21, మే 2022, శనివారం

హెయిర్ ఫాల్ గురించి

      చాలామంది మిత్రులు గత కొంతకాలం నుంచి హెయిర్ ఫాల్ గురించి బాధపడుతూ నన్ను అడుగుతూ ఉన్నారు . వారికి అప్పటికప్పుడు కొన్ని తాత్కాలిక పరిష్కారాలు చెప్తూ ఉన్నాను. కాని అవి శాశ్వతంగా పరిష్కారం చూపలేకపోయేవి . మార్కెట్లో దొరికే వివిధ రకాల ఆయిల్స్ వాడి విసిగిపోయిన వారికోసం ఒక కేశతైలం తయారుచేసాను. దానితో పాటు పూర్తి ఒక షాంపూ కూడా తయారుచేశాను. 


        ఈ రెండు పూర్తి ప్రకృతిసిధ్ధ వనమూలికలతో 

తయారుచేయబడినవి. ఇది అత్యంత ప్రాచీన గ్రంధాలననుసరించి 12 రకాల మూలికలు కలిపి  ప్రాచీనపద్ధతులను అనుసరించి తయారుచేశాను. 


  కేశవృద్ధితైలం ఉపయోగాలు - 


 *  వెంట్రుకలు రాలిపోవడం ఆపుతుంది.


 *  బరకగా ఉన్న వెంట్రుకలను మృదువుగా మారుస్తుంది. 


 *  వెంట్రుకల మందాన్ని పెంచుతుంది. 


 *  వెంట్రుకల కుదుళ్లకు బలాన్ని చేకూర్చడమే కాకుండగా వెంట్రుకలు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.


 *  తలలోని వేడిని తీసివేస్తుంది. తలలోని వేడివల్ల వచ్చే తలనొప్పిని నివారిస్తుంది.


 *  తలకు చల్లదనాన్ని ఇస్తుంది.


  హెర్బల్ షాంపు ఉపయోగాలు  - 


  *  చుండ్రుని శాశ్వతంగా పోగొడుతుంది.


  *  వెంట్రుకలకు అమితమైన బలాన్ని ఇస్తుంది. 


  *  వెంట్రుకలు చిట్లడం  ఆపుతుంది. 


     ఈ రెండిటి కాంబినేషన్ గతకొంతకాలంగా కొంతమంది మీద ప్రయోగించి చూసాను. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మీ అందరికి అందుబాటులో తీసుకుని వస్తున్నాను. 


       నా అనుభవంతో చెప్తున్నాను ఇది తప్పకుండా వెంట్రుకల సమస్యలపైనా బ్రహ్మస్త్రంలా పనిచేస్తుంది. అతి తక్కువకాలంలోనే మీ వెంట్రుకల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుంది.

 

  

  ఈ తైలం ఒక ప్రాచీన ఫార్ములాతో తయారుచేయబడినది. దీనిని వాడటం వలన సైడ్ అఫక్ట్స్ వంటివి ఉండవు. నిర్భయంగా వాడవచ్చు . ఇది పూర్తిగా 100% శుద్ధ ఆయుర్వేద మూలికలతో తయారుచేయబడినది. షాంపు కూడా పూర్తి ఆయుర్వేద మూలికలతో రూపొందించబడినది. చుండ్రు సమస్యతో ఇబ్బందిపడేవారు ఈ షాంపు వాడటం వలన చుండ్రుసమస్య నుంచి బయటపడగలరు.


   ఈ షాంపు మరియు తైలం కావలిసిన వారు 9885030034  నెంబర్ నందు సంప్రదించగలరు .


గమనిక  - 


      రెండు నుంచి మూడు నెలలపాటు ఆపకుండా వాడటం వలన ఇంకా గొప్ప ఫలితాలు చూడగలరు . వేడి నీటితో తలస్నానం నిషిద్ధం . 


                 కాళహస్తి వెంకటేశ్వరరావు 


                  అనువంశిక ఆయుర్వేదం 


                       9885030034

పాంచాలరాజు సాయుజ్యము*

 _*శనివారం మే 21, 2022*_


    _*🚩వైశాఖ పురాణం🚩*_

 🌴 *21 వ అధ్యాయము*🌴


🕉🍁🕉️🍁🕉️🍁🕉️🍁


*పాంచాలరాజు సాయుజ్యము*


☘☘☘☘☘☘☘☘


నారదుడంబరీషునితో తరువాతి వృత్తాంతము నిట్లు చెప్పసాగెను. శ్రుతదేవమహాముని శ్రుతకీర్తి మహారాజుతో నిట్లనెను.


పాంచాలరాజు శ్రీహరిని జూచి సంతోషపడినవాడై వెంటనే లేచి శ్రీహరికి  నమస్కరించెను. ఆనంద బాష్పములను విడుచుచుండెను. సర్వజగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్రజలమును తనపై జల్లుకొనెను. విలువైన వస్త్రములు ఆభరణములు , గంధ పుష్పాదులు , పుష్పమాలలు , ధూపములు , అమృతప్రాయములగు నివేదనలు , తన శరీరము , తన ధనము , తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను. ప్రాచీన పురుషుడు నిర్గుణుడు సాటిలేనివాడునగు శ్రీమహావిష్ణువును యిట్లు స్తుతించెను.


