యలేదు.."మొద్దు నిద్ర పట్టింది స్వామీ!..ఎప్పుడూ ఎరగను!..ఎద్దులకు నీళ్లు కూడా పెట్టలేదు.."అంటూ ఎద్దులను అదిలించి..బండి సిద్ధం చేసాడు.. శ్రీ స్వామివారు తమకోసం చూపిన ఈ చిత్కళ ను తలుచుకొని మనసులోనే నమస్కరించి ఇంటికి చేరారు..ఇంటికి వచ్చిన తరువాత తాము పొందిన అనుభవాన్ని మాతో చెప్పుకొని..అదే విషయాన్ని పదే పదే తలచుకొన్నారు..


శ్రీ స్వామివారితో నా సంభాషణ రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114...సెల్..94402 66380 & 99089 73699).