నిరంజనం విశ్వసృజామధీశం వందేపరం పద్మభవాదివందితం |

యన్మాయయా తత్త్వవిదుత్తమాజనాః విమోహితావిశ్వసృజామధీశ్వరం || 1

ముహ్యంతిమాయా చరితేషు మూఢా గుణేషు చిత్రం భగవద్విచేష్టితం |

అనీహఏతద్ బహుధైక ఆత్మనా సృజ త్యవత్యత్తిన సజ్జతేప్యధ || 2

సమస్తదేవాసుర సౌఖ్య దుఃఖ ప్రాప్త్యై భవాన్ పూర్ణమనోరథోపి |

తత్రాపికాలే స్వజనాభిగుప్త్యైబిభర్షిసత్త్వం ఖలనిగ్రహాయ || 3

తమోగుణం రాక్షస బంధనాయ రజోగుణం నిర్గుణ విస్వమూర్తే |

దిష్ట్యాదంఘ్రిః ప్రణతాఘనాశన స్తీర్దాస్పదంహృదిధృతః సువిపక్వయోగైః || 4

ఉత్సిక్త భక్త్యుపహృతాశయ జీవభావాః ప్రాపుర్గతింతవ పదస్మృతిమాత్రతోయే |

భవాఖ్యకాలోరగపాశబంధః పునఃపునర్జన్మజరాది దుఃఖైః || 5

భ్రమామి యోనిష్వహమాఖు భక్ష్యవత్ ప్రవృద్ధతర్షస్తవ పాదవిస్మృతేః |

నూనం న దత్తం న చతే కధాశ్రుతా నసాధవో జాతు మయాసిసేవితాః || 6

తేనారి భిర్ద్యస్త పరార్ధ్య లక్ష్మీర్వనం ప్రవిష్టః స్వహరూహ్యగుం స్మరన్ |

స్మతౌ చ తౌమాంసముపేత్య దుఃఖాత్ సంబోధయాం చక్రతురార్త బంధూ || 7

వైశాఖధర్మ్రైః శ్రుతిచోదితైః శుభైః స్వర్గాపవర్గాది పుమర్ధహేతుభిః |

తద్భోధతో హంకృతవాన్ సమస్తాన్ శుభావహాన్ మాధవమాసధర్మాన్ || 8

తస్మాదభూన్మేపరమః ప్రసాదః తేనాఖిలాః సంపద ఊర్జితా ఇమాః |

నాగ్నిర్నసూర్యోన చ చంద్రతారకా నభూర్జలంఖంశ్వసనో ధవాఙ్మనః || 9

ఉపాసితాస్తేపి హరంత్యఘంచిరాద్విపశ్చితో ఘ్నంతి ముహూర్త సేవయా |

యన్మన్యసేత్వంభవితాపి భూరిశఃత్యక్తేషణాన్ త్వద్పదన్యస్తచిత్తాన్ || 10

నమస్స్వతంత్రాయ విచిత్రకర్మణే నమః పరస్మై సదనుగ్రహాయ |

తన్మాయయోమోహితోహం గుణేషు దారార్థరూపేషు భ్రమ్యామ్యనర్ధదృక్ || 11

త్వద్పాద పద్మే సతిమూలనాశనే సమస్త పాపాపహరే సునిర్మలే |

సుఖేచ్ఛయానర్ధ నిదాన భూతైః సుతాత్మదారైర్మమతాభియుక్తః || 12

నక్వాపినిద్రాంలభతే న శర్మప్రవృద్దతర్షః పునరేవతస్మిన్ |

లబ్ద్వాదురాపం నరదేవజన్మత్వం యత్నతః సర్వపుమర్ధహేతుః || 13

పదారవిందం న భజామి దేవ సమ్మూఢ చేతావిషయేషు లాలసః |

కరోమి కర్మాణి సునిష్ఠితః సన్ ప్రవృద్ధతర్షః తదపేక్షయాదద్ || 14

పునశ్చభూయామహమద్యభూయామిత్యేన చింతాశత లోలమానసః |

తదైవ జీవస్య భవేత్కృపావిభో దురంతశక్తేస్తవ విశ్వమూర్తే || 15

సమాగమః స్యాన్మహతాంహి పుంసాం భవాంబుధిర్యేనహి గోష్పదాయతే |

సత్సంగమోదేవయదైవ భూయాత్తర్హీశదేవేత్వయిజాయతేమతిః || 16

సమస్త రాజ్యాపగమహిమన్యేహ్యనుగ్రహం తేమయి జాత మంజసా |

యధార్ధ్యతే బ్రహ్మసురాసురాద్యైః నివృత్త తర్షైరపిహంసయూధైః || 17

ఇతః స్మరామ్యచ్యుతమేవ సాదరం భవాపహం పాదసరోరుహం విభో |

అకించన ప్రార్ధ్యమమందభాగ్యదం నకామయేన్యత్తవ పాదపద్మాత్ || 18

అతోన రాజ్యం నసుతాదికోశం దేహేన శశ్వత్పతతారజోభువా |

భజామినిత్యం తదుపాసితవ్యం పాదారవిందం ముని భిర్విచింత్యం || 19

ప్రసీదదేవేశ జగన్నివాస స్మృతిర్యధాస్యాత్తవ పాదపద్మే |

సక్తిస్సదాగచ్ఛతు దారకోశ పుత్రాత్మచిహ్నేషు గణేషు మే ప్రభో || 20

భూయాన్మనః కృష్ణ పదారవిందయోః వచాంసితే దివ్యకధానువర్ణనే |

నేత్రేమమేతేతన విగ్రహేక్షణే శ్రోత్రేకధాయాం రసనాత్వదర్పితే || 21

ఘ్రూణంచత్వత్పాద సరోజ సౌరభే త్వద్భక్త గంధాది విలేపనే సకృత్ |

స్యాతాంచ హస్తౌ తవమందిరేవిభో సమ్మర్జనాదౌ మమనిత్యదైవ || 22

కామశ్చమే స్యాత్తవసత్కధాయాంబుద్ధిశ్చమే స్యాత్తవచింతనేనిశం |

దినానిమేస్యుస్తవ సత్కధోదయైః ఉద్గీయమానైః మునిభిర్గృహా గతైః || 23

హీనః ప్రసంగస్తవమేనభూయాత్ క్షణం నిమేషార్థ మధాపి విష్ణో |

న పారమేష్ఠ్యం న చ సార్వభౌమం న చాపవర్గం స్పృహయామి విష్ణో || 24

త్వత్పాదసేవాంచ సదైవకామయే ప్రార్ద్యాంశ్రియా బ్రహ్మభవాదిభిః సురైః || 25

అని స్తుతించెను.


పాంచాలరాజు చేసిన ఈ స్తుతి అర్ధవంతము శక్తిమంతమునగుటచే దీనికి భావము వ్రాయబడుచున్నది. మనమందరమును పాంచాలరాజువలె పూర్వ కర్మననుసరించి ఉన్నదానిని పోగొట్టుకొని గురువు పెద్దల వలన తరణోపాయము నెరిగి పాటించిన పాంచాలరాజు వలెనే కష్టములను దాటి సర్వసుఖములనంది పాంచాలరాజువలె భగవంతుని దర్శనమును పొందగోరువారమే కదా ! అందుకని యీ స్తోత్రమునకు భావము చదివినచో వేలాది పాఠకులలో నొకరైన భగవంతుని దర్శనానుగ్రహమును పొందవచ్చునేమోయని తలచి భావమునిచ్చుచున్నాము. సహృదయతతో భక్తులు దీనిని ఉపయోగించకొనగలరు. 24 తత్త్వములు పరమేశ్వరుడు / శ్రీహరి ఒకడు మొత్తము 25 సంఖ్యకు వచ్చిన శ్లోకములున్న యీ స్తోత్త్రము సాభిప్రాయమైనదే.


*1 .  స్వామీ ! నీవు దేనియందును ఆసక్తుడవుకావు ఏదియు అంటనివాడవు. సృష్టికర్తలకు అధిపతివి. పరాత్పరుడవు. నీమాయకులోబడిన తత్త్వవేత్తలును సృష్టికర్తలనెరుగు విషయమున అజ్ఞానవంతులగుచున్నారు.*


*2 . తత్త్వవిదులును మాయాచరితములైన గుణములయందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్టనెరుగ లేకున్నారు. కోరిక లేని ప్రభువా ! దీనినంతయు సృష్టించిన వాడవు నీవొక్కడవే. ఈ ప్రపంచము సృష్టించినవాడవు , రక్షించువాడవు. నశింపజెయువాడవును నీవొక్కడవే.*


*3. స్వామీ ! నీవు కోరికలన్నియు తీరినవాడవు అయినను దేవాసురులకు సుఖదుఃఖములను కలిగించుటకై సత్వగుణమునంది శిష్టరక్షణకు అవతరించుచున్నావు.*


*4. తమోగుణమున దుష్టులను శిక్షింతువు. రజోగుణమున రాక్షసుల నిగ్రహించు చున్నావు. దైవవశమున నీ పాదము నమస్కరించి వారి పాపములను పోగొట్టును. హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకమును కలిగించి తీర్థమగుచున్నది.*


*5. స్వామీ ! గర్వము - భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము / పుట్టుక అను కాలసర్పము బంధనమునకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుచున్నారు.*


*6. నేనును ఇట్టివాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలసిన పిల్లివలె నీ పాదభక్తిని మరచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచుంటిని. ఏమియు దానము చేయలేదు. నీ కథలను వినలేదు. ఉత్తముల సేవయును చేయలేదు.*


*7. ఇందువలన శత్రువులు నా రాజ్యము  నాక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించితిని. ఆర్తబంధువులగువారు నా యొద్దకు వచ్చి తమ ప్రభోధములచే నా దుఃఖమును పోగొట్టిరి.*


*8. ధర్మార్థకామమోక్షములను , స్వర్గమును కలిగించు వైశాఖవ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములగు వైశాఖధర్మముల నాచరించితిని.*


*9. అందువలన నాకు సర్వోత్తమమగు శ్రీహరియనుగ్రహము కలిగినది. అందువలన ఉత్తమ సంపదలు అధికములుగ నొనగూడినవి. అగ్ని , సూర్యుడు , చంద్రుడు , నక్షత్రములు , భూమి , నీరు , ఆకాశము , వాయువు , మాట , మనస్సు మున్నగువానిని సేవింపలేదు.*


*10. నేను వైశాఖవ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించితిని. సూర్యాదులనుపాసింపలేదు. అవి యన్నియు స్థిరములు కావు. అన్నిటిని ఈషణత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్తకాలము సేవించినను కోరినది సిద్ధించును.*


*11. స్వామీ ! నీవు స్వతంత్రుడవు. ఎవరికిని లోబడినవాడవు కావు. విచిత్రమైన కర్మలను చేయుదువు. అందరికంటె ఉత్తముడవు. ఇట్టి నీకు నమస్కారము. నేను నీ మాయకు  లోబడి భార్యాపుత్రులు రాజ్యము మున్నగు పనికిమాలిన వాని యందాసక్తుడనైతిని.*


*12. మొట్టమొదటి కర్మ దోషమును పోగొట్టి సర్వపాపములను హరించునట్టి నిర్మలమగు నీ పాదపద్మములుండగా నేను సుఖము కావలయుననుకొని మమకారమునకు లోబడి అనర్థమునే కలిగించు భార్యమున్నగు కోరికలచే పీడింపబడితిని.*


*13. స్వామీ ! ఎచటను సుఖనిద్రలేదు , శుభములేదు , సుఖాభిలాష పెరుగుచున్నది. దుర్లభమగు మానవజన్మనెత్తియు నీవే సర్వపురుషార్థకారణమని యెరుగజాలకపోతిని.*


*14. నీ మహిమనెరుగజాలని సుఖాసక్తుడనగు నేను నీ పాదపద్మములను సేవింపజాలక మూఢచిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమియును యెవరికిని ఇచ్చుటలేదు.*


*15. స్వామీ ! ప్రభూ ! పరమాత్మయగు నీ సేవను మరల మరల చేయవలయుననియున్నను చేయలేకున్నను. కాని నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తిమంతుడవగు నీ దయ మాయందు ప్రసరించును.*


*16. సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగరభయంకరమైన సంసారము గోవుపాదమంత చిన్నది అగును. అంతేకాడు దైవమగునీయందు భక్తి భావము కలుగును.*


*17. ప్రభూ ! ఈ రాజ్యమంతయు పోవుట మంచిదేయని అనుకొనుచున్నాను. బ్రహ్మాది దేవతలు నిరీహులగు మునులు పొందగలిగిన నీయనుగ్రహమును పొందు అవకాశము కలిగినది.*


*18. స్వామీ ! అచ్యుతా ! నీపాదపద్మమునే విడువక స్మరింతును. నీ పాదములు దీనులును ప్రార్థింపదగినవి. అనంతభాగ్యము నిచ్చునవి. కావున నీ పాదపద్మములను తప్ప మరొకదానిని స్మరింపను.*


*19. కావున రాజ్యము , పుత్రులు మున్నగు వానిని ధనమును , అశాశ్వతమగు దేహమును కోరెను. మునులంతటివారును కోరదగిన నీ పాదముల సేవనే కోరుదును.*


*20. జగన్నాధా ! ప్రసన్నుడవగుము. నీ పాదపద్మస్మృతి నన్ను విడువకుండ చూడుము. నీ పాదములయందు ఆసక్తియు , భార్యాపుత్రాదులయందనాసక్తియు కలుగజేయుము.*


*21. ప్రభూ ! నా మనస్సు శ్రీకృష్ణ పాదారవిందముల యందుండుగాక. నా మాటలు శ్రీకృష్ణకధాను వర్ణనమున ప్రవర్తించుగాక. నా యీ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక. నాయీ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక. నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక.*


*22. నా ముక్కు నీ పాదపద్మగంధమునే వాసన జూచుగాక. నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక ! స్వామీ ! నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులను చేయుగాక. నా పాదములు నీ క్షేత్రములున్నచోటకు , నీ కథలు చెప్పుచోటకు మాత్రమే వెళ్లుగాక. నాశిరమున నీకై నమస్కారము నిమగ్నమగు గాక.*


*23. నీ కథలను వినుటయందే నాకు కామము , కోరికలు కలుగుగాక. నా బుద్ది నీ చింతనమునందాసక్తమగుగాక.*


*24. నీ కథలను తలచుకొనుటతో దినములు నాకు గడచుగాక. నీ ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడచుగాక. నీ ప్రసంగములేని క్షణమైనను గడువకుండు గాక.*


*25. ప్రభూ ! బ్రహ్మపదవి అక్కరలేదు. చక్రవర్తిత్వము కలదు. మోక్షమును కోరును. నీ పాదసేవను మాత్రము కోరుదును. నీ పాదసేవను లక్ష్మీదేవి బ్రహ్మ మున్నగు వారు కోరుదురు. కాని వారికి నీ పాద సేవ సులభముకాదు. వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రము కోరుదును అనుగ్రహింపుము.*


ఇట్లు పాంచాలరాజుచే స్తుతింపబడిన శ్రీమన్నారాయణుడు వచ్చిన పద్మముల వలెనన్న కన్నులతో ప్రసన్నుడై వానిని జూచుచు మేఘ గంభీరస్వరముతో నిట్లనెను. నాయనా నీవు నా భక్తుడవని కోరికలు కల్మషములేనివాడవని నేనెరుగుదును. అందుచే దేవతలకును పొందరాని వరమును నీకిత్తును. పదివేల సంవత్సరముల దీర్ఘాయువునందుము. సర్వసంపదలను పొందుము. నీకు నాయందు నిశ్చలమైన భక్తియుండును. తుదకు ముక్తినందుదువు. నీవు చేసిన ఈ స్తుతితో నన్ను స్తోత్రము చేసినవారికి సంతుష్టుడనై భుక్తిని ముక్తిని ఇత్తును. సందేహములేదు. నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినము అక్షయతృతీయాతిధి సార్ధకనామమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములగు భుక్తి ముక్తుల నక్షయముగ నిత్తును. భక్తిపూర్వకముగ గాకున్నను బలవంతము వలననో మొగమాటమువలననో ఏదోయొక కారణమున వైశాఖస్నానాదికమును చేసినవారికిని భుక్తిని , ముక్తిని ఇత్తును. ఈ అక్షయతృతీయయందు పితృదేవతలకు శ్రాద్దమును నిర్వహించినచో వారికి వంశవృద్ది అనంతపుణ్యము నిత్తును. ఈ అక్షయతృతీయాతిధి మిక్కిలి యుత్తమమైనది. దీనికి సాటియైన తిధిలేదు. ఈనాడు చేసిన సత్కార్యము పూజ దానము అల్పములైనను అక్షయఫలములనిచ్చును. కుటుంబముకల బ్రాహ్మణునకు గోదానమునిచ్చినచో వానికి సర్వసంపదలను వర్షించి ముక్తి నిత్తును. సమస్త పాపములను పొగొట్టు వృషభదానమును చేసినవానికి అకాలమృత్యువేకాదు , కాలమృత్యువును కూడ పోగొట్టి దీర్గాయుర్దాయము నిత్తును. వైశాఖవ్రతమును దాన ధర్మములను యధాశక్తిగ చేసినవారికి జన్మ , జరా , మృత్యు , వ్యాధి , భయములను , సర్వపాపములను పోగొట్టుదును. వైశాఖమున చేసిన పూజ దానము మున్నగువాని వలన సంతోషించినట్లుగ నితరమాసములందు చేసిన పూజాదికమునకు సంతోషపడను. వైశాఖమాసమునకు మాధవమాసమని పేరు. దీనిని బట్టి నాకీ మాసమెంత ఇష్టమైనదో గ్రహింపవచ్చును. అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖవ్రతము నాచరించినచో నేను వారికి ప్రీతుడనై వరములనిత్తును.


వైశాఖవ్రతమును దానాదులను ఆచరించినవారు తపస్సులకు , సాంఖ్యయోగములకు , యజ్ఞయాగములకు సాధ్యముకాని నా సాన్నిధ్యమును చేరుదురు. ప్రాయశ్చిత్తమే లేని వేలకొలది మహాపాపములు చేసినవారైనను వైశాఖవ్రతము నాచరించిన పాపక్షయమును అనంత పుణ్యము నిత్తును. నా పాదస్మరణచే వారిని రక్షింతును.


పాంచాలమహారాజా ! నీ గురువులు చెప్పిన దానిని అడవిలో నున్నను భక్తి శ్రద్దలతో నాచరించి నాకు ప్రీతిపాత్రుడవైతివి. కావుననే ప్రసన్నుడనై నీకు ప్రత్యక్షమైతిని. నీకనేక వరములనిచ్చితిని అని పలికి శ్రీహరి అందరును చూచుచుండగనే అంతర్ధానమందెను. పాంచాలరాజును శ్రీహరి యనుగ్రహమునకు మిక్కిలి యానందమునందెను. శ్రీహరి యందు నిశ్చలభక్తియుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలము ధర్మపూర్ణమున రాజ్యమును పాలించెను. శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమింపలేదు. గౌరవింపలేదు. భార్యాపుత్రాదులకంటె శ్రీమన్నారాయణుడే తనకు కావలసినవాడని నమ్మి సేవించెను. భార్యాపుత్రులు , పౌత్రులు , బంధువులు పరివారము అందరితో గలసి వైశాఖవ్రతమును దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించెను. చిరకాలము సర్వసుఖభోగములనంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.


ఉత్తమమైన ఈ కథను విన్నను వినిపించినను సర్వపాపవిముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విధముగ నారదుడు అంబరీషునకు వైశాఖమహిమను వివరించుచు చెప్పెను.


*వైశాఖ పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం*


           🌷 *సేకరణ*🌷

         🌹🌷🍁🍁🌷🌹

                *న్యాయపతి*

             *నరసింహా రావు*


🙏🍁🙏🍁🙏🛕🙏🍁🙏🍁🙏

తమిళనాడు

 తమిళనాడు పి. చిదంబరానికి అవమానం*

 రఘురామ్ రాజన్ తనపై చేసిన ఫిర్యాదుపై నిన్న ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక *పి.  చిదంబరం* షోను సగంలోనే రద్దు చేసి వెళ్లిపోయారు.

 *రిపోర్టర్:*

 మీరు భారత రూపాయి ముద్రణ యంత్రాన్ని పాకిస్థాన్‌కు విక్రయించారని RBI మాజీ గవర్నర్ *రఘురామ్ రాజన్* మీకు ఫిర్యాదు చేశారా?

 *చిదంబరం*

 అది నిజం.  యంత్రం యొక్క జీవితకాలం ముగియడంతో మేము దానిని వేలం వేయడానికి టెండర్ చేసాము.  పాకిస్థానీ కంపెనీ కరణ్ పెద్ద నమ్మకమైన కంపెనీ అని  మేము నమ్మాం.

 *రిపోర్టర్*:

 మన భారత రూపాయి నోట్లు పాకిస్థాన్‌లో నకిలీవని తెలిసి కూడా మీరు ఆ యంత్రాన్ని పాకిస్థాన్‌కు విక్రయించడం సరైనదేనా?

 *చిదంబరం*

 నేను ఊహల ఆధారంగా ప్రశ్నలకు సమాధానం చెప్పలేను.  పాకిస్థాన్ మంచి దేశం

 *రిపోర్టర్*

 500, 1000 రూపాయల నోట్లలో 99 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చేశాయని రిజర్వ్ బ్యాంక్ చెబుతుండగా, కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే పాత రూపాయి నోట్లను చెల్లుబాటు చేస్తామని మీరు చెప్పారు.  అలాంటప్పుడు గవర్నర్ చెప్పినట్లు మీరు పాకిస్థాన్‌లో రూ.5 లక్షల కోట్లు దాచిపెట్టింది నిజమేనా?

 *చిదంబరం*

 కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.

 నువ్వేం చేశావో చూడు అని కోపంగా లేచి వెళ్లిపోయాడు.  షో సగంలో అగిపోయింది.

 తమిళనాడు నుండి షేర్ చేయబడింది

______________

 కరెన్సీ సంక్షోభం సమయంలో మొత్తం 15 లక్షల కోట్ల 500, 1000 రూపాయల నోట్లను నిషేధించారు.  అవన్నీ తిరిగి వచ్చాయని అబద్ధం చెప్పారు.  కానీ వాస్తవానికి 10 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయి.

ఎందుకు అబద్ధం చెప్పారంటే, మిగిలిన 5 లక్షల కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయి, వారి తదుపరి ఎత్తుగడ ఏంటనేది ట్రాక్ చేయడమే.

 ఈ వాస్తవం వెలుగులోకి వచ్చినప్పుడే కేంద్ర ప్రభుత్వానికి, నాకు మధ్య విభేదాల ధోరణి మోడల్ డ్రామాకు కారణమైంది మరియు నేను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవికి రాజీనామా చేసాను.

 మొత్తం డబ్బు ఎక్కడుందో కనుక్కున్నాను.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవన్నీ చెల్లుబాటవుతాయి.

 అదొక్కటే కాదు.  నాసిక్ నుండి భారత డబ్బును ముద్రించే యంత్రాన్ని పాక్ ఉగ్రవాదులు కేంద్ర మాజీ మంత్రి *పి ద్వారా పొందారు.  చిదంబరం.*

 * పి.  దీనికి ఒక్క చిదంబరమే 10 కోట్ల రూపాయల బహుమతిని అందుకుంది.

 *ఈ యంత్రంతో పాకిస్థాన్‌లోని దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల భారత కరెన్సీని అక్రమంగా భారత్‌లోకి తరలించాలని ప్లాన్ చేశారు.  నాకు రహస్య సమాచారం వచ్చింది.  ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లి చెప్పాను.  వెంటనే 500, 1000 రూపాయల నోట్లు చెల్లవని ప్రకటించారు.  ఎవ్వరూ ఊహించలేనంత వేగం ఆయనది.

 ఆ 8 లక్షల కోట్ల రూపాయలు దేశంలోకి చొరబడి ఉంటే ఈసారి సోమాలియాగా మారిపోయేది.

 దేశం వెలుపల మొత్తం రూ.13 లక్షల కోట్ల నకిలీ కరెన్సీ సిద్ధంగా ఉంది.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ దేశంలోకి వస్తుంది.  దేశం పతనం అవుతుంది.

హనుమజ్జయంతి

 ॐ హనుమజ్జయంతి ప్రత్యేకం - 2

       (ఈ నెల 25వ తేదీ హనుమజ్జయంతి) 

  

2. హనుమ - వాయు పుత్రుడు.  


    రావణ వధకై, బ్రహ్మాది దేవతల ప్రార్థనకు స్పందించి, 

    విష్ణువు - దశరథుని తండ్రిగా చేసికోవడానికి ఇష్టపడ్డాడు. 

    అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరితో 

    "అవతరించే విష్ణువుకు సహాయకులుగా ఉండుటకై బలవంతులూ కామరూపులూ అయి, మీ మీ శక్తులు కలిగియుండేలాగు పుత్రులను సృజింపుడు" అన్నాడు. 

   "ఎలుగుబంటులలో శ్రేష్థుడైన జాంబవంతుని తాను చాల క్రితమే సృజించాను" అని కూడా అన్నాడు. 


    అప్పుడు 

1, ఇంద్రుని వల్ల - వాలి,

2. సూర్యుని వలన - సుగ్రీవుడు, 

3. బృహస్పతి వల్ల - తారుడు, 

4. కుబేరుని వలన - గంధమాదనుడు, 

5. విశ్వకర్మ వలన - నలుడు, 

6, అగ్నీ వలన - నీలుడు, 

7, అశ్వినీ దేవతల వల్ల - మైంద ద్వివిదులు, 

8. వరుణుని వలన - సుషేణుడు,

9. పర్జన్యుడని వలన - శరభుడు, 

10. వాయువు వల్ల - హనుమ జన్మించారు. 


    పరాక్రమాలు గల అనేకమంది - గోలాంగూల (కొండముచ్ఫు) స్త్రీలయందూ, ఋక్ష స్త్రీల యందూ, కిన్నర స్త్రీలయందూ జన్మించారు. 


    ప్రధానంగా పైన పేర్కొన్న పదకొండు మందీ, పదకొండు విభాగాలకు చెందినవారు. తండ్రుల శక్తులు కలిగి, ఆయావిభాగాలలో నిష్ణాతులు.  


    ఒక భారీ పథకము (Project) చేపట్టేటపుడు కావలసిన 11 ముఖ్య విభాగాలైన 


ప్రణాళిక(Planning), 

వ్యవస్థీకృత కార్మిక రంగం(Organised working sector), 

కుశాగ్రబుద్ధి కలిగిన పరిపాలన(Correct decisive administration), , 

మేధస్సు(Intellect), 

ఆర్థికం(Finance), 

నిర్మాణం(Archetech), 

చైతన్యం(Activeness), 

ఆరోగ్యం(Health), 

నీరు(Water), 

దాపరీకం(Secrecy), 

సర్వజ్ఞత(All round) అనేవి ప్రధాన విషయాలు. 


    అటువంటి వాటికి సంబంధించి వారు "రావణ వధ" అనే ప్రత్యేక ప్రణాళిక(Operation)కి గాను వచ్చిన కారణజన్ములు. 


    అందులో వాయుపుత్రుడు ఒక ప్రత్యేకమైన వాడు. 

    వాయువు సర్వత్ర వ్యాప్తిచెంది, అందరకీ ప్రాణమైనది. అదే విధంగా వాయుదేవుని వలన జన్మించిన హనుమ, అందఱితోనూ అన్ని పనులలోనూ నేర్పుతో (all round) పని చక్కబెట్టగల్గినవాడు. 


    అంతేకాక, వాయువు 


(అ) సప్త మండలాలలో సప్త వాతస్కంధాలుగా కనబడుతుంది. 

(EXTERNAL - AT THE SPACE)


అవి


(i) మేఘమండలం - ఆవహము, 

(ii) సూర్యమండలం - ప్రవహము, 

(iii) చంద్రమండలం - సంవహము, 

(iv) నక్షత్రమండలం - ఉద్వహము, 

(v) గ్రహమండలం - వివహము, 

(vi) సప్తర్షిమండలం - పరివహము, 

(vii) ధ్రువమండలం - పరావహము 

                - అని ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క అధిష్ఠానదేవతగా ఉంటుంది. 

    అందుకనే వాయుపుత్రుడైన హనుమ అంతరిక్ష సంచారాన్ని అలవోకగా చేస్తాడు. 

    ఆకాశమార్గంలో సముద్ర లంఘనం, సంజీవని పర్వతం పెకలించి తీసుకురావడం, తిరిగి యథాస్థానంలో ఉంచడం వంటివి ఈ కోవలోకి వస్తాయి. 


(ఆ) శరీరంలో 

      (INTERNAL - WITH IN THE BODY) 


అవి


    హృదిలో - ప్రాణ, 

    గుదిలో - అపాన, 

    నాభి వద్ద - సమాన, 

    కంఠంవద్ద - ఉదాన, 

    సర్వశరీరమందు - వ్యాన 

                - అనే ఐదు వాయువులు అంతర్గతంగా అందరికీ జీవాధారంగా పనిచేస్తాయి. 

    వాయునందనుడు ఈ ఐదు వాయువులతోనూ శారీరకంగా అద్భుతాలు చేసినవాడు కదా!


    ఈ విధమైన కార్యాలవలనే, విభీషణునితో జాంబవంతుడు


      "హనుమ జీవించియున్నచో వానరసైన్యము హతమైననూ బ్రతికియున్నట్లే! 

       మారుతి ప్రాణాలు విడిస్తే, మనమందరమూ బ్రతికియున్ననూ మరణించినవారితో సమానమే!" 


                - అని వాయుపుత్రుడైన హనుమ గూర్చి అనగలిగాడు. 


వాయువు: 


    "గంధనం హింసనం యో వాతి చరాచరం జగద్ధరతి బలినాం బలిష్ఠః స వాయుః" - అని వాయు పదానికి నిర్వచనం. అంటే, 

  - చరాచర జగత్తును ధరించి జీవింపజేసి లయింపచేయువాడునూ, బలవంతులకంటే బలవంతుడునూ అవడం వల్ల దానికి "వాయువు" అని పేరు అని అర్థం. 


    వాయుపుత్రుడుగా హనుమ శ్రీరామునికి ప్రీతిపాత్రుడై, మనందరికీ ఇష్టమైన "ఇహలోక రక్షకుడు". 

                      


               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్  


                           కొనసాగింపు .... 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

పాంచాలరాజు రాజ్యప్రాప్తి

 వైశాఖ పురాణం - 20

20వ అధ్యాయము - పాంచాలరాజు రాజ్యప్రాప్తి


నారదమహర్షి అంబరీష మహారాజుతో వైశాఖమహాత్మ్యము నిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజా! వినుము. శ్రీహరికి మిక్కిలి యిష్టమైన వైశాఖమాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరియొక కథను చెప్పుదును వినుము.


పూర్వము పాంచాలదేశమున పురుయశుడను రాజు కలడు. అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యెను. అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించెను. పూర్వజన్మ దోషముచేనతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. వాని యశ్వములు, గజములు మున్నగు బలము నశించెను. వాని రాజ్యమున కరవు యేర్పడెను. ఈ విధముగా వాని రాజ్యము, కోశము బలహీనములై గజము మ్రింగిన వెలగపండువలె సారవిహీనములయ్యెను.


వాని బలహీనతనెరిగి వాని శత్రువులందరును కలసి దండెత్తి వచ్చిరి. యుద్దములో నోడిన రాజు భార్యయగు శిఖినితో గలసి పర్వతగుహలో దాగుకొని యేబదిమూడు సంవత్సరముల కాలము గడపెను. ఆ రాజు తనలో నిట్లు విచారించెను. "నేను ఉత్తమ వంశమున జన్మించితిని. మంచి పనులను చేసితిని. పెద్దలను గౌరవించితిని. జ్ఞానవంతుడను. దైవభక్తి, యింద్రియజయము కలవాడను. నావారును నావలెనే సద్గుణవంతులు. నేనేమి పాపము చేసితినని నాకిట్టి కష్టములు కలిగినవి? నేనిట్లు అడవిలో నెంతకాలముండవలయునో కదా! అని విచారించి తన గురువులగు యాజుడు ఉపయాజకుడను గురువులను తలచుకొనెను. సర్వజ్ఞులగు వారిద్దరును రాజు స్మరింపగనే వానివద్దకు వచ్చిరి.


రాజువారిద్దరికి నమస్కరించి యధాశక్తిగనుపచారములను చేసెను. వారిని సుఖాసీనులగావించి దీనుడై వారి పాదములందుపడి నాకిట్టి స్థితియేల వచ్చెను? నాకు తరణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించెను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పినమాటలను వినిరి. వాని మనోవిచారమును గ్రహించిరి. క్షణకాలము ధ్యానమగ్నులై యిట్లనిరి. రాజా! నీ దుఃఖమునకు కారణమును వినుము. నీవు గత పదిజన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతుడవు. నీయందు ధర్మప్రవృత్తి కొంచమైనను లేదు. సద్గుణము లేవియును లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు. శ్రీహరిని కీర్తింపలేదు. శ్రీహరి కథలను వినలేదు. గత జన్మమున నీవు సహ్యపర్వతమున కిరాతుడవైయుంటివి. అందరిని బాధించుచు, బాటసారులను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడుపుచుంటివి. నీవు గౌడ దేశముననున్నవారికి భయంకరుడవై యుంటివి. ఇట్లు అయిదు సంవత్సరములు గడచినవి.


బాలురను, మృగములను, పక్షులను, బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకీజన్మయందును సంతానము లేకపోవుటకును నీపూర్వకర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవరును అప్పుడును లేకుండిరి. అందరిని పీడించుట చేతను దానమన్నది లేకపోవుటచేతను నీవు దరిద్రుడవుగా నుంటివి. అప్పుడు అందరిని భయపెట్టుటచే నీకిప్పుడు యీ భయము కలిగెను. ఇతరులను నిర్దయగా పీడించుటచే నిప్పుడు నీ రాజ్యము శత్రువులయధీనమైనది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము.


నీవు గౌడదేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలోనుండగా ధనవంతులగు యిద్దరు వైశ్యులు కర్షణుడనుముని నీవున్న యడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. రెండవ వైశ్యుని చంపబోతివి. అతడును భయపడి ధనమును పొదరింటదాచి ప్రాణరక్షణకై పారిపోయెను. కర్షణుడను మునియు నీకు భయపడి ఆ యడవిలో పరిగెత్తుచు, యెండకు, దప్పికకు అలసి మూర్ఛిల్లెను. నీవును కర్ష్ణణుని సమీపించి వాని మొగముపై నీటిని జల్లి ఆకులతో విసరి వానికి సేవచేసి వానిని సేదతీర్చితివి. అతడు తేరుకున్న తరువాత నీవు మునీ! నీకు నా వలన భయములేదు. నీవు నిర్ధనుడవు. నిన్ను చంపిననేమి వచ్చును. కాని పారిపోయిన వైశ్యుడు ధనమునెక్కడ దాచెనో చెప్పుము. నిన్ను విడిచెదను చెప్పనిచో నిన్నును చంపెదను అని వానిని బెదిరించితివి. ఆ మునియు భయపడి ప్రాణ రక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను.


అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గమును చెప్పితిని దగ్గరలోనున్న నిర్మల జలము కల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీసిపొమ్ము. రాజభటులు నాకై రావచ్చును కావున నేను నీవెంబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము. చల్లనిగాలి వీచునని వానికి మోదుగ ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాగుకొంటివి. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనమెచటనున్నదో తెలిసికొనుటకై ఆ మునికి సేవలు చేయుటవలన వానిని అడవి నుండి పోవు మార్గమును జలాశయమార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖమాసమగుటచే నీవు తెలియకచేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజ వంశమున జన్మించితివి.


నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావలెనని యనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖమాసము. నీవు వైశాఖశుద్ద తదియ యందు ఒకసారి యీనిన ఆవును దూడతో బాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును. ప్రాతః కాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికి సుఖమును కలిగింపుము. నీవు భక్తిశ్రద్దలతో వైశాఖ వ్రతము నాచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యధాశక్తి దానములను చేయుము. లోకములన్నియు నీకు వశములగును. నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారిద్దరును రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలి పోయిరి.


రాజ పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తిశ్రద్దలతో నాచరించెను. యధాశక్తిగ దానములను చేసెను. వైశాఖవ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరును మరల వాని వద్దకు వచ్చిరి. వారందరితో కలసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయెను. శ్రీహరి దయవలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయిరి. రాజు అనాయాసముగ తన రాజ్యమును తిరిగి పొందెను. పోగొట్టుకొని సంపదలకంటె అధికముగ సర్వసంపదలను పొందెను. వైశాఖవ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగ నుండెను. వానికి ధృష్టకీర్తి, ధృష్టకేతువు, ధృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అను అయిదుగురు పుత్రులు కుమార స్వామియంతటి సమర్థులు కలిగిరి. ప్రజలందరును వైశాఖమాస వ్రత మహిమ వలన రాజానురక్తులై యుండిరి.


రాజును రాజ్యవైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్దలతో వైశాఖవ్రతము నాచరించి యధాశక్తి దానధర్మములను చేయుచుండెను. ఆ రాజునకు గల నిశ్చలభక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖశుద్ద తృతీయ అక్షయతృతీయనాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యెను. చతుర్బాహువులయందు శంఖచక్రగదా ఖడ్గములను ధరించి పీతాంబర ధారియై వనమాలావిభూషితుడై లక్ష్మీదేవితో గరుడాదిపరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మయగు అచ్యుతుని జూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసికొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. కనులు తెరచి ఆనందపరవశుడై గగుర్పొడిచిన శరీరముతో గద్గదస్వరముతో శ్రీహరిని జూచుచు ప్రభుభక్తితో ఆనందపరవశుడై శ్రీహరినిట్లు స్తుతించెను.


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పెనని నారదమహర్షి అంబరీషునితో పలికెను.

కురుక్షేత్రం లాంటిదే,

 ✍🏼💧


_మనిషి శరీరం కూడా ఒక కురుక్షేత్రం లాంటిదే, అందులో మంచి ఆలోచనలు పాండవుల సైన్యం అయితే, దుర్మార్గముతో కూడిన ఆలోచనలు కౌరవ సేనలు, వాటి మధ్య జరిగే ప్రతి ఘర్షణే కురుక్షేత్ర సంగ్రామంతో సమానం_ 


_అసలు మనిషి పుట్టగానే మనసు నిర్మలంగా, ప్రశాంతంగా, అమాయకంగా ఉంటుంది, పెరిగి పెద్ద అయ్యేకొద్దీ, ఇది నాది, అది నీది అనే స్వార్ధము, నీవు వేరు, నేను వేరు అనే భేదబుద్ధి, ఇది అంతా నాకే కావాలి, నీకు ఇవ్వను అనే లోభత్వము, నువ్వంటే నాకు పడదు అనే ద్వేషము, నీకు అంత ఉంది, నాకు ఇంతే ఉంది అనే అసూయ,        క్రమక్రమంగా మనసులను, బుద్ధిని కురుక్షేత్రంగా మారుస్తుంది_


_ఈ మంచి చెడుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూ ఉంటుంది, ఒక్కోసారి మంచి గెలుస్తుంది, మరో సారి చెడు గెలుస్తుంది, దాని వలన సుఖము, దుఃఖము ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి, ఈ సంసార సాగరము నుండి బయటపడాలంటే సత్పురుషుల మార్గదర్శనంలో సత్ప్రవర్తనతో, సత్సంగం అనే పడవలో ప్రయాణం చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూఉండాలి_


☝ *మిలింద్ కుమార్* ☝

        *9440603399*


🌳🌳🌳💎🌳🌳🌳

పొడుపు పద్యము

 ……  పొడుపు పద్యము  …...

ఆ. అందమైన మాట కారక్షరమ్ములు 

ఒండు, రెండు గూడ నొప్పు ''నైదు'' 

మూడు, నైదు, నారు చూడగా ''పొలములు'' 

పదము తెలుప వలయు పసిడి బాల..!

భగవంతుని సృష్టి

 **సర్వం భగవంతుని సృష్టి...కానీ మనం తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో వున్నాయి. వాటిలో రాగిపాత్రల విశిష్టత గురించి తెలుసుకుందాము.**

                       ***

**మందిరాల్లో మరియు నిష్టాగరిష్టులైన మహానుభావుల ఇళ్ళలోనూ పూజా సమయాల్లో రాగిపాత్రలనే వాడుతుంటారు.* *ఇది మన నిత్యానుభవంలోని విషయం,వెండి, బంగారు పాత్రలను వాడగలిగే ధనవంతులు సైతం ఈ రాగి పాత్రలనే వాడటంలో గల మర్మం ఏమిటి?*

*ఈ విషయమై మహావిష్ణువును ప్రశ్నించింది భూదేవి.*

*బంగారు, వెండి, కంచు మొదలైన పాత్రలతో కాక రాగి పాత్రలతో కర్మానుష్టానం చేస్తే నేను సంతోషిస్తాను. ఏడువేల యుగాల క్రితం నామాయ కారణంగా ఈతామ్రం (రాగి) పుట్టింది.* 

*'గుడాకేశుడనే' అసురుడు తామ్రరూపంతో నన్నారాధిస్తుండేవాడు.*

 *ఒకసారి నేనాతని ఆశ్రమానికి వెళ్ళాను. అద్భుతంగా ఉందా ఆశ్రమం సంతోషించాను.  అతడు నన్నారాధించాడు. తృప్తిపడ్డాను . కావలసిన వరంకోరుకొమ్మన్నాను . సుదర్శన చక్రంతో తనను వధించమని కోరాడు. తన అవయవాలన్నీ తామ్రరూపం దాల్చాలనీ, భగవదారాధనకు ఆపాత్రలనే వాడాలనీ సవినయంగా కోరాడు 'గుడాకేశుడు'.* *ఒకశుభముహూర్తంలో వైశాఖ శుక్ల ద్వాదశినాడు గుడాకేశ సంహారం జరిగింది. అతని కోరిక నెరవేరింది. ఈ విధంగా ఆనాటి నుండి మనకు తామ్ర పాత్రలు ప్రాప్తించాయి.*

                       ***

 ""పవిత్రాణాం పవిత్రం చ మంగళానాం చ మంగళమ్

విశుద్ధానాం శుచిశ్చైవ తామ్రం సంసార మోక్షణమ్""

                       *** 

*రాగి అత్యంత పవిత్రమైనదే గాక ఈ సంసారబంధం నుంచి ముక్తి నివ్వగలదు.*

                        ***

            **ఇదం న మమ**

        **శుభప్రదమైన రోజు**

ఆపస్తంబుని కధ*

 *శ్రాద్ధ భోక్తలు - ఆపస్తంబుని కధ*


 యజుర్వేదాధ్యాయులైన బ్రాహ్మణులలో మూడు వంతుల మంది ఆపస్థంబసూత్రానికి చెందినవారే.  ఈ ఆపస్థంబులు అనే ఈ మహర్షి గురించి తెలుసుకుందాము.


 ఒకప్పుడు వేదవేత్త అయిన ఒక బ్రాహ్మణుడు  శ్రాద్ధం జరిపేడు. భోక్తగా ఒక బ్రాహ్మణుడిని నిమంత్రణం చేశాడు . ఆ భోక్త కోసం చాలా సేపు వేచి ఉన్నాడు.  భోక్త చాలా ఆలస్యం చేసి వచ్చాడు.  బాగా ఆకలితో వచ్చాడు.  కర్త, భోక్త గారి కాళ్లు కడిగి అర్చన చేసి భోజనం వడ్డించేడు. 

వచ్చిన మిగతాసాధారణ భోక్తల కంటే బాగా ఎక్కువగా  సాపాటు చేశాడు.  బ్రాహ్మణుడికి బాగా ఆకలిగా ఉన్నట్లున్నది అని భావించి కర్త మళ్ళీ మళ్ళీ వడ్డించేడు.  వడ్డించగా వడ్డించగా వండిన వంటకాలు మరేమీ మిగలలేదు. 


 కర్తలో మొదట ఉన్న వినయం నశించిపోయి  హేళన చెయ్యటానికి దిగింది. తన మాటలలో హేళన కనబడటం మొదలైంది. దానిని లెక్క చెయ్యని భోక్త ఇంకా వడ్డించు వడ్డించు ఏమిటి అలా చూస్తున్నారు అన్నాడు.  అపరిమితంగా తిన్నా తృప్తి పొందక తనకు ఇంకా పెట్టు అనే అంటున్నాడు.  తనని  అలా ఇంకా పెట్టు ఇంకా పెట్టు అని అనటం తనని అవమానించటానికే అనుకున్నాడు కర్త.  వండిన పదార్థాలన్నీ అయిపోయి నా ఇంకా కావాలి ఇంకా కావాలని భోక్త అడుగుతూంటే కర్తకి కోపం వచ్చేసింది. 

దాంతో ఖాళీ అయిపోయిన వంట పాత్రలను తీసుకువచ్చి విస్తరిలో బోర్లించేసేడు. ఇంక తృప్తి అయిందా అని అన్నాడు. (భోక్త సాపాటు  అయిన తరువాత వారిని కర్త తృప్తాస్తాః అని అడగటం, భోక్త తృప్తోస్మి అని మూడు సారులు చెప్పటం అలవాటు కదా)


*(అలా చెప్పకపోతే శ్రాద్ధకర్మలు మరి ముందుకు సాగదు)*


కాని ఈ భోక్త లేదు నాకు తృప్తి కాలేదు అన్నాడు. కర్తకి కోపం నసాళానికెక్కింది. ఈయన అడిగినదంతా వడ్డించేనే, పెట్టినదంతా తినేసి తృప్తి లేదంటూ నన్ను అవమానించి, నేను  పెట్టిన ఈ శ్రాద్ధాన్ని కూడా చెడగొట్టేడే ఈ బ్రాహ్మణుడు అని కోపం తెచ్చుకున్నాడు. 


కర్త మంచి తపస్వి. కోపం చేత ముఖం ఎఱ్ఱగా చేసికొని ఆయన ఈ భోక్త గా వచ్చిన బ్రాహ్మణుడిని శపించటానికి చేతిలో జలం తీసుకొని అభి మంత్రించి బ్రాహ్మణుడితలమీద చల్లాడు.


అప్పుడొక ఆశ్చర్యం జరిగింది. వచ్చిన బ్రాహ్మణుడు తన చేతితో అభిమంత్రించి తలమీద  చల్లిన జలాన్ని క్రింద, తన తలమీద పడకుండా మధ్యనే నిలిచిపో  అని ఆజ్ఞాపించినట్లుగా ఆగు అని ఆపేసేడు.  కర్త దీన్ని చూసి ఆశ్చర్యంతో ఉన్నవాడు ఉన్నచోటనే నిలబడిపోయేడు. తాను చల్లిన నీటిని మధ్యనే నిలబెట్టిన ఈ బ్రాహ్మణుడు సాధారణ బ్రాహ్మణుడు కారు, తనకంటే గొప్ప వాడు అని తెలిసికొని,  "పూజ్యుడా! 

మీరు ఎవరు నన్ను ఎందుకిలా శోధిస్తున్నారు అని అడిగేడు. దానికి ఆయన ఇలా సమాధానంచెప్పేరు- నేను ఒక మునిని నేను ఎక్కువగా తిన్నందువలన నన్ను ఎగతాళి చేసేవు. నీ చూపులతోనూ నీ చేష్టలతోనూ నువ్వు నన్ను అవమానించేవు.

శ్రాద్ధానికి వచ్చిన బ్రాహ్మణుల మీద నీ పితృదేవతల ఒక అంశని వేసి భగవానుడు పంపుతాడని మరిచిపోయి నువ్వు వ్యవహరించేవు.నీకు బుద్ధి చెప్పటం కోసమే నేను ఇలా చేసేను శ్రాద్ధాన్ని భయభక్తులతో శ్రద్ధతో చెయ్యాలి తప్ప కోపం తెచ్చు కొనకూడదని తెలుసుకో అన్నారు. దానికి కర్త 'స్వామీ నా తప్పుని

తెలిసికొన్నాను, క్షమించండి ఇకమీదట ఇటువంటి తప్పు చెయ్యను, నేను జరిపిన శ్రాద్ధకర్మ  పూర్తికాలేదే,   దానికి ఏమి చేసేది? అని అడిగేడు. 


దానికి ఆ బ్రాహ్మణుడు నేను తృప్తి చెందలేదు అని చెప్పినందున శ్రాద్ధం పూర్తి కాలేదు. అందుచేత పురుషసూక్తాన్ని  పారాయణం చెయ్యి, ఈ దోషం పరిహరించబడుతుంది

అన్నారు దానిని పారాయణం చేసి కర్త శ్రాద్ధాన్ని పూర్తి చేసేడు.

* జలాన్ని మధ్యను ఆపేరు గనుక ఆయనకు ఆపస్తంబులు అని పేరు వచ్చింది

శ్రాద్ధకాలంలో పురుషసూక్తాన్ని, కాటకోపనిషత్తునీ పారాయణం చేసే నియమం ఉన్నది . ఆపః అంటే నీరు ఆ నీటిని స్తంభింపచేసి మధ్యను నిలిపి దానికి విలువ లేకుండా చేసినందున ఆయన ఆపస్థంబులు అయినారు.


🙏🙏🙏

సాంబారు తయారుచెయ్యడం ఎలా?

 సాంబారు తయారుచెయ్యడం ఎలా?


పరమాచార్య స్వామివారి చుట్టూ భక్తుల గుంపు. పురుషులంతా ఒకవైపు, స్త్రీలంతా ఒకవైపు. ఆరోజు స్వామివారు చాలా సాధారణ విషయాల గురించి మాట్లాడుతూ, భక్తులకు నవ్వులు పంచుతున్నారు.


హఠాత్తుగా పురుషుల వైపు తిరిగి, “మీలో వంట చెయ్యడం ఎవరికి వచ్చు?” అని అడిగారు.


జీవితంలో ఒక్కసారి కూడా వంటగది వైపు తొంగిచూడని కొందరు మగవారితో కలుపుకుని అందరూ “హా, నాకు తెలుసు” అన్నారు.


“సాంబారుని మీరు ఎలా తయారుచేస్తారు?” అన్నది తరువాతి ప్రశ్న.


వరుసలో మొదట నిలుచున్న వ్యక్తి చెప్పడం ప్రారంభించాడు, “చింతపండును నీళ్ళల్లో నానబెట్టి, కొద్దిగా ఉప్పు, ఎండు మిరప పొడి వేసి; ఆ మిశ్రమాన్ని బాగా మరిగించి వడ్డించాలి” 


వెనుకన నిల్చున్న మరొక వ్యక్తి చెప్పాడు, “నూనెలో కొద్దిగా ఆవాలు, ఎండు మిరపకాయలు వేయించుకోవాలి. తరువాత చింతపండు-ఉప్పు-కారం-కరం పొడి మిశ్రమాన్ని ఉడికించి, ఉడకబెట్టిన పప్పును వేసి, మొత్తంగా ఒకసారి ఉడికిన తరువాత కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి . . .”


మరొక వ్యక్తి, “చింతపండు, ఎండు మిరప రెండూ నీళ్ళతో బాగా రుబ్బుకుని, తరువాత ఉప్పు, ఉడకబెట్టిన పప్పు, చిటికెడు ఇంగువ వేసుకుని, బాగా మరిగించాలి” అని చెప్పాడు.


అలా కొందరు మగవాళ్ళు ఎన్నో రకాలా పద్ధతులని చెప్పారు. తరువాత పరమాచార్య స్వామివారి వంతు వచ్చింది.


“మీరందరూ పెద్ద జ్ఞానులు! అహంకారాన్ని మరచిపోయిన వారు. కాని నేను ఇంకా దానికోసం ప్రయత్నిస్తున్నాను” అని అన్నారు.


మహాస్వామివారు ఏమి చెప్పారు?


“సాధారణంగా మనం తికమకపడేది తాన్ (నేను) అన్న ఆలోచన వల్ల. మీకందరకూ ఆ తాన్(కూరగాయలు) అన్న ఆలోచనే లేదు. చింతపండు-ఉప్పు-మిరప-ఇంగువ మాత్రమే మీ మస్తిష్కంలో ఉన్నాయి. తాన్ అన్న ఆలోచనే మీకు రాలేదు. ఇది జ్ఞానుల స్థితి కదా?”


తమిళంలో తాన్ అంటే కూరగాయలు మరియు అహం అన్న అర్థం కూడా!!

వాళ్ళందరూ కైలాస పర్వతం ముందర చిన్న రాళ్ళల్లా నిలబడిపోయారు.


--- రాధా రామమూర్తి, మహా పెరియవాళ్ – దరిశన అనుభవంగళ్ 6


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం